నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 19:50

తెలంగాణలో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. రెవెన్యూ అధికారులకు,సిబ్బందికి సెలవులు రద్దు..

తెలంగాణలో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు

రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు

ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లతో మాట్లాడిన పొంగులేటి

కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి-పొంగులేటి

గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలి-పొంగులేటి

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 18:48

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులకు వరద పోటు...

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద పోటు.. భారీ వర్షాలతో ప్రాజెక్టులు, వాగులు, చెరువులకు పెరుగుతున్న వరద..

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు పెరిగిన వరద..

భద్రాచలం వద్ద 33 అడుగుల స్థాయికి చేరిన గోదావరి నీటిమట్టం..

రాత్రికి 41 అడుగుల స్థాయికి గోదావరి నీటిమట్టం.. ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు భారీగా వరద.. తెరచుకున్న నారాయణపూర్‌ ప్రాజెక్టు గేట్లు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 18:37

భద్రాచలం: చర్ల:లింగాపురం కొత్తపల్లి గోంపల్లి పంచాయతీల రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్...

లింగాపురం కొత్తపల్లి గోంపల్లి పంచాయతీల రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్..

చర్ల మండలం లింగాపురం కొత్తపల్లి గొంపల్లి ఈ మూడు గ్రామాలకు రహదారి లేకపోవడం చిన్నవర్షం పడ్డ ఈతవాగు రావడంతో, ప్రజలకు విద్యార్థులకు వృద్ధులకు రైతులకు రాకపోకలు బంద్ అయి తీవ్ర ఇబ్బందులకు ఎదురుకుంటున్నరని *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.

నేడు గ్రామలలోని ముఖ్యులతో పెద్ద మనుషులతో ఈత వాగును, ఆ మూడు గ్రామాల రహదారులను వారు సందర్శించి ప్రసంగించారు. సతీష్ మాట్లాడుతూ ఈ మూడు గ్రామపంచాయతీలు ఏజెన్సీలో వెనకబడ్డ ప్రాంతాలని ఇక్కడ ప్రజలకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి ప్రజలు వర్షం రావడంతో కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు రాకపోకలు బంద్ అయి కనీస సౌకర్యాలు లేక సరుకులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ఈ మూడు పంచాయతీల చుట్టూ గోదావరి ముంపు పొంచి ఉందని ప్రతి ఆట గోదావరి వచ్చి ఇల్లులు నీట మునుగుతున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాలలో పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని వారు అన్నారు భారత్ వెలుగుతోందని,అభివృద్ధి చెందుతుందని చెబుతూనే ఈ పాలకులు ఏజెన్సీ ప్రాంతాలని చిన్న చూపు చూస్తూ కనీసం చిన్న మోరీలు కూడా కట్టకపోవడంతో రహదారులు లేకపోవడంతో అనారోగ్యాల పాలైనటువంటి వారు గర్భవతులు మహిళలు అనేకమంది ఇబ్బందులకు గురవుతూ ఈ వర్షాకాలంలో వైద్యం అందక మరణిస్తున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు వేయాలని హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని వైద్య సౌకర్యాలు కల్పించాలని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా తెలియజేస్తున్నాం ఈ మూడు పంచాయతీల కలిపి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించకపోతే దశల వారి ఆందోళన చేస్తామని వారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళలు యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 16:55

గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ బదిలీ కాకుండా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డన్ని వెంటనే బదిలీ చేయాలని కలెక్టర్కు వినతి..

గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ బదిలీ కాకుండా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డన్ని వెంటనే బదిలీ చేయాలని కలెక్టర్కు వినతి..

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం

       

ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం బదిలీ చేయుట గురించి 

షెడ్యూల్ కులముల సంక్షేమ వసతి గృహము (ఏ) కాలేజ్ మహిళా హాస్టల్ నల్గొండ లోకల్ వార్డెన్ గా పనిచేస్తున్నటువంటి ఎస్ రమ్య సుధా విధులు నిర్వహిస్తుంది ప్రభుత్వ ఉత్తర్ల ప్రకారం బదిలీ కావాల్సి ఉన్నందున బదిలీ కాకుండా టీఎన్జీవోస్ నల్గొండ శాఖలో జిల్లాలో ఒక పదవిని అడ్డుపెట్టుకొని కదలకుండా నలగొండలో లోకల్ 12 సంవత్సరాలుగా ఒకే స్థానంలో పనిచేస్తూ జిల్లా శాఖ పదవిని అడ్డుపెట్టుకొని బదిలీ జరగకుండా నిలుపుదల చేసుకున్నది.

ఇది చట్ట విరుద్ధం కేవలం సంఘం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కి ఇరువురికి మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది ఆరు సంవత్సరాలు దాటితే ఎవరైనా టీఎన్జీవోస్ నాయకులు అయిన సభ్యులైన తప్పక బదిలీ కావాల్సిందే వార్డెన్ ఎస్ రమ్య సుధ లిస్టులో స్పాస్ కూడా చూపించి సంఘ సభ్యత అడ్డుపెట్టుకొని నల్గొండలో ఉన్న చోటే ఉండడానికి ప్రయత్నిస్తుంది ఆమె స్పోజ్ కోట చూపించింది కావున ఆమె భర్త నల్గొండ జిల్లా పరిధిలో పనిచేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్లవలసి ఉంది అలా వెళ్లకుండా ప్రస్తుతం పని చేస్తున్న అదే స్థానంలో లోకల్ కాలేజ్ హాస్టల్ పనిచేయడం చట్ట విరుద్ధం ఈమధ్య రెండు సంవత్సరాల కాలంలోనే ఆమె భర్త పౌస్ కోట చూపించి కనగల్ మండలంలో స్కూల్ కి రావడం జరిగింది.

ఆమె భర్త పౌసే కోట ఉపయోగించుకున్నందున మరల 2 సారి స్పౌజ్ కోట ఉపయోగించుకోవడానికి అవకాశం లేనందున టిఎన్జి తరఫున తప్పుడు సర్టిఫికెట్ ఉపయోగించి గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న చోట మరలా ఉండేందుకు వార్డెన్ ఎస్ రమ్య సుధా గారు ప్రయత్నిస్తున్నారు ఒకే చోట ఎక్కువ రోజులు పనిచేయడం వలన అవినీతికి పాల్పడంతో పాటు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది గతంలోనే టీఎన్జీవో స్పౌజ్ కోట రెండుసార్లు వినియోగించుకుంది కావున వెంటనే బదిలీ చేయాలి ప్రభుత్వం ఈ రెండు రోజుల క్రితం హైదరాబాదులో షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్లో నల్గొండ జిల్లాలో 47 మంది వార్డెన్స్ ఉంటే 46 మందిని ట్రాన్స్ఫర్స్ బదిలీ కల్పించి నందున వారితో సమానంగా ఈమెని కూడా 12 సంవత్సరాల లాంగ్ స్టాండ్ అయినందున బదిలీ చేసి సమాన న్యాయం చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పి ప్రభుత్వ ఉత్తర్ల ప్రకారం వార్డెన్ ఎస్ రమ్య సుధా వార్డెన్ గారిని బదిలీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా ధనావత్ అజయ్ మరియు కుమార్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 18 2024, 17:59

బ్రేకింగ్: రైతులకు పంట రుణమాఫీ నిధులు విడుదల..

బ్రేకింగ్:

రైతులకు పంట రుణమాఫీ నిధులు విడుదల

నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు జమ

రైతుల ఖాతాల్లోకి రూ.7 వేల కోట్లు

నేడు రైతులకు లక్ష వరకు రుణమాఫీ

ఈ నెలాఖరులోపే లక్షన్నర వరకు రుణమాఫీ

నిజందాగదుక్షణంఆగదు

Jul 18 2024, 10:04

హైదరాబాద్‌: నేడు రైతుల రుణమాఫీ సంబంధించి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం...

హైదరాబాద్‌: నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ

హాజరుకానున్న మంత్రి తుమ్మల, అధికారులు

రూ.లక్షలోపు రైతు రుణమాఫీపై దిశా నిర్దేశం

రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు

రైతుల ఇతర అప్పులకు రుణమాఫీ డబ్బులు మళ్లించొద్దని..

బ్యాంకర్లకు సూచించనున్న తెలంగాణ ప్రభుత్వం

నిజందాగదుక్షణంఆగదు

Jul 16 2024, 09:29

ఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్ పై నేడు విచారణ..

ఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్ పై నేడు విచారణ..

విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. జస్టిస్ నర్సింహారెడ్డి రెడ్డి కమిషన్ సమన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన కేసీఆర్

నిజందాగదుక్షణంఆగదు

Jul 16 2024, 08:01

ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

సముద్రమట్టానికి 1.5 కి.మీ.ఎత్తులో అల్పపీడనం

అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం

ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు

30 నుంచి 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో..

మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

నిజందాగదుక్షణంఆగదు

Jul 15 2024, 20:46

వినియోగదారుల హక్కులకు తూట్లు పొడుస్తున్న పెట్రోల్ బంకులపై కలెక్టర్ కు పిర్యాదు..

వినియోగదారుల హక్కులకు తూట్లు పొడుస్తున్న పెట్రోల్ బంకులపై కలెక్టర్ కు పిర్యాదు..

వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన ఉచిత సేవలను విస్మరించడంపై నల్గొండ పట్టణానికి చెందిన ఎండి సాధిక్ పాషా మరియు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం ఉచిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఉచిత ఫోన్ సౌకర్యం అలాగే వాహనాలకు గాలి నింపడం లాంటి కనీస సౌకర్యాలను వినియోగదారుల చట్టం ప్రకారం వాహన వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత పెట్రోల్ బంకుల నిర్వాహకులపై ఉన్నది.

కానీ అట్టి నిబంధనలను ఆయా పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులకు ఉచితంగా సేవలను అందించకపోగా వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు.ఇటీవల సామాజిక కార్యకర్త అయినటువంటి సాదిక్ పాషా వారి వాహనానికి దేవరకొండ రోడ్డు విశాల్ మార్ట్ పక్కన గల హెచ్. పి. పెట్రోల్ బంకులో తన వాహనానికి పెట్రోల్ పోయించుకున్న తరువాత టైర్లలో గాలి నింపమని కోరగా అక్కడి మేనేజరు దురుసుగా మాట్లాడడమే కాకుండా ఎక్కడ ఫిర్యాదు చేస్తారో చేసుకోండి మాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది.అంతేకాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న జైలు పెట్రోల్ బంకులో సైతం పరిమితికి మించి గాలిని టైర్లలో నింపడం వలన వాహన టైర్లు పేలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కావున ఇట్టి విషయమై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించగా అక్కడి సిబ్బంది పెడచెవిన పెట్టడం జరిగింది.ఇది కేవలం ఏ ఒక్క పెట్రోల్ బంకుకే పరిమితం కాదు నల్గొండ పట్టణంలో ఉన్న దాదాపు 80% బంకుల్లో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

అలాగే చాలా పెట్రోల్ బంకుల్లో వాహనాలకు గాలి నింపే సాధనాలు పూర్తిగా చెడిపోయి శిధిలావస్థలో దర్శనమిస్తున్నాయి.అంతేకాక పలు పెట్రోల్ బంకుల్లో పది రూపాయల నాణేలు మరియు ఫోన్ పే, గూగుల్ పే, లాంటి ఆన్ లైన్ పేమెంట్ లను నిరాకరిస్తూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూన్నారు. ఒకవేళ పెట్రోల్ నాణ్యతలో వినియోగదారునికి అనుమానం కలిగినచో అట్టి నాణ్యతను చెక్ చేయడానికి ఫిల్టర్ పేపర్ అందుబాటులో ఉంచడం లేదు మరియు చాలా పెట్రోల్ బంకుల్లో డెన్సిటీ డిస్ప్లే కూడా చేయడం లేదు ఇలాంటి విషయాలు సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో వీరి ఆటలు సాగుతున్నాయి మరియు పెట్రోల్ బంకుల్లో పనిచేసే ఉద్యోగులు వినియోగదారులతో ఎలా మసలుకోవాలో అవగాహన లేక పలుమార్లు వినియోగదారులతో ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కావున ఇట్టి విషయాలపై సంబంధిత అధికారులు లు దృష్టి సారించి వినియోగదారులకు ఉచితంగా అందించాల్సిన సేవలను పటిష్టంగా అమలుపరచాలని అట్టి సేవలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎం.డి. సాధిక్ పాష, ఎస్బి న్యూస్ రిపోర్టర్ కిరణ్ కుమార్,గుండె జనార్ధన్,జిల్లా కర్ణకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

నిజందాగదుక్షణంఆగదు

Jul 15 2024, 18:53

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం(హైదరాబాద్) అడిషనల్ డైరెక్టర్ కు విజ్ఞప్తి పత్రం అందజేసిన కట్టెల శివకుమార్

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ విజ్ఞప్తి 

విషయం,: షెడ్యూల్ సంక్షేమ వసతి గృహ వార్డెన్లు హెచ్ డబ్ల్యు ఓ గత 10 12 సంవత్సరాల నుండి ఒకే చోట ఉండి జిల్లాలో పాతుకపోవడం జరిగింది వీరిని ట్రాన్స్ఫర్ చేయుట గురించి 

హెచ్ డబ్లూ వార్డెన్లు షెడ్యూలు సంక్షేమ వసతిగృహ వార్డెన్లు వీరు ఒకే దగ్గర ఉండడం వలన వీరు డ్యూటీ సక్రమంగా నిర్వహించడం లేదువీరు డ్యూటీ సక్రమంగా నిర్వహించకపోగా వివిధ సంఘాలలో ఉండి సంఘ పదవులు అనుభవిస్తూ సంఘాలు అడ్డుపెట్టుకొని దొంగ ఫేక్ అనారోగ్య సర్టిఫికెట్లు సృష్టించికొని ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలోనే ఉండాలని చూస్తున్నారు విద్యార్థులకు అందవలసిన నాణ్యమైన భోజనం వసతులు కల్పించకుండా వీరు విద్యార్థులకు అందవలసినవి ఇవ్వకుండా అక్రమ పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారు కావున ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లాంగ్ స్టాండ్ అయిన ప్రతి ఒక్కరి ని ట్రాన్స్ఫర్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఓయూ రాష్ట్ర కార్యదర్శి బాకీ తరుణ్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ అలంపల్లి కొండన్న రఘు పాల్గొన్నారు పాల్గొని వివరించారు.