సైకిల్ గుర్తుకు ఓట్ వేసి బండారు శ్రావణి శ్రీ గారిని ఏమ్మెల్యేగా. చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం.. ఆలం నరస నాయుడు ..

సైకిల్ గుర్తుకు ఓట్ వేసి బండారు శ్రావణి శ్రీ గారిని ఏమ్మెల్యేగా గెలుపిoచుకొని చంద్రబాబు నాయుడు గారి ని ముఖ్యమంత్రి గా చేసుకుందాం.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం ముగేతిమ్మoపల్లి,జంగారెడ్డిపల్లి, రంగాపురం గ్రామాల లో శిoగనమల నియోజకవర్గ ;(టీడీపీ-జనసేన-బిజెపి) ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల YCP ప్రభుత్వం ఆరాచకాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. రంగాపురం గ్రామం లో గజమాలతో సత్కరించి మహిళలు భారీగా వచ్చి హారతులు ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది. 

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.. కార్యక్రమంలో మండలo లోని సీనియర్ నాయకులు,మాజీ ఎంపీపీ లు మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, క్లస్టర్, యూనిట్, బుత్ ఇంచార్జ్ లు గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలతో ఇంటింటా ఆనందం.. శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

సంక్షేమ పథకాలతో ఇంటింటా ఆనందం.. శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఇంటింటా ఆనందంగా ఉన్నారని ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వీరభద్రకాలనీ, గిరిప్రసాద్, భాగ్యనగర్ లలో జిల్లా చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఆర్టీసీ జోనల్ పర్సన్ మాల్యవంతం మంజుల, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య తో కలిసి ఆయన పర్యటించారు.

ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఐదేళ్ల జగనన్న పాలనపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంటి దగ్గరికి పింఛన్ అందిస్తున్న వైసిపి ప్రభుత్వానికి తమ ఓటు వేస్తామని అవ్వా తాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే వైయస్ జగనన్న మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. టిడిపి పార్టీ పొత్తులతో మోసం చేయడానికి వస్తోందని ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంకర్ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

గూగుడు గ్రామంలో టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ కి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నర్సా నాయుడుకి హారతులు ఇస్తూ ఘన స్వాగతం

గూగుడు గ్రామంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారికి మరియు ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలమ నర్సా నాయుడు గారికి హారతులు ఇస్తూ ఘన స్వాగతం

జన సంద్రోహంలో బండారు శ్రావణి గూగుడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి తిరిగి టిడిపి జనసేన ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ పథకాలను కరపత్రం పంచుతూ పథకాలను వివరించిన బండారు శ్రావణి శ్రీ . అక్కడున్న ప్రజల కష్టాలను తెలుసుకుని మా ప్రభుత్వం వస్తే ఏ సమస్య లేకుండా చేస్తాం అన్నారు. ప్రజలు అందరూ ఆదరించి టిడిపి ప్రభుత్వం ఓటు వేసి గెలిపించాలని కోరారు

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ఆలం వెంకట నరసా నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆకుల అనిల్ మదమంచి ప్రతాప్ టిడిపి సీనియర్ నాయకులు జనసేన కార్యకర్తలు.మహిళలు యువతులు పాల్గొన్నారు

బండారు కిన్నెర శ్రీ కేశవరెడ్డి రామలింగారెడ్డి పర్వతనేని శ్రీధర్ బాబు హనుమంతరెడ్డి బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో విస్తృత ప్రచారం

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని గాంధీనగర్ సుందర్ నగర్ బుడగ జంగాల కాలనీలో ""బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ""కార్యక్రమం నిర్వహించిన శింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణీ శ్రీ గారి అక్క బండారు కిన్నెర శ్రీ కేశవరెడ్డి రామలింగారెడ్డి పర్వతనేని శ్రీధర్ బాబు హనుమంతరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు.మహిళల కోసం మంచి పథకాలు పొందుపరిచారన్నారు.ఇందులో భాగంగా ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18 వేల రూపాయలు, తల్లికి వందనం పథకం కింద పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి ఒక్కొక్కరికి 15000 చొప్పున ఎంతమందిని బడికి పంపిస్తే అంతమందికి వర్తింపజేసేలా,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు,ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి ఇచ్చి వారిని పూర్ టు రిచ్ అయ్యేలా పథకాలను ప్రవేశపెట్టారన్నారు..రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అలాగే శింగనమల అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి బండారు శ్రావణి శ్రీ గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు..

చరిత్రలో నిలిచేలా సంక్షేమ పాలన.. వైఎస్సార్సీపీ 58 నెలల పాలన జనరంజకం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

చరిత్రలో నిలిచేలా సంక్షేమ పాలన.. వైఎస్సార్సీపీ 58 నెలల పాలన జనరంజకం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

మరోసారి వైయస్ జగనన్నకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, 58 నెలల పాలనలో సాహసోపేతమైన సంక్షేమ పథకాలను అమలుచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించిన ఘనత జగనన్నకు దక్కుతుందని వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో కే. వి. యస్.నగర్, గిరిప్రసాద్ నగర్, దక్షిణామూర్తి నగర్, చాకలి ఐలమ్మ కాలనీలలో పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.

కాలనీలలోని వైఎస్సార్సీపీ శ్రేణులు స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా కుటుంబాల లబ్ధిపై ఆరా తీశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు జగనన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని మీ అందరూ ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తామంటున్న పథకాలకు షూరిటీ, టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ లేదన్నారు. ప్రజలను మోసం చేయడానికి అమలు కాని వాగ్దానాలతో ఓట్ల కోసం వస్తున్న టిడిపికి సరైన సమాధానం చెప్పాలని ప్రజలకు తెలిపారు. జగనన్న చెప్పిన మాట ప్రకారం సంక్షేమం ,అభివృద్ధి చేసి చూపించారన్నారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందాయని మా ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Flash .. Flash.. కోడుమూరు నియోజకవర్గం టిడిపి పరిశీలకులుగా రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి నియామకం..

కోడుమూరు నియోజకవర్గం టిడిపి పరిశీలకులుగా రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి నియామకం..

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజవర్గం టిడిపి పార్టీ పరిశీలకులుగా బుక్కరాయసముద్రం మండలం చెందిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డిని బుధవారం రాష్ట్ర పార్టీ నియామకం చేసింది. కోడుమూరు నియోజవర్గం పార్టీ పరిస్థితి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థి గెలుపుకు, పార్టీలో కార్యకర్తలను నేతలను సమన్వయం చేసి ముందుకు పోయేందుకు నియోజవర్గం పరిశీలికలుగా వేసినట్లు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి రామలింగారెడ్డి తెలిపారు. నేడు కోడుమూరు నియోజకవర్గంకు గురువారం వెళ్లనున్నట్లు తెలిపారు.

రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. బాబు రావాలి.. గ్రామాల్లో బండారు శ్రావణి శ్రీ కు అపూర్వ ఆదరణ..

రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. బాబు రావాలి.. గ్రామాల్లో బండారు శ్రావణి శ్రీ కు అపూర్వ ఆదరణ..

గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో దాచుకో.. దోచుకో అన్న చందంగా శింగనమల నియోజకవర్గంలో పరిస్థితి ఉందని నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రోటరీపురం, కొర్రపాడు గ్రామపంచాయతీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వారితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు వసుపల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు కన్వీనర్ అశోక్ లు తో పాటు తదితరులు హజరై మాట్లాడడం జరిగింది. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా... అభివృద్ధి అడ్రస్ లేదన్నారు. చెరువులు, కొండ గుట్టలు ,  ఇసుక రీచ్ ల నుంచి అక్రమ ఇసుక రవాణా, అక్రమంగా ఎర్రమట్టి యదేచ్చగా తరలించి లక్షలాది రూపాయులు సొమ్ము చేసుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయులు అక్రమంగా సొమ్ము చేసుకున్నారన్నారని ఆరోపించారు. అభివృద్ధి అమడం దూరంలో ఉందన్నారు. అభివృద్ధి ఎక్కడ చేశారో.. చూపించాలన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే.. మరోసారి సీఎంగా చంద్రబాబు రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రజలను మభ్యపెట్టడానికి ఇప్పుడు నుంచే ఓటర్లును ప్రలోబాలుకు గురి చేస్తోందన్నారు. వారి ఇచ్చే మద్యం, డబ్బుకు ఆశకు గురికావద్దన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఏపీ అభివృద్ధి మరో పది సంవత్సరాల వెనక్కి పోయిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కన్వీనర్లు, అభిమానులు పాల్గొన్నారు.

 నువ్వు వస్తానే... శ్రావణమ్మ... నియోజకవర్గం మేలు

 నియోజకవర్గంకి నువ్వు వస్తానే... శ్రావణమ్మ నియోజకవర్గం అన్ని రకాలుగా మేలు జరుగుతుందని ఏ గ్రామానికి వెళ్లిన... ప్రజల మనుసులో ఉన్న మాట ... అప్యాయతగా చేబుతున్నారు. ఇంటింటా ప్రచారంకు వెళ్లిన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకు.. గ్రామాల్లో అపూర్వ మద్దతు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీని నమ్మి మోసిపోయామని ఈ సారి తప్పకుండా నిన్ను గెలిపించుకునే బాధ్యత మాపై ఉందంటూ ఓటరులు

అమెతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు నీరాజానాలు పలుకుతున్నారు. ఎంతో సాంప్రదాయంగా మా ఇంటి అడ బిడ్డగా కుంకుమ

 దిద్ది.. వారి అభిమానంతో... చీరలు ఇచ్చి.. తమ అభిమానంను చాటుకుంటున్నారు. నియోజకవర్గంలో రోజు రోజుకి బండారు శ్రావణిశ్రీ కు

ఆదరణ పెరుగుతుంది.

వైసీపీ మాజీ సర్పంచ్ తో సహ పలువురు టీడీపీలోకి చేరిక..

వైసీపీ మాజీ సర్పంచ్ తో సహ పలువురు టీడీపీలోకి చేరిక.. 

 *శింగనమల నియోజకవర్గంలో మొదలైన వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు 

బుక్కరాయసముద్రం, మార్చి 19: మండల పరిధిలోని కొర్రపాడు వైసీపీ మాజీ సర్పంచ్ చలపల లింగారెడ్డితో సహ పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బం డారుశ్రావణీశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు పసుపుల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికారప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, కన్వీనర్ అశోక్ లు టీడీపీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వనించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నుంచి పలువురు టీడీపీలోకి చేరారు. వైసీపీ పార్టీలో అవినీతి అక్రమాలు తప్ప, అభివృద్ధి ఎక్కడ జరగలేదని, చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని భావనతోనే తిరిగి టీడీపీలోకి చేరినట్లు మాజీ సర్పంచ్ లింగారెడ్డి ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుంది.. వీరాంజనేయులు ..

వైఎస్సార్సీపీతోనే పేదలందరికి మేలు.. శిగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుందని వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని రామిరెడ్డి, గాయత్రి, హమాలి కాలనీలలో పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.

ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా ఏర్పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని కోరారు. అమలు కాని వాగ్దానాలతో, ఉమ్మడి పొత్తులతో టీడీపీ ప్రజల్లోకి వస్తుందని వారిని నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలతో అడ్డుకోవడానికి వస్తున్నారని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలకు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నకు మరోసారి ఓటు వేసి గెలిపించాలన్నారు.

పెద్దమ్మ గుడి గోడ నిర్మాణానికి రూ.2.00 లక్షలు విరాళం

మండల కేంద్రంలోని హమాలీ కాలనీలో ఉన్న శ్రీ పెద్దమ్మ గుడి చుట్టూ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబ శివారెడ్డి సహకారంతో వైస్సార్సీపీ మండల నాయకులు ఆలూరు రమణారెడ్డి దాదాపు రూ.2.00 లక్షలు విరాళంగా అందజేశారు.

అడిగిన వెంటనే గుడి గోడ నిర్మాణానికి అందించిన ఎమ్మెల్యే దంపతులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బండారు శ్రావణి శ్రీ కి బ్రహ్మరథం పడుతున్న బుక్కరాయసముద్రం మండల ప్రజలు..

సింగనమల నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి పార్టీల అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ కి బ్రహ్మరథం పడుతున్న బుక్కరాయసముద్రం మండల ప్రజలు.. ప్రచార కార్యక్రమంలో భాగంగా జంతులూరు గ్రామంలో విశేష జనం హాజరై ఘన స్వాగతం పలుకుతూ గ్రామంలోకి ఆహ్వానించారు 

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీను భారీ మెజార్జీతో గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గ టిడిపి, జనసేన,బీజేపీల ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు అలం నరసానాయుడు, ముంటి మడుగు కేశవరెడ్డిలు అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జంతులూరు, కొత్తచెదళ్ల ,పాత చేదళ్ల గ్రామంలో టీడీసీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడిపీ ఉపాధ్యాక్షులు పనుపుల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిది పర్వతనేని శ్రీధర్ బాబు, కన్వీనర్ అశోక్ లు హజరై మాట్లాడారు. గత ఐదు సంవత్సరాలలో శింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి కంటే.. అవినీతి భారీగా జరిగిందన్నారు. టిడిపి గెలుపుతో.. శింగనమల నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపుతామన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా.. టీడీపీ అభ్యర్థికు అపూర్వ స్వాగతాలు పలుకుతున్నారన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లోకి వెళ్లలేక పోతున్నారని ఆరోపించారు. రామన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

 ఏ గ్రామానికి వెళ్లిన... టీడీపీ అభ్యర్థి శ్రావణిశ్రీ కు ఆపూర్వ స్పందన 

నియోజకవర్గంలో మీ అడ బిడ్డగా అని చెబుతూ... అందరి ఆదరా ఆభిమానలు సంపాదిస్తూ.. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ దూసుకెళ్తుంది. ఏ ఇంటికి వెళ్లి ఓటు అడిగినా.. మా ఓటు ఈ సారి నీకే... అంటూ మహిళలు గ్రామాల్లో కుంకమ దిద్ది స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలులు శ్రావణిశ్రీ అభ్యర్థి ఎవరు ఆమె చూడటానికి ఉత్సాహంగా గ్రామాల్లోని ఉన్న వారు సైతం బయటికి వచ్చి ఎంతో అప్వాయతగా పలకరించి కరచనాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనకబడిన కులాల వారు శ్రావణిశ్రీని ఒక్కసారి గెలిపించుకుందామని.. మన భవిష్యత్తుతో పాటు గ్రామాల అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గంలోని ప్రజలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు.