నిజంనిప్పులాంటిది

Jun 07 2024, 11:37

దేశమంతా ఒకటే హైప్ .. పవన్ కళ్యాణ్ !

- ఎన్నికల్లో గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్‌

- కుటుంబ సభ్యులందరి నుంచి అపూర్వ రీతిలో స్వాగతం

- భారీ పూలమాల మెడలో వేసి ముద్దాడిన మెగాస్టార్‌

- తల్లి, అన్నా, వదినలకు జన సేనాని పాదాభివందనం

అచ్చమైన ఆప్యాయత పూల వర్షమై కురుస్తుండగా.. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ.. గౌరవాభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి..! హర్షాతిరేకంతో ఆలింగనాలు వెల్లువెత్తగా.. భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి..! జగమంత కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కదంతొక్కి ఘన విజయం అందుకున్న జన సేనాని పవన్‌ కల్యాణ్‌కు సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.

ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సాగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం పవన్‌ కల్యాణ్‌ గురువారం తొలి సారిగా హైదరాబాద్‌లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వచ్చారు. దీంతో యావత్‌ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. భార్య అన్నా లెజ్‌నోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి వచ్చిన పవన్‌ను కారు దిగిన వెంటనే అన్న కుమారులు, హీరోలు రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌ కౌగిలించుకుని సాదరంగా ఆహ్వానించారు. వదిన సురేఖ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చి వీరతిలకం దిద్దారు. అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కచెల్లెలు హారతిచ్చిన అనంతరం.. బయటకు వచ్చిన చిరంజీవికి పవన్‌ చెప్పులు విడిచి మరీ పాదాభివందనం చేశారు.

చిన్న తమ్ముడిని గట్టిగా హత్తుకుని చిరు ముద్దాడి.. భారీ పూలమాలను మెడలో వేశారు. ఈ దృశ్యం చూసి సోదరుడు నాగబాబు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తల్లిదండ్రుల సమక్షంలో బాబాయ్‌ పవన్‌కు పుష్పగుచ్ఛం అందించిన రాంచరణ్‌ పాదాభివందనం చేశారు. ఇంతలో ఆయన భార్య ఉపాసన రావడంతో అందరూ కలిసి గ్రూప్‌ ఫొటోకు పోజిచ్చారు. నాగబాబు, ఆయన భార్య, కుమారుడు వరుణ్‌తేజ్‌, ఆయన భార్య లావణ్య త్రిపాఠిలూ పవన్‌ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ‘‘డియర్‌ కల్యాణ్‌ బాబు హ్యాట్సాఫ్‌’’ అని రాసి ఉన్న కేక్‌ను అమ్మ, వదినలతో కలిసి పవన్‌ కట్‌ చేశారు.

పవన్‌-లెజ్‌నోవాలకు చిరంజీవి దంపతులు కొత్త దుస్తులు పెట్టారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్‌ అమ్మ అంజనాదేవి, వదిన సురేఖకు పాదాభివందనం చేశారు. వేడుకలో నిర్మాత అల్లు అరవింద్‌, ఆయన కుమారుడు, హీరో అల్లు అర్జున్‌ మాత్రం కనిపించలేదు. మరోవైపు అకీరా నందన్‌ తండ్రిపై రూపొందించిన ఓ వీడియోను రేణూదేశాయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

పవన్‌ నటించిన చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, యాక్షన్‌ స్టిల్స్‌ను వాడుతూ దివంగత మైకేల్‌ జాక్సన్‌ పాట ‘దే డోంట్‌ కేర్‌ అబౌట్‌ అజ్‌’ను బ్యాక్‌ గ్రౌండ్‌లో ఉపయోగించారు. ఈ వీడియోను పవన్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే దీనిని అకీరా ఎడిట్‌ చేశారని రేణూదేశాయ్‌ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2024, 11:34

భారీగా నమోదైన చెల్లని ఓట్లు !

నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. నాలుగు రౌండ్ల తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

కాంగ్రెస్ - 1,22,813 (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ - 1,04,248 (ఏనుగుల రాకేష్ రెడ్డి), బీజేపీ - 43,313 (గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి), అశోక్ పాల్కూరి - 29,697 (స్వతంత్ర అభ్యర్థి) ఓట్లు పోలయ్యాయి. తీర్మాన్ మల్లన్న 18,565 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.

మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 87356 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 34516 ఓట్లతో మూడో స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 27,493 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. రెండు రౌండ్ల తర్వాత లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్‌తో పోల్చుకుంటే రెండవ రౌండ్‌లో తీన్మార్ మల్లన్నకు మెజారిటీ కాస్త తగ్గింది. రెండు రౌండ్లు ముగిసే సరికి మల్లన్న 14,672 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

నేడు సాయంత్రంలోగా ఫలితాలు విడుదలకు సిద్ధం చేశారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2024, 11:31

కేసిఆర్ దుకాణం బంద్ ...!

- కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది

- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం 

- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలుస్క్

బీఆర్‌ఎస్‌ కథ ముగిసిందని, కాంగ్రె్‌సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్‌ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. గురువారం ఢిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని, ఫలితంగా ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 14 చోట్ల మూడో స్థానానికి పరిమితమైందని, ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ అధినేత, పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు గెలిచారని చెప్పారు.గజ్వేల్‌, సిద్దిపేట, మెదక్‌లో బీఆర్‌ఎస్‌ రూ.వందల కోట్లు పంచిపెట్టినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని అన్నారు. పదేళ్లలో రూ.పది లక్షల కోట్లతో తెలంగాణలో అభివృద్ధి చేశామని.. అందువల్లే ప్రజలు ఎనిమిది సీట్లలో బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. మరో ఆరు చోట్ల రెండో స్థానంలో నిలిచామని, బలమైన ప్రత్యామ్నాయంగా మారామని చెప్పారు. కాంగ్రెస్‌ ఆరు నెలల పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, అందుకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తో పాటు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. పసుపు బోర్డు విషయంలో ఎన్నో విమర్శలు చేసినా.. ప్రజలు అర్వింద్‌ను గెలిపించారని చెప్పారు. ఏపీలో ప్రజల తీర్పు హర్షణీయమని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2024, 11:27

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు !

వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి పూర్తయ్యింది.

ఆ ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.

ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగడం లేదని మండిపడింది. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ఏజెంట్ల సంతకాలు లేకుండా ఫలితాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేంటని నిలదీస్తే బెదిరిస్తున్నారని రాకేశ్ రెడ్డి తెలిపారు.

హాల్-4లో 539 ఓట్ల మెజార్టీతో తాను ఉన్నానని రాకేశ్ రెడ్డి వివరించారు. అధికారులు మాత్రం తీన్మార్ మల్లన్నకు లీడ్ ఇచ్చారని వెల్లడించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. మూడో రౌండ్‌లో తీన్మార్ మల్లన్న 3 వేల ఓట్ల లీడ్ సాధించారు. మూడు రౌండ్లు కలిపితే 17 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 21:30

నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా కొణిదెల ఉపాసన నియామకం

అపోలో హాస్పిటల్స్ ట్రస్ట్ తో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా ఒప్పందం

అటవీశాఖ సిబ్బందికి అపోలో ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం

నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా ఉపాసన నియామకం

నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్న ఉపాసన 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి కొణిదెల ఉపాసనను ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచుర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా నియమించారు. 

ఆమె నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా విభాగం, అపోలో హాస్పిటల్స్ చారిటబుల్ ట్రస్ట్ (ఏహెచ్ సీటీ) మధ్య ఒప్పందం కుదిరింది. 

అపోలో హాస్పిటల్స్ సామాజిక సేవా కార్యక్రమాల విభాగానికి ఉపాసన వైస్ చైర్ పర్సన్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, తాజా ఒప్పందం నేపథ్యంలో, దేశంలో ఎక్కడైనా పులుల సంరక్షణ కేంద్రాల్లోనూ, వన్యప్రాణి రక్షిత ప్రాంతాల్లోనూ గాయపడిన అటవీశాఖ సిబ్బందికి అపోలో ఆసుపత్రుల్లో నాణ్యమైన చికిత్స అందిస్తారు. 

దీనిపై ఉపాసన మాట్లాడుతూ, అటవీ సిబ్బంది అజ్ఞాత వీరులు వంటి వారని, సహజసిద్ధ జంతు ఆవాసాలను, అటవీప్రాంతాలను కాపాడడంలో వారు అలుపన్నది లేకుండా పనిచేస్తుంటారని కొనియాడారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం తాము కట్టుబడి ఉన్నామని ఉపాసన స్పష్టం చేశారు. 

కాగా, అటవీశాఖ సిబ్బందికి మాత్రమే కాకుండా, జంతువుల దాడిలో గాయపడిన స్థానిక వన్యప్రాణి సంరక్షణ సంఘాల సభ్యులకు కూడా చికిత్స అందించనున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 13:59

పంచాయితీ ఎన్నికలకు సిద్ధమా !

- మొత్తం రిజర్వేషన్లు 50 కు దాటొద్దని సుప్రీం ఆదేశాలు.. ఎస్సీ, ఎస్టీలకు పోను బీసీలకు ఎంత శాతమనే ప్రశ్నలు

- పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేసిన గత సర్కార్‌.. ఎలా వెళ్దామనే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం

- జూన్‌ చివర్లో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా?.. ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50ు మించితే మరో చిక్కు

- జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్న బీసీలు

రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకుంది. స్థానిక సంస్థల్లో ఏ సామాజికవర్గానికి ఎంత శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండగా.. ఇందులోనే ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది.

మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంది. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతోందన్న అభిప్రాయాలున్నాయి. వాస్తవానికి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్‌ ఏళ్ల తరబడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది. 

మరోవైపు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను వర్తింపజేయాలా? లేక కులగణన చేపట్టి ఆ వివరాలు తేలిన తరువాత ఎన్నికలు నిర్వహించాలా? అని సర్కారు యోచిస్తోంది. కానీ, వచ్చే జూన్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికలు నిర్వహించాలంటే.. ముందుగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది.

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్ల శాతం పరిధి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. బీసీలకు కూడా జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్‌ బలంగా ఉన్నా.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి.

ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికా్‌సరావు గవాళి కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్‌ఎస్‌ సర్కారు.. బీసీల రిజర్వేషన్‌ను 23 శాతానికి తగ్గించి ఎన్నికలు జరిపింది. ఇది వివాదాస్పదం కావడంతోపాటు హైకోర్టు కూడా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా బీసీల రిజర్వేషన్‌ అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న జనాభా దామాషా విధానమైతే.. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన మేరకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. బీసీలవిషయంలో సమస్య తలెత్తుతోంది. ప్రస్తుత నిబంధన ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభాను లెక్కించి దాని ప్రకారం వారికి రిజర్వేషన్‌ కేటాయిస్తారు. 

అయితే ఆయా గ్రామాలు, మండలాల్లో ఎస్సీ, ఎస్టీలు క్కువగా ఉండి, బీసీలు తక్కువగా ఉంటే.. ఆ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు పోను మిగిలిన రిజర్వేషన్‌లో బీసీలకు కేటాయించాల్సి వస్తోంది. దీంతో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ విధానం కోసమైతే ఓటర్ల జాబితాను పరిశీలించి, వివరాలు సేకరిస్తే సరిపోతుంది. 

అనంతరం ఆయా కులాల వారీగా రిజర్వేషన్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. కానీ, బీసీల రిజర్వేషన్‌ మాత్రం తేలడంలేదు. ఇలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన కులగణనను పూర్తిచేసిన తరువాత వాటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. పైగా కులగణనలో బీసీలు అధికంగా ఉన్నారని తేలితే.. అప్పడు కూడా వారికి కేటాయించే రిజర్వేషన్లలో మళ్లీ ఈ 50 శాతం సమస్యే తలెత్తుతుంది.

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 13:55

Kaleshwaram Project: నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

- నెలలో పూర్తి చేద్దామంటున్న అధికారులు

- మూడు బ్యారేజీల బాధ్యత 3 కేంద్ర సంస్థలకు

- రేవంత్‌ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం 

- రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి

- సర్టిఫికెట్లిచ్చినా నిర్మాణం పూర్తికానట్లే లెక్క

- సీఎం స్పష్టీకరణ.. వారంలో కాళేశ్వరానికి

- రేవంత్‌ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం

- మరమ్మతు ఖర్చు నిర్మాణ సంస్థలదే

- అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స)తో, అన్నారం బ్యారేజీని పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఏ)తో అధ్యయనం చేస్తున్నారు . బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై ఈ మూడు సంస్థలతో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది.

నివేదికపై శనివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, అధికారులు చర్చించారు. ఇతర మంత్రులు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి?

బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేంటి? ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డ్డి ఆరా తీశారు. బ్యారేజీల అధ్యయనంతో పాటు రిపేర్లు ఏకకాలంలో చేపట్టాలని నిర్దేశించారు. సమాంతరంగా చేపట్టడం వల్ల నాలుగు వారాల్లోగా మరమ్మతులు, పరీక్షలు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పరీక్షలపై నోడల్‌ అధికారిగా నీటి పారుదల శాఖలోని డిజైన్ల విభాగం చీఫ్‌ ఇంజనీరును నియమించాలని శనివారం నాటి సమావేశంలో నిర్ణయించారు.

కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకొని, వెనువెంటనే అధ్యయనం చేసేలా చూడాలని నిర్దేశించారు. ఆనకట్టల భద్రత జాతీయ సంస్థ నివేదిక ప్రకారం మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. బ్యారేజీల మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు.

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 13:52

Breaking : కాళేశ్వరం ప్రాజెక్టు పై తనిఖీలు !

- మేడిగడ్డ , అన్నారం సుందిళ్ల బ్యారేజ్ లపై ప్రత్యేక అధ్యయనం

- కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ కు 50కు పైగా ఫిర్యాదులు

- నేడు రాష్ట్రానికి జస్టిస్ పీయూష్ ఘోష్

- 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల పరిశీలన

- రేపు కడెం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మంత్రి ఉత్తమ్‌ పర్యటన

- మేడిగడ్డలో నేడు 16, 17 గేట్లు ఎత్తేందుకు కసరత్తు

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. 7న అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈనెల 10వ తేదీలోపు బ్యారేజీలకు మరమ్మతులు/పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే. నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది. పనులు ఎంత వరకూ చేపట్టారన్న విషయాన్ని తెలుసుకోవడానికి పీసీ ఘోష్‌ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

మరోవైపు కడెం ప్రాజెక్టుతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పరిశీలించనున్నారు.కడెం ప్రాజెక్టులో మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.81 కోట్లను కేటాయించగా... ఆ నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులను మంత్రి ఉత్తమ్‌ పరిశీలించి, తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలనూ పరిశీలించనున్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో 16, 17వ నంబర్‌ గేట్లను బలవంతంగా ఎత్తే ప్రక్రియ గురువారం చేపట్టనున్నారు. ఈ మేరకు ఈఎన్‌సీ(జనరల్‌) గుమ్మడి అనిల్‌కుమార్‌తో పాటు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) ఓరుగంటి మోహన్‌కుమార్‌ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు.

జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు 54 ఫిర్యాదులు అందాయి. గత మే 31వ తేదీలోగా కమిషన్‌ కార్యాలయానికి నోటరీ ద్వారా అఫిడవిట్‌ రూపంలో ఫిర్యాదు చేయాలని కమిషన్‌ తరపున నీటిపారుదల శాఖ బహిరంగ ప్రకటన ఇచ్చింది. గడువు పూర్తయిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని లెక్క తీయగా... 54 దాకా వచ్చినట్లు తేలింది. కాగా, బ్యారేజీల నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజనీర్లు, మాజీ ప్రజాప్రతినిధులకు రెండో వారం లేదా మూడో వారంలో కమిషన్‌ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 13:50

Breaking : నీట్ పరీక్ష పేపర్ లీక్ ?

- 60కి పైగా విద్యార్థులకు 720/720 మార్కులు రావడం వివాదాస్పందంగా మారింది

- 70 మందికి 700కు పైగా రూపాయల మార్కులు

- దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విద్యార్థుల ఆందోళన

- పలు సెంటర్లో ఇదంతా జరిగిందని తెలిసిన పట్టించుకోని వైనం 

- వెంటనే దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్

నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అకా NEET, మన దేశ భవిష్యత్తు వైద్యులను ఎంచుకునే ప్రవేశ పరీక్ష. ఇది అమలు చేయబడినప్పుడు చాలా మంది అర్హులైన అభ్యర్థుల మెరిట్ ఆధారిత ఎంపికకు దారితీస్తుందని భావించారు మరియు ఇది 12వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేసే పాత విధానానికి వ్యతిరేకంగా మార్కెట్ చేయబడింది.

NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) NEET నిర్వహణ బాధ్యతను స్వీకరించినప్పటి నుండి, ఇది చాలా సినిమాల కంటే కామెడీగా మారింది, విషాదకరమైనది.

నిన్న, లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తర్వాత, NTA NEET 2024 స్కోర్ కార్డ్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇది పరీక్ష, వ్యవస్థ, విద్యార్థులు మరియు భారతీయ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును ఎంత అపహాస్యం చేసింది! 720 మార్కుల పరీక్షలో 67 మంది విద్యార్థులు పూర్తి మార్కులు సాధించారు. అంటే మీరు పూర్తి మార్కులు సాధించినా, మీరు దేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలలో అంటే AIIMS, న్యూఢిల్లీలో ప్రవేశం పొందలేరు ఎందుకంటే ఓపెన్ కేటగిరీకి కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నాయి.

కామెడీ ఇప్పుడు ప్రారంభమవుతుంది, AIIMS నుండి అంగీకార పత్రాన్ని ఎవరు స్వీకరిస్తారు మరియు ఎవరు మిస్ అవుతారో నిర్ణయించడానికి, NTA టై బ్రేకింగ్ ప్రమాణాలను అనుసరిస్తుంది. కానీ, వారిలో ప్రతి ఒక్కరు పూర్తి మార్కులను పొందినందున, మార్క్ ప్రమాణాలు చిత్రంలో లేవు.

పరీక్ష సమయంలో పేపర్ లీక్‌ల గురించి మీకు తెలిసినప్పుడు ఇది మరింత విషాదకరంగా మారుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేపర్ లీక్ అయినప్పటికీ అది రద్దు కాలేదు. ఇప్పుడు, అదే సెంటర్ నుండి ఏడుగురు అభ్యర్థులు 720 స్కోర్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఎంత యాదృచ్చికం? కొన్నేళ్ల క్రితం 720ని కలలో కూడా అందుకోలేనంతగా ఇప్పుడు ఇండియన్ మూవీ అవార్డ్ అనుకుని అవార్డ్ ఇస్తున్నారు.

ప్రతి సంవత్సరం కటాఫ్‌లు పెరుగుతుండటంతో పరీక్షలో అడిగే ప్రశ్నల నాణ్యత తక్కువగా ఉందని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బదులుగా అది దిగజారింది.

విద్యార్థులు 719 మరియు 718 మార్కులు పొందినట్లు నివేదికలు ఉన్నాయి, ఇది సాధారణ పరిస్థితులలో అసాధ్యం ఎందుకంటే 720 తర్వాత సాధ్యమయ్యే ఏకైక స్కోరు 716 (ఒకవేళ 179 ప్రశ్నలకు సరిగ్గా సమాధానమిచ్చి ఒకదానిని ప్రయత్నించకపోతే).

తమ ప్రశ్నలను ప్రయత్నించడానికి తక్కువ సమయం దొరికిన విద్యార్థులకు కోర్టు నిర్దేశించిన విధంగా బోనస్ పాయింట్లను ప్రదానం చేసినట్లు NTA ఒక ప్రకటనను విడుదల చేయడానికి విస్తృత నిరసన దారితీసింది.

ఇదంతా పెద్ద స్కామ్ లాగా ఉంది. పేపర్ లీక్‌ల నుంచి ప్రశ్నపత్రం నాణ్యత, ఇప్పుడు ఫలితాలు. ట్రెండ్ కొనసాగితే, విద్యార్థులు అసలు జ్ఞానం కంటే రొట్ లెర్నింగ్‌పై ఎక్కువ దృష్టి సారించే విద్య యొక్క ఈ అపహాస్యం కొనసాగించడం కంటే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలని ఆందోళన చేస్తున్నారు .

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 12:48

పవన్ కళ్యాణ్ - "కాంగ్రెస్ నాకు ప్రధాని పదవిని ఆఫర్ చేసినా, నేను వారితో చేతులు కలపను"

100% స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక పార్టీ పవన్ కళ్యాణ్ JSP

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది.

"మోదీ జీ కోసం మేము అతిపెద్ద ఆఫర్‌ను కూడా తిరస్కరించగలము"

ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్దతు తెలిపారు