VijayaKumar

Aug 16 2024, 22:52

ఘనంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కొండకింద బీఆర్ఎస్ పార్టీ మండల మరియు పట్టణ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అభిమాన నాయకురాలు శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నీ గ్రామాలలో మండల కేంద్రాలలో కేక్ లు కట్ చేసి పలు సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రం ఆలేరు లో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఇమ్మడి నర్సింహారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకలకు హాజరైన గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆలేరు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నేతలు, యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

VijayaKumar

Aug 16 2024, 22:40

గ్రామపంచాయతీ కార్మికుడు నల్లాల శంకరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైళ్ల గణపతి రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో మండల సెంటర్ గ్రామపంచాయతీలో గత సుమారు 35 సంవత్సరాలుగా వాటర్ మెన్ గా పనిచేస్తూ ఈరోజు అనారోగ్యంతొ మరణించడం జరిగింది అనారోగ్యంతో మరణించిన శంకరయ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఐదు లక్షల ఇన్సూరెన్స్ మంజూరు చేయాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ళ గణపతి రెడ్డి జిల్లా అధ్యక్షులు బందెల బిక్షం జిల్లా మాజీ ఎడవల్లి ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ నుండి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇది మేజర్ గ్రామపంచాయతీ కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న పంచాయతీ పదివేల రూపాయలు కాకుండా కనీసం 50 వేల రూపాయలు అతని సర్వీస్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ప్రతి కార్మికునికి తప్పకుండా ఇన్సూరెన్స్ కల్పించాలని అదేవిధంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గ్రామపంచాయతీ లో ఆదాయం ఉన్నటువంటి వద్ద జీతాలు పెంచుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మరియు ఇట్టి విషయంలో ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరించాలని వారి ఆలయంలో కూడా గ్రామపంచాయతీలో పని చేశారు కావున ఎమ్మెల్యే గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని శంకరయ్య గారికి ఒక కూతురు వివాహం కూడా కాలేదు కావున ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీరాములు మల్లయ్య రామలింగం సాలయ్య ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 16 2024, 22:18

ఆలేరు: 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ: CPI రాష్ట్ర కార్యదర్శి MLA కూనంనేని సాంబశివరావు

ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో చెక్క వెంకటేష్ అధ్యక్షతన యాదాద్రి భువనగిరి జిల్లా నిర్మల కౌన్సిల్ సమావేశంలో, ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జెండా ఆవిష్కరించి నా అనంతరం ఈ సమావేశంలో *ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్ల వెంకట్ రెడ్డి గారు* వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో త్యాగాలకు నిలియంగా ఈ ఉమ్మడినల్గొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, పేదవాడికి ఈరోజు కష్టం కలిగిన వారి వెన్నంటే ఉండి పోరాటం చేసేది కమ్యూనిస్టు పార్టీ నే నని పెట్రోల్ ధరలు పెరిగిన, డీజిల్ ధరలు పెరిగిన, నిత్యవసర ధరలు పెరిగిన, పేదవాడు దరిచేరి జెండా ఎర్రజెండా నే అని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతంలో నిరుపేదలకు భూముల పంచిన చరిత్ర ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీకే ఉందని ఈ సందర్భంగా వారి పేర్కొన్నారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ వందేళ్లు అధికారం లేకున్నా నిలబడగలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక కమ్యూనిస్టు పార్టీ అని, దాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణపరంగా పార్టీ ఎదుగుదల కోసం మళ్లీ కమ్యూనిస్టు పార్టీని పునర్ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శులు y దామోదర్ రెడ్డి, బి సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ,కృష్ణ,ఇమ్రాన్, అశోక్,సుదర్శన్, ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్, మహేందర్, శాంతి కుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు


VijayaKumar

Aug 16 2024, 19:08

హనుమపురం లో నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి: అఖిలపక్ష నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామంలో మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో వర్షాకాలంలో విష సర్పాల బారిన పడే అవకాశం ఉందని వీధి దీపాల ఏర్పాటు చేయాలని , వెంటనే దోమల మందును పిచికారి చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా గ్రామంలో నీటి సమస్యను తీర్చేందుకు అవసరమైన చోట గేటు వాళ్లు నూతనంగా ఏర్పాటు చేసి, నూతన బోరు మోటర్ ను ఫిట్ చేయాలని, పాత బోరుబావిలోకి నూతన పైపులు మంజూరు చేయాలని కోరారు. సెక్రెటరీ సెలవులు ఉండటం, స్పెషల్ ఆఫీసర్ గ్రామానికి రాకపోవడంతో, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ రాష్ర్ట అధ్యక్షులు మేకల బాలు యాదవ్. సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తుమేటి వెంకటేష్ యాదవ్, బిఆర్ఎస్ మండల నాయకులు నాగపురి కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ ఏనుగు లింగారెడ్డి, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, మాజీ వార్డ్ మెంబర్లు మోర లింగారెడ్డి, రంగస్వామి, నాయకులు హనుమ గంటి రాజు, హ్యన్మగంటి సత్యనారాయణ, ఎస్సీ సెల్ నాయకులు బండారి సుధాకర్ పాల్గొన్నారు.

VijayaKumar

Aug 15 2024, 22:11

క్యూ న్యూస్ ఆఫీసులో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాదులోని క్యూ న్యూస్ ఆఫీసులో 78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జెండా విస్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏ రవీందర్, యాంకర్ శ్యామ్ ,సుదర్శన్ 7200 యూత్ వింగ్ నాయకుడు తోటకూరి లింగస్వామి, కార్తీక్ ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 15 2024, 21:20

ఇంద్రపాలనగరం లో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, మాజీ వార్డ్ మెంబర్ కొలుకులపల్లి యాదయ్య, మహేష్ రవి, భూతం బాలస్వామి, సంభోగు స్వామి,కొలుకులపల్లి నరేష్, కొలుకులపల్లి ప్రశాంత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 15 2024, 21:07

రావన్నపేట మెయిన్ రోడ్డులో గల నకరికంటే కిష్టయ్య కాంప్లెక్స్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మెయిన్ రోడ్ లో గల నకిరేకంటి కిష్టయ్య కాంప్లెక్స్ ఆవరణలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.నకిరేకంటి కిష్టయ్య గారు జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గొల్లెపల్లి శంకరయ్య, బొడ్డు భిక్షం తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 15 2024, 21:05

రామన్నపేట: నేర్నెముల గ్రామానికి కాంక్రీట్ బెంచీల బహుకరణ చేసిన దొంతర బోయిన నవీన్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట  మండలంలోని నిర్నెంల గ్రామంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ రోజున తన జన్మదిన పురస్కరించుకుని దొంతరదొంతర బోయిన నవీన్ గ్రామ వాసుల సౌకర్యార్థం సుమారు రూ.60000/- రూపాయల విలువ గల ఏడు సిమెంటు కాంక్రీటు బెంచీలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి అందజేశారు. వీటిని గ్రామ ప్రజల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలలో ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ప్రజల సౌకర్యార్థం చేయూత అందించినందుకు గ్రామ పెద్దలు వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మి, మాజీ సర్పంచ్ ముత్యాల సుజాత రవి, గోపాల్, చిప్పలపల్లి రవి, సాయిలు, రాంబాబు, తరుణ్, ఆవుల సాయి, దొంతర బోయిన దైవాధీనం ముదిరాజ్, ఉద్యోగ సంఘం కార్యదర్శి యాదగిరి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 15 2024, 20:29

వలిగొండ: దుప్పల్లి లో మద్యం విక్రయిస్తున్న ఓ కిరణా షాప్ పై పోలీసుల దాడి ,కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దుప్పల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న భీమ గాని రంగయ్య కిరణా షాప్ పై వలిగొండ పోలీసులు దాడులు నిర్వహించి మద్య పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసి ఎలాంటి వ్యాలీడి లైసెన్స్ లేకుండా కస్టమర్స్ కి మద్యం అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. మద్యాన్ని సీజ్ చేసి భీమ గాని రంగయ్యపై కేసు నమోదు చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

Aug 15 2024, 20:11

వలిగొండ: ఆర్థిక సహాయం అందజేసిన తుమ్మల నర్సయ్య సేవాసమితి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామం లో పురుమ కృష్ణ గారు శనివారం తేదీ 10వ తారీకు సాయంత్రం మరణించడం జరిగినది. వారి కుటుంబాన్ని తుమ్మల నరసయ్య సేవా సమితి సభ్యులు పరామర్శించారు. తుమ్మల నరసయ్య సేవాసమితి ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగినది.. ఈ కార్యక్రమంలో తుమ్మల నరసయ్య సేవా సమితి సభ్యులు తదితరులు. పాల్గొనడం జరిగింది.