VijayaKumar

Jun 27 2024, 17:57

వలిగొండ: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలి వేముల నాగరాజు SFI జిల్లా ఉపాధ్యక్షులు

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ వినతిపత్రం వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలన్నారు ఒక పాఠశాలలో ఒక రేటుగా అంగట్లో సరుకుల ఏ స్కూలుకు తోసిన ఫీజు ఆ స్కూలు తీసుకోవడం జరుగుతోంది అన్నారు వెంటనే ప్రభుత్వం ఫీజు నియంత్రణ చేసి పేద మధ్య తరగతి తల్లిదండ్రులని ఆదుకోవాలని అన్నారు మరియు మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్లో ద్వారా ఫీజు నిర్ణయాలు చేయాలన్నారు పాఠశాల యజమాన్యం వాళ్ళు ఇష్టానుసారమైన ఫీజులు నిర్వహించడం తల్లిదండ్రులు కట్టడం కాకుండా పేరెంట్స్ మీటింగ్లో వారు కట్టే స్తోమత తగిన ఫీజులు నిర్ణయం చేయాలన్నారు అదేవిధంగా మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో వేలకు వేలుగా పుస్తకాల పేరుతో స్టేషనరీ వ్యాపారం నడిపిస్తున్నారన్నారు ప్రభుత్వ మాత్రం చోద్యం చూస్తున్నట్టు విహరిస్తామన్నారు అని వారు విమర్శించారు మండల విద్యాధికారి వెంటనే అన్ని పాఠశాలలు తనిఖీ నిర్వహించి పుస్తకాల అమ్ముతున్న పాఠశాలను సీజ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్ ఏసోఫ్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 27 2024, 17:49

ఆదర్శమూర్తి, అసాధారణ ప్రతిభాశాలి హెల్లెన్ కెల్లర్; ధరణికోట నరసింహ VHPS జిల్లా అధ్యక్షులు

చిన్న తనం నుంచే మూడు రకాల వైకల్యాలను జయించి, అసాధారణ ప్రతిభను కనబర్చిన హెల్లన్ కెల్లర్ జీవితం మనకు ఆదర్శం కావాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులధరణికోట నర్సింహ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో జరిగిన "హెల్లన్ కెల్లర్" 144 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్లన్ కెల్లర్ పుట్టుకతోనే చెవుడు,మూగ, అంధత్వం కల్గి ఉన్నా, అధైర్య పడకుండా ఆమె వికలాంగుల, మహిళల హక్కుల కోసం కృషి చేసారని ఆయన అన్నారు. హెల్లన్ కెల్లర్ రచయితగా, సంఘసంస్కర్త గా చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు జాగిళ్ళపురం అయిలయ్య, నాయకులు వెంకటేశ్వర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 27 2024, 15:59

వలిగొండ: హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి : సిపిఎం డిమాండ్

వలిగొండ తొర్రూర్ డబుల్ రోడ్డు వెడల్పులో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుండి పవిత్రాత్మ పాఠశాల వరకు ఏర్పాటుచేసిన డివైడర్ కు ఎలాంటి హెచ్చరికల బోర్డులు,స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే హెచ్చరిక బోర్డులు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పవిత్రాత్మ పాఠశాల ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ వలిగొండ నుండి తిరుమలగిరి వరకు నిర్మించిన డబల్ రోడ్డు నిర్మాణం లో భాగంగా వలిగొండ అంబేద్కర్ విగ్రహం నుండి పవిత్రాత్మ పాఠశాల వరకు ఏర్పాటు చేసిన డివైడర్ ముగింపులో ఎలాంటి హెచ్చరికల బోర్డు మరియు స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఒక టాటా ఏసీ బండి డివైడర్ పైకి ఎక్కిన పరిస్థితి ఉందన్నారు పాఠశాల ఉండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వెళ్తుంటారని స్పీడ్ గా వచ్చే వాహనాల వల్ల ప్రమాదం ఉందని వెంటనే రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్, మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి డివైడర్ ముగింపులో హెచ్చరిక బోర్డును మరియు పవిత్రాత్మ పాఠశాల ఆవరణలో స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం,మండల నాయకులు రాధారపు మల్లేశం, కొండూరు సత్తయ్య,రంగారెడ్డి, సలిగంజి మురళీ కృష్ణ,నర్సింహ,ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 27 2024, 14:17

భువనగిరి: రైలు కిందపడి బస్వాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ముత్తిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఉడుత పాండు మద్యానికి బానిస అయినందున, కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .

VijayaKumar

Jun 27 2024, 14:13

చౌళ్ళ రామారం లో కల్వర్టు, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమిటి సందీప్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామంలో జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం & స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల నుండి కల్వర్టు మరియు సిసి రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న  జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, అడ్డ గూడూరు జడ్పిటిసి శ్రీమతి శ్రీరాముల జ్యోతి అయోధ్య , ఎంపీపీ శ్రీ దర్శనాల అంజయ్య , BRS మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి , ప్రజా ప్రతినిధులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 20:07

భువనగిరి పట్టణంలో ఎనిమిదో వార్డులో శానిటేషన్ పనులు పరిశీలించిన కౌన్సిలర్ పంగ రెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో కౌన్సిలర్ పంగరెక్క స్వామి బుధవారం శానిటేషన్ పనులను పరిశీలించారు. వార్డులో  గల డ్రైనేజీ కాలువల చుట్టూ ఉన్న చెత్తని మున్సిపల్ సిబ్బంది తో తీయించారు. వార్డులలో పేరుకుపోయిన చెత్తాచెదారం శుభ్రం చేయించారు. వర్షాకాలంలో సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



.

VijayaKumar

Jun 26 2024, 19:44

వలిగొండ: పాఠశాలల బంద్ విజయవంతం: ABVP

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం వలిగొండ మండల కేంద్రంలో పాఠశాలల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ 1,ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కలిపించాలని, 2,ప్రవేట్,కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా ఎక్కువ మొత్తంలో ఫిజులు వసూలు చేస్తున్న యజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, 3, ఫిజుల నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని, 4,ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, 5,నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేట్ పాఠశాలలో బుక్స్,యూనిఫామ్స్,అమ్ముతున్న యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, 6,ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా,వెంటనే DEO,MEO అధికారులను నియమించాలని, 7,ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న భోజనం లో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, 8,వెంటనే మెగా డిఎస్సి ద్వారా 24వేల పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సతీష్,మహేందర్,సన్నీ,చరణ్ శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 18:25

వలిగొండ: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని డ్రగ్స్ పై ప్రజలకి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజ్,జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి, వలిగొండ ఎస్సై మహేందర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 17:34

భువనగిరి : జిల్లాలో యదేచ్చగా ప్రైవేట్ విద్యాసంస్థలలో పుస్తకాల అమ్మకం...పట్టించుకోని యాదాద్రి భువనగిరి డి ఈ ఓ

వలిగొండ పవిత్రాత్మ ప్రవేట్ స్కూలుకు సంబంధించిన పుస్తకాలు ఏదేచ్ఛగా అమ్ముతుంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు SC,ST, BC విద్యార్థి సంఘం నాయకులు పుస్తకాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫోన్ చేసి చెప్పిన మాకు సంబంధం లేదు అని చెప్పిన యాదాద్రి DEO నారాయణరెడ్డి MEO శ్రీధర్ జిల్లాలో పూర్తిగా విఫలం అయిపోయిన విద్యావ్యవస్థ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది పిల్లల ప్రాణాలతో చెలగాటలాడుతున్న DEO నారాయణరెడ్డి పుస్తకాలు పట్టుకొని రూములు చూపించిన పట్టించుకోని DEO అది పొంగ మాకు సంబంధం లేదు అని బెదిరిస్తున్న డీఈఓ నారాయణరెడ్డి జిల్లాలో విద్యా వ్యవస్థ అసమర్ధత వల్ల ప్రైవేటు స్కూలు ఇష్టానుసారంగా బస్ ఫీజ్ అని బుక్ ఫీజ్ అని డొనేషన్ ఫీజ్ యూనిఫామ్ ఫీజ్ అని విద్యార్థుల రక్తం తాగుతున్న దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా నిద్రపోయిన యాదాద్రి జిల్లా విద్యా వ్యవస్థ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల గత 2 సంవత్సరాల వ్యవధిలో 5 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి జిల్లాలో ఉన్నది ప్రవేట్ విద్యాసంస్థలకు కొమ్ముగాస్తున్న యాదాద్రి జిల్లా విద్యావ్యవస్థ *ప్రభుత్వం మీద తిరగబడాలని DEO దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించడం లేదు గవర్నమెంట్ ను బదనం చేయాలని చూస్తున్న యాదాద్రి DEO* మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి అధికారి వ్యవస్థను తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు విద్యార్థి తల్లిదండ్రులు SC,ST,BC సంఘాలు *ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు సల్ల మనీల్, లింగస్వామి, సరిత, మహేందర్, భాస్కర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 26 2024, 11:35

వలిగొండ మండల కేంద్రంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించిన ఎస్సై మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో వలిగొండ పట్టణ కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాలు తీసుకుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి, మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని వివరించి పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ప్రజలు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే సమాజం తిరోగమనంలో పయనిస్తుందని అన్నారు. సామాజిక ,మానసిక, శారీరిక అనారోగ్యాలు తలెత్తుతాయని అన్నారు.