డిఎండికె పార్టీ నేత గణేష్ మూర్తి మృతి
టికెట్ రాలేదని మనస్తాపం తో తమిళనాడుకు చెందిన డీఎండీకే ఎంపీ,ఈరోడ్, గణేశమూర్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు.
గత కొన్ని రోజులుగా కోయం బత్తూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న ఆయన ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో కన్ను మూశారు.
ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని మనస్తా పానికి గురైన గణేశమూర్తి ఆదివారం మార్చి 24వ తేదీన తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.
వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కొయంబత్తూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న గణేశమూర్తికి ఇవాళ ఉదయం హార్ట్ ఎటాక్ రావడం వల్ల మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి...











Mar 28 2024, 09:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.9k