సంక్షేమ పాలనను మరోసారి గెలిపించుకుందాం: సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..

సంక్షేమ పాలనను మరోసారి గెలిపించుకుందాం: సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నను రాబోయే ఎన్నికలలో మరోసారి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకుందామని శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు కోరారు.

శింగనమల మండలం ఆకులేడు, చిన్న జలాలపురం, నాగులగడ్డం, గురుగుంట్ల, లోలూరు, మదిరేపల్లి, గ్రామాల్లో ఆయన పర్యటించారు.

గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరిస్తూ, ముఖ్యమంత్రి జగనన్న దీవెనలతో శింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని, మీ అందరి సహాయ సహకారాలతో పార్టీ బలోపేతానికి పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, రాబోయే ఎన్నికలలో మెజార్టీతో గెలిపించాలని వారిని కోరారు.

ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి పాలన జరుగుతోందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల ద్వారా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇప్పటికే అందజేశారన్నారు. ఇలాంటి పరిపాలన మళ్లీ కొనసాగాలి అంటే రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్నారు. శింగనమల నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తానని, రాబోయే ఎన్నికలలో మెజార్టీతో గెలిపించాలని వీరాంజనేయులు కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభ్యున్నతికి జగనన్న కృషి.. ప్రభుత్వ విద్యా సలహా దారులు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త శంకర్ నారాయణ

మహిళల అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆలూరు సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు అన్నారు.

నార్పల మండల కేంద్రంలోని సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు " వై. యస్. ఆర్ ఆసరా" నాలుగవ విడత లబ్ది చెక్కు పంపిణీ పండుగలా సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త శంకర్ నారాయణ హాజరయ్యారు.

 

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. 2019 ఎన్నికల ముందు జగనన్న ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీ చేసారని గుర్తు చేశారు. మండలంలో ఆసరా ద్వారా 9.51 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ నుంచిఅయ్యాయన్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 1,058 సంఘాలకు దాదాపు రూ.38.14 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా క్రింద అందించినట్లు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వీరాంజనేయులును జగనన్న సమన్వయకర్తగా నియమించారని, రాబోయే ఎన్నికలలో గెలిపించాలని కోరారు.

శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయం సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న హామీలన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించారని చెప్పారు.  

వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదర్శంగా నిలిచారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేశారన్నారు.  

అనంతరం మహిళా సంఘాలకు చెక్కు పంపిణీ చేసి, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

వలంటీర్ల సేవలు అమూల్యం

సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలతో ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలు అందుతుండటమే గాకుండా అవినీతి రహిత పాలన అందించడం జరుగుతోందని ఆలూరు సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు, శంకర్ నారాయణ తెలిపారు.

మండల కేంద్రంలో సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు.

వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం సేవా పురస్కారాల కింద వలంటీర్ జి. రాజుకు సేవా వజ్రకు రూ.

45 వేలు, 5 మందికి సేవా రత్న క్రింద రూ.25 వేలు, 272 మంది సేవా మిత్ర క్రింద రూ.10 వేలు చెప్పున ఒక్కొక్కరికి ప్రోత్సాహక బహుమతిని అందజేయడంతో పాటు వాలంటీర్లకు బ్యాడ్జ్ అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాలంటీర్ల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు సేవలందిస్తున్నారని, సంక్షేమ పథకాలను అర్హులైన, లబ్ధిదారుల ఇళ్ళకే చేరుస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు వివరించాలన్నారు.

జగనన్న పరిపాలనలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావటం ఎంతో సంతోషంగా ఉందని, సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి వద్దకే చేరువ చేయడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వాలంటీర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు, మహిళా సంఘాలు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బుక్కరాయసముద్రం మండల ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు

రాప్తాడు మండల కేంద్రంలో ఈనెల 18న జరిగిన సిద్ధం కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ కృష్ణ సీఎం సమావేశం జరుగుతున్న తరుణంలో ఫోటోలు తీస్తూ ఉండగా కొందరు రౌడీ మూకలు వివక్షరహితంగా బట్టలను చింపుతూ, కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ దాడి చేయడం జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఫోటోగ్రాఫర్ కృష్ణ. దాడి చేసిన రౌడీ మూకలను కఠినంగా శిక్షించాలని, ఈమధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు అధికంగా జరుగుతున్నాయి కనుక అలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కృష్ణ పై దాడి చేసిన వారిపై అత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేసిన బుక్కరాయసముద్రం మండల జర్నలిస్టు..

జగన్ రెడ్డి సిద్ధం సభలో జర్నలిస్ట్ కృష్ణ పై దాడి బాధాకరం శోచనీయం రౌడీ మూకల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా సమావేశంలో వెల్లడి

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసిపి సిద్ధం సభలో వైసిపి మూకలు ఏ బీ ఎన్ ఫోటో గ్రాఫర్ కృష్ణ పై విచక్షణ రహితంగా దాడి  చేయడము బాధాకరం సాక్షాత్తు సీఎం సమక్షంలోనే ఫోటో కవరేజ్ చేయడానికి వెళ్లిన కృష్ణా పై దాడి చేయడం అంటే రాష్ట్రంలోశాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఏబీఎన్ విలేకర్ కృష్ణ పావని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు గారు, పరిటాల సునీత గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పయ్యావుల కేశవ్ గారు, ప్రభాకర్ చౌదరి గారు, పార్థసారధి గారు, రాష్ట్ర కార్యదర్శి ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు,గారు, శ్రీధర్ చౌదరి గారు, తలారి ఆదినారాయణ గారు, గంజి నాగరాజు గారు,

ఈ సందర్బంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జిల్లా నాయకులు మాట్లాడుతూ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న రాప్తాడు బహిరంగ సభ లో ఆంధ్రజ్యోతి పత్రికా ఫోటోగ్రాఫర్ పై..కొందరు వైసీపీ రౌడీ మూకలు అమానుషంగా దాడి చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. పట్టపగలు ఇంత దారుణమైన సంఘటన తన సభలో జరిగితే, ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఖండ్డిచరా ? దీని ద్వారా ఎటువంటి సంకేతం పంపదలిచారు? ఆ ఫోటోగ్రాఫర్ చేసిన నేరమేమిటో జగన్ చెప్పగలరా? రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యం గా చేస్తారా? మిమ్మల్ని ప్రశ్నించే వారు లేరనే దురంహ కారమా?18.02.2024. రాప్తాడు నియోజకవర్గం లో నిర్వహించిన సిద్ధం సభపై అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం అయినది సిద్ధం సభ చంద్రబాబు నాయుడు గారిని ఇతర ప్రతిపక్ష నాయకులను దూషించడానికి సొంత డబ్బు కొట్టుకోవడానికి నిర్వహించారు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని దాడి ఘటన పై మీడియా మిత్రులు తెదేపా జనషేన వామపక్ష నాయకుల తో కలసి జిల్లా పోలీస్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేసి జిల్లా ఎస్పీ గారిని కలిసి దాడి పై చర్చించి వైసీపీ రౌడీ మూకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది

 తక్షణం ముఖ్యమంత్రి నోరువిప్పి జరిగినదానికి క్షమాపణ కోరాలి. దాడికి పాల్పడిన రౌడీ మూకల్ని చట్టప్రకారం శిక్షించాలి...

పార్టీ కార్యకర్తలకు నివాళులు అర్పించిన ఆలూరు సాంబశివారెడ్డి..

పార్టీ కార్యకర్తలకు నివాళులు అర్పించిన ఆలూరు సాంబశివారెడ్డి.

గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పి. వెంకటరెడ్డి(84) అనారోగ్యంతో అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు.

మండల పరిధిలోని కేశవాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కె. ప్రతాప్ రెడ్డి (67) అనారోగ్యంతో మృతి చెందారు.

ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వీరి స్వగృహాలను సందర్శించి మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకి భరోసా కల్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వాలంటీర్ల సేవలు అభినందనీయం..సచివాలయాలతోనే గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆలూరు సాంబ శివారెడ్డి, బోయ గిరిజమ్మ, ఎం. వీరాంజనేయులు

సచివాలయాలతోనే గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం 

◆ ఆలూరు సాంబ శివారెడ్డి, బోయ గిరిజమ్మ మరియు 

 ఎం. వీరాంజనేయులు

రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థతో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండల పరిధిలోని ఈస్ట్ నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డా. వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వ్యవసాయ గోదాము భవనాలను మరియు సలకంచెర్వులో గ్రామ సచివాలయాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత ప్రారంభించారు.

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. సచివాలయాల ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.  

వాలంటీర్ల సేవలు అభినందనీయం

వాలంటీర్ల సేవలను ఆలూరు సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు, బోయ గిరిజమ్మ అభినందించారు. ఈ కార్యక్రమానికి వీరు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

శింగనమల మండల కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ వాలంటీర్లుగా ఎంపికైన వారికి, నగదు బహుమతి, బ్యాడ్జ్ అందజేసి శాలువాతో సత్కరించారు.

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ సేవలను గుర్తించిన జగనన్న భవిష్యత్తులో వారికి మరింత మేలు చేకూరుస్తారని చెప్పారు. గత టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తే జగనన్న ప్రభుత్వంలో నేరుగా వాలంటీర్ వ్యవస్థతో ఇంటి దగ్గరికే సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. సంక్షేమ పాలన ఇంటి వద్దకు రావాలంటే మరోసారి ముఖ్యమంత్రి జగనన్నను చేసుకుందామన్నారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

వాలంటీర్ల వ్యవస్థ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మరోసారి ప్రజలని మోసం చేయడానికి ఎన్నికల సమయంలో వస్తున్న ప్రతిపక్షాలని తిప్పికొడదామని జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్న చేపల రమణా వారి బృందం

అనంతపురం బుక్కరాయసముద్రం మండలం వైసిపి జిల్లా స్థాయి నాయకులు జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి చేపల రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

గ్రామానికి తీరిన దాహార్తికి రూ. 50.91 లక్షలు నిధులతో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి,..

గ్రామానికి తీరిన దాహార్తికి రూ. 50.91 లక్షలు నిధులతో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

తాగునీటి అవస్థలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజల కష్టాలను తీరుస్తున్నట్లు ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును సాంబ శివారెడ్డి మరియు ఎం. వీరాంజనేయులు ప్రారంభించారు.

ప్రజల దాహార్తి కోసం జలజీవన్ మిషన్ పథకం క్రింద దాదాపు రూ.50.91 లక్షల నిధులతో వాటర్ ట్యాంకు మరియు పైపు లైన్ నిర్మాణం చేశారు.

గ్రామంలోని అన్ని కుటుంబాలకు కొళాయి కనెక్షన్‌ ఇవ్వడం స్థానిక తాగునీటి వనరుల లభ్యత, సమస్యను అధిగమించడం ప్రస్తుత్తం ఉన్న తాగునీటి పంపిణీ వ్యవస్థ నుంచి మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో గ్రామాల్లో నీటి సమస్య లేకుండా ఇంటింటికీ పైపు లైన్ ద్వారా కొళాయి అందించి నీటి సమస్య లేకుండా చేస్తున్నారన్నారని సాంబ శివారెడ్డి అన్నారు.

కిలోమీటరు దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. రోజూ అవస్థలు తప్పేవి కావు. ప్రస్తుతం జలజీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించారు. ఇంటిముందే కొళాయి ఏర్పాటు చేయడంతో గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వచ్ఛమైన నీరు అందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ శ్రీ మహంకాళీ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జంతులూరు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మహంకాళీ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు హాజరయ్యారు.  

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ కొండమీద వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవ, రథోత్సవ కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే దంపతులను ఆహ్వానించిన ఆలయ కమిటీ

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీశ్రీశ్రీ కొండమీద వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవ, రథోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించిన ఆలయ కమిటీ. అనంతపురంలోని ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి ఆహ్వాన పత్రికను రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాకే రమేష్ బాబు, అర్చకులు చాగంటి లక్ష్మణా చార్యులు, వైద్యం శ్రీనాథ్ అందజేశారు. 

బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సాంబ శివారెడ్డి సూచించారు.

అనంతరం ఆలయ సిబ్బంది, అర్చకులు సాంబశివారెడ్డిని, వైఎస్ఆర్సీపీ నాయకులు రమణారెడ్డిని శాలువాతో సన్మానించారు.