నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వు శాతం జీరో..!
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వు శాతం జీరో..!

పాల రంగు విషయానికి వస్తే చాలా మంది పాల రంగు తెలుపు అని చెబుతారు. ఇది కాకుండా మీరు లేత పసుపు రంగు పాలను కూడా చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా నలుపు రంగు పాలను చూశారా? బహుశ మీరు ఇలాంటివి చూసి ఉండకపోవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే నల్ల పాలను చూసి ఉంటారు. అయితే, ఇలాంటి నలుపు రంగు పాలు ఆడ నల్ల ఖడ్గమృగం నుండి వస్తాయి. వాటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గమృగం అని కూడా అంటారు. ఖడ్గమృగం ఇచ్చే పాలు పూర్తిగా నల్లనిరంగులో ఉంటాయి. వీటిలో కొవ్వు అస్సలు ఉండదని చెబుతుంటారు. ఇవి ఆర్యోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, వీటి వల్ల పుష్కలంగా అందుతాయని చెబుతారు. ఖడ్గమృగం తల్లి పాలలో నీరు ఉంటుంది. 0.2 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ నల్లని పాలు జంతువుల్లో పునరుత్పత్తి ప్రక్రియను నెమ్మదిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే నల్ల ఖడ్గమృగాలు నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. ఇది కాకుండా, వాటి గర్భం సాధారణం కంటే ఎక్కువ. ఇవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ పాటు గర్భాన్ని మోస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఓ.పి టికెట్ పై ఆధార్ లింక్ ఓ.టీ.పిని రద్దు పరిచి సత్వరమే రోగులకు వైద్యం అందించాలి -సామ్రాట్ కే.బి.మధు డిమాండ్..
ఓ.పి టికెట్ పై ఆధార్ లింక్ ఓ.టీ.పిని రద్దు పరిచి సత్వరమే రోగులకు వైద్యం అందించాలి -సామ్రాట్ కే.బి.మధు డిమాండ్

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ని ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రిలో రోజు వేలాది మంది పేద ప్రజలు తమ ఆరోగ్యం మెరుగు పర్చుకోవడా నికి చికిత్స నిమిత్తం వస్తున్న రోగులకు ఓ.పి టికెట్ తీసుకోవడం లో అనేక కష్టాలకు గురి కావడమే కాకుండా ఆధార్ నంబర్ లింకు తో ఓ.టీ.పి తోసమయం వృతా చేస్తున్నారు ఈ సందర్బంగా ఓ.పి సమయం పూర్తి అయి డాక్టర్లు రౌండ్స్ కు వెళ్లి వార్డులో అడ్మిట్ లో ఉన్నరోగులకు వైద్యం చేయడానికి వెళ్లి పోతారు ఈ సమయంలో ఓ.పి విభాగం లో చికిత్స ఆలస్యమై రోగులు వైద్యం అందాకా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా రు ఈ సమయంలో రోగులు అత్యవసర చికిత్స విభాగంకు వెళ్లి తే అక్కడ పరిస్థితి వర్ణనాతీతం అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు వైద్యం అందించడం లో నిర్లక్ష్యం చూపుతున్న సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక వైపు ఓ. టీ. పి తో ఇబ్బందులు పడి ఆతరువాత వైద్యం విద్యంకోసం నా నాతంటాలు పడవలసి వున్నదని వెంటనే ఓ. టీ. పి ఆధార్ లింకు రద్దు పరచాలని సత్వరమే ఓ. టీ. పి టికెట్ అందజేసి సత్వరమే రోగులకు వైద్యం అందె విదంగా చూడాలని అదే విదంగా అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం సేవలు అందించడానికి ఎక్కువ మంది డాక్టర్లను మరియు సిబ్బంది తో పాటు ఎం.ఎన్.ఓ లను ఉంచాలని ఎం.ఆర్.పి.యస్ ఆధ్వర్యంలో సూపర్నెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అత్యవసరంగా వచ్చిన రోగులకు స్ట్రక్చర్ లేక ఎమర్జెన్సీ విభాగం నుండి సిటీ స్కాన్ కు గాని లేదా ఎక్స్రే లకు గాని తీసుకెళ్లాలనుకుంటే చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది, అలాగే వైద్యం కోసం వచ్చిన రోగులను స్టాంపు కోసమని సంతకాల కోసమని చీటికిమాటికి తిప్పుతున్నారు. అత్యవసరంగా యాక్సిడెంట్లు అయి గాయాలతో వచ్చిన రోగులను కనీసం డ్రెస్సింగ్ చేయడానికి కూడా తగిన సిబ్బంది ఆ విభాగంలో లేరు. ఎమర్జెన్సీగా వచ్చిన రోగులను సరైన సమయానికి వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం ఎంతోమంది వస్తుంటారు అలాంటి చోట కనీస పరిశుభ్రత లేకుండా అలాగే దుర్వాసన వస్తున్న కూడా అ వార్డుని ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంచడం లేదు. ఇవి అన్ని దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ వార్డులో రోగుల వైద్యం కోసం బెడ్లు, అలాగే రోగులను తరలించడా నికి స్ట్రక్చర్లు వార్డ్ బాయ్స్ మరియు అక్కడ సిబ్బందిని పెంచాలని అత్యవసరంలో వచ్చిన రోగులను సరైన సమయానికి చికిత్స అందించే విధంగా చూడాలని Mrps, Msp కమిటీ ద్వారా సర్వజన ఆసుపత్రి సూపరేంటెండెంట్ గారికి మెమోరాండం ఇచ్చి త్వరగా రోగులకి చికిత్స అందె విదంగా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సామ్రాట్ కే. బి. మధు మాదిగ యం.ఆర్. పి.యస్, యం.యస్.పి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, Msp సీనియర్ నాయకులు నిషార్ అహమ్మద్ మహాజన్, యం.ఆర్.పి.యస్.జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజి,సీనియర్ నాయకు లు రేకులకుంట వెంకటేష్, బి. కే.యస్,యం.ఆర్.పి.యస్ మండల అధ్యక్షులు రెడ్డిపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు సామాజికఉద్యమవందనాలతో నిషార్ అహమ్మద్ మహాజన్ ఎం.యస్.పి సీనియర్ నాయకులు
S.C. సంపత్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుక్షం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టిడిపి సీనియర్ నాయకులు పామురాయి వెంకటేష్..
విద్యుత్ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీ కె. సంపత్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుక్షం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపిన జిల్లా టిడిపి సీనియర్ నాయకులు రాప్తాడు నియోజకవర్గం పామురాయి వెంకటేష్ మరియు ఇతర తెలుగుదేశం నాయకులు ప్రతినిధులు.
విద్యుత్ శాఖ S.C.ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుక్షం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన పసుపల ఫుడ్స్ అధినేత శ్రీరామరెడ్డి, పసుపుల హనుమంతరెడ్డి..
విద్యుత్ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీ కె. సంపత్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి... పుష్పగుక్షం అందజేసి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపిన పసుపల ఫుడ్స్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామరెడ్డి, తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ హనుమంతరెడ్డి మరియు ఇతర తెలుగుదేశం నాయకులు ప్రతినిధులు.
ఉనికి కోసమే జగన్ హత్య రాజకీయాలు.. మాసూల చంద్రమోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్..
ఉనికి కోసమే జగన్ హత్య రాజకీయాలు.. మాసూల చంద్రమోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్..

వినుకొండలో వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజకీయ రంగు పులమడం శవ రాజకీయాలు చేయడం ఉనికి కోసమే అత్యా రాజకీయాలు చేయడం మానుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ అన్నారు,వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను రాజకీయంగా వాడుకోవడం సరైన పద్ధతి కాదని గత వైసిపి ప్రభుత్వంలో మేధావులపైన టిడిపి కార్యకర్తల పైన దౌర్జన్యాలు, దాడులు, మానభంగాలు, హత్యలు ఊచకోతలు జరిగితే శాంతిభద్రతల గురించి ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా సీఎం హోదాలో జగన్ గారు మాట్లాడారా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గతంలో అధికారం కోసం బాబాయ్ హత్య, కోడి కత్తి డ్రామ ఆడిన నీవు ప్రజలందరూ గమనించి మొన్న జరిగిన ఎన్నికలలో నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం జరిగింది డాక్టర్ సుధాకర్, బీసీ నేతలు చంద్రయ్య, గంధం సుబ్బయ్యను దారుణంగా వైసిపి గుండాలు హత్య చేస్తే సీఎం హోదాలో స్పందించలేదు గాని ఇప్పుడు రషీద్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటు అని ఢిల్లీలో ధర్నాలు చేస్తామనడం మీ ఎమ్మెల్సీ దళితుని చంపే డోర్ డెలివరీ చేస్తే ఎందుకు నీవు ధర్నా చేయలేదు అని ప్రశ్నిస్తున్నాం శాంతి భద్రతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు గారిని ప్రభుత్వాన్ని నీ ఉనికి కోసం హత్య రాజకీయాలు చేయడం మాని అభివృద్ధికి సహకరించాలని కోరుచున్నాము
మరణించిన బండారు కుర్ర కొండన్న గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం చేసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
స్వాగ్రామం సిద్దారంపురంలో అనారోగ్యంతో మరణించిన బండారు కుర్ర కొండన్న గారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కరణలా ఖర్చులకి ₹10,000/- రూ.లు ఆర్థికసాయం చేసిన పేదలపెన్నిధి మంచిమనస్సు ఉన్న మహానేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురం లో అనారోగ్యంతో మరణించిన బండారు కుర్ర కొండన్న గారి పార్థివదేహంకు నివాళులు అర్పించిన *వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కరణలా ఖర్చులకి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి అండగా నిలిచినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అని తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ నూతన ఎస్ ఈ సంపత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీం..
ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ నూతన ఎస్ ఈ సంపత్ కుమార్ అధికార బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ డిస్కం అడిషనల్ సెక్రెటరీ ఇబ్రహీం మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ మరియు అనంతపురం నగర అధ్యక్షులు వీకే కృష్ణుడు అనంతపురం నగర ఉపాధ్యక్షులు చిరంజీవి కళ్యాణదుర్గం డివిజన్ సెక్రెటరీ హనీఫ్ గుత్తి డివిజనల్ సెక్రెటరీ అక్బర్ కనేకల్ సెక్షన్ కోశాధికారి మఠం రమేష్ అసోసియేషన్ 5 రాష్ట్ర అధ్యక్షులు మంజునాథ్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కొదశాధికారి రమేష్ బాబు ఔట్సోర్సింగ్ అనంతపురం ఉపాధ్యక్షురాలు రమాదేవి గారు మరియు సింగనమల కోశాధికారి నల్లప్ప మీటర్ రీడర్స్ జిల్లా కార్యదర్శి కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
గురుపౌర్ణమి రోజున రాతిదులం పోటీలు.. 3 పెద్ద మొత్తంలో బహుమతులు ప్రకటించిన ముంటిమడుగు కేశవరెడ్డి, కాట్టప్ప గారి రామలింగారెడ్డి గాండ్ల విశాలాక్షి..
శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండల కేంద్రంలో *గురుపౌర్ణమి సందర్బంగా శ్రీ సాయిబాబా స్వామి వారిని దర్శించుకొని, రాతిదులం లాగుడు పోటీలకు ముఖ్యఅతిథులుగా హాజరుఅయి కార్యక్రమంను ప్రారంభించిన మొదటి బహుమతి ₹50000/-రూపాయలు ప్రధాత శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, రెండొవ బహుమతి ₹40000/- రూపాయలు ప్రధాత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, 3బహుమతి ₹30000/- రూపాయలు ప్రధాత మాజీజడ్పీటీసీ గాండ్ల విశాలాక్షి గారు* ఈ కార్యక్రమంలో. అనిల్ చౌదరి. గేట్ కృష్ణారెడ్డి. మండల కన్వీనర్ పాండు.బాలకృష్ణ. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లు రామాంజనేయులు. మాజీ జెడ్పిటిసిగుర్రం ఆదినారాయణ. మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ నాయుడు. గ్రామ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు.గుర్రం శ్రీనివాసులు. పెనకచర్ల నరసింహారెడ్డి.కల్లూరు రాము. బాబయ్య. గార్లదిన్నె మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
ఐరిస్క్ ప్రెగ్నెంట్ మహిళా సరోజమ్మ కు A+ పాజిటివ్ రక్తం డోనేట్ చేసి ఆ తల్లి బిడ్డకు ప్రాణ రక్షణ కల్పించిన వడియం పేట సర్పంచ్ నాగార్జున..
facebook చూస్తూ.. చూస్తూ.. ఓ చిన్న ప్రకటన కనబడడంతో ఆశ్చర్యపోయి.. హుటా.. హుటిన ఇంటి నుంచి బయలుదేరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు చేరుకొని రాయదుర్గం మండలం గుమ్మగట్ట గ్రామానికి చెందిన ఐరిస్క్ ప్రెగ్నెంట్ మహిళా సరోజమ్మ బెర్త్ ను అక్కడున్న నర్స్ను అడిగి తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసా.. ఆమెకు ఏ పాజిటివ్ బ్లడ్ కావలసి ఉండడంతో ఫేస్బుక్లో ఆ ప్రకటన చూసి సరోజమ్మ దగ్గరికి చేరుకొని ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని... నాది ఏ పాజిటివ్ బ్లడ్ అని ఆమెకు ధైర్యం చెప్పి బ్లడ్ డొనేషన్ సెంటర్లో కి వెళ్లి తన వంతు సహాయంగా తల్లి బిడ్డ ప్రాణ రక్షణ కొరకు ఏ పాజిటివ్ బ్లడ్ ను డొనేట్ చేయడం జరిగింది. ఆ మహిళ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.. అందుకేనేమో వడియం పేట ప్రజలు మంచి మనసుతో నాగార్జునను సర్పంచ్ గా ఎన్నిక చేయడం జరిగింది.. సర్పంచ్ అంటే ఇలా ఉండాలని రుజువు చేసుకున్న మన సర్పంచ్ నాగార్జున...  సర్పంచ్ నాగార్జున బ్లడ్ డొనేషన్ చేయడంతో తనకు తన తో పాటి ఊరికి మంచి పేరు రావడం జరుగుతుందని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.. అసలు ఏ పాజిటివ్ బ్లడ్ దొరకాలంటేనే ఎంతో కష్టంగా ఉంటుంది. అందుకే సర్పంచ్ నాగార్జున గారు తనంతకుతానే ప్రకటన చూసి ఏడు నెలలు నిండిన ప్రెగ్నెంట్ మహిళ సరోజమ్మ ప్రాణ రక్షణకు బ్లడ్ డొనేట్ చేసి ఆపద్బాంధవుడిలా నిలిచాడు...
బుక్కరాసముద్రం మండలంలో ఓబులాపురం గ్రామం నందు రైతులతో నూనెగింజల పంటలపై సమీక్ష..
నూనెగింజల పంటలపై సమీక్ష : మండలములోని ఓబులాపురం గ్రామములో భారత ప్రభుత్వ వ్యవసాయశాఖ, నూనెగింజల అభివృద్ధి విభాగం అధికారులు శ్రీ అవినాష్ గారు శ్రీ శ్రీకాంత్ గారు (అసిస్టెంట్ డైరెక్టర్స్) గ్రామములోని రైతుల యొక్క వేరుశనగ పొలంలను సందర్శించి వేరుశనగ పంట విస్తీర్ణం గురించి పంట విత్తిన సమయం నుండి పంట కోత వరకు ఎంత పెట్టుబడి పెట్టుచున్నారని దిగుబడులు ఎంత వచ్చుచున్నాయని సేద్యపు ఖర్చులకు విత్తనమునకు విత్తనశుద్ధికి, కలుపు తీయడానికి ఎరువులకు పురుగుమందులకు, తెగుళ్ళమందులకు,సూక్ష్మపోషకాలకు పంట కోతలకు ఎంత ఖర్చు అవుతున్నదని ఖరీఫ్ రబి సీజన్ల వారీగా అడిగి వ్రాత పూర్వకంగా తీసుకున్నారు. అదేవిదంగా సబ్సిడీ విత్తనం అందుతున్నద లేదా సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు అందుతున్నాయా లేదా సూక్ష్మ పోషకాలు సబ్సిడీ ధరలపై అందుతున్నాయా లేదా అని ఎందుకు విస్తీర్ణం తగ్గుతున్న దని రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామరైతులు సకాలంలో వర్షాలు కురవడం లేదని సాగు ఖర్చులు పెరిగిపోయాయని దిగుబడులు తగ్గిపోయాయని సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు వ్యక్తిగతంగా పనిముట్లు ఇవ్వవలెనని సూక్ష్మ పోషకాలు సబ్సిడీ పై అందజేయవలెనని ఉపాధి హామీ పతకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయవలెనని కోరారు. జిల్లావ్యవసాయధికారిని శ్రీమతి ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ ఈనెల ఆఖరివరకు వేరుశనగ విత్తుకొనవచ్చని రాబోయే నాలుగు ఐదు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని రైతులు అదర్య పడవద్దని తెలియజేసారు ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ డైరెక్టర్, అనంతపురం డివిజన్ శ్రీ రవి గారు, కేంద్ర వేరుశనగ పరిశోధన కేంద్రం అధిపతి శ్రీ అజయ్ గారు పాల్గొన్నారు.