విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు సాంబశివా రెడ్డి...

విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు సాంబశివా రెడ్డి.

కృష్ణా జిల్లా పామర్రులో విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివా రెడ్డి , పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.

దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేసింది.

పల్స్ పోలియో నిర్వహణపై అవగాహన శిక్షణ కార్యక్రమం

పల్స్ పోలియో నిర్వహణపై అవగాహన శిక్షణ కార్యక్రమం, బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రo వైద్య అధికారి డాక్టర్ స్వాతి లక్ష్మీ గారు మరియు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం శోభ రాణి గారి ఆధ్వర్యంలో మార్చి మూడవ తేదీన జరుగు పల్స్ పోలియో కార్యక్రమం పై శిక్షణ నిర్వహించడం జరిగింది . వైద్య అధికారి మాట్లాడుతూ బుక్కరాయసముద్రం ఆరోగ్య కేంద్ర పరిధిలో గల 38 బూత్ లలో గల సభ్యులకు, మరియు బుక్కరాయసముద్రం బస్టాండులో ట్రాన్సిస్టర్ పాయింట్ సభ్యులకు, మొబైల్ టీం సభ్యులకు పల్స్ పోలియో నిర్వహణ పైన అవగాహన శిక్షణ కార్యక్రమం ఎంపీడీవో కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది, ఐదు సంవత్సరముల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని బుక్కరాయసముద్రం ఆరోగ్య కేంద్రం పరిధి నందు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరముల పిల్లలు 4213 ఉన్నారని వారందరికీ మార్చి 3 తేదీనే 100% పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు, అలాగే మార్చి 4వ తారీఖు, మార్చి 5వ తేదీన ఇంటింటికి వెళ్లి ఆదివారం రోజు చుక్కలు వేయించుకొని పిల్లలను గుర్తించి పల్స్ పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మూడు రూట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, రూట్ సూపర్వైజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు, అలాగే ఒక మొబైల్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు, మార్చి మూడో తారీఖున ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించి సాయంత్రం ఐదు గంటల వరకు పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు, పిహెచ్ఎన్ చెన్నమ్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి, సత్యనారాయణ శాస్త్రి, జానీ రాజ్, రూట్ సూపర్వైజర్లు శివానంద, నాగరాజు, మరియు హెల్త్ అసిస్టెంట్లు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు వాలంటరీ వర్కర్లు ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పథకాలు కొనసాగాలంటే.. జగనన్న మళ్లీ రావాలి.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్యయకర్త ఎం. వీరంజనేయులు

రాష్ట్రంలో పేదలకు మేలు జరగాలన్నా..మరోసారి పెద్దఎత్తున సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా...అభివృద్ధి పనులన్నీ ముందుకు సాగాలన్నా.. మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు మనమంతా అండగా నిలవాలని సమన్వయకర్త ఎం. వీరంజనేయులు అన్నారు.

శింగనమల మండలం నిదనవాడ, గ్రామంలో ఆయన పర్యటించారు.

గ్రామంలో ప్రజలను పలకరిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించారు. రానున్న ఎన్నికలలో మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి తనను గెలిపించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ... జగనన్న ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసి చూపించారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ప్రతి ఒక్కరూ చూశారని గుర్తు చేశారు.

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు తన పాలనలో సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలు గుర్తించాలని కోరారు. బాబు మోసపు మాటలు, హామీలను నమ్మి మరోసారి మోసపోవద్దని హితవు పలికారు. జగనన్న చెప్పిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. జరగబోయే ఎన్నికలలో మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పాలనను మరోసారి గెలిపించుకుందాం.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.. మెజారిటీతో గెలిపించండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

సంక్షేమ పాలనను మరోసారి గెలిపించుకుందాం.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.. మెజారిటీతో గెలిపించండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

ఇచ్చిన మాట తప్పకుండా, హామీలన్నీ నెరవేర్చిన జగనన్న సంక్షేమ పాలనను రాబోయే ఎన్నికలలో మరోసారి గెలిపించుకుందామని ఎం. వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండలం తరిమెల, కల్లుమడి గ్రామాల్లో ఆయన పర్యటించారు.

వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరిస్తూ, రాబోయే ఎన్నికలలో తనను మెజారిటీతో గెలిపించాలని, కలసికట్టుగా వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని కోరారు.

జగనన్న ప్రభుత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు ఏకమై దుష్ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని తిప్పి కొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన మేలుని ప్రజలకు వివరించాలన్నారు.

గత టిడిపి పరిపాలనలో చేయలేని పనులను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగనన్న దీవెనలతో నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని ప్రజలందరి ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం మండలంలో అట్టహాసంగా జగనన్న పాల వెలువ ప్రారంభ కార్యక్రమం

బుక్కరాయసముద్రం మండలంలో అట్టహాసంగా జగనన్న పాల వెలువ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కేతన్ కార్గ్ గారు ఎంపీపీ దాసరి సునీత గారు బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామం నందు పాలవెల్లువా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కేతన్ కార్గ్ గారు ఎంపీపీ దాసరి సునీత గారు    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న పాలు వెలువ కింద పాల సేకరణను వేగవంతం చేయాలని కోరారు పాల ఉత్పత్తిదారులకు ప్రామాణికమైన ధరలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి గారు యు ఆర్ డి దామోదరమ్మ గారు వెటర్నరీ డాక్టర్ పెద్దన్న గారు వైస్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నాయకులు రాధా మనోహర్ రెడ్డి గారు బుల్లి నారాయణస్వామి గారు పాల ఉత్పత్తిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

గొల్లపల్లి గ్రామం పెద్దమ్మ స్వామి గుడికి 10,000/- రూ.లు విరాళం అందజేసిన..టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడుగారు..

నార్పల మండలం గొల్లపల్లి గ్రామం పెద్దమ్మ స్వామి గుడికి 10,000/- పదివేల రూపాయలు విరాళం అందజేసిన పేదల పాలిటి పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడుగారు..

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆలం నరసానాయుడు గారు ఆలయ నిర్మాణానికి సహాయం చేయడం ఆయన మంచితనానికి,సేవా భావానికి నిదర్శనమని తెలియజేస్తూ,వారికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు దునుంజయ,గొల్లపల్లి sc కాలనీ వాసులు,తదితరులు పాల్గొన్నారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రంలో సిబ్బంది వీడ్కోల సభ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రంలో సిబ్బంది వీడ్కోల సభనిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వైద్యాధికారులు డాక్టర్ స్వాతి లక్ష్మి గారు, డాక్టర్ తహీరున్నిసా గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దండువారిపల్లి హెల్త్ వెల్నెస్ సెంటర్ నందు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ గా పనిచేయుచున్న కుమారి భవాని గారు , స్టాఫ్ నర్స్ ఉద్యోగం కర్నూలు జిల్లాలో వచ్చిన సందర్భముగా ప్రస్తుతం పని చేయుచున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిన సందర్భంగా సిబ్బంది ఈరోజు వీడ్కోల సభ ఏర్పాటు చేసి సన్మానం చేయడం జరిగింది, అలాగే ప్రతి శుక్రవారం రోజు గర్భవతులకు అన్నదానం చేయుచున్న చిప్పల చంద్రశేఖర్ , అనిత దంపతులను కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఆర్డిటిలో పనిచేయుచున్న చిరు ఉద్యోగి అయినా చంద్రశేఖర్ గారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి శుక్రవారం రోజు 70 నుంచి 100 మంది గర్భవతులకు ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేయుచున్నారు వారిని కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు, పి హెచ్ ఎన్ చెన్నమ్మ గారు, ఫార్మసిస్ట్ మహబూబ్ బాషా, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, హెల్త్ అసిస్టెంట్ లో ధనుంజయ, నాగరాజు శివ నంద, ఆనంద, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ యామిని జ్యోతి, జయంతి, ధనలక్ష్మి, మంజు భార్గవి, మణి ,శ్రీ కీర్తి, గౌతమి, శ్రీజ, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు వరలక్ష్మి, బుజ్జమ్మ ,ఆదిలక్ష్మి, నాగేంద్రమ్మ, లక్ష్మీదేవి, అటెండర్ శివరాజ్, హోమియోపతి అటెండర్ కిషోర్ కుమార్, ఎఫ్ ఎన్ ఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

పెద్దమ్మ స్వామి గుడి నిర్మాణం కోసం దుర్గం గ్రామస్తులైన కురుబ గురు ప్రసాద్ 30 వేల రూపాయల విరాళం

సింగనమల నియోజకవర్గం నార్పల మండలం గొల్లపల్లి గ్రామం ఎస్సీ కాలనీ నందు పెద్దమ్మ స్వామి గుడి నిర్మాణం కోసం దుర్గం గ్రామస్తులైన కురుబ గురు ప్రసాద్ 30 వేల రూపాయల విరాళం సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు కలసి గొల్లపల్లి గ్రామస్తులకు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణ దొడ్డి పెద్దన్న మసాల కాటమయ్య పెద్ద గంగన్న రామకృష్ణ పాల్గోన్నారు. కాలనివాసులు చేసిన సహయానికి కృతజ్ఞతలు తెలిపారు

నార్పల కలను సాకారం చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. జగనన్న అండతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి, హామీని నెరవేర్చని గత పాలకులు.. ఎమ్మెల్యే

రూ.2.50 కోట్ల వ్యయంతో కూతలేరు బ్రిడ్జిను ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

◆ పాల్గొన్న శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయ కర్త ఎం. వీరాంజనేయులు..

గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు చేయని పనిని చేసి చూపించి నార్పల మండల ప్రజల కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

నార్పల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కూతలేరు బ్రిడ్జ్ ను ఆమె ప్రారంభించారు.

గత పాలకులు కూతలేరు బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాజీ లయ్యారన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్మావతి నార్పల మండల ప్రజలకు కూతలేరు బ్రిడ్జిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నేడు నెరవేర్చారు. మాట తప్పని మడమ తిప్పని సీఎం జగనన్న ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నార్పల మండల ప్రజలకు ఇచ్చిన హామీనీ నేడు సగర్వంగా నెరవేర్చుకున్నారు. 

నాడు కాంగ్రెస్ పార్టీ, నిన్న తెలుగుదేశం పార్టీ కూతలేరు బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీనే నెరవేర్చకుండా కాలయాపన చేసి వెళ్లిపోయారు. ఇచ్చిన హామీనే తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత పద్మావతికే దక్కుతుంది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నికలకు ముందు కూతలేరు బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికలకు వస్తామని చెప్పిన విధంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామన్నారు.

బ్రిడ్జి నిర్మాణానికి అనేక ఆటంకాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం వాటిని లెక్కచేయకుండా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి మాట ఇస్తే తప్పని ప్రభుత్వం వైఎస్సార్సీపీ అని రుజువు చేశామన్నారు.

శింగనమల చెరువు లోకలైజేషన్, నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జగనన్న పాలనలో చేసి చూపించామన్నారు. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొని ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు నుంచి అభివృద్ధి వరకు కార్యక్రమాలు ఎక్కడా నిలపకుండా పూర్తి చేశామన్నారు. ప్రజలందరూ జగనన్న వెంట ఉన్నారని తెలియడానికి 'సిద్ధం సభ' కు వచ్చిన ప్రజలే నిదర్శనమన్నారు.

రాబోయే ఎన్నికలలో మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేస్తే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ప్రజలకు దగ్గరగా ఉంటామన్నారు.

కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల పాలనలో పాలించిన నాయకులు ఎవరూ నెరవేర్చని కూతలేరు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి నార్పల ప్రజల కష్టాలను, మరియు ఈ బ్రిడ్జి పై అనేక గ్రామాలకు వెళ్ళటాని సులువుగా చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పరవశించిన భక్తజనం.. కొండమీదరాయుని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సుప్రసిద్ధమైన కొండమీదరాయుని రథోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కొండమీదరాయునికి శ్రీదేవి, భూదేవితో కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. సూర్యప్రభ వాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో ఉరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. రథం ముందు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ పూజా కార్యక్రమంలో జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల వైస్సార్సీపీ సమన్యయకర్త ఎం. వీరాంజనేయులు,పెనుకొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం పార్లమెంట్ సమన్యయకర్త ఎం. శంకర్ నారాయణ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మధ్యాహ్నం రథోత్సవం ప్రారంభమైంది. భక్తులు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నుంచి పాత పంచాయతీ కార్యాలయం వరకు లాగారు. తిరిగి సాయంత్రం బ్రాహ్మణ వీధి, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. ఈ రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులతో గ్రామ పురవీధులు నిండిపోయాయి. స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. దేవరకొండ పైకి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోవిందనామ స్మరణతో భక్తజనం పులకించి పోయింది.