గ్రామాల్లో అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు.. మీ ఆశీస్సులతో గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తా.. ఎమ్మెల్యే ఎం. వీరాంజనేయులు..
గ్రామాల్లో అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు.. మీ ఆశీస్సులతో గెలిపించండి.. తోడుగా ఉంటా.. అభివృద్ధి చేసి చూపిస్తా.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
శింగనమల నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటలో ఉంటా..ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యే గా గెలిపించండి..అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎం. వీరాంజ నేయులు కోరారు.
పుట్లూరు మండలం మడుగుపల్లి, జంగం రెడ్డిపల్లి, ఎల్లుట్ల గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన చేపట్టారు.
ముందుగా గ్రామాల్లో పార్టీ నాయకులు, ప్రజలు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులతో కలసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ మీ సోదరుడిగా మీ ముందుకు వస్తున్నా, ఆశీస్సులు అందించాలని కోరారు.
డప్పు కళాకారులతో కలసి డప్పు దరువు వాయించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, మీ అమూల్యమైన ఓటును 'ఫ్యాన్ " గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కరపత్రాలను అందించి అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగనన్న గెలుపొందాలన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పాఠశాలల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి కార్పొరేట్ విద్య కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తూ, దేశ చరిత్రలో నిలిచిన జగనన్నకు రుణపడి ఉంటామని మహిళలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా, సంక్షేమ పథకాలు అందించి తమ కష్టాలు తీర్చిన జగనన్నకే తమ ఓటు వేసి ఆయన రుణం తీర్చుకుంటామని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సంక్షేమం ఆపకుండా అందరికీ అందించి తోడుగా ఉన్నారన్నారు. ప్రజలు కరోన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగనన్న ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తుంటే, మనమందరం కూడా ఆయనని రానున్న ఎన్నికలలో సమిష్టిగా కృషి చేసి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు,తదితరులు పాల్గొన్నారు.
Mar 27 2024, 06:57