ఆశీర్వదించండి..అండగా ఉంటాను.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..

ఆశీర్వదించండి..అండగా ఉంటాను.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

రానున్న ఎన్నికలలో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని వీరాంజనేయులు కోరారు.

గార్లదిన్నె మండలం కోటంక, మార్తాడు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.

ఇంటింటికీ వెళ్ళి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కావాలంటే  వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ సీఎం గా జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో పొత్తులపై వస్తున్నారన్నారు. జగనన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇంటింటికి చేకూర్చారన్నారు. ప్రజలు ఓటు రూపంలో ఫ్యాన్ కు ఓటు వేసి వైఎస్సార్సీపీ ని గెలిపించుకొని గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

పేదల ఆశాజ్యోతి జగనన్న.. వైఎస్సార్సీపీని గెలిపించండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

పేదల ఆశాజ్యోతి జగనన్న.. వైఎస్సార్సీపీని గెలిపించండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

పేద, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎల్బీ కాలనీ, జన చైతన్య కాలనీలలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.

గడపగడపకు వెళ్లి ప్రజలను ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, సంక్షేమ పాలనపై అరా తీస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగలంటే వైస్సార్సీపీ 'ఫ్యాన్' గుర్తుకు ఓటు వేసి మళ్ళీ సీఎంగా వైఎస్ జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే ఉందని ప్రజలంతా ఆయనను ఆశీర్వదించాలన్నారు. ఎన్నికల కోసం తప్పుడు వాగ్దానాలతో ఇంటింటికి వస్తు ప్రజలని మోసం చేయడానికి టీడీపీ జనసేన కలిసికట్టుగా వస్తున్నారనే విషయం గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇంతకు మించిన సంక్షేమం, అభివృద్ధి ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..

-సీఎం జగనన్నతోనే గ్రామాభివృద్ధి

శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎల్బీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన ప్రారంభించారు.

యం. జి.యన్.ఆర్.ఇ. జి. యస్ క్రింద రూ.20.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమానంగా చూస్తోందని, ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు జోరుగా చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో టీడీపీ పాలనలో చేయని అభివృద్ధిని నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

బుక్కరాయసముద్రం మండలం కేంద్రంలోని జన చైతన్య కాలనీలో ఉన్న మసీదు కాంపౌండ్ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మండల వైఎస్సార్సీపీ నాయకులు ఆలూరు రమణారెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల సొంత నిధులను ముస్లిం పెద్దలకు అందజేశారు.

గత టిడిపి ప్రభుత్వ పాలనలో మసీదు కాంపౌండ్ గోడ నిర్మాణం చేసుకోండి అని చెప్పి నిర్మించిన తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వంత ఖర్చుతో గోడను నిర్మించుకున్నాము అని , గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వచ్చినప్పుడు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడంతో కాంపౌండ్ గోడ ఖర్చు తామే ఇస్తామని మాట ఇచ్చి నేడు మాట నిలుపుకున్నారని ముస్లిం పెద్దలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

తమ కాలనీల్లో అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాలతో పాటు, అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, జగనన్న ఇళ్ల పట్టాలు వంటి పలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇలాంటి పాలన మళ్ళీ రావడం కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని వారు తెలిపారు.

అడిగిన వెంటనే స్పందించి సహాయం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ఆలూరు సాంబశివరెడ్డికి ఆలూరు రమణారెడ్డికి ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి గా కాటప్పగారి రామలింగారెడ్డి నియామకం..

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి గా కాటప్పగారి రామలింగారెడ్డి నియామకం.. 

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని టీడీపీ సీనియర్ నాయకుడు కాటప్పగారి రామలింగారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యనిర్వాహ కార్యదర్శిగా ఎన్నిక చేశారు. కాటప్పగారి రామలింగారెడ్డి గారు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ,రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారికి , జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలిపినారు.

సమిష్టి కృషితోనే విజయ బావుటా.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

సమిష్టి కృషితోనే విజయ బావుటా.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

వైఎస్సార్సీపీ విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమిష్టిగా కృషి చేయాలని  వీరాంజనేయులు కోరారు.

గార్లదిన్నె మండలం బూదేడు, ఎర్రగుంట్ల, ముకుందాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు.

గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి ప్రజలను పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ' ఫ్యాన్' గుర్తుకు ఓటు వేసి మళ్ళీ సీఎం గా వైఎస్ జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించారు.

ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జగనన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పార్టీ బలోపేతానికి ప్రజల అభ్యున్నతికి తోడ్పాటు అవుతానన్నారు. నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అండగా ఉంటానన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమ సారథి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే విధంగా అందరం కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగాలని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ఆప్యాయంగా పలకరిస్తూ.. మద్దతు కోరుతూ..సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పర్యటించారు.

ఆప్యాయంగా పలకరిస్తూ.. మద్దతు కోరుతూ

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని విరుపాక్షి నగర్ , గుజ్జల సరళాదేవి నగర్ లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పర్యటించారు.

ఇంటింటికీ వెళ్ళి మహిళలు, వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీకి ఓటు వేసి మళ్ళీ సీఎం గా జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ... జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మక జగనన్నకే మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి జగనన్న పాలన పై అడుగుతుంటే మునుపెన్నడు లేనివిధంగా సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందుతున్నాయని ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, బ్రిడ్జి ప్రారంభోత్సవం...

◆ రాష్ట్రంలో నిరంతరాయంగా అభివృద్ధి.

◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.

◆ శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, బ్రిడ్జి ప్రారంభోత్సవం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిరంతరాయంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని ఆలూరు సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రం పరిధిలో ఉన్న విరుపాక్షి నగర్ లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, మరియు బ్రిడ్జి ను, గుజ్జలసరళాదేవి నగర్ లో మంచినీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పైపు లైన్ మోటర్ ను వారు ప్రారంభించారు.

దాదాపు రూ.23.00 లక్షలతో సీసీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణం చేశారు మరియు మంచి నీటి సౌకర్యం కోసం దాదాపు రూ.2.50 లక్షల నిధులతో బోర్, పైపు లైన్, మోటార్ లను ఏర్పాటు చేశారు.

వారు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల్లో ధైర్యంగా ప్రజల వద్దకు ధైర్యంగా వెళుతున్నామన్నారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నూతన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నిక అయినా కాటప్పగారి రామలింగారెడ్డి..

నూతన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నిక అయినా కాటప్పగారి రామలింగారెడ్డి..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని టీడీపీ సీనియర్ నాయకుడు కాటప్పగారి రామలింగారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక చేసినా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు,రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారు

సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలి.. రాబోయే రోజుల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి..

సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలి..

రాబోయే రోజుల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి..

సార్వత్రిక ఎన్నికలు - 2024పై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ

అనంతపురం, మార్చి 06 :

సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సార్వత్రిక ఎన్నికలు - 2024పై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో మీడియా పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు. ఎన్నికల కోడ్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని, రానున్న సాధారణ, పార్లమెంట్ ఎన్నికల్లో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలను పాటించేలా మీడియా ప్రధాన భూమిక వహించాలన్నారు. ఎన్నికల్లో జిల్లా యంత్రాంగం, జిల్లా ఎన్నికల అధికారికి, మీడియాకు మధ్య సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సన్నద్ధత, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, అప్డేట్స్, జిల్లా జరిగే పలు విషయాలు, ఇతర అంశాలపై సమాచారం అందించాలన్నారు. ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం తెలియజేయడంలో మీడియా ప్రధానంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో మీడియా పాత్రపై అన్ని రకాల అంశాలను తెలియజేయడం కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పెయిడ్ న్యూస్ కి సంబంధించి ఎన్నికల కమీషన్ నుంచి కొన్ని సూచనలు ఉన్నాయని, ఇందుకోసం ఎంసిఎంసి (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ) ఉంటుందని, నోడల్ అధికారి ఉంటారని, కమిటీ సర్టిఫికేషన్ జరిగిన అనంతరం నిర్ణయించిన డిఐపిఆర్ఓ రేట్స్ కు అనుగుణంగా పెయిడ్ న్యూస్ ప్రచురించాలన్నారు. ఎంసిఎంసికి ఎన్నికల్లో అధికారులకు, నాయకులకు సమాచారం కోసం మీడియా ముఖ్యమైన వారన్నారు. ఎన్నికల వేళ రాబోయే రోజుల్లో మీడియా అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. సోషల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏ చిన్న విషయమైనా ఓటర్లకు వెంటనే చేరువ అవుతుందని, ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరచడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలన్నారు. ఏదైనా వార్తను ప్రచురించే ముందు ఫ్యాక్ట్ చెక్ సరిచూసుకొని ప్రచురించాలని సూచించారు. ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ కాకుండా మీడియా ముఖ్య భూమిక పోషించాలన్నారు. రాజకీయ ప్రకటనలు, సోషల్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్ లు, వాయిస్ మెసేజ్ లు, సినిమా హాల్లో ప్రకటనలు, ఈ పేపర్లు, రేడియోలలో ముందుగా ఎంసిఎంసి ద్వారా సర్టిఫై అయిన తర్వాతనే ప్రచురించాలన్నారు. ఎన్నికల కమీషన్ గైడ్లైన్స్ ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

ఈ సందర్భంగా ఎంసిఎంసి అండ్ పెయిడ్ న్యూస్, ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ యాడ్స్ ఎక్స్పెన్స్, మీడియా & ఎలెక్షన్స్ పర్సెప్షన్ మేనేజ్మెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీడియా సెల్, సాధారణ నిబంధనలు, కమ్యూనికేషన్ స్ట్రాటజీ, తదితర అన్ని రకాల అంశాలపై హ్యాండ్లూమ్స్ అభివృద్ధి అధికారి బసవరాజు శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా.. అలం నరసానాయుడు...నియామకం..

శింగనమల నియోజకవర్గం, మరియు రాష్ట్రంలో  తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్ట పడుతున్న అలం నరసానాయుడు గారిని పార్టీ అధిష్టానం గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా నియమించింది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలం అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం గత 30 సంవత్సరాలు పైగా అలం నరసానాయుడు గారు 

టిడిపి 

మండల పార్టీ అధ్యక్షుని గా, జిల్లా పార్టీ కార్యదర్శి గా 2 సంవత్సరాలు,జిల్లా పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి గా 2 సంవత్సరాలు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా 4 సంవత్సరాలు ,జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా 4 సంవత్సరాలు, అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 3 సంవత్సరాలు,రాష్ట్ర కార్యదర్శి గా 8 సంవత్సరాలుగా, శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులుగా 3 సంవత్సరాలుగా కొనసాగుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కడప, కర్నూల్, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకునిగా పార్టీ కోసం నిత్యం శ్రమిస్తున్న విషయాన్ని గుర్తించి అలాగే గత పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి విజయం కోసం చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా శ్రమించిన తీరును మరియు నియోజకవర్గంలోని సర్పంచుల ఉప ఎన్నికల్లో కష్టపడిన తీరును గుర్తించి ఇలా ఎన్నో విషయాలను పరిగణములోకి తీసుకొని ఈ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు విషయాన్ని తెలుసుకున్న శింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు హర్షాని వ్యక్తం చేస్తున్నారు,

 అలాగే ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా నియమించినందుకు మరింత బాధ్యతతో పార్టీ అభివృద్ధికి నిత్యం కష్టపడుతూ 2024 సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి ని చేయడమే ధ్యేయంగా పని చేస్తానని అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారికి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారికి, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కోవెలమూడి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసారు,