మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆరో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కోరిన రవి కుమార్ నాయక్
ప్రపంచ అదివాసి దినోత్సవం సందర్బంగా అనంతపురం జిల్లా గిరిజన భవన్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మారుమూల గిరిజన గారిని కలిసిన రవి కుమార్ నాయక్ పుష్పగుచం అందించి గిరిజనుల వివిధ సమస్యలను తీర్చాలని అలాగే అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతాలలో నివసించే గిరిజనులకు ఒక్కొక్క ఊరిలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి తారురోడ్లు వేయించి సమాన్యాయాలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరి అందేలా చూడాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది..
ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల వివరాలను ఈ - పంట ద్వారా నమోదు.. ఉద్యానాధికారి శైలజ..
ఈ పంట నమోదు: ఈరోజు బుక్కరాయసముద్రం మండలం , పసలూరు కొత్తపల్లి, రేకులకుంట గ్రామంలో ఖరీఫ్ 2024 సంవత్సరం ఈ పంట నమోదు లో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల వివరాలను ఈ పంట ద్వారా నమోదు చేయడమైనది. మండల వ్యాప్తంగా ఈ పంట ద్వారా నమోదు చేయించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్పుట్స్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, అకాల వర్షాలు మరియు ఈదురు గాలుల వలన పంట నష్ట పరిహారాలు ,పంట మీద బ్యాంకు రుణాలు అందుతాయని తెలపడం అయినది .పంట నమోదుకు రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం ,ఆధార్ కార్డు, రైతు ఫోన్ నెంబర్తో ఆయా గ్రామాల రైతు సేవ కేంద్రాల్లో వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేసుకోవాలని తెలపడం అయినది .దీర్ఘకాలిక ఉద్యాన పంటలను గత ఏడాది పంట నమోదైన పంటలను ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేయాలని రైతు సేవా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడమైనది. ఎంఐడిహెచ్ 2024 ఆర్థిక సంవత్సరం లో భాగంగా కొత్తగా నాటిన చి నీ ,మామిడి, జామ, బంతిపూల తోటలను సందర్శించడమైనది.ఈ కార్యక్రమంలో ఉద్యానాధికారి శైలజ, ఉద్యాన మరియు వ్యవసాయ సిబ్బంది అనూష నదియా, జోష్ణ ,ముని కుమార్ పాల్గోడమైనది.
E -క్రాప్ నమోదుకు తుది గడువు సెప్టెంబర్ -15... జిల్లా వ్యవసాయాధికారిని శ్రీమతి ఉమా మహేశ్వరమ్మ
E -క్రాప్ నమోదుకు తుది గడువు సెప్టెంబర్ -15...జిల్లా వ్యవసాయాధికారిని శ్రీమతి ఉమా మహేశ్వరమ్మ గారు జిల్లా లోని రైతులు సాగుచేసిన పంటలను ఈ క్రాప్ నమోదు చేయుంచుకోవాలని దీనికి తుది గడువు సెప్టెంబర్ నెల 15 వ తారీకుగా ప్రభుత్వం నిర్ణయించినదని కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందులవలన సామాజిక మాధ్యమాల ద్వారా మరియు గ్రామములలో దండోరా వేయుంచి రైతులకు తెలియజేసి పంటలను ఈ క్రాప్ ద్వారా నమోదు చేయవలెనని రైతు సేవ కేంద్ర ఇంచార్జి ని ఆదేశించారు. మండలములోని దయ్యలకుంటపల్లి గ్రామములో జరుగుతున్న ఈ క్రాప్ నమోదును పరిశీలించటానికి వచ్చిన ఆమె పంట నమోదు తర్వాత సామాజిక తనిఖీ 19/9/24 నుండి 24/9/24 వరకు ఉంటుందని ఫిర్యాదుల పరిస్కారం 25/9/24 నుండి 28/9/24 వరకు తుది జాబితా 30/9/24 న రైతు సేవ కేంద్రములలో మరియు గ్రామ సచివాలయం లో ఉంచడం జరుగుతుందని తెలియజేసారు. అదే విదంగా కౌలుకు భూములు తీసుకున్న రైతులు పంట సాగు హక్కు పత్రాలను పొందవలె నని దేవదాయ,మాన్యం భూములు సాగు చేసుకొ ను చున్న రైతులు కూడా ఈ హక్కు పత్రాలను సంబంధిత గ్రామ రెవిన్యూ అధికారులద్వారా పొందవలె నని తెలియజేసారు. వీటి ద్వారా పంటల కొనుగోళ్లు పంట నష్ట పరిహారం ప్రకృతి వ్యాపారీత్యాలు సంభవించినప్పుడు నష్టపరిహారం ఇన్సూరెన్సు మొదలగునవి పొందవచ్చునని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయధికారి శ్యాం సుందర్, రైతు సేవ కేంద్ర ఇంచార్జి నరేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
సెంట్రల్ యూనివర్సిటీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామం నందు నూతనంగా నిర్మించిన సెంట్రల్ యూనివర్సిటీ నందు పూర్తి అయిన భవనాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు విసి ఎస్ ఏ కోరి గారు బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు సిబ్బంది జంతలూరు సర్పంచ్ సుజాతమ్మ గారు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం పూర్తయిన అకాడమిక్ బ్లాక్ బాయ్స్ హాస్టల్ మరియు గర్ల్స్ హాస్టల్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి యూనివర్సిటీ కావలసిన సహాయ సహకారాలను గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరిన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కరువు జిల్లా మన అనంతపురం జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ ని తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు
సింగనమల మండల నూతన పదవి బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వో కు శుభాకాంక్షలు తెలిపిన.. సింగనమల మండల టిడిపి నాయకులు
సింగనమల నూతన ఎమ్మార్వో కు టిడిపి నాయకులు శుభాకాంక్షలు.. సింగనమల నూతన తహసిల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సాకే బ్రహ్మయ్య సార్ గారికి సింగనమల మండల ఆఫీసులో నూతన ఎమ్మార్వో గారికి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మార్కెట్ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ మాజీ సర్పంచ్ రామాంజనేయులు మాజీ సర్పంచ్ ముంత వెంకటేష్ శంకర్ నారాయణ జడేజా దాల్ వీర బాలముని ప్రకాష్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు
అమ్మవారిపేట గ్రామంలో తాగునీటి ఎద్దడిని గమనించి తాగునీటి పైప్ లైన్లను మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి పంచాయతీ అమ్మవారిపేట గ్రామంలో తాగునీరు పైపు పగిలిపోవడంతో వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
సిరికల్చర్ అధికారులు ఎంపీపీ దాసరి సునీతకు ప్రశంసలు.. బుక్కరాయసముద్రం మండలంలో సిరికల్చర్ సాగుపై అధికారులతో చర్చించిన ఎంపీపీ దాసరి సునీత..

నాడు అనంతపురం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో మీరు సిరికల్చర్ ప్రస్తావన తెచ్చినందుకే మా పై అధికారులు సిరి కల్చర్ డిపార్ట్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇప్పుడు మేము సిరికల్చర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము కనుక మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని సిరికల్స్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. బుక్కరాయసముద్రం మండలంలో సిరికల్చర్ సాగుపై అధికారులతో చర్చించిన ఎంపీపీ దాసరి సునీత.. ఈ కార్యక్రమంలో సిరి కల్చర్ అధికారులు ఓబులేసు గారు మండల అధికారి ఓబుల రెడ్డి గారు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ మండలంలో సెరికల్చర్ సాగు చేయాలంటే రైతులకు వచ్చే సబ్సిడీ షెడ్లను వాటి సాగులో మెలకువలు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పారు.

బండారు విశ్వభారతి అనే అమ్మాయి వివాహానికి ఆర్థిక సాయం అందించిన పసుపుల ఫుడ్స్ అధినేత పసుపుల హనుమంతు రెడ్డి..
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దలాపురం గ్రామంలో బండారు విశ్వభారతి అనే అమ్మాయి వివాహానికి వారి తాతాగరైనా కుళ్లాయప్పకి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన పసుపుల ఫుడ్స్ అధినేత, మాజీ జిల్లా సర్పంచుల అధ్యక్షుడు పసుపుల హనుమంతు రెడ్డి
నూతన తహసీల్దార్ పుణ్యవతి కి శుభాకాంక్షలు తెలిపిన బుక్కరాయసముద్రం మండల టీడీపీ శ్రేణులు..
నూతన తహసీల్దార్ పుణ్యవతి కి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు.. బుక్కరాయసముద్రం మండలం నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన పుణ్యవతి కి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పసపల హనుమంత రెడ్డి, జిల్లా టీడీపీ బీసీ నాయకులు పొడరాళ్ల రవీంద్ర లు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాజకీయాలు కు సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందేటట్లు చూడాలని తహసీల్దార్ పుణ్యవతి ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ బండి ఆదినారాయణ, పెద్దప్పయ్య, నాగార్జున, గంగాధర్, ఈశ్వరయ్య, శివా రెడ్డి, రవీంద్ర, తలారి ఆది, ఓబులపతి, బాబా ఫక్రుద్దీన్ వలి, తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన.. ఎంపీపీ దాసరి సునీత..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రంలో ఆశ కార్యకర్తల సమావేశం డాక్టర్ స్వాతి లక్ష్మి మరియు డాక్టర్ తెహర్నిశ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా మండల ప్రజా పరిషత్ చైర్మన్ దాసరి సునీత గారు సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వమని స్నేహపూర్వకంగా పనిచేసుకుంటూ మంచి వాతావరణంలో ఉద్యోగులు ముందుకు వెళ్లాలని తెలియజేశారు. సమస్యలు ఉంటే మాకు తెలియజేస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. సిబ్బంది అంతా వారి వారి విధులను నిర్వహించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. వైద్యాధికారి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు 4 నెలల గర్భవతి నుండి కాన్ పైన సంవత్సరం వరకు కిల్ కర్రి ఫోన్ కాల్స్ పైన వారికి అవగాహన కల్పించాలని తెలియజేశారు .అలాగే ఈ నెలలో నిర్వహించే జాతీయ నులి పురుగుల దినోత్సవం అందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని దానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటినుంచే అన్ని ప్రభుత్వ ప్రైవేటు అంగన్వాడి పాఠశాలల యందు ప్రధానోపాధ్యాయులకు తెలియజేసి , చేతుల పరిశుభ్రత పైన అవగాహన కల్పించాలని తెలియజేశారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆశ కార్యకర్తలు మరియు సిబ్బంది శ్రమదానం చేసి ఆసుపత్రి ఆవరణంలో ఉన్న మొక్కలను తొలగించడం జరిగింది. ఆసుపత్రిలో కాన్పులు అయ్యే విధంగా ఆశ కార్యకర్తలు గర్భవతులుకు అవగాహన కల్పించాలని తెలియజేయడమైనది. ఈ ఆశ యాప్ ను ప్రతిరోజు అప్డేట్ చేసుకొని పెండింగ్ వర్క్ ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలియజేశారు. అలాగే పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడం కోసం పొగాకు ఉత్పత్తులను ప్రజలు వాడకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి మోహన్ రావు, పీహెచ్ఎం చెన్నమ్మ రామలక్ష్మమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ ఫాతిమా, సూపర్వైజర్ ఈశ్వరమ్మ, జానీ రాజ్, సీనియర్ అసిస్టెంట్ సునీత, హెల్త్ అసిస్టెంట్లు ధనుంజయ , ఆనంద్, శివానంద, ఫార్మసిస్ట్ మహబూబ్ బాషా, స్టాఫ్ నర్స్, అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లలా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది