నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 16:53

పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు

పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు..

అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.

తెదేపా హయాంలోనే 72 శాతం పూర్తి..

''పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తెదేపా హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌ వేపై డిశ్చార్జ్‌ అవుతాయి''

రాష్ట్రానికి శాపంగా జగన్‌..

''రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు. 'ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు'' 

వేల కోట్ల ప్రజాధనం వృథా..

''ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్‌ స్టడీ. రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. అలా మార్చితే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు. ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?. ప్రజలనే కాదు, మీడియాను, ప్రతిపక్ష నేతగా నన్ను కూడా ఇక్కడికి రానీయలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు అంతా క్లిష్టంగా మారిపోయింది. ఈ చిక్కుముడులు అన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వాలని కలలు కన్నా. రాష్ట్రంలోని ప్రతి వక్తికి చెందిన ప్రాజెక్టు ఇది'' అని చంద్రబాబు అన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 11:43

బక్రీద్ సందర్భంగా పట్టణంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

కామెంట్స్:-

బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీక..

 నల్గొండలో గత 30 ఏళ్లుగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారు..

 పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తాం..

ముస్లింలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తాం...  

ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తాం..

అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నా..

పటిష్ట బందోబస్తుతో శాంతియుతంగా ప్రార్థనలు జరిగేలా చేసిన ఎస్పీ చందన దీప్తికి ప్రత్యేక అభినందనలు...

నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 11:41

రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పర్వదినం ఉద్దేశ్యం: చంద్రబాబు.

స్వార్థం, రాగద్వేషాలు వదిలిపెట్టి త్యాగగుణం పెరగాలి: చంద్రబాబు.

త్యాగగుణాన్ని ప్రభోదించే బక్రీద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు...

సమైక్యతా మానవత్వం దిశగా అడుగులు వేయాలి: సీఎం చంద్రబాబు.....

నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 11:38

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం..

రంగపాణి-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలును ఢీకొన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌.. 

పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు..

ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడివున్న బోగీలు, కొనసాగుతోన్న సహాయక చర్యలు

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 11:36

కాళేశ్వరం ప్రోజెక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనీ ఉద్యమం !

- ప్రైవేట్ కంపెనీలను ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ చేయాలని డిమాండ్

- కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ 

ప్రపంచానికి దిక్సూచిగా పేరు గాంచిన కాళేశ్వరం ప్రోజెక్ట్ ఆంధ్ర వాసులకు ప్రైవేట్ కంపెనీలకు అమ్ముడుపోయాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.టన్నెల్ లో భూమి 2కిలోమీటర్ల లోపల ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నామని విన్నవించారు.

మరి కొద్ది రోజుల్లో అన్ని ప్యాకేజీల ఇంజినీర్లతో ఏకమై నిరసన ఉద్యమం చేస్తామని ప్రకటించారు. వెంటనే ప్రైవేట్ కంపెనీలకు తొలగించి .. రెగులర్ చేయాలని కోరారు .

విషయం తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చిమ్ముతున్నారు . ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనీ ఉద్యమం చేస్తామని ...కాళేశ్వరం ప్రోజెక్ట్ ఉద్యోగులకు అండగా ఉంటామని పలు రాష్ట్ర సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి.

నిజంనిప్పులాంటిది

Jun 16 2024, 10:04

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం: పవన్

ఆంధ్రప్రదేశ్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టిపెడతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు,జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు.

'ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం.

అడవుల వినాశనానికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. సామాజిక వనాలు పెంచాల్సిన అవశ్యకత ఉంది' అని అన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 15 2024, 20:09

తండు సైదులు గౌడ్ జన్మదిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం...

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ,తిప్పర్తి మాజీ జెడ్పిటిసి, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ ప్రజా సేవకుడు డా.తండు సైదులు గౌడ్  గారి జన్మదిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

 ఈ సందర్భంగా వారి అభిమానులు మాట్లాడుతూ

 నిరంతరం పేద ప్రజల కోసం అనేక విధాలుగా సేవలందిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు తండు సైదులు గౌడ్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని భవిష్యత్తులో రాజకీయ పదవులని అనుభవించాలని కోరుతూ

నలగొండ నియోజకవర్గం కాకుండా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రోజుకి 18 గంటలు ప్రజల మధ్యలో ఉంటూ 40 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ చనిపోయిన గీత కార్మికులకు వారి కుటుంబాలకు అండగా ఉంటూ గ్రామాలలో దేవాలయ నిర్మాణం కొరకు లక్షలాది రూపాయలు ఆర్థిక సాయం అందించినాడు ఇలాంటి గొప్ప మనసున్న నాయకుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.

ఈ కార్యక్రమంలో కారింగ్ నరేష్ గౌడ్ ,చింతల విజయ్ కుమార్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ వజ్జ శ్రీనివాస్ యాదవ్, 

అయితగోన సత్యనారాయణ గౌడ్ ,యాదగిరి, మండల యాదగిరి యాదవ్ ,శ్రీకాంత్ యాదవ్ ,కొంపల్లి రామన్న గౌడ్ ,పండ్ల హరికృష్ణ ,బచ్చనబోయిన మహేష్ కుమార్ ,దూదిమెట్ల ప్రశాంత్, ఆనంతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 15 2024, 15:14

తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలీ..

ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్,

నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్,

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,

కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి,

కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సాంగ్వాన్,

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్,

జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ,

నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్,

పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష,

హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య బదిలీ.

జగిత్యాల కలెక్టర్ గా సత్య ప్రసాద్,

మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర బోయి,

మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్,

వికారాబాద్‌ కలెక్టర్ గా ప్రతిక్ జైన్,

నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి,

వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ్ సురభి,

సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్,

వరంగల్ కలెక్టర్ గా సత్య శారదా దేవి,

ములుగు కలెక్టర్ గా టీఎస్ దివాకరా,

నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ బదిలీ.

నిజంనిప్పులాంటిది

Jun 15 2024, 09:28

ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు..

పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా

సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయంలోనే

ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు..

మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్కు రావాలని ఆయన సూచించారు..

శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే

అవకాశం ఉంది..

నిజంనిప్పులాంటిది

Jun 15 2024, 09:23

ఉద్యమకారులను ఆదుకోవాలి ..!

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పాడుపడిన తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మస్కు మహేష్‌ డిమాండ్‌ చేశారు.

గుమ్మడవెళ్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కాలికి గజ్జ కట్టి.. గోసి గొంగడేసి గ్రామ గ్రామాన తిరిగి ధూంధాం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రజలను మరింత చైతన్యం చేసినట్లు గుర్తుచేశారు.

తమ కష్టాన్ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేవలం రాజకీయ నాయకులు బాగుపడ్డారు తప్ప..

ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేకూరడం లేదన్నారు, కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి ఆదుకోవాలన్నారు.

ఉద్యమకారులు ధన్నారం జంగయ్య, శివకుమార్‌, కిరణ్‌కుమార్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.