అపార్ట్మెంట్లలో స్కూల్ ను నడుపుతున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలి, నగరంలో విచ్చలవిడిగా పాఠశాలలకు అనుమతులు ఇచ్చిన డిప్యూటీ DEO ను సస్పెండ్ చేయాలి
అపార్ట్మెంట్లలో స్కూల్ ను నడుపుతున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలి.. పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న భాష్యం పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.. సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తున్న భాష్యం పాఠశాల.. నగరంలో విచ్చలవిడిగా పాఠశాలలకు అనుమతులు ఇచ్చిన డిప్యూటీ డిఇఓ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలి..

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లలో నడుపుతున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భాష్యం పాఠశాల దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనుమల నరేష్ ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పృథ్వి వి ఎన్ ఐ వి రాష్ట్ర కార్యదర్శి వినోద్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రమణయ్య ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఓబులేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ అనంతపురం నగరంలో అపార్ట్మెంట్లలో విద్య సంస్థలు నడుపుతున్న భాష్యం స్కూల్లో సీట్ చేయాలని డిమాండ్ చేశారు. కమర్షియల్ బిల్డింగ్లలో నడుపుతున్న వాటికి గ్రౌండ్ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇష్టానుసారంగా విద్యాసంస్థలకు అనుమతులు మంజూరు చేస్తున్న డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. భాష్యం పాఠశాలలో పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేసిన స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధన తుంగలో తొక్కుతూ రకరకాల కోర్సులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కోర్టుకు ఒక్కొక్క ఫీజు చొప్పున విద్యాసంస్థల వసూలు చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసిన చూసీచూడనట్టు వివరిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారుల పైన మండిపడ్డారు.. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికను నగరంలో ఏ విద్యాసంస్థలు పాటించకుండా ఆ ఫీజు పట్టికను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు ..సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తు, నిబంధనలను తుంగలో తొక్కుతూ పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న అపార్ట్మెంట్లో నడుపుతున్న భాష్యం స్కూల్ ను వెంటనే సీట్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు హనుమంతు రాయుడు వంశీ మంజునాథ్ ఉమా మహేష్ హరికృష్ణ హర్ష శేఖర్ రారాజు ఆనంద్ నిశాంత్ కార్తీక్ యశ్వంత్ కుమార్ అభి గణేష్ తదితరులు పాల్గొన్నారు*
మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా కేక్ కట్ చేస్తూ సంబరాలు

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీ నందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా కేక్ కట్ చేస్తూ సంబరాలు ఘనంగా జరుపుకున్న ముష్టూరుసాయి శివకుమార్ కులయప్ప వన్నూర్ వలి ప్రదీప్ ఓబుళపతి గణేష్ రాజు కొండ వడ్డెమనోహర్ మరియు కాలనీవాసులు

నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న సింగనమల మండల తెలుగుదేశం నాయకులు..
నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న సింగనమల మండల తెలుగుదేశం నాయకులు.
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు ఆధ్వర్యంలో గన్నవరం సమీపాన కీసరపల్లి గ్రామంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే నాగభూషణ్ జిల్లా బీసీ సెల్ కార్యనిర్వ కార్యదర్శి కొయ్యగూర పెద్దన్న ఎల్లనూరు మండల పార్టీ కన్వీనర్ దొడ్లో రామాంజనేయులు చెన్నయ్య ప్రతాప్ నెట్టికంటి జయరాం వేణు* తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ యువతకి ఉపాధి హామీ కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంచి పరిపాలన ధ్యేయంగా ముందుకు వెళ్తామని రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీ గారికి చేయడమైనది
బుక్కరాయసముద్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణస్వీకారం ఎల్ఈడి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం

శ్రీ నారా చంద్రబాబు గారి ప్రమాణస్వీకారం సందర్భంగా బుక్కరాయసముద్రం మండలంలో సచివాలయం దగ్గర ఎల్ఈడి స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని ఎంపీపీ సునీత టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పసుపుల హనుమంత్ రెడ్డి. పొడ్రాళ్ళ రవీంద్ర బుల్లె నారాయణస్వామి తదితర ముఖ్య నాయకులు అధికారులు మరియు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు హాజరు కావడం విశేషం..

మంత్రి పయ్యావుల కేశవ్ గారిని విజయవాడ లో కలసి శుభకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
రాష్ట్ర మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్బంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారిని విజయవాడ లో కలసి శుభకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు*,రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు నాయకులు
నార్పల మండల కేంద్రంలో అదుపు తప్పిన ట్రాక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల క్రీడా మైదానం నందు ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదం జరగడం వల్ల ముగ్గురికి తీవ్ర గాయాలు... వెంటనే ప్రమాదం జరిగిన చోటికి పోలీస్ లు చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించడం జరిగింది..
నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతపురం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారిని మంగళగిరిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురం అర్బన్ నియోజవర్గం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా.. ఈ సందర్భంగా నిహా అయేషా మాట్లాడుతూ:రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు సైకో జగన్ పాలనకు చమర గీతం పాడి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో కుంటు పడిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగా అనంతపురం నియోజవర్గం అభివృద్ధివైపు అడుగులు వేస్తుందని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురాన్ని సుందరవణంగా తీర్చి దిద్దుతారని తెలియజేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంతటి ఘన విజయానికి సహకారం అందించిన అర్బన్ నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
కామాఖ్య దేవాలయంలో మొక్కు తీర్చుకున్న హేమంత్ యాదవ్...
కామాఖ్య దేవాలయంలో మొక్కు తీర్చుకున్న హేమంత్ యాదవ్

2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి శ్రీ గారు విజయం అయిన సందర్భంగా అస్సాం రాష్ట్రంలో గల కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోవడం జరిగింది.
పోలీసుల దాడిలో గాయపడిన తెలుగుదేశంపార్టీ నాయకుడు తిరుపాలు ను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
పోలీసుల దాడిలో గాయపడిన తెలుగుదేశంపార్టీ నాయకుడు తిరుపాలు ను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు.. నిన్న సాయంత్రం పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం నాయకుడు తిరుపాలును అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ..... పోలీసులు ఇప్పటికైనా మారాలని ఇంకా వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం నాయకులు పై దాడులు చేస్తే సహించేది లేదని వారు తెలియజేశారు గాయపడిన తిరుపాల్ ను ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది
ఖైదీ.. మృతి..
అనంతపురం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద టిప్పర్ ఢీకొని ఓపెన్ ఎయిర్ జైలో శిక్ష అనుభవిస్తున్న ఈరన్న (50) S/o రంగయ్య కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చెందిన ఖైదీ అక్కడిక్కడే మృతి..