తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 13:50

Farmers: ఆదాయపన్ను చెల్లిస్తే ‘మాఫీ’ ఉండదు!

రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేసే రైతులు, చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విధివిధానాలు ఖరారుచేసి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ఈ నివేదికలో పలురకాల ప్రతిపాదనలను వ్యవసాయశాఖ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఎంతమంది? పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నవారెందరు? అనే వివరాలకోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే! ఆ వివరాలు ఢిల్లీ నుంచి వచ్చాయని, ఆ జాబితాను ప్రభుత్వం ముందు వ్యవసాయశాఖ ఉంచినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం- కిసాన్‌ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను మినహాయించారు.

ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి.. పన్ను చెల్లించేవారికి రుణమాఫీ వర్తింపజేయాల్సిన అవసరంలేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మానం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిటర్నులు దాఖలుచేస్తున్నారు. ఇలాంటివారికి రుణమాఫీ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిఽధులను కూడా రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. పీఎం- కిసాన్‌ పథకంలో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మునిసిపల్‌ చైౖర్మన్లు... తదితర ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటంలేదు. అవే మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి.. ఎక్కువ జీతం తీసుకునేవారికి రుణమాఫీ వర్తింపజేసే ఉద్దేశం లేదని, అయితే తక్కువ జీతం తీసుకునే చిరు ఉద్యోగులు రైతుల జాబితాలో ఉంటే... వారి వరకు రుణమాఫీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వాలు రుణమాఫీ పథకం అమలుచేసిన సందర్భంలో ఈ నిబంధన లేదు.

నిర్ణీత గడువు, కటాఫ్‌ అమౌంట్‌ పెట్టుకొని రుణమాఫీ చేశారు. దాంతో కొందరు బడా బాబులు, భూస్వాములకు కూడా రుణమాఫీ పథకం వర్తించింది. అలాంటివారికి ఇప్పుడు రుణమాఫీ వర్తింపజేస్తే...

ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లే అవుతుందని, చిన్న, సన్నకారు రైతులు, అర్హులకు రుణమాఫీ చేస్తే నిధులు సద్వినియోగం చేసినట్లు అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాగా రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో విడుదలచేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తాజాగా ప్రకటించారు.

దీంతో రుణమాఫీ మార్గదర్శకాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఆగస్టు-15 డెడ్‌లైన్‌గా పెట్టుకున్న విషయం విదితమే! ఈ రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలతో కూడా జీవో విడుదలైతే... పథకాన్ని అమలుచేయటానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంటుంది.

రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయనే అంచనా ఉండగా... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు సమకూర్చింది. మరో రెండు, మూడు వారాల్లో రుణమాఫీకి సరిపడా నిధులు సమకూర్చుకొని రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. మరోవైపు ‘నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌’(ఎన్‌ఐసీ)లో... బ్యాంకర్లు, పీఏసీఎ్‌సల నుంచి వచ్చిన రైతులు, రైతుకుటుంబాలు, అప్పుల జాబితాను జల్లెడ పడుతున్నారు. రేషన్‌కార్డు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రైతు కుటుంబాలను డిసైడ్‌ చేస్తున్నారు. ఆధార్‌ కార్డుల ఆధారంగా నంబర్లను సరిపోలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం మార్గదర్శకాలపై కసరత్తు పూర్తిచేసేలోపు... ఎన్‌ఐసీలో డేటా ప్రాసెసింగ్‌ ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 13:46

తెలంగాణాను హెచ్చరించిన వాతావరణ శాఖ

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలకు సంబంధించి కీలక అప్డేట్ వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కోసం రైతులు ప్రజలు, ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో ఈ సంవత్సరం

రైతాంగానికి సరిపడా నీరు ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాసంలో అయినా వర్షాలు కురిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణాలో నేడు వర్షాలు

ఇదిలా ఉంటే నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణ ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు బలపడడంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 13:41

హైకోర్టులో సజ్జల, ఆర్కే సహా వైసీపీ నేతలకు రిలీఫ్- టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో..!

ఏపీలో గత వైసీపీ పాలనలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేతలకు ఇవాళ భారీ ఊరట లభించింది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఆఫీసుపై దాడి కేసిన కేసులో ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతల తరఫున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేసింది.

ఈ కేసులో పోలీసుల తరఫున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరఫున సినీయర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీసీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైనా ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేశ్ కు ముందస్తు ఈ నెల 16 వరకూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

16 వరకూ వీరిపై ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆ లోపు వీరికి ఊరట లభించినట్లయింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 13:38

ఆ చెట్లు చాలా డేంజర్..తక్షణమే తొలగించండి..డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ చెట్టు గురించి మాట్లాడుతూ అది చాలా డేంజర్ వెంటనే తొలగించండి అని అధికారులకు సూచించారు.

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ చెట్టు గురించి మాట్లాడుతూ అది చాలా డేంజర్ వెంటనే తొలగించండి అని అధికారులకు సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చెట్టు గురించి ప్రస్తావించారు. ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానని పవన్ తెలిపారు.

అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించాను అన్నారు.

కాకినాడలో మొత్తం 4,602 కానో కాన్ఫరస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఏడాకుల చెట్టు (కోనో కార్పస్) ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు అధికారులు.

దక్షిణ అమెరికాకు చెందిన కోనో కార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం వాడుతున్నారు. వాటి వలన

భూగర్భజలాలు తగ్గపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ఏపీలో వాటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 12:06

Indigo: ఇండిగోకు షాక్.. హైదరాబాద్ దంపతులకు పరిహారం ఇవ్వాలని ఆదేశం..

ఇండిగో ఎయిర్ లైన్స్ షాక్ తగిలింది. 2021లో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన సమయంలో హైదరాబాద్‌కు చెందిన దంపతులకు రూ.10,000 పరిహారం చెల్లించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ని వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

అపరిశుభ్రమైన విమానం కారణంగా ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారు డి రాధాకృష్ణ తెలిపారు.

జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్-1 హైదరాబాద్‌లో విమానంలో అపరిశుభ్రతపై రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు.

కోచ్‌లో చెత్త, ప్లాస్టిక్ సీసాలు, ఉపయోగించిన నాప్‌కిన్‌లతో నింపారని ఆయన ఆరోపించారు.

విమానంలో అపరిశుభ్రత కారణంగా, తన జీవిత భాగస్వామికి వికారం, వాంతులు వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు, విమానంలో పరిస్థితుల కారణంగా తన జీవిత భాగస్వామి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ఫిర్యాదుదారు గతంలో ఎన్నడూ ప్రస్తావించలేదని ఇండిగో ఆరోపించింది.

Streetbuzz News

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 12:00

గంజాయి జోలికి పోవద్దు

దండం పెట్టి మరీ వేడుకుంటున్నాను. గంజాయి జోలికి పోవద్దు, మన పిల్లల్ని ఆ ఉచ్చులో దించొద్దు. మరీ ముఖ్యంగా గంజాయి సాగు వద్దే వద్దు’ అని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజలను కోరారు.

దండం పెట్టి మరీ వేడుకుంటున్నాను. గంజాయి జోలికి పోవద్దు, మన పిల్లల్ని ఆ ఉచ్చులో దించొద్దు.

మరీ ముఖ్యంగా గంజాయి సాగు వద్దే వద్దు’ అని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజలను కోరారు. మన్యంలో గంజాయి నిర్మూలనపై బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఏ అరాచకం జరిగినా గంజాయి ప్రభావమే కారణంగా, దానికి మన జిల్లాయే మూలమనే ప్రచారం జరగడం ఆవేదన

కలిగిస్తోందన్నారు. యువత డబ్బు కోసం గంజాయి ఉచ్చులో చిక్కుకోవద్దని, మరీ ముఖ్యంగా గిరిజనులు అసలు గంజాయి సాగు జోలికి వెళ్లొద్దని అభ్యర్థించారు.

ఎవరైనా డబ్బు ఆశచూపి గంజాయి సాగు చేయాలని గిరిజనులను ప్రోత్సహిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అందులో భాగంగా వంద రోజుల్లో గంజాయిని నిర్మూలించాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని, అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారని తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 10:56

Telangana ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్‌ జిల్లాలో దారుణం

Telangana వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాకు చెందిన బానోతు శివ, సుగుణ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.

కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు బన్నీ ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.

అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 10:51

పూరీలో ఘోర అపచారానికి కారకులెవరు? అన్ని వేళ్లూ వారివైపే.. విచారణకు కమిటీ!

ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్ర రెండు రోజుల పాటు జరిగింది. ఒకే రోజున స్వామివారికి మూడు వేడుకలు నిర్వహించాల్సి రావడంతో రథయాత్ర ఆలస్యంగా మొదలైంది. జులై 7న ఆదివారం సాయంత్రం కావడంతో కొద్ది దూరం వెళ్లిన రథాలు నిలిపివేసి.. మర్నాడు సోమవారం ఉదయం మళ్లీ రథాలను లాగుతూ పెంచిన తల్లి గుండిచా మందిరానికి చేర్చారు. 53 ఏళ్ల తర్వాత పూరీలో ఒకే రోజున మూడు వేడుకలు జరగడంతో భక్తులు పోటెత్తారు.

పూరీ జగన్నాథుడి రథయాత్రలో బలభద్రుని పొహండి వేడుకలో జరిగిన ఘోర తప్పిదంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అపచారం జరగలేదని వారు ఆవేదనకు గురవుతున్నారు. రథం నుంచి గుండిచా మందిరంలోకి తరలిస్తుండగా బలభద్రుని విగ్రహం ఒరిగి.. సేవాయత్‌లపై పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. అయితే, విగ్రహం ఒరిగిపోవడానికి సేవలతో ప్రమేయం లేని యువ సేవాయత్‌లు ఎక్కువ సంఖ్యలో రథంపై గుంపుగా ఉండడమే కారణమా? లేక చారమాల సక్రమంగా కట్టలేదా? అనేది ప్రస్తుతం

సోమవారం సాయంత్రం పెంచిన గుండిచా ఆలయానికి చేరుకున్న చతుర్దామూర్తులు జగన్నాథ, బలభద్ర, దేవి సుభ్రద, సుదర్శనులకు మంగళవారం రాత్రి పొహండి జరిగింది. అయితే, సేవాయత్‌లు ఈ ఉత్సవాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల నుంచి సంభావన అందుకోవడానికి సేవాయత్‌లకు పొహండి గొప్ప అవకాశం. దీంతో సేవలతో ప్రమేయం లేనివారు రథాలపై గుంపులుగా పొగయ్యారు. పొహండి తిలకించడానికి వచ్చిన భక్తులతో గుండిచా ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

తొలుత జగన్నాథుడు, సుదర్శనుని పొహండి జరిగిన తర్వాత బలభద్రున్ని గుండిచా సన్నిధికి తీసుకెళ్లే సమయంలో రథంపై ఉన్న సేవాయత్‌లు ఎక్కువ సమయం తీసుకున్నారు. అలాగే, స్వామి వెనుకవైపు ‘చారమాల’ సక్రమంగా కట్టలేదు. రథం నుంచి విగ్రహాల తరలింపు ఘట్టంలో వాటిని ఊపుతూ తీసుకెళతారు. చారమాల కట్టడంలో లోపం ఉంటే విగ్రహం ముందుకు ఒరిగిపోయి.. బరువు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో శ్రీక్షేత్ర, గుండిచా పొహండి వేడుకల్లో అనుభవం గలిగిన సేవాయత్‌లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక, ఘటన గురించి తెలిసిన వెంటనే.. న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌లను సీఎం మోహన్ చరణ్ మాఝి పూరీకి పంపించారు. అక్కడకు చేరుకున్న మంత్రి హరిచందన్‌ రాత్రి 12 వరకు పూరీలో ఉండి.. పొహండి ముగిసే వరకు పరిస్థితి సమీక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.

పొహండి ఘటనను జగన్నాథేచ్ఛగా పేర్కొన్నారు. ఇందులో సేవాయత్‌ల తప్పిదం తమ దృష్టికి రాలేదని, ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు, ఈ ఘటనపై విచారణకు జగన్నాథ ఆలయ యంత్రాంగం ముగ్గురు సభ్యులతో కమిటీని వేసింది. పూరీ రాజు గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్ నేతృత్వంలోని ఈ కమిటీలో అడిషినల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆలయ డిప్యూటీ సూపరింటిండెంట్ సభ్యులుగా ఉన్నారు. పది రోజుల్లో ఈ కమిటీ నివేదికను అందజేయనుంది. విచారణలో భాగంగా డ్రోన్ ఫుటేజ్‌లను పరిశీలించి, రథంపై ఎవరున్నారు? ఏం జరిగింది? అనేది తెలుసుకోనుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 10:48

Water Projects: ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కుల వరద..

కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.

ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.

జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... 81.44 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ జలాశయం నిండితే తెలంగాణ కీలక ప్రాజెక్టులకు నీరు విడుదల కానుంది. రెండ్రోజుల్లో ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకు 27,544 క్యూసెక్కుల వరద వచ్చింది.

తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 25.17 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,256 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గోదావరి బేసిన్‌లోని మేడిగడ్డ బ్యారేజీకి 41 వేల క్యూసెక్కులు,

తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌) బ్యారేజీకి 64 వేల క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్‌)కు 66 వేల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 650 క్యూసెక్కులు, సుందిళ్లకు 956 క్యూసెక్కుల వరద రాగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి 396 క్యూసెక్కులు, కడెం 464 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1,852 క్యూసెక్కులు, సింగూరులకు 300 క్యూసెక్కుల వరద రికార్డయింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 08:56

నీట్‌ పరీక్షలో మాల్​ప్రాక్టీస్‌ జరగలేదు'- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​

Centre Additional Affidavit On NEET UG In SC :నీట్‌ యూజీ 2024 పరీక్షలో మాస్​ మాల్​ప్రాక్టీస్‌ జరిగిందనడానికిగానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికిగానీ ఆధారాలు లేవని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

మద్రాస్‌ ఐఐటీ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల డేటా విశ్లేషణలో, మార్కుల పంపిణీలో అసాధారణ అంశాలేవీ కనిపించలేదని పేర్కొంది.

మార్కులు సాధారణంగానే ఉన్నాయని తెలిపింది. 2024-25 సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్​ ప్రక్రియ

జూలై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది.

NEET-UG 2024పై గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్‌ సమర్పించింది.