madagoni surendar

Jul 26 2024, 20:57

పంచాయతీరాజ్ పై ముగిసిన సీఎం సమీక్ష

తెలంగాణ:-

పంచాయతీరాజ్ పై ముగిసిన సీఎం సమీక్ష

కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి

ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించిన సీఎం

బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం

madagoni surendar

Jul 26 2024, 19:05

రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి మోతే మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించిన. టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సూర్యాపేట జిల్లా :-

రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి

మోతే మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించిన. టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

నల్గొండ జిల్లా :-

గౌరవ అతిథులుగా హాజరైన మండల తహసిల్దార్..

ఎంపీడీవో...వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలను నిర్మించాలని స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి దిశా నిర్దేశం చేసే ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90% జర్నలిస్టులకు పక్కా ప్రెస్ క్లబ్ భవనాలు లేక హోటల్లో చెట్ల కింద ప్రైవేటు భవనాల మెట్ల పైన కూర్చొని కాలం వార్తలు సేకరించే దయనీయమైన పరిస్థితి నెలకొన్నదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా భవనాలు నిర్మించాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సంఘమిత్ర, మండల ఎంపీడీవో హరి సింగ్, భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ, భాస్కర్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బి శ్రీనివాస్, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దోసపాటి రాములు, బిజెపి మండల ఉపాధ్యక్షులు కొడిసే వెంకన్న, టీఎస్ జెఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌసుద్దీన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలకల చిరంజీవి, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏర్పుల సాయి కృష్ణ , మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గట్టిగుండ్ల రాము, ఉపాధ్యక్షులు మాలోత్ కోటి నాయక్, కోశాధికారి గురజాల వెంకన్న, సహాయ కార్యదర్శి డి ఎలీషా, కమిటీ సభ్యులు కొండ ఉదయ్, అన్ని పార్టీల నాయకులు మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ , ఆర్.టి.ఐ నాయకులు, నాయకులు పేర్ల రామయ్య, సిఐటియు మండల కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Jul 25 2024, 21:26

ఏలూరు జిల్లా :-ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ :-

ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్

ఏలూరు: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డి.ఎస్.పి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరులు వృత్తులను ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్ లో విలేఖరిగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్ కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడ అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని.. హోటల్ ఏమి సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడుని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ను ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను ఇకనుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికి ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. రూ 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాలు దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తాను చెప్పి ఈ విషయాన్ని అందర్నీ అడగగా వాళ్ళు నకిలేని అధికారులు తెలిసింది వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్ చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గా దేవి పాట సహకరించి బుక్కురి దేవి ప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగా రాంబాబులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు..వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్స్ రెండు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేస్ చేదించిన ఎస్సై రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు

madagoni surendar

Jul 25 2024, 19:29

ఏపీ.పరకాలలో ఏసీబీ ట్రాప్ లంచం తీసుకొంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ సునీత.

BIG BREAKING

ఆంధ్రప్రదేశ్ :-

పరకాలలో ఏసీబీ ట్రాప్ .

లంచం తీసుకొంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ సునీత.

80000 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్.

బాధితుడు లాడే శ్రీనివాస్, శ్రీకాంత్ లకు చెందిన చెందిన ల్యాండ్ ను తల్లి నుండి కొడుకులకు పార్టెషన్ కోసం మాదారం శివారులోని 481c సర్వే నెంబర్ భూమి కోసం వెళ్లగా 80000 వేల లంచం అడిగిన సబ్ రిజిస్టర్ సునీత .

దీంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు.

madagoni surendar

Jul 25 2024, 17:36

మాల మహానాడు నల్లగొండ జిల్లా మీడియా అధ్యక్షులు గా గోగు బాలసైదులు నీయమకం

నల్గొండ జిల్లా :-

మాల మహానాడు నల్లగొండ జిల్లా మీడియా అధ్యక్షులు గా గోగు బాలసైదులు నీయమకం

నల్గొండ జిల్లా :-

శుక్రవారం నాడు నల్గొండ జడ్పీ గెస్ట్ హౌస్ లో మాల మహానాడు సమావేశం చింతపల్లి బాలకృష్ణ నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మాల మహానాడు జాతి అధ్యక్షులు తాళ్లపల్లి రవి సోషల్ మీడియా కన్వీనర్ నాగాటి జోసఫ్ పాల్గొన్నారు ఇట్టి సమావేశంలో జిల్లా సోషల్ మీడియా సమావేశం జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించి కట్టంగూరు గ్రామానికి చెందిన గోగు బాలసైదులు ను మాల మహానాడు నల్లగొండ జిల్లా మీడియా అధ్యక్షులు గా ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది నియామక పత్రాన్ని సంఘ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కామర్ల నరేష్ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పెరమళ్ళ వినోద్, రాష్ట్ర నాయకులు బోగరి అనిల్,జిల్లా విద్యార్థి అధ్యక్షులు చింతపల్లి వెంకన్న, జిల్లా విద్యార్థి ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Jul 24 2024, 10:28

నల్గొండ జిల్లా :-ప్రకాశం బజార్ లోని పలు దుకాణాల్లో బయటపడ్డ నిర్వహకుల ఘరానా మోసం.

నల్గొండ : బ్రేకింగ్...

ప్రకాశం బజార్ లోని పలు దుకాణాల్లో బయటపడ్డ నిర్వహకుల ఘరానా మోసం....

పలు దుకాణాలపై కాపీ రైట్స్ అధికారుల తనిఖీలు...

హనుమాన్ ఎలక్ట్రిక్ షాప్ లో గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతలేని వైర్లను అమ్ముతున్న నిర్వాహకులు...

రూ 22 లక్షల విలువ గల 16 వైర్ బ్యాగులు స్వాధీనం..

పద్మావతి కిరాణం షాపులో రూ 1.70 లక్షల విలువ గల కల్తీ మస్కిటో అగరబత్తులు స్వాధీనం...

పలు దుకాణాలపై కొనసాగుతున్న దాడులు...

madagoni surendar

Jul 23 2024, 21:48

ఢిల్లీ :-2024: కుర్చీని కాపాడుకునే బడ్జెట్. బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

ఢిల్లీ :-

2024: కుర్చీని కాపాడుకునే బడ్జెట్:

-:రాహుల్ గాంధీ

బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత

మిత్రులను ఆనందింపజేసేందుకు సామాన్యులకు ఏమీ ప్రకటించలేదని ఆరోపణ

కాంగ్రెస్ మేనిఫెస్టో‌ను కాపీ-పేస్ట్ చేశారని మండిపాటు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. కేంద్ర బడ్జెట్‌ను ‘కుర్చీని కాపాడుకునే బడ్జెట్’గా అభివర్ణించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ‘కాపీ అండ్ పేస్ట్’ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను విమర్శిస్తూ, దీనిని కుర్సీ బచావో బడ్జెట్ అని అభివర్ణించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 బడ్జెట్‌ను తన 7వ వరుస ప్రజెంటేషన్‌గా ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మొదటి బడ్జెట్. 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో మరియు మునుపటి బడ్జెట్‌ల యొక్క "కాపీ అండ్ పేస్ట్" పని బడ్జెట్ అని కాంగ్రెస్ మాజీ చీఫ్ పేర్కొన్నారు.

బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారని, ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు చేశామని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బడ్జెట్ ద్వారా మిత్రులను ఆనందింపజేశారని, ఏఏలకు (అంబానీ, అంబానీ అనే అర్థంతో) ప్రయోజనం చేకూర్చేందుకు సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, మునుపటి బడ్జెట్లలను ‘కాపీ అండ్ పేస్ట్’ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 

నిరుద్యోగం ఉందని అంగీకరించారు: కాంగ్రెస్

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్ వేదికగా బడ్జెట్ 2024-25పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం బడ్జెట్ ఆకట్టుకోవడంపై మాత్రమే దృష్టిసారించిందని, చర్యలపై ఫోకస్ చేయలేదని పేర్కొంది. కాపీ-పేస్ట్ ప్రభుత్వం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నిరుద్యోగం జాతీయ సంక్షోభం అనే విషయాన్ని ఈ బడ్జెట్ ద్వారా కేంద్రం నిశ్శబ్దంగా అంగీకరించినట్టు అయిందని వ్యాఖ్యానించింది. రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా ఉన్నాయని ఈ బడ్జెట్ ద్వారా అర్థమవుతోందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

madagoni surendar

Jul 23 2024, 13:10

ఆంధ్రప్రదేశ్ :- ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం::రెండో ప్రమాద హెచ్చరిక జారీ.

ఆంధ్రప్రదేశ్ :-

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం::రెండో ప్రమాద హెచ్చరిక జారీ.

జలదిగ్భందంలో పలు గ్రామాలు

అమరావతి :, జులై 23

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగుతుంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగు తుంది. సోమవారం అర్ధ రాత్రి 2గంటల సమయంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 

కాటన్ బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని వదులు తున్నారు. సుమారు 13లక్షల14వేలు క్యూసెక్కు ల నీటిని దిగు ప్రాంతానికి వదులుతున్నారు. 

ఈరోజు ఉదయం ఏడు గంటల వరకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14 అడుగులకు నీటి మట్టం చేరింది. ఏజెన్సీలో గంటగం టకు వరద ప్రభావం పెరగ డంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

చింతూరు జాతీయ రహదారి (NH)30పై వరద నీరు చేరింది. చింతూరు నుండి భద్రాచలం వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వి.ఆర్.పురం మండలం చింతరేవుపల్లి, తుష్టివారి గూడెం గ్రామాల వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుంది. నాలుగు మండలాల్లో సుమారుగా 250 గ్రామాలకు రాకపోక లకు పూర్తిగా నిలిచిపో యాయి. 

లోతట్టు గ్రామాల ప్రజలను అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అప్రమత్తం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిం చడానికి 18 లాంచీలను అధికారులు ఏర్పాటు చేశారు.

madagoni surendar

Jul 23 2024, 12:47

ఆంధ్రప్రదేశ్ :-నెల్లూరు జిల్లా :-పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఆంధ్రప్రదేశ్ :-

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

AP: నెల్లూరులోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్తో తెల్లవారుజామున 5 గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డ్లోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు.

madagoni surendar

Jul 22 2024, 17:50

కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం   

     

 పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

 కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

..

నల్గొండ జిల్లా :-

నకిరేకల్.కల్యాణ లక్ష్మీ పధకం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా నిలుస్తుంది అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు,సోమవారం నాడు నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడి ఆలయంలో కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు, అనంతరం మండలంలోని మంజూరైన 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేశారు 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.

నేడు 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను అందుకుటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు 

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది నార్కెట్‌పల్లి లో బస్సు డిపోను పునరావృత్తం చేస్తాం 

మన నియెజకవర్గం ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ముఖ్యమంత్రి చేతులు మీదుగా 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేసుకుందాం, డ్రీగి కళాశాల ను నిర్మాణం చేసుకుందాం నకిరేకల్ పట్టణంలోని పేద విద్యార్థులకు, ఫీజుల భారం లేకుండా నర్సరీ నుండి డ్రీగి వరకు నాణ్యతమైన విద్యను అందిస్తాం మీ సమస్యల పరిష్కారానికి ఏల్లపుడు తోడుగా ఉంటా.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..