madagoni surendar

Mar 02 2024, 16:56

దుద్దిల్ల శ్రీపాదరావు  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కట్టంగూర్ ఎంపీపీ
దుద్దిల్ల శ్రీపాదరావు  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కట్టంగూర్ ఎంపీపీ నల్గొండ జిల్లా:-
కట్టంగూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఉదయం శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు  జల్లా ముత్తిలింగయ్య ఎంపీపీ  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మందని నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది  ప్రజలకు అనేక సేవలు అందించారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి శ్రీపాద రావు  స్పీకర్ గా తన బాధితులు సక్రమంగా నిర్వహించి శాసనసభ వన్నెతెచ్చినటువంటి మహానుభావుడు శ్రీపాద రావు  వారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్ణయించడానికి ప్రభుత్వం స్వీకారం చుటడం సంతోషకరమని వారి వేడుకల్ని చేయడం చాలా సంతోషమని అని అన్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు  రాష్ట్ర ఐటీ మంత్రి కొనసాగుతూ మందని నియోజకవర్గం నాటి నుండి నేటి వరకు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ రాష్ట్ర దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సూపర్డెంట్ చలపతి, ఏపీఓ రామ్మోహన్,కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 24 2024, 16:56

రేపే నకిరేకల్ లో మెగా జాబ్ మేళా

రేపే నకిరేకల్ లో మెగా జాబ్ మేళా

నియెజకవర్గ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలి

నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహయ సహకారంతో రేపు అనగా 25 /02/2024 (ఆదివారం) రోజున మెగా జాబ్ మేళా ను నకిరేకల్ పట్టణంలోని హైస్కూల్ నందు నిర్వహిస్తుండగా శనివారం నాడు ఎమ్మెల్యే వేముల వీరేశం ఏర్పాటు పరిశిలించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని సుమారుగా యువతి, యువకులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు .. కావున రేపు అభ్యర్థులు వచ్చేటప్పుడు తమ ద్రువప్రతాలు తామ వెంట తెచ్చుకోగలరు. ఉదయం 9.00 గంటలకు ప్రారంభం కావడం జరుగుతుంది. సుమారుగా 60 పైచిలుకు కంపెనీలు ఇందులో పాల్గొంటాయి..కావున నియోజకవర్గ నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని మనవి..

.

madagoni surendar

Feb 24 2024, 13:33

ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర
ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర

ములుగు జిల్లా:-

వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు.

ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది.

సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు.

పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది.

అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.

చివరి రోజు కూడా భక్తుల రద్దీ భారీగా ఉంది.
. . . .

madagoni surendar

Feb 23 2024, 11:47

తెలంగాణకు భారీ వర్షాలు

తెలంగాణకు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది.

రాత్రిపూట చలిగా ఉంటుంది... మధ్యాహ్నం అయితే ఎండ విపరీతంగా కొడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ స్పష్టంగా చేసింది. తెలంగాణలో... వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు తూర్పు తెలంగాణ జిల్లాలో... మోస్తారు వర్షం పేర్కొన్నారు అధికారులు. ఇక హైదరాబాద్లో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య... భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

madagoni surendar

Feb 23 2024, 11:42

రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే మృతి. వరుస ప్రమాదాల నుండి తప్పించుకోలేకపోయిన వైనం

రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే మృతి... వరుస ప్రమాదాల నుండి తప్పించుకోలేకపోయిన వైనం

  

ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయింది. 

మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. 

ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. 

అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది.          

ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది.. 

ఎమ్మెల్యే గా లాస్యకు కలిసి‌రాని‌ కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే.. 

1) లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం 

2) నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెండవసారి‌ ప్రమాదం 

3) ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మూడో సారి గండాన్ని గట్టెక్కలేకపోయిన యువ‌ఎమ్మెల్యే 

ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది.. 

కాసేపట్లో పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం.

madagoni surendar

Feb 21 2024, 14:03

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:-మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:-

మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది... ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు... ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి... క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు...

మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

.

..

.

madagoni surendar

Feb 21 2024, 13:32

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

ఈ నెల 25వ తేదిన ఉదయం 10గంటలకు.. నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం a నకిరేకల్ యువతకు పిలుపునిచ్చారు. మెగా జాబ్ మేళా పోస్టర్ ను నేడు నకిరేకల్ పట్టణంలోని వారి నివాస సముదాయంలో ఆయన విడుదల చేశారు.

.

.

.

.

madagoni surendar

Feb 20 2024, 19:48

సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో జర్నలిస్టు భవన్ ఏర్పాటు చేయాలి

సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో జర్నలిస్టు భవన్ ఏర్పాటు చేయాలి

అన్ని సౌకర్యాలతో కూడిన పక్క భవనాన్ని 500 గజాల స్థలంలో నిర్మించాలి

వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు,హెల్త్ కార్డులు,పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి

రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సూర్యాపేట జిల్లా:-

సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో 500 గజాల స్థలాన్ని కేటాయించి అన్ని సౌకర్యాలతో కూడిన పక్క జర్నలిస్టు భవన్ ను విలేకరుల కోసం ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రెస్ క్లబ్ భవనాలు లేక జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ప్రాంతాలలో విలేకరుల ఆత్మగౌరవ భవనాలుగా గుర్తించి జర్నలిస్టు భవనాలు నిర్మించాలన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్బులు లేక జర్నలిస్టులు హోటల్లో ప్రైవేటు భవనాల మెట్ల కింద చెట్లనీడకు సేద దీరుతున్నారని తమ దయనీయమైన పరిస్థితి చూసి ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడం లేదా ప్రత్యేక ఇండ్లు కట్టి ఇవ్వడం చేయాలని కోరారు.ఎటువంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఉచిత సేవ చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలోనే కొనసాగుతూ ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను గుర్తించి కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.వృత్తిపరంగా పోలీసు వారి నుండి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జర్నలిస్టులకు పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలన్నారు.ఇంతే కాకుండా తాము గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతిరోజు లీటర్ పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు.తమ సమస్యలన్నీ ప్రభుత్వం వెనువెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ దుర్గం బాలు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు,రాష్ట్ర గౌరవ సలహాదారులు మానుకొండ రాము,రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్,ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలకల చిరంజీవి, ఉమ్మడి నల్లగొండ జిల్లా సలహాదారులు అనంతుల శ్రీనివాస్ గౌడ్,సూర్యాపేట పట్టణ కార్యదర్శి తప్సి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

.

.

.

madagoni surendar

Feb 19 2024, 23:37

పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య.

పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కట్టంగూర్ ఎంపీపీ

నల్లగొండ జిల్లా:

(నకిరేకల్ నియోజకవర్గం):- కట్టంగూర్ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కల్ని పరిశీలించిన కట్టంగూర్ జెల్లా ముత్తిలింగయ్య, మరియు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జ్ఞాన ప్రకాష్ రావు, ఏపీవో రామ్మోహన్.అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ వేసవికాలం వస్తున్నందున పకృతి వనాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు పకృతి సంపద ఎంతో ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణకై పకృతి వనాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.పకృతి సంపద ఎంత మెరుగైతే మానవ జీవనానికి ఎంతో ఉపయోగం ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.

.

.

madagoni surendar

Feb 17 2024, 19:53

అక్రిడిటేషన్‌ అనేది రాయితీ కార్డు మాత్రమే* *-జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదు* *-నిజాలు రాసేవారంతా జర్నలిస్టులే*

అక్రిడిటేషన్‌ అనేది రాయితీ కార్డు మాత్రమే

-జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదు

-నిజాలు రాసేవారంతా జర్నలిస్టులే

-చిన్నపెద్ద అనేది సిండికేట్ల సృష్టే

-జర్నలిస్టు ఔనో కాదో తేల్చాల్సింది పత్రిక ఎడిటర్లు మాత్రమే "ఖాకీలు" కాదు.

-డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు:మనసాని కృష్ణారెడ్డి.

హైదరాబాద్:

ఫిబ్రవరి 17 ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియా ప్రజాస్వామ్యానికి కావలిగా ఉండటంలో తనకు మరే వ్యవస్థ సాటిరాదని పలుమార్లు నిరూపించింది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా బాధ్యతలు అనేక రకాలుగా రానురాను విస్తరించాయి. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే క్రమం నుంచి పాత్రికేయ వృత్తి అనేక రంగాలుగా విస్తరించింది. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే క్రమంలో జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందని వారి సౌకర్యార్థం ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణ సౌకర్యంతోపాటు మరి కొన్ని రకాల రాయితీలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అక్రిడిటేషన్‌లు ప్రవేశపెట్టిందని డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి అన్నారు. రానురాను పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించేవారి సంఖ్య ప్రతి యేడు పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ల జారీకి అనేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అదేవిధంగా జర్నలిస్టు సంఘాల కృషితోనో లేక ఓటు బ్యాంకు రాజకీయాలతోనే రానురాను మేం అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించడంతో అక్రిడిటేషన్లకు బాగా గిరాకీ పెరిగింది. కొందరు నాన్‌ జర్నలిస్టులు కూడా డబుల్‌బెడ్‌రూంల ఆశతో అక్రిడిటేషన్లని అంగట్లో కొనుక్కుని రిపోర్టర్లుగా చెలామణీ అవుతున్నారనే ఆరోపణలున్నాయి. అంటే కేవలం బస్‌పాస్‌గా ఉన్న అక్రిడిటేషన్‌ని ఈ పాలకులే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించడంతో అక్రిడిటేషన్‌ యూనివర్సిటి పట్టా కన్నా ఎక్కువగా మారింది. అంటే అక్రిడిటేషన్‌ ఉంటేనే జర్నలిస్టు లేదంటే నకిలీ అనే ప్రచారాన్ని ముమ్మరం చేయడం వెనక కుట్ర ఉంది. తమ మాట వినేవారిని, విననివారిని కూడా తమ దారికి తెచ్చుకోవడానికి అక్రిడిటేషన్‌ అనేది ఓ కంచెలా పనిచేస్తోంది. గొర్రెల మందని ఓ కంచెలో తోలినట్లుగా ఈ అక్రిడిటేషన్‌ అనే కంచెతో జర్నలిస్టులందరినీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలని అటు పాలకులు ఇటు కొందరు జర్నలిస్టు యూనియన్ల ముసుగులో ఉన్న తాబేదార్లు ఇన్నాళ్లూ చేస్తూ వచ్చారు. అయితే రానురాను డిజిటల్‌ మీడియా ప్రాధాన్యత పెరిగి ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో జర్నలిజంలో పోటీ ఏర్పడిరది. ఎక్కడ తమకు ఆదరణ దక్కకుండా పోతుందనో లేక తమ మాట వినకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో కారణంతో అటు పాలకులు, ఇటు కొందరు సిండికేట్‌ జర్నలిస్టులు ఈ క్రమంలో డిజిటల్‌ మీడియా మీద విషం కక్కుతూ వస్తున్నారు. అయితే డిజిటల్‌ మీడియా వేదికలో కొందరు జర్నలిజం ముసుగేసుకున్న వ్యక్తులు జర్నలిజం కట్టుబాట్లను, విలువలను తుంగలో తొక్కి విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తులు, పార్టీల నేతలపై నిత్యం సామాజిక మాధ్యమాల వాడకూడని భాషను వాడుతూ తప్పుడు ప్రచారం చేస్తూ పాత్రికేయ వృత్తికి తీరని మచ్చను తెచ్చిపెడుతున్నారు. ఇలాంటి వ్యవహారాన్ని ఉపేక్షించరాదు. అయితే ఇలాంటి కొందరు సూడో జర్నలిస్టులు చేసే పనికి మొత్తం పాత్రికేయ వృత్తినే అగౌరపరుస్తూ పాలకులు, అధికారుల వ్యవహరించడం తగదు. అక్రిడిటేషన్‌ ఉంటేనే జర్నలిస్టని అక్రిడిటేషన్‌ లేకుండా ఫీల్డ్‌ వర్క్‌ చేసే పాత్రికేయులుపై చర్యలు తీసుకుంటామని కొందరు అధికారులు, ఖాకీలు చెప్పడం విచిత్ర పరిణామమే కాదు పూర్తిగా ఖండిరచాల్సిన వ్యవహారమే. ఓ పత్రికకు లేదా మీడియాకు ఎవరు రిపోర్టర్లుగా ఉండాలనేది నిర్ణయించేది ఆ పత్రిక ఎడిటర్‌ లేక యాజమాన్యమే. అంతే తప్ప మరే వ్యక్తో వ్యవస్థో, అధికారికో జర్నలిస్టులను గుర్తించే హక్కు లేదు. ఎవరు జర్నలిస్టు? ఎవరు నకిలీ? అనే ప్రశ్న వేయాల్సి వస్తే ప్రజాపక్షాన నిజాలు రాసేవారంతా పాత్రికేయులే. సామాజిక స్పృహ ఉండి ప్రజాసమస్యల మీద స్పందించి కలం పట్టి ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి చూపేవారంతా ముమ్మాటికీ నిఖార్సయిన పాత్రికేయులే. ఇలాంటివారికి అక్రిడిటేషన్‌తో సంబంధం లేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు తీసుకుంటే ఎక్కడ తమ రాతల్లో పక్షపాతానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అక్రిడిటేషన్‌కి దరఖాస్తు చేయని ఎందరో గొప్ప పాత్రికేయులు నేటికీ ఉన్నారు. దశాబ్దాలపాటు కలాన్ని నమ్ముకున్ని ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తూ సొంత మీడియాలు ఏర్పాటు చేసుకున్న సీనియర్‌ పాత్రికేయులు ఎందరికో నేటికీ అక్రిడిటేషన్లు లేవు. అంటే వీరందరికి అక్రిడిటేషన్లు లేవు కావున వీరంతా జర్నలిస్టులు కాదని, వారంతా నకిలీ విలేకర్లని కొందరు చెప్పడం నిజంగా సిగ్గు చేటు. ఇలాంటి ప్రకటనలు ఇస్తున్న అధికారులు, పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జర్నలిస్టు కావడానికి చదువుతోపాటు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. కేవలం నిజాయితీ, నిబద్ధత, సామాజిక స్పృహ ఉన్నవారంతా కలం యోధులే. వేదికలు చిన్నవా పెద్దవా? అనే తేడానే లేదు. వృత్తి ధర్మంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన రాయితీనే అక్రిడిటేషన్‌. అక్రిడిటేషన్‌కు ఇంతకు మించి విలువ లేదు. అంతకన్నా చెల్లుబాటు లేదు. అయితే కొందరు అధికారులు అక్రిడిటేషన్‌ అంటే జర్నలిజం పట్టాగా పేర్కొంటూ రాజ్యాంగ స్ఫూర్తిని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఇలాంటి పోకడ ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలో పడేసే వ్యవహారంగా ఉన్నది. జర్నలిజం ముసుగులో రాజకీయాలు నెరిపే వ్యవహారంతో నిజంగా నిఖార్సయిన జర్నలిజానికి ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడ్డాయి.

.

.

.