Venkatesh1

Mar 28 2024, 07:18

ఉపాధ్యాయునిగా మారిన విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..

ఉపాధ్యాయునిగా మారిన విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..

■ బండ్లపల్లి "పల్లెనిద్ర" కార్యక్రమంలో పాల్గొన్న వీరాంజనేయులు

సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటే రాష్ట్రం,దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు పేర్కొన్నారు.

నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఐదవ రోజు "పల్లె నిద్ర" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వీరాంజనేయులు పాఠాలు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న అందిస్తున్న వసతుల గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. 

కార్పొరేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందిస్తూ అమ్మ ఒడి జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నామని పిల్లలు తెలిపారు.

అనంతరం గ్రామంలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలని ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

అనంతరం కాలనీలో బస చేశారు.

Venkatesh1

Mar 28 2024, 07:11

ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను.. ఆదరించండి.గెలిపించండి.. శింగనమల వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను.. ఆదరించండి.గెలిపించండి.. శింగనమల వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

ప్రజలకు, జగనన్నకు బాధ్యుడనై ఉంటూ, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తాను.. ఆదరించి..గెలిపించండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

నార్పల మండలం దుర్గం, సిద్దరాచెర్ల, బోయకొట్టాల, గొల్లపల్లి, కమ్మకొట్టాల, మాలవాండ్లపల్లి, బండ్లపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ సీపీ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి ఆయన చేపట్టారు.

ముందుగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాల మేలును వివరించారు. శింగనమల స్థానిక బిడ్డగా వస్తున్నా అందుబాటులో ఉంటాను, ఆదరించండి మీకు సేవకుడిగా పని చేస్తాను. రానున్న ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును "ఫ్యాన్" గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్దంలో పేదల పక్షాన నిలిచిన జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. పేదలకు మెరుగైన విద్య, వైద్యం, సంక్షేమాభివృద్దే ధ్యేయంగా పరిపాలన సాగిందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో విద్య, వైద్యం సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు. జగనన్న చేసిన సంక్షేమాన్ని చూసి రానున్న ఎన్నికలలో గెలవలేని భయంతో, టిడిపి, జనసేన, బిజెపి, మరికొన్ని పార్టీలు జతకట్టి జగనన్నని ఓడించడానికి వస్తున్నాయన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఇచ్చిన మాట ప్రతి హామీని నెరవేర్చిన సంక్షేమ ప్రధాత జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 27 2024, 07:32

బహిరంగ సభ నుండి రోడ్ షో గా మార్పు.. స్థల పరిశీలన చేసిన టిడిపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఆలం నరస నాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఈనెల 28 చంద్రన్న రాకతో తొలతగా బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు అనంతరం సభా స్థలమును మారుస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర రోడ్ షో నిర్వహణకు స్థలమును పరిశీలించిన టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కే రామలింగారెడ్డి పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధ పర్వతనేని శ్రీధర్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Venkatesh1

Mar 27 2024, 06:57

పల్లె నిద్ర కార్యక్రమంతో క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు..

ప్రజల్లో మమేకమై...ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 

పల్లె నిద్ర కార్యక్రమంతో క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు..

"మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో నాలుగవ రోజు పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

స్థానిక గ్రామస్తులతో మమేకమవుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని వారికి తెలియజేశారు. 

ఎన్నికల ప్రచారం అనంతరం గ్రామంలోని మీ సమస్యలను తెలుసుకొని, మీ అందరి ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత మీరు చెప్పిన ప్రతి సమస్యలను మన వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటన్నిటిని నెరవేరుస్తానని వారికి హామీ ఇచ్చారు.

అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ భవనంలో బస చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచు, ఎంపీటీసీ, స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 27 2024, 06:50

గ్రామాల్లో అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు.. మీ ఆశీస్సులతో గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తా.. ఎమ్మెల్యే ఎం. వీరాంజనేయులు..

గ్రామాల్లో అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు.. మీ ఆశీస్సులతో గెలిపించండి.. తోడుగా ఉంటా.. అభివృద్ధి చేసి చూపిస్తా.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

శింగనమల నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటలో ఉంటా..ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యే గా గెలిపించండి..అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎం. వీరాంజ నేయులు కోరారు. 

పుట్లూరు మండలం మడుగుపల్లి, జంగం రెడ్డిపల్లి, ఎల్లుట్ల గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన చేపట్టారు.

ముందుగా గ్రామాల్లో పార్టీ నాయకులు, ప్రజలు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులతో కలసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ మీ సోదరుడిగా మీ ముందుకు వస్తున్నా, ఆశీస్సులు అందించాలని కోరారు. 

డప్పు కళాకారులతో కలసి డప్పు దరువు వాయించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, మీ అమూల్యమైన ఓటును 'ఫ్యాన్ " గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కరపత్రాలను అందించి అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగనన్న గెలుపొందాలన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పాఠశాలల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి కార్పొరేట్ విద్య కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తూ, దేశ చరిత్రలో నిలిచిన జగనన్నకు రుణపడి ఉంటామని మహిళలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా, సంక్షేమ పథకాలు అందించి తమ కష్టాలు తీర్చిన జగనన్నకే తమ ఓటు వేసి ఆయన రుణం తీర్చుకుంటామని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సంక్షేమం ఆపకుండా అందరికీ అందించి తోడుగా ఉన్నారన్నారు. ప్రజలు కరోన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగనన్న ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తుంటే, మనమందరం కూడా ఆయనని రానున్న ఎన్నికలలో సమిష్టిగా కృషి చేసి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.  నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు,తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 26 2024, 16:04

మృతి చెందిన టిడిపి సీనియర్ కార్యకర్త గారి కుటుంబానికి అండగా నిలబడి ఆర్థిక సాయం చేసిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు..

సింగనమల నియోజకవర్గం నార్పల మండలం బండ్లపల్లి గ్రామం టీడీపీ సీనియర్ కార్యకర్త తలారి ఓబుళప్ప అనారోగ్యం తో అకస్మాత్తుగా మృతి చెందడం తో ఆ విషయం ఆ గ్రామ సీనియర్ నాయకుల ద్వారా తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు 10,000 వేల రూ.లు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో పిట్టు రంగారెడ్డి,G సుధాకర్ రెడ్డి,పిట్టు వెంకటనారాయణమ్మ,K సాంబశివరెడ్డి,తలారి కుళ్లాయప్ప,నారాయణ స్వామి,పెద్దన్న,రఘురాములు తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 26 2024, 10:36

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం బొందలవాడ గ్రామంలో నిన్నటి రోజున బీసీ కాలనీలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు ఈ కార్యక్రమంలో బొందలవాడ గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Mar 26 2024, 07:54

28వ తేదీన వస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం ఏర్పాట్లను చూస్తున్న టిడిపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ..

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలానికి ఈనెల 28 తేదీన వచ్చేస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న శుభ సందర్భంగా సభా స్థలాన్ని మరియు ఏర్పాట్లను పరిశీలిస్తున్న టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ మరియు ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి రామలింగారెడ్డి పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Mar 26 2024, 07:44

నార్పల మండలం గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో విస్తృత ప్రచారం చేపట్టిన రాష్ట్ర అధికార ప్రతినిధి విశబ్ కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు, ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ  బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు అనంతరం రిజర్వేషన్లను పెంచి పదవుల్ని ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు అనంతరం వైయస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నీరుగార్చిన ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు, ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరు ఏకతాటిపై ఉంటూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి బండారు శ్రావణి శ్రీ గారి ని ఏమ్మెల్యే గా గెలిపించుకొని నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ  అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 26 2024, 07:37

సమస్యల పరిష్కార దిశగా పని చేస్తా దీవించి ఆశీర్వదించండి బండారు శ్రావణి శ్రీ..

సమస్యల పరిష్కార దిశగా పని చేస్తా దీవించి ఆశీర్వదించండి బండారు శ్రావణి శ్రీ..

గ్రామాల్లో అపూర్వస్వాగతం పలుకుతున్న మీకు శతకోటి వందనాలు

మీరు చూపించే ప్రేమ, ప్రేమ ఆప్యాయతలు ఎన్నటికీ మరువలేనివి

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉత్సాహంతో పని చేస్తాను..

నా ధైర్యం,బలం ప్రజలే, నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజలతోనే ఉంటా ప్రజల మధ్యనే తిరుగుతా.

మీకోసం ఎటువంటి సమస్యలు ఉన్నా మీ తరపున పోరాడడానికి నేను సిద్దం..

ప్రతి ఇంటిలో ఆడపడుచుల మీలో ఒక్కరిగా నిత్యం అందుబాటులో ఉంటాను.

ప్రజల వెంట తిరిగాను ప్రతి ఊరు ప్రచారం చేశాను మీ సమ్యస  నాకు తెలుసు ఎక్కడ ఏ సమస్య ఉందో నేను ఆరాధిస్తున్నాను.. "మీరు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత". నాకోసం మండే ఎండలు లెక్క చేయకుండా మీరు మాకోసం ప్రచారం చేస్తూ మా వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను..