బుక్కరాయసముద్రంలో వర్షపు నీరు, మురికి నీరు నిలువ ఉన్నచోట గాంభూజియా చేపలను వదిలిన జిల్లా మలేరియా అధికారి డి ఓబులు..
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రo లో డెంగ్యూ మాసోత్సవాలలో భాగంగా *జిల్లా మలేరియా అధికారి డి ఓబులు గారు, సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ గారి* ఆధ్వర్యంలో మండల కేంద్రమైన బుక్కరాయసముద్రంలో వర్షపు నీరు, మురికి నీరు నిలువ ఉన్నచోట గాంభూజియా చేపలను వదిలే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మలేరియా అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి నీరు నిల్వ ఉన్నచోట లార్వా ఎక్కువ ఉండి దోమలను అభివృద్ధి చేస్తాయి కనుక ఆ నీటిలో గాంబుజియా చేపలను వదలడం ద్వారా వదలటం ద్వారా లార్వాలను అవి తినేసి దోమల ఉత్పత్తిని అరికడతాయని తెలియజేశారు. వివిధ గ్రామాలలో నీరు నిల్వ ఉన్నచోట ఈ చేపలను వదలాలని తెలియజేశారు. అన్ని సచివాలయాలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ చేపలను అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. అలాగే ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించి దోమల ఉత్పత్తిని అరికట్టాలని, అలాగే ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, టెంకాయ చిప్పలు, పాత కూలర్లు, మొదలగు వాటిలో నీరు నిలువ లేకుండా చూసుకొని ఈ దోమల ఉత్పత్తిని అరికట్టాలని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తహేరున్నిసా , సామాజిక ఆరోగ్య అధికారి మోహన్ రావు, మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, సబ్ యూనిట్ సూపర్వైజర్ శ్రీధర్ మూర్తి, పిహెచ్ఎన్ చేన్నమ్మ, నాగలక్ష్మమ్మ ,హెల్త్ ఎడ్యుకేటర్ ఫాతిమా, సూపర్వైజర్లు ఈశ్వరమ్మ, సత్యనారాయణ శాస్త్రి, జానీ రాజ్, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ, ఆనంద్, మరియు ఆఫీస్ సబార్డినేట్ శివరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Jul 23 2024, 07:42