తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 10:19

Adani vs Birla : అదానీ వర్సెస్‌ బిర్లా

దేశీయ సిమెంట్‌ రంగంలో గడిచిన కొన్నేళ్లలో కొనుగోళ్లు, టేకోవర్ల ట్రెండ్‌ ఊపందుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో కొనుగోళ్ల విషయంలో ప్రధానంగా రెండు కంపెనీల మధ్యనే పోటీ నడుస్తోంది. ఒకటి గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ సిమెంట్స్‌. మరొకటి కుమార మంగళం బిర్లాకు చెందిన అలా్ట్రటెక్‌ సిమెంట్‌. వ్యాపార విస్తరణతోపాటు

దేశీయ సిమెంట్‌ రంగంలో గడిచిన కొన్నేళ్లలో కొనుగోళ్లు, టేకోవర్ల ట్రెండ్‌ ఊపందుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో కొనుగోళ్ల విషయంలో ప్రధానంగా రెండు కంపెనీల మధ్యనే పోటీ నడుస్తోంది. ఒకటి గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ సిమెంట్స్‌. మరొకటి కుమార మంగళం బిర్లాకు చెందిన అలా్ట్రటెక్‌ సిమెంట్‌. వ్యాపార విస్తరణతోపాటు మార్కెట్‌పై పట్టుకోసం ఇరు వర్గాలు పోటాపోటీగా దక్షిణాదిలోని సిమెంట్‌ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. అలా్ట్రటెక్‌ ఈ మధ్యనే ఇండియా సిమెంట్స్‌లో 23 శాతం వాటాను రూ.1,900 కోట్లకు కొనుగోలు చేయగా..

అంతకు కొన్ని వారాల క్రితం అదానీ సిమెంట్‌లో భాగమైన అంబుజా సిమెంట్‌.. హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌లో 100 శాతం వాటాను రూ.10,420 కోట్లకు చేజిక్కించుకుంది. అంతకంటే ముందే అలా్ట్రటెక్‌.. బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్‌ సిమెంట్‌ను హస్తగతం చేసుకుంది. బిర్లాకు చెందిన అలా్ట్రటెక్‌ దేశంలోనే అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా ఉంది. కాగా, స్విట్జర్లాండ్‌కు చెందిన సిమెంట్‌ దిగ్గజం హోల్సిమ్‌ నుంచి అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో మెజారిటీ వాటాను 1,050 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా 2022లో అదానీ గ్రూప్‌ సిమెంట్‌ తయారీ రంగంలోకి ప్రవేశించింది.

తద్వారా దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా అవతరించింది. అప్పటి నుంచే మార్కెట్‌లో అగ్రస్థానం కోసం బిర్లా, అదానీ మధ్య పోటీ ప్రారంభమైంది. అది సిమెంట్‌ రంగంలో కొనుగోళ్లు, విలీనాల ట్రెండ్‌కు బాటలు వేసింది. ఉత్పత్తి సామర్థ్యంతోపాటు మార్కెట్‌ వాటా పెంపు కోసం ఈ రెండు కంపెనీలు వ్యూహాత్మక కొనుగోళ్లకు పాల్పడుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఓరియంట్‌ సిమెంట్‌పై బిర్లా కన్ను: కుమార మంగళం బిర్లా తన బంధువైన సీకే బిర్లాకు చెందిన ఓరియంట్‌ సిమెంట్‌ను సైతం కొనుగోలు చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. దక్షిణ, పశ్చిమ భారత మార్కెట్లపై ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రలో మరింత పట్టుసాధించేందుకు అలా్ట్రటెక్‌కు ఈ డీల్‌ దోహదపడనుంది. ఓరియంట్‌ సిమెంట్‌కు ఒక్కో షేరుకు రూ.350-375 వరకు చెల్లించేందుకు అలా్ట్రటెక్‌ ముందుకొచ్చిందని, ఈ లెక్కన ఓరియంట్‌ మార్కెట్‌ విలువ రూ.7,300-7,800 కోట్లవుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 09:16

శరవేగంగా దిగువ కాఫర్‌ డ్యాం స్లూయిజ్‌ పనులు

పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యాం స్లూయిజ్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి

పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యాం స్లూయిజ్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించి దిగువ కాఫర్‌ డ్యాం వద్ద సీపేజీ జలాలు బయటకు పంపేందుకు నిర్మిస్తున్న స్లూయిజ్‌ పనులను వేగవంతం చేయాలని, వరద ఉధృతి పెరగక మునుపే పూర్తిచేసి గోదావరి జలాలు కాఫర్‌ డ్యాంల మధ్యకు చేరుకోనివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. దీంతో స్లూయిజ్‌ నిర్మాణం పనులు వేగవంతం చేసినట్లు ఈఈ పాండురంగయ్య శనివారం తెలిపారు.

కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అప్రూవల్స్‌ మేరకు పనులు ప్రారంభించామని.. రానున్న రెండ్రోజుల్లో స్లూయిజ్‌ గేట్ల అమరిక పనులు పూర్తవుతాయని, గోదావరి జలాలు కాఫర్‌ డ్యాంల మధ్యకు వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. సీపేజీ జలాలను బయటకు పంపడానికి ఏడాది క్రితం ప్రారంభించిన స్లూయిజ్‌ పనులు నత్తనడకన నడిచాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన తర్వాత పనులు ఊపందుకుని అప్పుడే గేట్లు బిగించే వరకూ వచ్చింది.

రెండ్రోజుల్లో ఇది పూర్తయితే స్పిల్‌వే బ్యాక్‌ వాటర్‌.. కాఫర్‌ డ్యాంలోకి రాకుండా నివారించవచ్చు, డీవాటరింగ్‌ ద్వారా కాఫర్‌ డ్యాం నడుమ సీపేజీ జలాలను తొలగించవచ్చని.. తద్వారా ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ పనులకు ఎలాంటి ఆటకం ఉండదని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 08:24

Hyderabad: నైనీలో బొగ్గు తవ్వకాలకు లైన్‌క్లియర్‌..

ఒడిసాలోని అంగుల్‌ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది.

ఒడిసాలోని అంగుల్‌ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది. దీంతో త్వరలో అటవీ భూముల బదిలీ జరగనుంది.

నిజానికి, నైనీ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు 2022 అక్టోబరులోనే అటవీ అనుమతులు ఇచ్చాయి. కానీ, వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళిక(వైల్డ్‌ లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌)ను వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ సిద్ధం చేయకపోవడంతో ఒడిసా ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో అంగీకారం తెలపలేదు. దీంతో భూముల బదిలీ జరగలేదు

ఈ అంశమై బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఒడిసా అధికారులతో పలుమార్లు స్వయంగా సమావేశమయ్యారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా కేంద్ర బొగ్గు, గనుల శాఖకు విజ్ఞప్తి చేశారు.

దీంతో ఒడిసా సీఎంతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సమస్య పరిష్కారమయ్యేలా చేశారు. ఆటంకాలు తొలగిపోయిన నేపథ్యంలో నైనీ కోల్‌ బ్లాక్‌కు సంబంధించిన అటవీ భూముల బదిలీ, ఇతర అనుమతుల విషయంలో ఒడిసా ప్రభుత్వాధికారులను సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు కలిశారు. వీలైనంత త్వరగా అటవీ భూమి బదలాయింపు చేయాలని కోరారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 08:22

Engineering Colleges: 4వేలకు పైగా సీఎస్‌ఈ సీట్లు..

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కోర్‌ బ్రాంచ్‌లు అయిన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, మెటలర్జీ వంటి ఇంజనీరింగ్‌ కోర్సులను నిర్వహించే కాలేజీలకు మరింత ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా సీఎ్‌సఈ సీట్లను పెంచేందుకు సర్కారు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్‌సెట్‌ రెండోదశ కౌన్సెలింగ్‌ తర్వాత సీట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరంలో కోర్‌ బ్రాంచ్‌ల్లో సీట్లు తగ్గించుకొని ఆమేరకు సీట్లను సీఎ్‌సఈలో పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి కొన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే, మరికొన్ని కళాశాలలు కోర్‌ బ్రాంచ్‌లను అలాగే కొనసాగిస్తూ అదనంగా సీఎ్‌సఈ కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేశాయి. ప్రైవేటు కాలేజీల అభ్యర్థనలకు ఏఐసీటీఈ అమోదం తెలిపినప్పటికీ, కోర్‌ బ్రాంచ్‌ ల్లో సీట్ల తగ్గింపునకు సర్కారు విముఖత చూపుతున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలో కోర్‌ బ్రాంచ్‌ల సీట్ల తగ్గింపు కోరుకున్న కళాశాలల్లో సుమారు 1,700 సీట్లు తగ్గుతుండగా, కోర్‌ బ్రాంచ్‌లు నిర్వహిస్తున్న కాలేజీలకు సుమారు 4,500 సీఎ్‌సఈ సీట్లకు అనుమతి లభించవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఎప్‌సెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌కు గతేడాది సీట్ల ప్రకారమే కాలేజీలకు అనుమతులు ఇస్తుండగా, రెండో దశ కౌన్సెలింగ్‌ నాటికి సీట్ల పెంపు ఉండే అవకాశం ఉందని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, ఈ నెల 8నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్స్‌ ఎక్సర్‌సైజ్‌ ప్రారంభం కానుండడంతో కళాశాలలకు అఫిలియేషన్‌/కోర్సులు/సీట్ల కేటాయింపు వివరాలను శనివారం సాయంత్రం జేఎన్‌టీయూ అధికారులు ఉన్నత విద్యామండలికి సమర్పించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 08:19

రైతు భరోసా కటాఫ్.. ఐదెకరాలు!

రైతు భరోసా స్కీమ్ విధివిధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది రైతులు ఈ స్కీమ్‌పై తమ అభిప్రాయాలు తెలుపగా, అందులో మెజార్టీ రైతులు ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృథా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం

రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండీషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ లోపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నది. రైతు వేదిక లు, వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా, మండల పరిషత్ సమావేశాల సమయంలో అక్కడికి వచ్చిన రైతులు, రాజకీయ నాయకుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు స్వీకరిస్తున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది నుంచి లిఖిత పూర్వకంగా సలహాలు సేకరించినట్టు తెలిసింది. అందులో మెజార్టీ మంది ఐదెకరాలకు కటాఫ్ పెట్టి, రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని చెప్పినట్టు సమాచారం. అసలైన రైతులకు ప్రయోజనం కలగాలంటే, కండీషన్లు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వ్యవసాయ శాఖ సేకరించిన అభిప్రాయాలు, సూచనలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీకి సమర్పించే చాన్స్ ఉంది.

త్వరలో మంత్రుల సబ్ కమిటీ రైతులు, రైతు సంఘాలు నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా జిల్లాలో పర్యటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ లోపు వ్యవసాయ శాఖ మరిన్ని జిల్లాలకు చెందిన రైతుల నుంచి సలహాలు తీసుకోవాలని భావిస్తోంది. లిఖిత పూర్వకంగా మాత్రమే సలహాలు తీసుకోవాలని, వీలైతే రైతు పేరు, ఫోన్ నెంబర్ వివరాలను సేకరించాలని భావిస్తున్నట్టు సమాచారం.

రైతు భరోసా స్కీమ్‌ను కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీంతో కౌలు రైతులను గుర్తించడం పెద్ద సమస్యగా మారిందనే చర్చ జరుగుతున్నది. ఎలా గుర్తించాలి అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని ఫలాన రైతుకు కౌలుకు ఇచ్చినట్టు అఫడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎంత మంది అఫిడవిట్ ఇచ్చేందుకు ముందుకు వస్తారనే అనుమానం అధికారులకు పట్టుకున్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 08:16

Nalgonda: డిండి గురుకులంలో 16 మంది విద్యార్థినులను కొరికిన ఎలుకలు..

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయాలైన విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పాఠశాల ఏఎన్‌ఎం, ప్రిన్సిపాల్‌.. ఎలుకలు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఈ నెల 2న ఆరుగురు, 3న ఆరుగురు, 5న నలుగురిని ఎలుకలు గాయపరచగా, వైద్యం అందించినట్లు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం రికార్డుల్లో నమో దు చేశారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ పద్మను వివరణ కోరగా నలుగురిని మాత్రమే ఎలుకలు గాయపర్చినట్లు తెలిపారు.

విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఎన్‌ఎ్‌సయూఐ, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో గురుకులం ఎదుట ధర్నా నిర్వహించారు. కాగా, పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు 640 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు.

పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు తిరుగుతున్నాయని విద్యార్థినులు తెలిపారు. పరిసరాల్లో మురుగునీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని, ఈగలు, దోమలు వ్యాపించి బాలికలు అనారోగ్యం పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 06 2024, 12:46

L&T Metro | టీవోడీకి గుడ్‌బై.. ఒక్కొక్కటిగా థర్డ్‌ పార్టీకి అప్పగిస్తున్న ఎల్‌అండ్‌టీ మెట్రో

వాణా ఆధారిత అభివృద్ధి అన్న నినాదానికి ఎల్‌ అండ్‌ టీ మెట్రో స్వస్తి పలుకుతోంది.

సమగ్ర రవాణా వ్యవస్థతో అత్యంత మెరుగైన అభివృద్ధి సాధించవచ్చన్న లక్ష్యంతో చేపట్టిన రవాణా ఆధారిత అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ..ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ క్రమంగా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలను చేపట్టకుండా ఇతర సంస్థలకు అప్పగిస్తుండటంతో టీవోడీ లక్ష్యం దెబ్బతింటోంది

L&T Metro | రవాణా ఆధారిత అభివృద్ధి అన్న నినాదానికి ఎల్‌ అండ్‌ టీ మెట్రో స్వస్తి పలుకుతోంది.

సమగ్ర రవాణా వ్యవస్థతో అత్యంత మెరుగైన అభివృద్ధి సాధించవచ్చన్న లక్ష్యంతో చేపట్టిన రవాణా ఆధారిత అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ..ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ క్రమంగా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలను చేపట్టకుండా ఇతర సంస్థలకు అప్పగిస్తుండటంతో టీవోడీ లక్ష్యం దెబ్బతింటోంది.

ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలైన మెట్రోమాల్స్‌ను దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చేందుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు చేస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 06 2024, 12:44

GHMC జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస.. పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

జీహెచ్‌ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు.

మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

పలువురు కార్పొరేటర్లు మేయర్‌తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొన్నది. దీంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లపై మేయర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 06 2024, 12:40

Andhra Pradesh: అమరావతికి వచ్చేస్తాం..

అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సీఆర్‌డీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది.

అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సీఆర్‌డీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది. అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 130 సంస్థలకు భూములు కేటాయించారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇక్కడ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు.. వంటి అంశాలపై చర్చిస్తోంది. కార్యాలయాల ఏర్పాటుపై శుక్రవారం నాటికి 80శాతం సంస్థల నుంచి సానుకూలత వచ్చిందని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 25కుపైగా సంస్థల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని సంస్థలు వైసీపీ ప్రభుత్వ హయాంలో బెదిరింపుల కారణంగా తరలిపోవటంవల్ల వాటినుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అమరావతిలో సంస్థల ఏర్పాటు నిమిత్తం మొత్తం 130 సంస్థలకు 1,660 ఎకరాలు కేటాయించారు. అప్పట్లో ఆయా సంస్థలకు కొన్ని లీజు ప్రాతిపదికన, మరికొన్ని అవుట్‌రేట్‌ సేల్‌ ప్రాతిపదికన రూ.677.10కోట్ల విలువైన భూములు కేటాయించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.546కోట్ల మేర ఆయా సంస్థలు చెల్లింపులు చేశాయి. మరో రూ.131కోట్లు చెల్లించాల్సి ఉంది. రాజధానిలో 45 కేంద్ర సంస్థలకు భూములు కేటాయించగా.. వాటిలో తాజాగా 40 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 25 సంస్థలకు భూములు కేటాయించగా దాదాపు వాటన్నింటి నుంచీ సానుకూలత వచ్చింది. మరికొన్ని ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మొత్తానికి మరో వారం రోజుల్లో అమరావతిలో ఏర్పాటు కాబోయే సంస్థల మీద స్పష్టత వస్తుంది. రెండు నెలల్లో అవి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:56

Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ (AICC) నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో (Telangana) నిజనిర్ధారణ కోసం కురియన్ కమిటీని అధిష్టానం నియమించింది.

కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈనెల 10న రాష్ట్రానికి రానున్న కమిటీ... తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారాన్ని సేకరించనుంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. కురియన్ కమిటీ రిపోర్ట్ తర్వాతే కార్పొరేషన్ పదవులు ఇద్దామనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్లు సమాచారం.