ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఐటీడీపీ మండల అధ్యక్షుడు హేమంత్ యాదవ్ వినతి..
ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఐటీడీపీ మండల అధ్యక్షుడు హేమంత్ యాదవ్ వినతి..
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అని భావించి పేదవాడికి పట్టడన్నం పెట్టడమే లక్ష్యంగా పాలన సాగించి, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన దివంగత నేత ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఐ టీడీపీ మండల కన్వీనర్ హేమంత్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఒక సంచలనం అన్నారు. నిరంతరం పేదలు, బలహీన వర్గాలు, మహిళల గురించి ఆలోచించిన మానవతావాది ఎన్టీఆర్ అన్నారు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... గతం ఎంతో ఘన కీర్తి కలవాడ! అనే పాట ఎప్పుడు, ఎక్కడ వినిపించినా తెలుగువాడికి వెంటనే గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆ పాట రాసింది ఆయన కాకపోయినా తెలుగువారికి అంటే ఎన్టీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాళ్ల కోసం ప్రవేశపెట్టారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి కోటి 20 లక్షల పేద కుటుంబాల ఆకలి తీర్చారు రాష్ట్రంలో పేద ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు, పెద్దలకు జనతా వస్త్రాలు పంపిణీ చేశారు. పేదలకు తొలిసారిగా వృద్ధాప్య పెన్షన్లు నెలకు 30 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. దేశంలోనే తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా కృష్ణ పెన్నా నదులను అనుసంధానం చేశారు, పేద విద్యార్థులకు గురుకుల ఆశ్రమ పాఠశాల సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారు విజయవాడలో ఎన్టీఆర్ మెడికల్ అండ్ హెల్త్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు దేశంలో తొలి మహిళ విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చేందుకు కృషి చేశారు రాష్ట్రంలో 330 తాలూకాలను 1104 మండలాలుగా చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తారాస్థాయికి ఎదిగిన నిత్య కృషివలుడు, పల్లె ప్రజల మదిలో గూడు కట్టుకున్న తారక రాముడు, నటసార్వభౌముడు. నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రపంచానికి తిరుగులేని రారాజు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి యావత్ భారతావానికి ఆదర్శంగా నిలిచిన ప్రజా నాయకుడు. అందరితోనూ అన్నా అని పిలిపించుకున్న ఆయన పేదల పెన్నిధిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల అతి స్వల్ప కాలంలో 23 జిల్లాలను ఒక ప్రభంజనంలా చుట్టేసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ కే సాధ్యమైంది. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సును త్రికరణశుద్ధిగా కోరుకుని పరిపాలనకు సరికొత్త భాష్యం చెప్పారు. ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తర్వాత ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పురోగమిస్తోంది 2024 ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుంది సంపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన చంద్రబాబు నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలుగు వెలుగును నలుగు దిశల వ్యాపింప చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించాలని హేమంత్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
Jun 06 2024, 10:00