కొరపాడు నందు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరపాడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఆర్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాది కారి గారు మాట్లాడుతూ ప్రపంచ జనాభా అధికారికంగా 8 బిలియన్లు దాటినది. ఈ జనాభా ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తు తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్ధికి, అలాగే ఆర్థిక అభివృద్ధికి, అలాగే ఆరోగ్య అభివృద్ధి ఆటకం కలుగుతుందన్నారు. పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం కలిగి ఉంటారు. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబము కనుక దీనివలన అనేక లాభాలు గురించి మరియు కాన్పుల మధ్య ఎడం పాటించడం వల్ల తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారనిఅందుకోసం వారు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని, ఇవి పాటించడానికి అవసరమైన నిరోధులు,నోటితో మింగు మాత్రలు, కాపర్ T లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితముగా ఆరోగ్య కార్యకర్త లభిస్తాయి. అలాగే చిన్న వయసులో వివాహం చేయడం వల్ల కలిగే నష్టములు గురించి తెలియపరిచినారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యా బోధకురాలు ఎస్ పర్వీన్, విజయలక్ష్మి ప్రధాన ఉపాధ్యాయిని గారు, కేశవయ్య సూపర్వైజర్ గారు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ నాజియా, ఏఎన్ఎం రామలక్ష్మి, లక్ష్మీదేవి,హెల్త్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్, మరియు గురుకుల పాఠశాల స్టాఫ్ నర్స్ మాధవి గారు మరియు సిబ్బంది మరియు ఆశ తిరుపాలమ్మ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే కుటుంబ నియంత్రణ ప్రతిజ్ఞ గురుకుల పాఠశాల విద్యార్థులచే చెప్పించడం జరిగింది. ధన్యవాదములు
Jul 12 2024, 07:34