కౌలు రైతుల పంట సాగు హక్కు పత్రాలను పొందండి... జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి ఉమామహేశ్వరమ్మ...
కౌలు రైతులు పంట సాగు హక్కు పత్రాలను పొందండి... అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి ఉమామహేశ్వరమ్మ...

బుక్కరాయసముద్రం మండలములోని వడియం పేట గ్రామం రైతులు భూమి యజమాని నుండి భూమిని కౌలుకు తీసుకున్నచో పంట సాగు హక్కు పత్రాలను సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులను సంప్రదించి సాగు హక్కు పత్రాలను పొందాలని రైతులను కోరారు. పంట సాగు హక్కు పత్రాల అవగాహనా కార్యక్రమం నకు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు కౌలుకు తీసుకున్నచో వెంటనే యజమాని మరియు కౌలుదారు సంబంధిత గ్రామ రెవిన్యూ అధికారిని సంప్రదించి పాస్ పుస్తకం జిరాక్స్ రెండు ఫోటో లు మరియు దరఖాస్తు ను నింపి ఇచినచో పంట సాగు హక్కు పత్రాన్ని ఇస్తారని తెలియజేసారు. దీని యొక్క కాల పరిమితి 11 నెలలు మాత్రమే ఉంటుందని యజమానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేసారు. కౌలు రైతుకు పంట మీద మాత్రమే హక్కు ఉంటుందని భూమి పై ఉండదని తెలియజేసారు.కౌలు రైతుకు ప్రభుత్వం నుండి పెట్టుబడి సహాయం వస్తుందని పంట నష్ట పోతే పెట్టుబడి రాయుతి, ఇన్సూరెన్సు,పంట నష్ట పరిహారం, పంట కనీస మద్దతు ధరతో అమ్ముటకు వీళవుతుందని తెలియజేసారు కావున రైతులందరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయధికారి శ్యాం సుందర్ రెడ్డి,గ్రామ రెవెన్యూ అధికారిని శిరీష, వ్యవసాయసహాయకుడు శ్రీనివాస్, ఎంపీ ఈఒ తిరుమలేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
పి.ఆర్.వన్ యాప్ లో డ్రైనేజీ కాలువలను గుంతలను చెత్త దిబ్బలను ఎలా రిజిస్టర్ చేయాలో యాప్ పై అవగాహన కల్పించిన.. D.P.O, జిల్లా ఇన్చార్జి సీ.ఈ.ఓ

అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఇన్చార్జి సీఈఓ ప్రభాకర్ రావు అనంతపురం వారు బుక్కరాయసముద్రం గ్రామపంచాయతీకి సందర్శించి పి ఆర్ వన్ యాప్ కు సంబంధించి గ్రామంలో ఉన్న మురికాలువలు కసువు దిబ్బలు ,కంప చెట్లు ,ట్యాంకులు రిజిష్టర్ చేసే టప్పుడు ఫోటో రిజిష్టర్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తరువాత ఫోటో అప్లోడ్ చేయవలెనని DPO గారు పంచాయితీ సిబ్బంది చేయుచున్న అన్ లైన్ పరిశీలించడ మైన ది. ఈ కార్యక్రమం నకు సర్పంచ్ అమ్మవారిపేట పార్వతి గారు, EORD దామోదరమ్మ గారు. పంచాయితి కార్యదర్శులు,ఇంజనీరింగ్ అసిస్టెంట్స్,పంచాయితి సిబ్బంది అందరూ పాల్గొన డ మైన ది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్య లను తెలిపిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి,జనసేన పార్టీ అధ్యక్షులు గౌ|| శ్రీ పవన్ కళ్యాణ్ గారినిమర్యాదపూర్వకంగా కలిసి,నియోజకవర్గ సమస్యలు,గ్రామీణ తాగునీరు మరియు పారిశుద్ధ్యనికి సంబంధించిన పెండింగ్ బిల్లులు,అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లిన శింగనమల నియోజకవర్గం శాసనసభ్యురాలు బండారు శ్రావణి శ్రీ గారు.
పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంకు ₹10000/- రూ.లు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
స్వాగ్రామం మైన సిద్దారంపురంలోని పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంకు ₹10000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురం లోని పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంకు ₹10000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు కాటమయ్య,మద్దిలేటి, రవి, నరసింహులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి..

అమరావతి అసెంబ్లీ సెక్రటరియేట్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర IT & విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు .

నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వు శాతం జీరో..!
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వు శాతం జీరో..!

పాల రంగు విషయానికి వస్తే చాలా మంది పాల రంగు తెలుపు అని చెబుతారు. ఇది కాకుండా మీరు లేత పసుపు రంగు పాలను కూడా చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా నలుపు రంగు పాలను చూశారా? బహుశ మీరు ఇలాంటివి చూసి ఉండకపోవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే నల్ల పాలను చూసి ఉంటారు. అయితే, ఇలాంటి నలుపు రంగు పాలు ఆడ నల్ల ఖడ్గమృగం నుండి వస్తాయి. వాటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గమృగం అని కూడా అంటారు. ఖడ్గమృగం ఇచ్చే పాలు పూర్తిగా నల్లనిరంగులో ఉంటాయి. వీటిలో కొవ్వు అస్సలు ఉండదని చెబుతుంటారు. ఇవి ఆర్యోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, వీటి వల్ల పుష్కలంగా అందుతాయని చెబుతారు. ఖడ్గమృగం తల్లి పాలలో నీరు ఉంటుంది. 0.2 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ నల్లని పాలు జంతువుల్లో పునరుత్పత్తి ప్రక్రియను నెమ్మదిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే నల్ల ఖడ్గమృగాలు నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. ఇది కాకుండా, వాటి గర్భం సాధారణం కంటే ఎక్కువ. ఇవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ పాటు గర్భాన్ని మోస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఓ.పి టికెట్ పై ఆధార్ లింక్ ఓ.టీ.పిని రద్దు పరిచి సత్వరమే రోగులకు వైద్యం అందించాలి -సామ్రాట్ కే.బి.మధు డిమాండ్..
ఓ.పి టికెట్ పై ఆధార్ లింక్ ఓ.టీ.పిని రద్దు పరిచి సత్వరమే రోగులకు వైద్యం అందించాలి -సామ్రాట్ కే.బి.మధు డిమాండ్

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ని ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రిలో రోజు వేలాది మంది పేద ప్రజలు తమ ఆరోగ్యం మెరుగు పర్చుకోవడా నికి చికిత్స నిమిత్తం వస్తున్న రోగులకు ఓ.పి టికెట్ తీసుకోవడం లో అనేక కష్టాలకు గురి కావడమే కాకుండా ఆధార్ నంబర్ లింకు తో ఓ.టీ.పి తోసమయం వృతా చేస్తున్నారు ఈ సందర్బంగా ఓ.పి సమయం పూర్తి అయి డాక్టర్లు రౌండ్స్ కు వెళ్లి వార్డులో అడ్మిట్ లో ఉన్నరోగులకు వైద్యం చేయడానికి వెళ్లి పోతారు ఈ సమయంలో ఓ.పి విభాగం లో చికిత్స ఆలస్యమై రోగులు వైద్యం అందాకా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా రు ఈ సమయంలో రోగులు అత్యవసర చికిత్స విభాగంకు వెళ్లి తే అక్కడ పరిస్థితి వర్ణనాతీతం అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు వైద్యం అందించడం లో నిర్లక్ష్యం చూపుతున్న సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక వైపు ఓ. టీ. పి తో ఇబ్బందులు పడి ఆతరువాత వైద్యం విద్యంకోసం నా నాతంటాలు పడవలసి వున్నదని వెంటనే ఓ. టీ. పి ఆధార్ లింకు రద్దు పరచాలని సత్వరమే ఓ. టీ. పి టికెట్ అందజేసి సత్వరమే రోగులకు వైద్యం అందె విదంగా చూడాలని అదే విదంగా అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం సేవలు అందించడానికి ఎక్కువ మంది డాక్టర్లను మరియు సిబ్బంది తో పాటు ఎం.ఎన్.ఓ లను ఉంచాలని ఎం.ఆర్.పి.యస్ ఆధ్వర్యంలో సూపర్నెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అత్యవసరంగా వచ్చిన రోగులకు స్ట్రక్చర్ లేక ఎమర్జెన్సీ విభాగం నుండి సిటీ స్కాన్ కు గాని లేదా ఎక్స్రే లకు గాని తీసుకెళ్లాలనుకుంటే చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది, అలాగే వైద్యం కోసం వచ్చిన రోగులను స్టాంపు కోసమని సంతకాల కోసమని చీటికిమాటికి తిప్పుతున్నారు. అత్యవసరంగా యాక్సిడెంట్లు అయి గాయాలతో వచ్చిన రోగులను కనీసం డ్రెస్సింగ్ చేయడానికి కూడా తగిన సిబ్బంది ఆ విభాగంలో లేరు. ఎమర్జెన్సీగా వచ్చిన రోగులను సరైన సమయానికి వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం ఎంతోమంది వస్తుంటారు అలాంటి చోట కనీస పరిశుభ్రత లేకుండా అలాగే దుర్వాసన వస్తున్న కూడా అ వార్డుని ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంచడం లేదు. ఇవి అన్ని దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ వార్డులో రోగుల వైద్యం కోసం బెడ్లు, అలాగే రోగులను తరలించడా నికి స్ట్రక్చర్లు వార్డ్ బాయ్స్ మరియు అక్కడ సిబ్బందిని పెంచాలని అత్యవసరంలో వచ్చిన రోగులను సరైన సమయానికి చికిత్స అందించే విధంగా చూడాలని Mrps, Msp కమిటీ ద్వారా సర్వజన ఆసుపత్రి సూపరేంటెండెంట్ గారికి మెమోరాండం ఇచ్చి త్వరగా రోగులకి చికిత్స అందె విదంగా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సామ్రాట్ కే. బి. మధు మాదిగ యం.ఆర్. పి.యస్, యం.యస్.పి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, Msp సీనియర్ నాయకులు నిషార్ అహమ్మద్ మహాజన్, యం.ఆర్.పి.యస్.జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజి,సీనియర్ నాయకు లు రేకులకుంట వెంకటేష్, బి. కే.యస్,యం.ఆర్.పి.యస్ మండల అధ్యక్షులు రెడ్డిపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు సామాజికఉద్యమవందనాలతో నిషార్ అహమ్మద్ మహాజన్ ఎం.యస్.పి సీనియర్ నాయకులు
S.C. సంపత్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుక్షం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టిడిపి సీనియర్ నాయకులు పామురాయి వెంకటేష్..
విద్యుత్ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీ కె. సంపత్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుక్షం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపిన జిల్లా టిడిపి సీనియర్ నాయకులు రాప్తాడు నియోజకవర్గం పామురాయి వెంకటేష్ మరియు ఇతర తెలుగుదేశం నాయకులు ప్రతినిధులు.
విద్యుత్ శాఖ S.C.ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుక్షం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన పసుపల ఫుడ్స్ అధినేత శ్రీరామరెడ్డి, పసుపుల హనుమంతరెడ్డి..
విద్యుత్ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీ కె. సంపత్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి... పుష్పగుక్షం అందజేసి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపిన పసుపల ఫుడ్స్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామరెడ్డి, తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ హనుమంతరెడ్డి మరియు ఇతర తెలుగుదేశం నాయకులు ప్రతినిధులు.
ఉనికి కోసమే జగన్ హత్య రాజకీయాలు.. మాసూల చంద్రమోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్..
ఉనికి కోసమే జగన్ హత్య రాజకీయాలు.. మాసూల చంద్రమోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్..

వినుకొండలో వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజకీయ రంగు పులమడం శవ రాజకీయాలు చేయడం ఉనికి కోసమే అత్యా రాజకీయాలు చేయడం మానుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ అన్నారు,వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను రాజకీయంగా వాడుకోవడం సరైన పద్ధతి కాదని గత వైసిపి ప్రభుత్వంలో మేధావులపైన టిడిపి కార్యకర్తల పైన దౌర్జన్యాలు, దాడులు, మానభంగాలు, హత్యలు ఊచకోతలు జరిగితే శాంతిభద్రతల గురించి ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా సీఎం హోదాలో జగన్ గారు మాట్లాడారా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గతంలో అధికారం కోసం బాబాయ్ హత్య, కోడి కత్తి డ్రామ ఆడిన నీవు ప్రజలందరూ గమనించి మొన్న జరిగిన ఎన్నికలలో నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం జరిగింది డాక్టర్ సుధాకర్, బీసీ నేతలు చంద్రయ్య, గంధం సుబ్బయ్యను దారుణంగా వైసిపి గుండాలు హత్య చేస్తే సీఎం హోదాలో స్పందించలేదు గాని ఇప్పుడు రషీద్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటు అని ఢిల్లీలో ధర్నాలు చేస్తామనడం మీ ఎమ్మెల్సీ దళితుని చంపే డోర్ డెలివరీ చేస్తే ఎందుకు నీవు ధర్నా చేయలేదు అని ప్రశ్నిస్తున్నాం శాంతి భద్రతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు గారిని ప్రభుత్వాన్ని నీ ఉనికి కోసం హత్య రాజకీయాలు చేయడం మాని అభివృద్ధికి సహకరించాలని కోరుచున్నాము