నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 12:48

పవన్ కళ్యాణ్ - "కాంగ్రెస్ నాకు ప్రధాని పదవిని ఆఫర్ చేసినా, నేను వారితో చేతులు కలపను"

100% స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక పార్టీ పవన్ కళ్యాణ్ JSP

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది.

"మోదీ జీ కోసం మేము అతిపెద్ద ఆఫర్‌ను కూడా తిరస్కరించగలము"

ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్దతు తెలిపారు

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 07:43

దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్ గా ప్రంజల్ పాటిల్

దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్ గా ప్రంజల్ పాటిల్ ఎంపిక అయ్యారు..కేరళలోని తిరువనంతపురం సబ్కలెక్టర్ గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్గా అక్టోబర్ 14న ఆమె బాధ్యతలు స్వీకరించారు.

మహారాష్ట్రలోని ఉల్హాసనగర్ కు చెందిన ప్రంజల్ ఆరేళ్ల వయసు లోనే చూపును కోల్పోయారు. ముంబైలోని కమలామెహతా దాదర్ అంధుల పాఠశాలలో చదువుకున్నారు.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీపట్టా పొందారు.తర్వాత ఢిల్లీ జేఎన్ఎయు నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పీజీ పూర్తి చేశారు.

2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఎఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ప్రంజల్ అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు.

పట్టు వదలని ప్రంజల్ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు.

ఐఏఎస్ గా ఎంపికై, యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు.

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 13:01

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 13:00

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 12:56

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 12:55

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 09:34

నేడు మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవనున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి, పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 07:33

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు...!

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రం లో బుధవారం ప్రారంభం కానుంది. బ్యాలెట్‌ ఓట్లు కావడంతో ఫలితం వెలువడడానికి రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలిం గ్‌ జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాములో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. బ్యాలెట్‌ అన్నింటిని బండిల్స్‌గా కట్టి అనంతరం లెక్కిస్తారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవక పోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడుతారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.

మొదట తొలి ప్రాధాన్యం ఓట్లు లెక్కింపు చేస్తారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లతో పాటు కౌంటింగ్‌ అసిస్టెంట్లు 37 మంది ఏఆర్‌వోలు, 40 మంది తహసీల్దార్లను నియమించారు. అదేవిధంగా 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమలు చేయనున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 19:09

తెలంగాణ రాష్ట్రం,నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దేశ చరిత్రలోనే, 5.50 లక్షల ఓట్లతో భారీ మెజారిటీ...

 తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ సహకారంతోనే ఇది సాధ్యం..

అన్ని తానై ముందుండి నడిపించిన మంత్రి ఉత్తమ్

 నల్గొండ పార్లమెంట్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది రఘువీర్ రెడ్డి కి భారీ మెజార్టీ రావడంలో మంత్రి ఉత్తమ్ కీలకపాత్ర..

 రఘువీర్ రెడ్డి కి ఇంత భారీ మెజార్టీ రావడంలో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వెలకట్టలేనిదని అభివర్ణించిన కెప్టెన్ ఉత్తమ్.....

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 17:20

మరి కొద్ది క్షణాల్లో ఈసి మీడియా సమావేశం !

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్(AP Election 2024), ఒడిశా అసెంబ్లీ ఎన్నికల (Odisha Polls 2024) ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ఏడు విడతల పోలింగ్ విజయవంతంగా జిరగిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Raajiv Kumar) చెప్పారు. దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లు అందరికీ ఆయన ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. 

దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లు అందరికీ ఆయన ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. ఇవి చారిత్రాత్మక ఎన్నికలని, రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. ఇందులో 31 కోట్ల మంది మహిళలు ఉన్నారని ప్రశంసించారు.

ప్రపంచ రికార్డు బ్రేక్ !

దేశ ఓటర్లు 2024లో చరిత్రను లిఖించారని, ఏకంగా 64.2 కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు. ఓటు వేసినవారి సంఖ్య జీ7 దేశాల్లో 1.5 రెట్లు అధికమని, ఈయూలోని(యూరోపియన్ యూనియన్) 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువని రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ఈసారి రీపోలింగ్ చాలా తక్కువ !

గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి రీపోలింగ్ తక్కువగా జరిగిందని ఆయన వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది నిబద్ధతో పనిచేయడంతో తక్కువ రీపోల్స్‌కు దోహదపడ్డాయని ఆయన అభినందించారు. 2019లో ఏకంగా 540 చోట్ల రీపోలింగ్ జరిగిందని ప్రస్తావించారు. ప్రస్తుత ఎన్నికల్లో 39 రీపోల్స్‌ జరగగా అందులో 2 రాష్ట్రాల్లో 25 చోట్ల ఈ రీపోలింగ్ జరిగిందని ఆయన వివరించారు.