madagoni surendar

Feb 06 2024, 12:51

భారత్‌ రైస్‌' ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

డిల్లీ :-భరత్ రైస్ ' ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. 'భారత్‌ రైస్‌' (భారత్ రైస్ ) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

₹29కే కేజీ భారత్‌ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ (ఫ్ సి ఐ) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(యన్ ఏ ఫ్ ఇ డి ), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (యన్ సీసీఫ్ ), కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు.ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్‌ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

madagoni surendar

Feb 06 2024, 11:34

నివాళులుఅర్పించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్

నివాళులుఅర్పించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట,కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ నరసింహ్మ యాదవ్

నల్గొండ జిల్లా :-నకిరేకల్ మండల పాలెం గ్రామానికి చెందిన నోముల యాదగిరి మృతిచెందంగా వారి మృతదేవానికి పూలమాలలు వేసి నివాళులుర్పించి అనంతరం.కుటుంబ సభ్యులను పరామర్శించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్, కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,

madagoni surendar

Feb 05 2024, 19:39

సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్

హైదరాబాద్ :--సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్

నేను ఒకటే చెప్తాన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విస్మరించిన బిఆర్ఎస్ నాయకులను.కానీ వేరే పార్టీ నాయకుడు వారు ఎమ్మెల్యే అయినా ఎంపీ. అయినా గాని..మన పార్టీ కోసం కష్టపడ్డ గ్రామ.మండల నియోజకవర్గ.జిల్లా స్థాయి నాయకులను కార్యకర్తలను కాదని ఎవరన్నా నాయకుడు తన సొంత ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకొని వస్తే తగు చర్యలు ఉంటాయి.ఫస్టు లోకల్ గా ఉండే మన పార్టీ కార్యకర్తలతో సమావేశమై అడిగి తెలుసుకుని మన కార్యకర్త ఆ(వేరే పార్టీల) వ్యక్తి మన పార్టీలోకి వద్దు అంటే అంటే అసలు చేర్చుకోవద్దు అలా కాకుండా కార్యకర్తతో నాకేం అవసరం నేను మండల నాయకుడిని కదా జిల్లా నాయకుడిని కదా నేను చేర్చుకుంటా పార్టీలో అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి జాగ్రత్త రాష్ట్ర జిల్లా మండల్ నాయకులు.

madagoni surendar

Feb 05 2024, 19:22

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి తెలంగాణ శ్రీశైలంగా పేరుపోందిన చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల రివ్యూ సమావేశంలో.నకిరేకల్ ఎమ్మెల్యే

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి

తెలంగాణ శ్రీశైలంగా పేరుపోందిన చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల రివ్యూ సమావేశంలో పాల్గొన్న

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి., అనంతరం ఈనెల 14 నుండి 21 వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల రివ్యూ మీటింగ్ లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు..

వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :-

బ్రహోత్సవములకు తెలంగాణ రాష్ట్రం నుండి నలుమూలలుగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు..

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాలొన్ని ఈ బ్రహోత్సవములను విజయం చేయాలి

గుట్ట పైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

ఏక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్ని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

.

madagoni surendar

Feb 05 2024, 15:14

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 38 వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ జిల్లా.:-

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో జరిగిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 38 వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి...

జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్..

బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్న మెజారిటీ కౌన్సిలర్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్ట మొదటగా అవిశ్వాస తీర్మానంతో నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్..

madagoni surendar

Feb 05 2024, 13:11

మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం. స్థానికుల దేహశుద్ధి పోలీసులకు అప్పగింత

మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం.

స్థానికుల దేహశుద్ధి పోలీసులకు అప్పగింత

హైదరాబాద్ :- కామా తురాణం న భయం న లజ్జ.. అని పెద్దలు చెప్పారు. కామం నెత్తికెక్కితే మంచి చెడు కళ్ళకు కనిపించదు. అలాంటి కామాంధులకు భయము సిగ్గు శరం ఉండదు. ఓ ప్రబుద్ధుడు తన మనవరాలి వయసున్న చిన్నారి పై అఘాయిత్య ప్రయత్నం చేశాడని తెలుసుకున్న స్థానికులు వాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఈ సంఘటన షాద్ నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. మూడేళ్ల చిన్నారిని చాక్లెట్లు ఆశ చూపి దుశ్చర్య ప్రయత్నం చేసినట్టు స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ విషయమై పోలీసు స్టేషన్ కు మీడియా వివరాలు కోరగా ప్రస్తుతం సంఘటన ఇన్విజిగేషన్లో ఉందని చెప్పారు. సంబంధిత ప్రబుద్ధుడు ఆర్టీసీలో మెకానిక్ గా పనిచేసి రిటైర్డ్ అయినట్టు స్థానికులు చెప్పారు..

madagoni surendar

Feb 05 2024, 12:56

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్

నల్గొండ జిల్లా :-కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన సరిపెల్లి యాదగిరి మృతిచెందంగా వారి మృతదేవానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం.కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,వారి వెంట మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మ సాగర్,ఓబీసీ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు,పట్టణ అధ్యక్షులు చెరుకు యాదగిరి,మాజీ ఎంపీటీసీ గట్టిగొర్ల సత్తయ్య, సీనియర్ నాయకులు కొంపెల్లి యాదయ్య, జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్, మండల యువజన నాయకులు మేడి విజయకుమార్,తదితరులు ఉన్నారు.

.

madagoni surendar

Feb 04 2024, 18:00

నల్గొండ జిల్లా :-బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో

బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో

నల్గొండ జిల్లా :

-భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం నాడు గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఉపాధ్యక్షురాలు అయితగోని అనిత పాల్గొని ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బిజెపి బలోపేతాని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ప్రతి కార్యకర్త ఒకరోజు మొత్తం ఆ బస్తీలో ఉండి జరగబోయే భువనగిరి ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మ్రోగించేలా చెయ్యాలని అన్నారు.ఈ దిశగా మోడీ పథకాలు ప్రతి గడపగడపకు తెలిసేలా చేయాలని దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది.

.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ మండూరి ప్రభాకర్ రావు, గ్రామ చలో బస్తీ చలో అభియాన్ పట్టణ కన్వీనర్ మైల శ్రీనివాస్,కో కన్వీనర్ అప్ప అంజయ్య,ఉపాధ్యక్షులు వనం వేణు,గుర్రం నాగచంద్రు, కొల్లూరి జానయ్య,పట్టణ నాయకులు బ్రహ్మదేవర రవిశంకర్,కోట శ్రీను,సిద్ధోజు ఉపేంద్ర చారి,యెన్నం వెంకటేష్,కడింగు నాగరాజు, నర్సింగు అశోక్,రాపోలు శరత్,రవీందర్ నాగేష్, రమేష్,తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Feb 04 2024, 17:12

ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎంను విమర్శించే స్థాయి అగ్గిపెట్టె రాజుకు లేదు.కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి

సీఎంను విమర్శించే స్థాయి అగ్గిపెట్టె రాజుకు లేదు.

కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆనాడు స్వతంత్ర జడ్పిటిసి గా గెలుపొంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి ని అన్నారు..

2009లో లీటర్ పెట్రోల్ తీసుకుని ఒక రూపాయి పెట్టి అగ్గిపెట్టె తీసుకొలేని ఉద్యమ నాయకుడు హరీష్ రావు ని ఎద్దేవ చేశారు..తెలంగాణ కోసం అసలైన ఆత్మ బలిదానం చేసిన, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అమరుడు శ్రీకాంతా చారి అని మరొకసారి గుర్తు చేశారు..

డ్రామాలు అంటేనే కెసిఆర్ కుటుంబమని, సినీ నటుల కంటే గొప్ప నటులు కెసిఆర్,హరీష్ రావు అని అన్నారు...

అలాగే మా నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు..

బిఆర్ఎస్ నాయకులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు..

గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో దొంగ పాలన చేసినందుకు ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తుందని, రేవంత్ రెడ్డి ని ప్రజలు మెచ్చుకుంటున్నారని, దీనిని జీర్ణించుకోలేకనే బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు..అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేశామని,ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని పేర్కొన్నారు..అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు..

...

ఈ కార్యక్రమంలో

బట్టుపల్లి సర్పంచ్ నియోజకవర్గ నాయకులు తోలెం నాగేశ్వరరావు, నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ, మండల నాయకులు ఎర్ర సురేష్ , జలగం కృష్ణ, మండల కార్యదర్శి షేక్ రఫీ, మండల నాయకులు దంచనాల రాజేంద్రప్రసాద్, నరసింహారావు, లాలయ్య, తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Feb 04 2024, 12:07

భువనగిరి గురుకుల హాస్టల్లో దారుణం..

భువనగిరి గురుకుల హాస్టల్లో దారుణం..

ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా:-

భువనగిరి గురుకుల హాస్టల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి వేళ ఇద్దరు స్టూడెంట్స్ ఒకే గదిలో ఉరి వేసుకుని నూసైడ్ చేసుకున్నారు. గమనించిన తోటి స్టూడెంట్స్, హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పరీక్షల భయంతో చనిపోయారా లేదా ఇతర కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను టెన్త్ చదువుతోన్న వైష్ణవి, భవ్యగా గుర్తించారు. ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటం హాస్టల్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న వారు ఉరి వేసుకుని చనిపోవడంతో తోటి విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు అవుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.