తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 30 2024, 18:41

Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్..

తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) చేసిన పనులనే కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ దుర్మార్గాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) చేసిన పనులనే కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ దుర్మార్గాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు వస్తున్నాయని.. బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు.

తాము కూడా అలాగే వ్యవహరిస్తే.. తెలంగాణ అభివృద్ధి జరగదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీలకు తాము నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అవమానిస్తారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ మీద తిరగబడినట్లే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తిరుగుబాటు చేస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అందరికీ సమానంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో బీఆర్‌స్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తోందని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రతిపాదనపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జనసేనతో బీజేపీ పొత్తుపై కిషన్ రెడ్డి, జేపీ నడ్డా ఆలోచిస్తారని చెప్పారు.

బీజేపీతో జనసేన పొత్తు తన పరిధిలో లేదని.. దానిపై తానేమీ మాట్లాడనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కూటమిగా ఉన్న విషయం తెలిసిందే. అదే పొత్తు తెలంగాణలోనూ కొనసాగించాలని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే, దీనిపై బీజేపీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 30 2024, 12:38

AP News: పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి (Distribution of pensions) అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు. 4 వేల రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ మూడు వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు పంపిణీ చేయనున్నారు. జీవీఎంసీ పరిధిలో 1 లక్ష 46 వేల 930 మందికి..100.91 కోట్లు పంపిణీ చేయనున్నారు

జీవీఎంసీ పరిధిలోని 1,46,930 మంది పెన్షన్‌దారులకు సోమవారం రూ.100.91 కోట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కూటమి అధికారంలోకి వస్తే పింఛన్‌ను మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు పెంచుతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్‌ పెంపుపైనే చంద్రబాబు తొలిసంతకం చేశారు

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.

జూలై ఒకటో తేదీన రూ.నాలుగు వేలతోపాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఎరియర్స్‌ రూ.మూడు వేలు కలిపి రూ.ఏడు వేలు అందజేయనున్నారు. ఈ మేరకు వార్డు సచివాలయ పరిధిలో ఎంతమందికి పెన్షన్‌ అందజేయాలి, ఎంత మొత్తం అవసరమనే దానిపై అధికారులు ముందుగానే లెక్కలు సిద్ధం చేశారు. ఆదివారం బ్యాంకులు సెలవు కావడంతో శనివారమే పెన్షన్ల పంపిణీకి అవసరమైన డబ్బును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేయాలని సంబంధిత కార్యదర్శులను అధికారులు ఆదేశించారు. వార్డు సచివాలయ కార్యదర్శులు తమకు కేటాయించిన పెన్షన్‌దారుల ఇళ్లకు ఒకటో తేదీ ఉదయాన్నే వెళ్లి పెన్షన్‌ అందజేయనున్నారు. జోన్‌-1 (భీమిలి) పరిధిలో 8,722 మందికి రూ.5,97,89,500, జోన్‌-2 (మధురవాడ) పరిధిలో 20,378 మందికి రూ.13,99,07,500, జోన్‌-3 (ఆశీల్‌మెట్ట) పరిధిలో 15,389 మందికి రూ.10,61,27,00, జోన్‌-4 (సూర్యాబాగ్‌) పరిధిలో 16,014 మందికి రూ.11,03,99,500, జోన్‌-5 (జ్ఞానాపురం) పరిధిలో 27,424 మందికి రూ.18,84,77,000, జోన్‌-6 (గాజువాక) పరిధిలో 32,179 మందికి రూ.22,09,25,500, జోన్‌-7 (అనకాపల్లి) పరిధిలో 10,057 మందికి రూ.6,84,500, జోన్‌-8 (పెందుర్తి) పరిధిలో 16,767 మందికి రూ.11,51,68,000 అవసరమని ఆయా జోనల్‌ కమిషనర్లు నివేదికలు సమర్పించారు. అలాగే విశాఖ జిల్లా పరిధిలోని పెందుర్తి మండలంలో 8,113 మందికి రూ.5,24,79,500, పద్మనాభం మండలంలో 8,821 మందికి రూ.5,97,92,000, ఆనందపురం మండలంలో 6,191 మందికి రూ.4,11,93,000, పెందుర్తి మండలంలో 4,241 మందికి రూ.2,78,96,000 పెన్షన్‌ కింద పంపిణీ చేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 30 2024, 12:30

ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!

తమ ఉద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల డీఏను 16 శాతం పెంచుతున్నట్లు సీఎం భజన్‌ లాల్ శర్మ ప్రకటించారు. డీఆర్ తొమ్మిది శాతం పెంచినట్లు తెలిపారు.

తమ ఉద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల డీఏను 16 శాతం పెంచుతున్నట్లు సీఎం భజన్‌ లాల్ శర్మ ప్రకటించారు. డీఆర్ తొమ్మిది శాతం పెంచినట్లు తెలిపారు.

ఈ ఏడాది రెండో డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర నెలలో కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి నెల నుంచి అమలులోకి వచ్చింది.

ఈసారి కూడా ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. మొదటి డీఏ 4 శాతం పెంపుతో మొత్తం 50 శాతానికి చేరింది. మరోసారి కూడా నాలుగు శాతం పెంచే అవకాశాలు ఉండడంతో 54 శాతానికి చేరనుంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు అలవెన్సులు ప్రకటిస్తున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది.

5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కరువు భత్యాన్ని 16 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా తొమ్మిది శాతం పెంచినట్లు వెల్లడించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 30 2024, 12:22

పది’ పాట్లు..!

మార్కెట్‌లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ..

మార్కెట్‌లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ.. వాటిని ఎవరూ స్వీకరించడం లేదు. మరోవైపు పది నోట్లను సరఫరా చేయలేక బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. ఆర్బీఐ నుంచి సరఫరా లేనప్పుడు తామేం చేస్తామని చెబుతున్నారు.

మార్కెట్‌లో పదుల కొరత ఏడాదిగా కొనసాగుతోంది. నోట్ల రద్దు తర్వాత పరిస్థితి గాడిన పడుతుందనుకున్న సమయంలో చిన్న నోట్ల కొరత పెరుగుతుండడం తో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టీ స్టాల్స్‌, కిరణా షాపుల్లో వ్యాపారమంతా రూ.10తోనే మొదలవుతుంది. పెద్దమొత్తం బిల్లులకు పెద్దనోట్లు ఇచ్చినప్పుడు ఎలాంటి సమస్య ఉత్పన్నం కావడం లేదు. చిన్న చిన్న బేరాల విషయంలో మాత్రం వివాదాలు జరుగుతున్నాయి.

సాధారణంగా కొత్త కరెన్సీని ఆర్‌బీఐ విడుదల చేసినప్పుడు బ్యాంకుల వద్ద నుంచి.. రూ.5, రూ.10, రూ.20, రూ.50నోట్లను తీసుకుని భద్రపరుచుకుంటారు. ఐదు రూపాయల నోట్ల ముద్రణ ఆగిపోయిన తర్వాత నాణేలు మనుగడలోకి వచ్చాయి. వాటి లభ్యత కూడా క్రమంగా తగ్గుతోంది. ఆర్‌బీఐ పది రూపాయల నోట్లతోపాటు నాణేలు కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. కానీ, నోట్లలో జరిగినన్ని లావాదేవీలు నాణేలతో జరగడం లేదు. పది రూపాయలు చిల్లర ఇవ్వాల్సిన స్థానంలో నాణేలు ఇస్తుంటే వినియోగదారులు గానీ, వ్యాపారస్తులుగానీ తీసుకోవడం లేదు. దీంతో సమస్య తీవ్రమవుతోంది.

ఆర్‌బీఐ ముద్రించిన కరెన్సీని వ్యతిరేకించడం నేరమని న్యూమి్‌సమ్యాటిక్‌ నిపుణుడు ప్రసాద్‌ అన్నారు. వ్యతిరేకించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం ఆర్‌బీఐకి ఉందన్నారు. ‘అన్ని రాష్ట్రాల్లోను పది రూపాయల నాణేల చలామణి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు దీనిపై అపోహలున్నాయి. ఐదు రూపాయల నాణేలు విడుదలైన కొత్తలో నకిలీ నాణేలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పది రూపాయల నాణెం విషయంలోనూ అదే అనుమానాలున్నాయి. ప్రజల్లో ఈ నాణెం మనదేశానిది కాదన్న భావన ఉంది’ అని ప్రసాద్‌ చెప్పారు. మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఉన్నమాట వాస్తవమేనని, దీనికి ఆర్‌బీఐ కారణమని మరో న్యూమి్‌సమ్యాటిక్‌ నిపుణుడు రామకృష్ణ అన్నారు. పది రూపాయల నాణేలను చలామణిలోకి తీసుకురావడం కోసం హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 నోట్ల సరఫరాను బాగా తగ్గించిందని వెల్లడించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 30 2024, 08:34

కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త.. ఏళ్లనాటి కల నెరవేరింది.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త వినిపించింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కంటోన్మెంట్ ప్రాంత ప్రజల కల నెరవేరింది. కంటోన్మెంట్ ప్రాంతాలను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయటానికి కేంద్ర రక్షణ శాఖ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన కల ఎట్టకేలకు నెరవేరింది.

రేవంత్ రెడ్డి సర్కార్ చొరవతో కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయడానికి మొత్తానికి.. కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ట్వీట్‌తో పాటు కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసిన గెజిట్‌‌ను కూడా జత చేసింది.

కేంద్ర రక్షణ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేసిన విజ్ఞప్తి ఫలించిందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్‌లో రాసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మార్చి 6, 2024న సీఎస్ శాంతి కుమారి రాసిన లేఖకు కేంద్రం సానుకూలంగా స్పందించి.. కంటోన్మెంట్‌పై అధికారాలను జీహెచ్ఎంసీకి అప్పగించిందని తెలిపింది. కంటోన్మెంట్ ప్రజల తరఫున.. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయం ఇది అని తెలంగాణ కాంగ్రెస్ అభివర్ణించింది.

అయితే.. ఈ విషయంపై ఏళ్లుగా కేంద్రానికి ఇక్కడి ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ పలుమార్లు లేఖలు రాశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని.. రహదారుల విస్తరణతో పాటు మూసేసిన పలు రోడ్లను తెరవాలంటూ విజ్ఞప్తులు చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేయగా.. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 30 2024, 08:26

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్‌గా మారేందుకు కవిత సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇప్పటికీ తీహార్ జైలులోనే రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు.

ఆమె జైలుకు వెళ్లి 100 రోజులకు పైనే అయ్యింది. బెయిల్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు కవిత సిద్ధంగా ఉన్నారంటూ కీలక కామెంట్ చేశారు.

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. జ్యూడీషియల్‌ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 100 రోజులకు పైగానే ఆమె జైలులో ఉంటున్నారు. కవిత అటు రౌస్ అవెన్యూ కోర్టులోనూ బెయిల్ దొరకలేదు.. ఇటు ఢిల్లీ హైకోర్టులోనూ దొరకట్లేదు. రిమాండ్ గడువును న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ కేసులో కవిత అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. కానీ.. కవిత అప్రూవర్‌గా మారకుండా ఉండడానికి.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి.. వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తోందన్నారు శ్రీనివాస్ రెడ్డి. భూస్వాములకు, రియల్టర్లకు రైతుబంధు నిలిపేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి.. రేవంత్ రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలను రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నారన్నారు. నిరంతరం ప్రజల కోసం తపనపడుతున్నాడని తెలిపారు. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేశారని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు.

బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కేసీఆర్ పరిష్కరించలేని భూసమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లేందుకు కేసీఆర్ భయపడితే.. రేవంత్ రెడ్డి మాత్రం ధైర్యంగా వెళ్లి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథకు రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అందులో మొత్తం అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. అసెంబ్లీకి కేసీఆర్ రావాలంటూ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 30 2024, 08:03

తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిలాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు

తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని చెప్పారు. దాని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. అల్పపీడన ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై ఉంటుందన్నారు.

నేడు ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

ఇక ఈ ఏడాది నైరుతి రుతపవానాలు జూన్ మెుదటివారంలోనే వచ్చినా.. ఆశినంతగా వర్షాలు కురవలేదు. తెలంగాణలోని 111 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 210 మండలాల్లో సాధారణ వర్షపాతం కురవగా.. 166 మండలాల్లో అధికంగా, మరో 125 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. జూన్‌ 1 నుంచి 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా సగటున 149 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు చెప్పారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 29 2024, 19:23

SBI Clerk Notification 2024: Check Post For 4613 Vacancies, Eligibility Criteria

State Bank of India (SBI) has announced the recruitment for the Clerk position in 2024. This article provides a detailed guide about the recruitment process, eligibility criteria, application process, and more.

The SBI Clerk Recruitment 2024 is a golden opportunity for candidates preparing for the SBI Clerk examination. The bank has released a notification for the recruitment of 4613 Clerk posts. The application forms are expected to be available soon on the SBI’s official website.

Eligibility Criteria

Educational Qualification

Candidates applying for the SBI Clerk position should have a Bachelor’s Degree in any discipline. Those appearing for their final year exams or postgraduates in respective disciplines with experience in the relevant field are also eligible to apply. You should check the official notification for more details on the required educational qualifications.

The age limit for the SBI Clerk position is a minimum of 21 years and a maximum of 30 years. However, there is age relaxation for reserved categories:

Check the official notification for more details on the age limit and relaxation.

The application fee for the General, OBC, and EWS categories is Rs. 750. There is no application fee for SC, ST, and PH candidates. The payment can be made through Debit Card, Net Banking, or E Challan.

The selection process for the SBI Clerk position involves two stages:

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 29 2024, 19:12

చూడటానికి సంప్రదాయనీ.. పనులు మాత్రం సుద్దపూసనీ తలపిస్తాయి

Kerala Crime News ఈ అమ్మాయి చూడటానికి సంప్రదాయనీలా ఉంటుంది. కానీ ఆమె చేసే పనులు సుద్దపూసనీ తలపిస్తుంటాయి. కానీ పోలీసులు సైతం ఖంగుతినేలా చేసింది. ఆమె ఏం చేసిందంటే..?

వ్యాపారం చేయడంలో ఈ అమ్మాయి ముందు ఎవరైనా దిగదుడుపే. విలాసవంతమైన జీవితం.. గోవా, బెంగళూరు ట్రిప్స్. ఎక్కడకు వెళ్లినా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే బస. తనకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తుంది. తాను చేసే బిజినెస్ డబ్బుతోనే ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఓ డౌట్ రావొచ్చు. బిజినెస్ చేస్తున్నదంటే.. అసలు తీరిక ఉండదు కదా అని.

మరీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటుందని. ఆమె చేసే వ్యాపారం అలాంటి, ఇలాంటిది కాదు.. పోలీసులు సైతం ఖంగుతిన్నారు. ఇంతకు ఆ వ్యాపారం ఏంటనేగా.. మాదక ద్రవ్యాల సరఫరా. అవాక్కయ్యారు కదా. రెండు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం కేసులో తాజాగా ఈ మహిళను అరెస్టు చేశారు. ఈమెది గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ.

గత నెల 19న కేరళలోని పుయ్యింగడి ఎటక్కల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు నిర్వహించగా.. రెండు కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు వస్తున్నారని తెలిసి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మొత్తం రూ. 2 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దృష్టి సారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. నిలంబూరుకు చెందిన షైన్ షాజీని తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో నిందితుడు పెరువన్నముళికి చెందిన అల్బిన్ సెబాస్టియన్‌ను అరెస్టు చేసి కుమిలిలో రిమాండ్‌కు తరలించారు.

నిందితుల్ని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వీరే కాదూ.. వీటి వెనుక మరో కిలాడీ లేడీ ఉందని గుర్తించారు. అయితే అసలైన స్మగ్లర్‌గా జుమీ అని నిర్దారించారు. షైన్ షాజీ డ్రగ్స్ కొరియర్ చేసేందుకు ఆమెనే వినియోగించే వాడని విచారణలో తేలింది. బెంగళూరు నుండి టూరిస్టు బస్సుల ద్వారా ఆమెతో డ్రగ్స్ రవాణా చేయించేవాడు. పోలీసులకు నిందితులు పట్టుబడటంతో ఆమె కూడా బెంగళూరులో తలదాచుకుంది. ఆమెను కూడా పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. మద్యానికి బానిసైన జుమీ.. డ్రగ్స్ కొరియర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో విలాసవంతమైన జీవనాన్ని గడిపేది. తరచుగా గోవా, బెంగళూరు టాప్ హోటల్లోనే బస చేసేది. ఈ కేసులో మొత్తం ముగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ కేసులో మరెవరైనా ఉన్నారేమోనన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 29 2024, 18:58

GHMC: గ్రేటర్ ఆస్తుల పరిరక్షణపై సర్కార్ ఫోకస్..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో(GHMC) చాలా ఏరియాల్లో కోట్ల విలువైన భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. ఇటీవలే మియాపూర్‌లో రాత్రికి రాత్రే టెంట్లు వేసి ఆక్రమించడానికి ప్రయత్నించారు.

అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఇదే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో(GHMC) చాలా ఏరియాల్లో కోట్ల విలువైన భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. ఇటీవలే మియాపూర్‌లో రాత్రికి రాత్రే టెంట్లు వేసి ఆక్రమించడానికి ప్రయత్నించారు.

అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఇదే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సీఎం రేవంత్ సర్కార్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కమిషనర్ అసెట్స్ ప్రొటక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేకంగా విభాగాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇప్పటి వరకు ఉన్న EVDM ను అసెట్స్ ప్రొటక్షన్ లో విలీనం చేయనున్నారు. GHMC, HMDA పరిధికి ఈవీడీఎంను విస్తరించనున్నారు. ఆస్తుల రక్షణ కోసం ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, 8 మంది డీఎస్పీలు, సీఐలు, డిప్యూటీ కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ వాటర్ బోర్డు, ఫైర్ అధికారులను ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం మూడు వేల మంది సిబ్బందితో ప్రత్యేక టీం ఏర్పాటు చేయనున్నారు.