VijayaKumar

Aug 15 2024, 20:02

బీబీనగర్ : వెంకిర్యాల మహర్షి మోడల్ హైస్కూల్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా బిబి నగర్ మండలం వెంకీర్యాల మరియు పోచంపల్లి మండలం ఇంద్రియాల మహర్షి మోడల్ హైస్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించారు, సాంస్కృత కార్యక్రమా లలో పాల్గొని డాన్సులు వేశారు. పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్ ,వైస్ ప్రిన్సిపల్ జ్యోతి ,అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 14 2024, 15:16

యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి : AISF

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబ్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి* ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం వస్తువుల అభిలాష్ అధ్యక్షతన భువనగిరి లో జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం గా ప్రాముఖ్యత పొందిన యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి గవర్నమెంట్ డిగ్రీ ,పీజీ కళాశాల లేకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ యూనివర్సిటీ మాదిరిగానే పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఇక్కడ కూడా దేవస్థానం నిధులతో అన్ని వసతులు , కోర్సులతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణలో డ్రగ్స్ మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని విద్యార్థులు వాటికి బానిసలు కాకుండా ఉన్నత చదువులపై దృష్టి సారించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని,యూనివర్సిటీలకు వీసీ లను వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణికంఠ రెడ్డి ,లక్ష్మణ్ డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి సంఘం బలోపేతం కోసం విద్యార్థులు నడుం బిగించాలని అన్నారు జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ,సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో వసతి గృహ అధికారులు సమయం పాలన పాటించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు మారపాక లోకేశ్వర్ , ఆర్ చందు , రామ్ చరణ్ , సాయి చరణ్, టీ ప్రవీణ్, శ్రీకాంత్ మండల నాయకులు వినీల్ ,భారత్ సుమన్ తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Aug 13 2024, 23:04

వలిగొండ మండల కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మా వాటా మాకే పుస్తకావిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత జూలూరు శంకర్ రచించిన మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఘనంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బిసి జనగణ చేసి 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసినారు. అనాదిగా తరతరాల నుండి బిసి లను చేనేత వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలను రాజకీయంగా మరియు వ్యవహారపరంగా మోసం చేసే వారిపై కలసి పోరాడి మన హక్కులను మనము కాపాడుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి ,బిసి సంఘం మండల అధ్యక్షుడు ఐటిపాముల ప్రభాకర్, తవుటము నరహరి, దొంత శంకరయ్య, మిరియాల శ్రీనివాస్, ఐటిపాముల కుమార్, గంజి నారాయణ, లెనిన్, డిఎన్ఆర్ రమేష్, జెల్ల నరహరి ,మిరియాల శేఖర్, ఎక్కడ దేవి శ్రీనివాస్, మిర్యాల వెంకటేశం ,గంజి బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 12 2024, 20:43

ఆర్థిక సహాయం అందజేసిన జిట్టబోయిన కుటుంబం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన కీ.శే. దాసరి యాదగిరి కుటుంబంకు కీర్తిశేషులు జిట్టబోయిన నరసింహ జ్ఞాపకార్థం వారి కుమారుడు కీ. శే.జయరాం జ్ఞాపకార్థం మరియు వారి తమ్ముళ్లు మల్లేశం, అశోక్ లకు జరిగిన విషాదం గురించి తెలియగానే వెంటనే స్పందించి వారి కుటుంబానికి 10000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పులిపలుపుల రాములు ఎస్కే రసూల్ ఎరుపుల వెంకటేశం గన్నెబోయిన నరసింహ ఇంజమూరి శీను కాడిగళ్ల రవి బత్తుల యాదగిరి సలవద్రి చింటూ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 12 2024, 19:48

దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి: దయ్యాల నరసింహ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూమికి వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున హనుమాపురం దళితుల పట్టాదారు పాసుబుక్కుల సాధన కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండల ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ హనుమాపురం గ్రామంలో సర్వేనెంబర్ 87 లో ప్రభుత్వ భూమి 15.06 ఎకరాలు సుమారు 65 సంవత్సరాల నుండి దళితులు సాగు చేసుకోని చెలుక పంటలు పండిస్తూ ఉలువలు, కందులు, నువ్వులు ఇతర పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. కావున ప్రభుత్వము దళిత పేద కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని పట్టదార్ పాస్ బుక్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టాదారుల సాధన కమిటీ అధ్యక్షులు బిచ్చాల మహేందర్, ప్రధాన కార్యదర్శి ముడుగుల రాజు, నాయకులు బండారి రామచందర్, చందుపట్ల మల్లేష్, బండారి జనార్ధన్, బిచ్చాల కొండలు, బండారి బాల నరసింహ, బిచ్చాల మైసయ్య, బండారి క్రాంతి, బుడుగుల రామచందర్, బండారి జీవన్, బుడుగుల బాల నరసింహ, సింగారం జాంగిర్, బండారి ప్రభాకర్, ముడుగుల ఉప్పలయ్య, ముడుగుల పరమేష్, మడుగుల కొండల్, మైసయ్య, దానయ్య, లింగయ్య, నరసింహ, బిచ్చల రాము ముడుగుల వెంకటయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 12 2024, 19:42

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో AISF 89వ ఆవిర్భావ దినోత్సవం

యాదధ్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వస్తూపుల అభిలాష్, ఉప్పుల శాంతి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ జెండాను ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వసంత్రం లక్ష్యంగా విద్యార్థులను చైతన్యం చేసిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ స్వతంత్ర ఉద్యమ సమయంలో అక్కడక్కడ ఎవరికి వారుగా పోరాడుతున్న విద్యార్థులను ఏకం చేసి జాతీయస్థాయిలో ఏర్పడిన తొలి విద్యార్థి సంఘముగా ఏఐఎస్ఎఫ్ నిలిచింది 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో ..భగత్ సింగ్ ..రాజ్ గురు.. సుఖ్ దేవ్ .. ఆజాద్ ..ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం ..బాబరుద్దీన్ బాసు.. ప్రేమ్ నారాయణ.. భార్గవ్..లా నాయకత్వన ఏఐఎస్ఎఫ్ సంఘం ఆవిర్భవించింది ఈ విద్యార్థి సంఘం నేటికీ 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సంఘం ఏఐఎస్ఎఫ్ విద్య కాషాయకరణకు వ్యతిరేకంగా కామన్ విద్యా విధానం కోసం విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ నాటి నుండి నేటి వరకు విద్యార్థుల పక్షాన నిలబడిన ఏఐఎస్ఎఫ్ లో ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థి సంఘంలో చేరి ఆ జెండాను భావితరాల కోసం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యపై అదే విధంగా సంక్షేమ హాస్టల్ లో మెస్ చార్జీలు పెంచాలని యూనివర్సిటీలలో విసి లను నియమించాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఇలా అనేక పోరాటాలు చేసిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఆ పోరాటాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతమాత బానిస సంకెళ్లు నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశంలోనే ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ప్రకాష్, ఆకాష్, శివ, సాయి, నరేష్,రాజు,అశోక్, రజినీ,శ్రీవాణి,పూజ,రేవతి,శ్రావణి తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Aug 12 2024, 18:20

రామన్నపేట: ఇంద్రపాలనగరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపార నగరంలో అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మల్లం మాదవి.గాజుల గణేష్.పావురాల ఐలయ్య .రాదారపు శంకరయ్య గారికి ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన చెక్కులను అందజేసిన రామన్నపేట మాజీ ఎంపీపీ పూస బలమని-బాలనర్సింహ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పేదలకు వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గార్దస్ సురేష్,సీనియర్ నాయకులూ పెద్దగోని వెంకటేశం,రవ్వ నర్సింహా,విక్కీసాయి,సందీప్,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 11 2024, 22:49

జర్నలిస్టు యోగి రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: టీజేయు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఎండి షానూర్ బాబా

వరంగల్ జిల్లాకు చెందిన యువ జర్నలిస్ట్ యోగి రెడ్డి మృతి చెందడం బాధాకరంమని ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక చౌరస్తాలో ముందుగా జర్నలిస్ట్ యోగి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు షానుర్ బాబా మాట్లాడుతూ యువ జర్నలిస్టు యోగి రెడ్డి మృతి చెందడం బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వాలు పాలకులు మారిన జర్నలిస్టు పరిస్థితులు మారటం లేదని ఆ దిశగా ఆలోచించే నాధుడు ఎవరు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ వృత్తి భద్రత వారి కుటుంబ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. నాటి నుండి నేటి వరకు సొంత ఇల్లు లేక మరణం అనంతరం పార్థివ దేహాన్ని అంతిమ చూపు సైతం చూడలేని పరిస్థితి ఉండటం సమాజంలో ఇంతకంటే విషాదకరమైన పరిస్థితి ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. యోగి రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్నపత్తిని మథ్యస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.శ్రీనివాస్, శ్రీనివాస్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 11 2024, 15:11

అరూరు లో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  అరూరు గ్రామంలో పురమ కృష్ణ అనారోగ్యం కారణాల వల్ల మరణించాడు, కృష్ణ కుటుంబానికి ఆదివారం రూ.10000/- పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని Ex.ZPTC వాకిటి పద్మ అనంత రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో DCC ఉపాధ్యక్షులు అనంత రెడ్డి, వాకిటి శరత్ పవన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, జనరల్ సెక్రటరీ కోడితల కరుణాకర్,సుంకిశాల పరమెశ్,పోలెపాక నరసింహ,దమెర అంజయ్య, M. ముత్యాలు , జకిడి నర్సిరెడ్డి,రేఖ మచి, కసరబోయిన మహేష్,K.మధు ,ch.సీను,పోలెపాక చెమ్మయ, బుర్ర శ్రీను,కాదరి నరేష్,J.రాజు,M.గణేష్,నల సత్తయ్య, వేముల ఎట్టయ్య, వేముల నరసింహ, వేముల రమేష్,B.రాజు,జినుకల దానయ్య,ఫకీర,అజగర్,P.రమేష్,P.మహేష్, వేముల చిన నరసింహ,ch.ఉపేందర్,రెబస్ నరేష్,జోలం సిద్ధయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 11 2024, 12:08

ఉత్తమ జర్నలిస్టుగా సేవ రత్న అవార్డును అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా స్టాపర్ గుర్రాల నాగరాజు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,డిజిటల్ మీడియా సంస్థలలో పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ..ప్రజల సమస్యలపై పలు ప్రత్యేక కథనాలు రాస్తూ, సామాజికంగా, రాజకీయంగా ప్రజలను ,యువతని చైతన్యపరుస్తూ సేవలు అందిస్తున్నందుకు ఎస్ఎల్పి చారిటబుల్ ట్రస్ట్ ,ఎస్జెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని చిక్కడ పల్లి త్యాగరాయ కళా భవనంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న ,హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్టుగా సేవ రత్న అవార్డును అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా చాడ గ్రామానికి చెందిన , యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా స్టాపర్ గుర్రాల నాగరాజు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, గ్రామస్తులు నాగరాజుకు అభినందనలు తెలియజేశారు.