వైఎస్సార్సీపీ కార్యకర్తను పరామర్శించిన.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు..
వైఎస్సార్సీపీ కార్యకర్తను పరామర్శించిన బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన డీలర్ వెంకటేశులు ఆరోగ్యం బాగాలేక పోవడంతో ఆపరేషన్ చేయించుకుని ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, పార్టీ మండల నాయకులు రమణారెడ్డి, జడ్పీటీసీ నీలం భాస్కర్, ఎంపీటీసీలు, సర్పంచు, పార్టీ నాయకులు, ఆయనను పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు.
టీడీపీ సీనియర్ కార్యకర్త గడ్డం నారాయణ కుటుంబానికి అండగా ఉంటాం : దండు శ్రీనివాసులు..
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గడ్డం నారాయణ కుటుంబానికి అండగా ఉంటాం : దండు శ్రీనివాసులు.. శింగనమల : శింగనమల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త *గోరుమానుపల్లి నారాయణ (గడ్డం నారాయణ) గారి తల్లి వెంకట లక్ష్మమ్మ* అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న *తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు* ఆయన స్వగృహానికి విచ్చేసి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో *దాసరి గంగాధర్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, శింగనమల నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, తెలుగు యువత శింగనమల మండల అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, శంకర్ నారాయణ మాసూల్ ప్రకాష్ దండు ప్రకాష్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మసూద్ వలి, రంగస్వామి, ఆర్మీ జిలాన్, నరసింహ,శివ, రాజు, శివశంకర్,ఋషెంద్ర, కాయలసుర్యనారాయణ,లాలు,* తదితరులు పాల్గొన్నారు
మరణించిన రైతు వెంకటరాముడు కుటుంబానికి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి
మరణించిన రైతు వెంకటరాముడు కుటుంబానికి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం దయ్యలాకుంటపల్లి గ్రామంలో మరణించిన రైతు G.వెంకటరాముడు గారి పార్థివాదేహంకు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు *₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ కార్యక్రమం ఎర్రిస్వామి, శ్రీనివాసులు , వెంకట నారాయణ, ఏకంబారి రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సింగనమల నియోజకవర్గం వైసీపీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటా... ఆలూరు సాంబశివారెడ్డి
నమస్కారం జగనన్న చెప్పినట్టు కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ఇది వ్యక్తిగతంగా నాకు గత రెండు ఎన్నికల కంటే చాలా టఫ్. ఎందుకంటే పద్మావతి గారు అభ్యర్థిగా లేకపోవడం వల్ల నాకు కత్తి మీద సాము అయింది. ఫలితం ఏమాత్రం అటూ ఇటూ అయినా చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే గత రెండు ఎన్నికలకు పెట్టినంత శక్తి సామర్ధ్యాలు ఈ ఒక్క సారే పెట్టాల్సి వచ్చింది. ఇక కార్యకర్తలు, నాయకుల విషయానికి వస్తే మీరంతా ఇచ్చిన సహాయ సహకారాలకు రుణపడి ఉంటాను. ఈసారి సామాజిక సమీకరణల నేపథ్యంలో మన సోదరుడు వీరాకు టికెట్ వచ్చింది. అయినప్పటికీ నేను కానీ, పద్మావతి గారు కానీ ఏమాత్రం డీలా పడకుండా జగనన్న మాటే వేదమని పని చేశాము. మనకు టికెట్ లేదు అయినా జగనన్న కోసం కష్టపడి పని చేయాలి, అన్న భావన మాలో ఎలా అయితే ఉందో, కార్యకర్తల నుంచి నాయకుల వరకు అదే స్ఫూర్తి తీసుకోవడం ఒక అద్భుతం. జగనన్న మీద, మా మీద ఉన్న అపారమైన ప్రేమకు ఇది నిదర్శనం. ఒకానొక దశలో నియోజకవర్గంలో అసంతృప్తి వాదుల అలజడి రేగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అది సమసి పోయింది అది వేరే విషయం. వీరాను మార్చాలని ఒకవైపు, మారుస్తున్నారనే పుకార్లు ఒకవైపు‌. మార్చాలని పైవరకు విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. మార్చరు అని నాకు పక్కాగా తెలిసినప్పటికీ, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లడం మాకు ఇబ్బందిగానే అనిపించింది. అలాంటి ఇబ్బందికర వాతావరణంలో నాలో ధైర్యం నింపి, ఆత్మవిశ్వాసంతో నన్ను నడిపింది ఇద్దరు. ఒకరు జగన్ సార్ అయితే రెండోది నన్ను నమ్మిన కార్యకర్తలు, నాయకులు. ఇద్దరిలోనూ నాకు ఒకటే విధమైన నమ్మకం కనిపించింది. *"సాంబుడూ, నువ్వు ఏదీ పట్టించుకోవద్దు. పని చెయ్. మనం గెలుస్తాం." అని జగన్ సార్ చెప్పడం. ఇక్కడ క్షేత్రస్థాయిలో నా వెంట ఉండి నన్ను నడిపించారు చాలా మంది. వాళ్లని ఎప్పటికీ మర్చిపోలేను. మీరు నా బలం, నా సైన్యం.* చివరి రెండు నెలలు, ఎండలు మండిపోతుంటే ఇంటింటి ప్రచారం చేసాం. ఏ ఊరికి వెళ్ళినా అపూర్వమైన ఆదరణ. జనమే జనం. ఎండల్ని ఏమాత్రం లెక్కచేయకుండా అలుపెరగకుండా మాతో తిరిగారు మమ్మల్ని నడిపించారు. ఇలా ప్రతి ఒక్క అంశం నాకు గుర్తు వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను కూడా. మన కష్టానికి తగిన ఫలితం రాబోతోంది. మంచి మెజారిటీతో మనం గెలుస్తున్నాం. మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. పేదలకు కచ్చితంగా ఇంకా మంచి జరగబోతోంది. మీరు అందించిన సహకారానికి సేవలకు ప్రతిఫలంగా నా వంతు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. *మరోసారి మీకందరికీ వేలవేల ధన్యవాదాలు*
రోటరీ పురం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీ పురం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరిక..
వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరిక..

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగలనుంది, ఆ పార్టీకి స్వస్తి పలికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సంక్షేమ పాలన సాధనే లక్ష్యంగా, టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు సమక్షంలో వారు చేరారు.

నార్పల మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన రాగే పుల్లయ్య, రాగే సాలన్న, రాగే రాముడు, రాగే జయన్న, 4 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి మండల కన్వీనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరాయి. వారికి కండువా వేసి సాదరంగా ఆయన ఆహ్వానించారు. శింగనమల మండలం పెద్ద జలాలపురం గ్రామానికి చెందిన మంచాల శివ, ఎం. ఆదెన్న, ఆంజనేయులు, 3 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలోకి డీసీఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి ఆధ్వర్యంలో శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు సమక్షంలో చేరాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న అందిస్తున్న సంక్షేమ పాలన, శింగనమల నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి వైఎస్సార్సీపీలోకి చేరినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జగనన్న పాలన స్వర్ణయుగం.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. జగనన్న రుణం తీర్చుకుందాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ..

జగనన్న పాలన స్వర్ణయుగం.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. జగనన్న రుణం తీర్చుకుందాం.. వైఎస్సార్ సీపీ వస్తేనే పథకాలు ఇంటికి వస్తాయి

◆ ఎన్నికలప్పుడు మాత్రమే ఆర్భాటం చేసే టిడిపిని నమ్మొద్దు ■ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో స్వర్ణ యుగ పాలన జరిగిందని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకుందాం అని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు పేర్కొన్నారు.

గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో డా.బి ఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రజక కార్పోరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ఆర్టీసీ రీజనల్ చైర్ పర్సన్ మాల్యవంతం మంజుల, పార్టీ శ్రేణులతో కలసి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు నిర్వహించారు. ముందుగా డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి సంక్షేమాన్ని వివరించారు. ఈ నెల 13 తేదీన జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీయం మెషినల్ లో సీరియల్ నెంబర్ 3 వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కల్లూరు మండల కేంద్రంలో నీలం సంజీవరెడ్డి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. సాధారణంగా రాజుల కాలంలో రాజులు ప్రజలను పాలించే పాలనను స్వర్ణ యుగం అంటారని, కానీ వైస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన పాలన కూడా స్వర్ణ యుగ పాలన అని అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గ్రామాల్లో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి పేదప్రజలకు అండగా నిలిచారన్నారు. పేద ప్రజలందరూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందారంటే ఆ ఘనత వైస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగలంటే మరోసారి వైస్ జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో గార్లదిన్నె మండలంలోని మిడ్ పెన్నార్ డ్యామ్ గేట్లకు రబ్బరు మరమ్మతులు చేసిన పాపాన పోలేదన్నారు. కానీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గెలిచిన తర్వాత మరమ్మతులు చేసి రైతులకు తాగు, సాగు నీరు అందించారన్నారు. సాధారణ కార్యకర్త అయిన తనకు జగనన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ఎంతో సంతోషమని సీఎంకు రుణపడి ఉంటానని, నా రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ఎమ్మెల్యే పద్మమ్మకు, ఆలూరు సాంబ శివారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాల్లోకి టీడీపీ, బీజేపీ, జనసేన తోడేళ్ళు గుంపు వస్తున్నాయని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘనాయకులు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్దారంపురం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం..
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించి *ఉమ్మడి MP అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారికి, ఉమ్మడి MLA అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారికి ఓటు వేసి వేపించి గెలిపించాలి* అని కోరిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,ఎంపీటీసీ భర్త సాకే నాగేంద్ర జిల్లా తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య, నాగేంద్ర, కాటమయ్య, నారాయణస్వామి,ఆదినారాయణ,మారుతీ, చిన్నరాజు, లింగమయ్య,చిన్న మద్దిలేటి,నరసింహులు,కిష్టయ్య, సాకే మహేష్, పెద్దమద్దిలేటి,మాజీ డీలర్ కొండన్న, ,రమేష్, హరి,తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రంలో ఆలం నరసా నాయుడు మొండిమడుగు కేశవరెడ్డి కే రామలింగారెడ్డి పర్వతనేని శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించిన ద్విసభ్య కమిటీ సభ్యులు అలంనరసానాయుడు గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారు కె.రామలింగారెడ్డి గారు పర్వతనేని శ్రీదర్ బాబు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిలుగా పోటీ చేస్తున్న బండారు శ్రావణీ శ్రీ అంభికా లక్ష్మి నారాయణ గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు..
ప్రచార హోరు...'ఫ్యాన్ జోరు' వీరాకు అడుగడుగునా జన నీరాజనం.. 'ఫ్యాన్ ' గుర్తుకు ఓటు వేసి గెలిపించండి..
సైకిల్ కి ఓటు వేస్తే వందేళ్లు వెనక్కి వెళ్లినట్లే సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు. శింగనమల మండలం పెద్ద మట్లగొంది, గోవిందరాయునిపేట గ్రామాలలో మరియు మండల కేంద్రంలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు. ఆయనకు ప్రజలు, అభిమానులు, అడుగడునా పూలమాలలు వేసి నీరాజనాలు పలికారు. ఇంటింటికి వెళ్లి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వారికి గుర్తు చేస్తూ.. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శింగనమల మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి ఎం శంకర్ నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రీజనల్ కోఆర్డినేటర్ రాగే పరశురాం, గిరిజన ప్రజా సమైక్య జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్ నాయక్ , పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు పాల్గొన్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ..ఒక సామాన్యుడిని పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన తనను ఇలా మీ ముందు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను, దీనికి కారణం అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చిన దళితుల దేవుడు డా.బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. నన్ను తమ్ముడిలా ప్రోత్సహిస్తున్న మన ఎమ్మెల్యే పద్మమ్మ, ఆలూరు సాంబశివారెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గానికి అనేకమంది ఎమ్మెల్యేలు పాలన చేశారు. 50 ఏళ్ల చరిత్రను తిరగరాస్తు శింగనమల చెరువును లోకలైజేషన్ చేసిన ఏకైక ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి చరిత్రలో నిలిచారన్నారు. ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన కొనసాగించారన్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను ఎన్నికల వేళ మరోసారి మోసం చేయటానికి వస్తున్నారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈనెల 13 తేదీన ఈవీఎం మెషినల్ లో సీరియల్ నెంబర్ 3 వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి శింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని కోరారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు కూటముల పేరుతో ప్రజలని మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈనెల 13న ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి అయిన తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.