ఉపాధ్యాయునిగా మారిన విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..
ఉపాధ్యాయునిగా మారిన విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..
■ బండ్లపల్లి "పల్లెనిద్ర" కార్యక్రమంలో పాల్గొన్న వీరాంజనేయులు
సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటే రాష్ట్రం,దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు పేర్కొన్నారు.
నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఐదవ రోజు "పల్లె నిద్ర" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వీరాంజనేయులు పాఠాలు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న అందిస్తున్న వసతుల గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
కార్పొరేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందిస్తూ అమ్మ ఒడి జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నామని పిల్లలు తెలిపారు.
అనంతరం గ్రామంలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలని ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం కాలనీలో బస చేశారు.
Mar 29 2024, 06:34