ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్న చేపల రమణా వారి బృందం

అనంతపురం బుక్కరాయసముద్రం మండలం వైసిపి జిల్లా స్థాయి నాయకులు జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి చేపల రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

గ్రామానికి తీరిన దాహార్తికి రూ. 50.91 లక్షలు నిధులతో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి,..

గ్రామానికి తీరిన దాహార్తికి రూ. 50.91 లక్షలు నిధులతో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

తాగునీటి అవస్థలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజల కష్టాలను తీరుస్తున్నట్లు ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును సాంబ శివారెడ్డి మరియు ఎం. వీరాంజనేయులు ప్రారంభించారు.

ప్రజల దాహార్తి కోసం జలజీవన్ మిషన్ పథకం క్రింద దాదాపు రూ.50.91 లక్షల నిధులతో వాటర్ ట్యాంకు మరియు పైపు లైన్ నిర్మాణం చేశారు.

గ్రామంలోని అన్ని కుటుంబాలకు కొళాయి కనెక్షన్‌ ఇవ్వడం స్థానిక తాగునీటి వనరుల లభ్యత, సమస్యను అధిగమించడం ప్రస్తుత్తం ఉన్న తాగునీటి పంపిణీ వ్యవస్థ నుంచి మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో గ్రామాల్లో నీటి సమస్య లేకుండా ఇంటింటికీ పైపు లైన్ ద్వారా కొళాయి అందించి నీటి సమస్య లేకుండా చేస్తున్నారన్నారని సాంబ శివారెడ్డి అన్నారు.

కిలోమీటరు దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. రోజూ అవస్థలు తప్పేవి కావు. ప్రస్తుతం జలజీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించారు. ఇంటిముందే కొళాయి ఏర్పాటు చేయడంతో గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వచ్ఛమైన నీరు అందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ శ్రీ మహంకాళీ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జంతులూరు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మహంకాళీ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు హాజరయ్యారు.  

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ కొండమీద వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవ, రథోత్సవ కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే దంపతులను ఆహ్వానించిన ఆలయ కమిటీ

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీశ్రీశ్రీ కొండమీద వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవ, రథోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించిన ఆలయ కమిటీ. అనంతపురంలోని ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి ఆహ్వాన పత్రికను రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాకే రమేష్ బాబు, అర్చకులు చాగంటి లక్ష్మణా చార్యులు, వైద్యం శ్రీనాథ్ అందజేశారు. 

బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సాంబ శివారెడ్డి సూచించారు.

అనంతరం ఆలయ సిబ్బంది, అర్చకులు సాంబశివారెడ్డిని, వైఎస్ఆర్సీపీ నాయకులు రమణారెడ్డిని శాలువాతో సన్మానించారు.

ఆసరాతో అక్కా చెల్లెమ్మలకు భరోసా.. జగనన్న బలం మహిళలే రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

మహిళలు ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నాడే అన్ని రంగాల్లో ముందంజ వేయగలుగుతారని ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకే అందించడం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.

శింగనమల మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో "వై.యస్.ఆర్ ఆసరా" నాలుగవ విడత లబ్ధి కార్యక్రమాన్ని సాంబశివారెడ్డి మరియు వీరాంజనేయులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతల ఆశీర్వాదం ఉంటుందని పెద్దలు చెబుతుంటారని, గతంలో వైయస్సార్, ప్రస్తుతం జగనన్న ముఖ్యమంత్రి కావడానికి అక్కచెల్లెమ్మలే కారణమన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి పాదయాత్రలో మహిళల కోరిక మేరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన జగనన్న అధికారంలోకి వచ్చాక దశల వారీగా నాలుగు విడతల్లో రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నెరవేర్చారని ప్రశంసించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వై.యస్.ఆర్. ఆసరా క్రింద 4,835 సంఘాలకు నాలుగు విడతల్లో మహిళలకు దాదాపు రూ.169.88 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. అలాగే వై. యస్. ఆర్. సున్నా వడ్డీ పథకం క్రింద నియోజకవర్గ వ్యాప్తంగా 6,047 సంఘాలకు దాదాపు రూ.41.82 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. జగనన్న ఆశీస్సులతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వీరాంజ నేయులును ఆశీర్వదించాలని కోరారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. కుల,మత పార్టీలకతీతంగా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తున్నారన్నారు. గత టిడిపి పాలనలో ఇచ్చిన మాట తప్పితే నేడు జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. ఐదేళ్ల పరిపాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. మండల వ్యాప్తంగా నాలుగవ విడత వైయస్సార్ ఆసరా పథకం కింద 630 సంఘాలకు దాదాపు రూ. 21.70 కోట్లు, వైయస్సార్ ' 0' వడ్డీ పథకం ద్వారా 844 సంఘాలకు దాదాపు రూ.5.39 కోట్లు లబ్ధిచేకూరిందన్నారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.

అనంతరం రూ.5.45 కోట్లు చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు కలసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

జగనన్న చేసిన మేలుని ఓట్ల రూపంలో చూపించి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని మహిళలు హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

నారా భువనేశ్వరి చేతుల మీదుగా నామకరణం..

నారా భువనేశ్వరి చేతుల మీదుగా నామకరణం..

అనంతపురం జిల్లా శింగనమల నియోజక వర్గం బుక్కరాయశముద్రం మండల ఐటీడీపి అధ్యక్షుడు హేమంత్ యాదవ్ గారికి నారా లోకేష్ జన్మదినం రోజున జనవరి 23న బాబు జన్మించాడు అందుకని నారా భువనేశ్వరి అమ్మ గారు చేతుల మీదుగా కుషాల్ క్రిష్ణ గా నామ కరణం చేయడం జరిగింది.

వైఎస్ఆర్సీపీ ని ఆదరించండి.. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటాను.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

వైఎస్ఆర్సీపీ ని ఆదరించండి.. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటాను.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గంలో వైయస్సార్సీపీని ఆదరించాలని నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండలంలోని పెరవళి, జూలాకాలువ, జలాలపురం, కొరివిపల్లి, సలకంచెరువు, సోదనపల్లి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి పర్యటించారు.

గ్రామాల్లోని నాయకులు ఇళ్లకు వెళ్లి పలకరించారు. పార్టీ బలోపేతానికి కలసికట్టుగా పని చేద్దామని, మీ అందరికి అందుబాటులో ఉంటానని, గెలిపించాలని కోరారు.

గ్రామాల్లోని ప్రజలతో, అవ్వ, తాతలను పలకరిస్తూ, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లోనే జగనన్న పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలను నాడు- నేడు క్రింద ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. జాతీయస్థాయిలో మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రతిభ చాటే విధంగా తీర్చిదిద్దుతున్న ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు.

రాబోయే కాలంలో పేద పిల్లలు ఉన్నత చదువులు చదివి వారి కుటుంబాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చి పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. ఆనాడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థుల జీవితాలు మార్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్

ప్రవేశపెట్టి ఎంతోమంది పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారని, అలాగే ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించి పేదలకు రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు. తండ్రి బాటలో నడుస్తూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి మళ్లీ రావాలి అంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి, వైఎస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలికిన శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు

ఈనెల 18న రాప్తాడులో జగనన్న సిద్ధం సభ జరుగుతున్న నేపథ్యంలో, ఏర్పాట్లు ను పరిశీలించడానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలికిన శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు.

అనంతరం సభా స్థలాన్ని పరిశీలించారు.

బొలెరో వాహనం, సిమెంటు లారీని ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి...
అర్ధరాత్రి సోమవారం ఒంటిగంటలో ఇరిగేపల్లి హైవే దగ్గర బొలెరో వాహనం, సిమెంటు లారీని ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. బొలెరో వాహనంలో రొల్ల మండలం దాసప్పన పాల్యం గ్రామానికి చెందిన 3 గ్రామస్తులు సిరాలో జరుగు పెండ్లికి పోవుచుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.
తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్..
తిరుమల : తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్.. తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ గంధం వనం వద్ద ఏనుగుల గుంపు వచ్చాయి. శ్రీ గంధం వనం వద్ద ఏర్పాటు చేసిన భారీ కంచెలను ధ్వంసం చేశాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు వచ్చిందన్న సమాచారంతో టిటిడి అటవీ శాఖా అధికారులు ఘటనా స్థలంకు చేరుకున్నారు. ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నించారు. అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టారు. వేసవి ప్రారంభం కాకముందే నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతంను వదిలి బయటకు వచ్చినట్లు టిటిడి అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.