శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న కోడుమూరు నియోజకవర్గం MLA, నియోజవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి..
40 సంవత్సరాల తర్వాత కర్నూలు జిల్లా కోడుమూరు నియోజవర్గంలో టిడిపి ఘనవిజయం సాధించిన శుభ సందర్భంగా విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న కోడుమూరు నియోజకవర్గం MLA బొగ్గుల దస్తగిరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు) కాటప్పగారి రామలింగారెడ్డి గారు, టీడీపీ నాయకులు అనిల్ చౌదరి గారు..
దళితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ..
దళితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు. సింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణ శ్రీ గారు నార్పల పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశమై నార్పల లోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్ కాంపౌండ్ విషయమై వారు ఎమ్మెల్యే గారికి వివరించారు కాంపౌండ్ పూర్తిగా శిథిలావమైపోయినది కాంపౌండ్ నిర్మించాలని వారు ఎమ్మెల్యే గారికి సూచించారు మరియు అంబేద్కర్ నార్పల క్రాస్ నందు నిర్మాణం కొరకు గతంలో అప్రూవల్ వచ్చింది వాటిని పరిష్కరించి నిర్మాణం చేయాలని వారు కోరారు మరియు మండలంలోని ఒక అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని కోరారు ఈ విషయమై ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మీ యొక్క పనులను పరిష్కరిస్తాను అని చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సింగనమల ఇంచార్జ్ రంగాపురం పుల్లప్పసీనియర్ నాయకులు గడ్డం నాగేపల్లి జయరాం కార్యదర్శి రాజు ప్రసాదు గంగయ్య నారాయణ రమణ లక్ష్మీనారాయణ గోపాలు తదితర ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి అన్ని విధాల సన్నద్ధం.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జూన్ 29 : వెలగపూడి, ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శనివారం పెన్షన్ల పంపిణీ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు.* *అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, డీపీఓ ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.* - *వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి అన్ని విధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒకటో తేదీనే 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని, ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది వారి మండలంలోని కొన్ని ప్రాంతాలను తనిఖీ చేయాలన్నారు. నియోజకవర్గ అధికారులు పెన్షన్ల పంపిణీని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం బ్యాంకుల నుంచి అవసరమైన నగదు పూర్తిగా విత్ డ్రా చేసుకుని పాయింట్ పర్సన్ లకు అప్పగించాలన్నారు. పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, జిల్లాలో సజావుగా, విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఏ అడ్మిన్ అసిస్టెంట్ అజంతుల్లా పాల్గొన్నారు..

రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన కోడుమూరు నియోజకవర్గం MLA మరియు నియోజకవర్గం పరిశీలకులు
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన కోడుమూరు నియోజకవర్గం MLA బొగ్గుల దస్తగిరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు) కాటప్పగారి రామలింగారెడ్డి గారు,కోడుమూరు నియోజకవర్గం మాజీ టీడీపీ ఇంచార్జ్ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు అనిల్ చౌదరి గారు..
ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.7000 లు అందించడం లో అలసత్వం వద్దు.. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.7000 లు అందించడం లో అలసత్వం వద్దు : ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శింగనమల నియోజకవర్గ పరిధిలోని శింగనమల, గార్లదిన్నె,బుక్కరాయసముద్రం,నార్పల,పుట్లూరు,యల్లనూరు మండలాలలోని అన్ని గ్రామ సచివాలయాల పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ దారులకు జులై నెల 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని మండలాల ఎంపీడీఓ లకు క్యాంప్ ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ప్రతి లబ్దిదారుని ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలి,ఈ విషయంలో ఎంపీడీఓ ఆఫీస్ అధికారులు,గ్రామ పంచాయితీ అధికారులు,సచివాలయం అధికారులు అలసత్వం చేయకుండా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. అలాగే డయోరియా వ్యాధి ప్రబలకుండా,సీజనల్ వ్యాధులు రాకుండా నివారణకు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నార్పల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..

నార్పల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు

శింగనమల నియోజకవర్గం,నార్పల మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రావణి శ్రీ ఆస్పత్రిలోని కొన్ని వైద్య సేవా విభాగాలు ను పరిశీలించారు.స్కానింగ్ యంత్రం ఉండి కూడా సంబంధించిన డాక్టరు లేరని,మహిళా గర్భవతులు జిల్లా కేంద్రం కి వెళ్లి పరీక్షలు చేయించుకుని వస్తున్నారు.అలాగే రోగులకు ఇచ్చే మందు మాత్రలు సరిపడా రావడం లేదని,రెట్టింపు అవసరం ఉంది. కాన్పు కు వచ్చిన తరువాత తల్లి,బిడ్డలకు ఇచ్చే కిట్లు అందడం లేదు.సెలైన్ సీసాలు అందుబాటులో లేవు. వీటన్నింటి గురించి సంబంధించిన అధికారులు కు రిపోర్ట్ చేయాలనీ తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు వైద్య సిబ్బంది తో మాట్లాడుతూ డయోరియా వ్యాధి,సీజనల్ వ్యాధుల చికిత్స కు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.అంబులెన్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన.. కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి..
మంగళగిరి లోనీ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు, టీడీపీ నాయకులు అనిల్ చౌదరి.
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై గట్టి నిఘా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై గట్టి నిఘా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జూన్ 28 : *జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్, NCORD) జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, డ్రగ్స్, లాంటివి సాగు, రవాణా చేయకుండా చూడాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు కెనాబీస్, ఆల్కహాల్, గంజాయిలాంటి కేసులు నమోదు కాగా, వైజాగ్, శ్రీకాకుళం నుంచి వస్తున్న, అనంతపురం మీదుగా బళ్లారి వెళుతున్న ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేయాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రయాణికులను కూడా తనిఖీ చేయాలని సూచించారు. పాఠశాలలు, హైస్కూల్ లలో కమ్యూనిటీ డ్రైవ్ చేపట్టాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద, సరిహద్దు ప్రాంతాలలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణాపై నిఘా ఉంచాలని, ఎక్కడి నుంచి రవాణా జరిగే అవకాశం ఉందో పరిశీలించి ముఖ్యమైన బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. జిల్లాలో ఎక్కడ గంజాయి సాగు చేయడానికి వీలు లేకుండా చూడాలని, మారుమూల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో పలు చోట్ల పోస్టర్లను, ఐఈసీ మెటీరియల్ ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ కళాశాలలలో సిసి టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అన్నిచోట్ల సౌకర్యాలు బాగా కల్పించాలన్నారు. జిల్లాలోని రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో మత్తు పదార్థాలు ఉపయోగించకుండా అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా నశాముక్త భారత్ లో భాగంగా ఎన్హెచ్ఎం ఐఈసీ యాక్టివిటీల కింద "JUST SAY NO TO DRUGS" మరియు "SAY NO TO DRUGS" అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.* - *ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, డిటిసి వీర్రాజు, అనంతపురం ఆర్డిఓ గ్రంధి వెంకటేష్, డిఎంహెచ్ఓ డా.ఈ బి.దేవి, డీఈఓ వరలక్ష్మి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్, జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, డివీఈఓ వెంకటరమణ నాయక్, ఏసిఐఓ శ్రీధర్ బాబు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది...జగనన్న ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తారు.. ఆలూరు సాంబ శివారెడ్డి..
అనంతపురం జిల్లా: పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తల దాడిలో మరణించిన వైఎస్ఆర్సిపి కార్యకర్త ఎరుకులయ్య(60) పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్ఆర్సిపి నేతలు ఆలూరు సాంబశివారెడ్డి, ఎం. వీరాంజ నేయులు. మృతునికి భార్య, ముగ్గురు కొడుకులు, ఇంటి పెద్ద దిక్కు తండ్రి చనిపోవటడంతో మృతి దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడు ఎరుకులయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ సీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నా ఎస్సీ..నా ఎస్టి.. నా బిసి..ఆ మైనార్టీలు అని జగనన్న హక్కును చేర్చుకుంటే నేడు టీడీపీ బీసీలపై దాడులు చేస్తుంది. టీడీపీ చేతులో గాయపడి మృతి చెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను వైస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. టీడీపీ వాళ్ళు పైశాచిక ఆనందం కోసం వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంది. నియోజకవర్గంలోని జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ టిడిపి వైశాచిక ఆనందం పొందుతుంది.
తగు మోతదులో క్రిమిసంహారక మందులను వినియోగించాలి.. జిల్లా వనరుల కేంద్రం ఉప సంచాలకులు శ్రీ మద్దిలేటి..
క్రిమిసంహారక మందులు తక్కువ మొతదులో వాడండి. వేరుశనగ లో మిత్రపురుగులను శత్రు పురుగులను గుర్తించి తగు మోతదులో క్రిమిసంహారక మందులను వినియోగించవలేనని జిల్లా వనరుల కేంద్రం ఉప సంచాలకులు శ్రీ మద్దిలేటి గారు సూచించారు. మండలములోని దయ్యాలకుంటపల్లి గ్రామములో సాగుకు సమయత్తం పై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులు లోతు దుక్కులు చేసుకోవాలని మట్టి నమూనా పరీక్షలు చేయుంచుకోవాలని ఉదజని సూచికలను బట్టి ఎరువులను వినియోగించుకోవాలని సకాలం లో మంచి విత్తనాన్ని ఎన్నుకొని విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవాలని సరైన క్రమములో నీటి తడులు ఇవ్వాలని సూక్ష్మ పోషక ఎరువులను ప్రతి రెండు పంటలకు ఒకసారి వినియోగించుకోవాలని పురుగుల ఉదృతి ని బట్టి మందులు వాడాలని రసాయనిక ఎరువులు తగ్గించి పశువుల ఎరువులను వినియోగించాలని రైతులను కోరారు, మరియు వివిధ పంటలపై రైతుల ప్రశ్నలకు సమాధానములు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ADA శ్రీమతి శైలజ గారు, గ్రామ రైతులు రైతు భరోసా కేంద్ర ఇంచార్జి లు పాల్గొన్నారు.