అనంతపురం పట్టణంలోని ప్రైవేట్ యశోద ఆసుపత్రిని తనిఖీ చేసిన.. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి..
ఆస్పత్రిలో వెలువడే వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోస్ తెలియలి, డాక్టర్ ఈ బి దేవి డి యం అండ్ హెచ్ ఓ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి అనంతపురం పట్టణంలోని ప్రైవేట్ యశోద ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది ఆసుపత్రిలో వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను సక్రమమైన పద్ధతిలో డిస్పోజ్ చేయడం లేదని ఫిర్యాదులు అందడంతో డి ఎం అండ్ హెచ్ వో గారు తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రిలో వెలువడేటువంటి వ్యక్తపదార్థాలను బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో అనుసంధానమై శాస్త్రీయ పద్ధతిలో వ్యక్తపదార్థాలను డిస్పోజ్ చేయాలని ఆదేశించారు .ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను రకాలుగా విభజించుకొని పసుపు రంగు,ఎరుపు రంగు ,నీలం రంగు మరియు పంచర్ ప్రూఫ్ కవర్లలో వేయాలని వేసేముందు ఏ రంగు చెత్తకుండీలో ఏ చెత్త వేయాలో విభజించుకుని అందులో వేసి బయో మెడికల్ డిస్పోజల్ ప్రాంతానికి ఒప్పంద ప్రకారం పంపివేయాలని ఆదేశించారు బయో మెడికల్ వేస్ట్ ప్రమాదకరమైనవని పారవేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని తెలియజేశారు ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రులలో వెలువడే వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్దతిలో డిస్పోస్ చేయక పొతే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు
నిరుపేదల వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి
వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి...

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం గార్లదిన్నె గ్రామంలో నివాసంఉంటున్న మంగళ గణేష్ కూతురు వివాహంకు ₹10000 ఆర్థిక సహాయం చేసిన నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాండు మాజీ వైస్ ఎంపీపీ శేఖర్ నాయుడు గ్రామ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు రామంజి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మహిళా నాయకురాలు నేహా అయేషా..
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మహిళా నాయకురాలు నేహా అయేషా

అనంతపురం అర్బన్ నియోజవర్గం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేడు జన్మదినం తన క్యాంపు కార్యాలయం ఘనంగా జరిగింది.37వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నేహా అయేషా పూల బొక్కేను అందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు.
మరణించిన నడిపి కొండన్న పార్థివదేహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేసిన.. కాట్టప్ప గారి రామలింగారెడ్డి..
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురంలో అనారోగ్యంతో మరణించిన బండారు నడిపి కొండన్న, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కరణలా ఖర్చులకి ₹10,000/- రూ.లు ఆర్థికసాయం చేసిన పేదలపెన్నిధి, మంచిమనస్సున్న మహానేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. అనంతరం బండారు నడిపి కొండన్న గారి పార్థివదేహంకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భర్త సాకే నాగేంద్ర, సిద్దారంపురం ZPH స్కూల్ కమిటీ చైర్మన్ బోయ లింగమయ్య, సిద్దారంపురం ఏలిమెంటరీ స్కూల్ కమిటీ చైర్మన్ బోయ అంజి, కాటమయ్య, చెన్నమయ్య, నాగేంద్ర, వెంకటేష్, రవి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆరో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కోరిన రవి కుమార్ నాయక్
ప్రపంచ అదివాసి దినోత్సవం సందర్బంగా అనంతపురం జిల్లా గిరిజన భవన్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మారుమూల గిరిజన గారిని కలిసిన రవి కుమార్ నాయక్ పుష్పగుచం అందించి గిరిజనుల వివిధ సమస్యలను తీర్చాలని అలాగే అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతాలలో నివసించే గిరిజనులకు ఒక్కొక్క ఊరిలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి తారురోడ్లు వేయించి సమాన్యాయాలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరి అందేలా చూడాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది..
ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల వివరాలను ఈ - పంట ద్వారా నమోదు.. ఉద్యానాధికారి శైలజ..
ఈ పంట నమోదు: ఈరోజు బుక్కరాయసముద్రం మండలం , పసలూరు కొత్తపల్లి, రేకులకుంట గ్రామంలో ఖరీఫ్ 2024 సంవత్సరం ఈ పంట నమోదు లో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల వివరాలను ఈ పంట ద్వారా నమోదు చేయడమైనది. మండల వ్యాప్తంగా ఈ పంట ద్వారా నమోదు చేయించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్పుట్స్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, అకాల వర్షాలు మరియు ఈదురు గాలుల వలన పంట నష్ట పరిహారాలు ,పంట మీద బ్యాంకు రుణాలు అందుతాయని తెలపడం అయినది .పంట నమోదుకు రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం ,ఆధార్ కార్డు, రైతు ఫోన్ నెంబర్తో ఆయా గ్రామాల రైతు సేవ కేంద్రాల్లో వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేసుకోవాలని తెలపడం అయినది .దీర్ఘకాలిక ఉద్యాన పంటలను గత ఏడాది పంట నమోదైన పంటలను ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేయాలని రైతు సేవా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడమైనది. ఎంఐడిహెచ్ 2024 ఆర్థిక సంవత్సరం లో భాగంగా కొత్తగా నాటిన చి నీ ,మామిడి, జామ, బంతిపూల తోటలను సందర్శించడమైనది.ఈ కార్యక్రమంలో ఉద్యానాధికారి శైలజ, ఉద్యాన మరియు వ్యవసాయ సిబ్బంది అనూష నదియా, జోష్ణ ,ముని కుమార్ పాల్గోడమైనది.
E -క్రాప్ నమోదుకు తుది గడువు సెప్టెంబర్ -15... జిల్లా వ్యవసాయాధికారిని శ్రీమతి ఉమా మహేశ్వరమ్మ
E -క్రాప్ నమోదుకు తుది గడువు సెప్టెంబర్ -15...జిల్లా వ్యవసాయాధికారిని శ్రీమతి ఉమా మహేశ్వరమ్మ గారు జిల్లా లోని రైతులు సాగుచేసిన పంటలను ఈ క్రాప్ నమోదు చేయుంచుకోవాలని దీనికి తుది గడువు సెప్టెంబర్ నెల 15 వ తారీకుగా ప్రభుత్వం నిర్ణయించినదని కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందులవలన సామాజిక మాధ్యమాల ద్వారా మరియు గ్రామములలో దండోరా వేయుంచి రైతులకు తెలియజేసి పంటలను ఈ క్రాప్ ద్వారా నమోదు చేయవలెనని రైతు సేవ కేంద్ర ఇంచార్జి ని ఆదేశించారు. మండలములోని దయ్యలకుంటపల్లి గ్రామములో జరుగుతున్న ఈ క్రాప్ నమోదును పరిశీలించటానికి వచ్చిన ఆమె పంట నమోదు తర్వాత సామాజిక తనిఖీ 19/9/24 నుండి 24/9/24 వరకు ఉంటుందని ఫిర్యాదుల పరిస్కారం 25/9/24 నుండి 28/9/24 వరకు తుది జాబితా 30/9/24 న రైతు సేవ కేంద్రములలో మరియు గ్రామ సచివాలయం లో ఉంచడం జరుగుతుందని తెలియజేసారు. అదే విదంగా కౌలుకు భూములు తీసుకున్న రైతులు పంట సాగు హక్కు పత్రాలను పొందవలె నని దేవదాయ,మాన్యం భూములు సాగు చేసుకొ ను చున్న రైతులు కూడా ఈ హక్కు పత్రాలను సంబంధిత గ్రామ రెవిన్యూ అధికారులద్వారా పొందవలె నని తెలియజేసారు. వీటి ద్వారా పంటల కొనుగోళ్లు పంట నష్ట పరిహారం ప్రకృతి వ్యాపారీత్యాలు సంభవించినప్పుడు నష్టపరిహారం ఇన్సూరెన్సు మొదలగునవి పొందవచ్చునని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయధికారి శ్యాం సుందర్, రైతు సేవ కేంద్ర ఇంచార్జి నరేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
సెంట్రల్ యూనివర్సిటీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామం నందు నూతనంగా నిర్మించిన సెంట్రల్ యూనివర్సిటీ నందు పూర్తి అయిన భవనాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు విసి ఎస్ ఏ కోరి గారు బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు సిబ్బంది జంతలూరు సర్పంచ్ సుజాతమ్మ గారు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం పూర్తయిన అకాడమిక్ బ్లాక్ బాయ్స్ హాస్టల్ మరియు గర్ల్స్ హాస్టల్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి యూనివర్సిటీ కావలసిన సహాయ సహకారాలను గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరిన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కరువు జిల్లా మన అనంతపురం జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ ని తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు
సింగనమల మండల నూతన పదవి బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వో కు శుభాకాంక్షలు తెలిపిన.. సింగనమల మండల టిడిపి నాయకులు
సింగనమల నూతన ఎమ్మార్వో కు టిడిపి నాయకులు శుభాకాంక్షలు.. సింగనమల నూతన తహసిల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సాకే బ్రహ్మయ్య సార్ గారికి సింగనమల మండల ఆఫీసులో నూతన ఎమ్మార్వో గారికి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మార్కెట్ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ మాజీ సర్పంచ్ రామాంజనేయులు మాజీ సర్పంచ్ ముంత వెంకటేష్ శంకర్ నారాయణ జడేజా దాల్ వీర బాలముని ప్రకాష్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు
అమ్మవారిపేట గ్రామంలో తాగునీటి ఎద్దడిని గమనించి తాగునీటి పైప్ లైన్లను మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి పంచాయతీ అమ్మవారిపేట గ్రామంలో తాగునీరు పైపు పగిలిపోవడంతో వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.