వారి పిలుపుమేరకు తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

ఇదేనా ఆయన ఆగ్రహం... సోషల్ మీడియాలో నిన్నటి నుంచి అవాకులు చవాకులు పేలిన వారికి

ఇదే మా సమాధానం. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా జగనన్నకు పద్మమ్మ ను సాంబుడి ని ఎవరూ దూరం చేయలేరు...

నిన్నటి రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి

ఆదేశానుసారం కలిసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మరియు ఆలూరు సాంబశివారెడ్డి...

రేకులకుంట గ్రామంలో ఆలయాలను దర్శించిన కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటి మడుగు కేశవరెడ్డి జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం

రేకులకుంట గ్రామంలో దుర్గంశీనయ్య స్వామి మరియు వీరబ్రహ్మ స్వామి నీ దర్శించుకొని, టీడీపీ నాయకులు కురుబ చిట్రా వీరనారాయణస్వామి గారి విందు కార్యక్రమంలో పోల్గొన్నా

శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు

మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, మాజీసర్పంచ్ లక్ష్మి నారాయణ గారు, మాజీఎంపీటీసీ చెరుకూరి నారాయణస్వామి గారు,క్లస్టర్ ఇంచార్జ్ చిత్తంబిరి గారు తదితరులు పాల్గొన్నారు.

జయహో బీసీ ప్రచార రథాన్ని ప్రారంభించిన శింగనమల నియోజకవర్గం దిసభ్య కమిటీ సభ్యులు..

జయహో బిసి ప్రచార రథాన్ని శింగనమల నియోజకవర్గం దిశభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు అన్న గారు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నగారు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

జయహో బీసీ కార్యక్రమానికి అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య గారు, TNTUC రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్లా నాగేంద్ర గారు , గార్లదిన్నే మండల కన్వీనర్ పాండు గారు.

అనంతపురం పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య గారు, మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్. నియోజకవర్గ బీసీ కార్యదర్శి నారాయణస్వామి.

ఐ టిడిపి మండల అధ్యక్షులు మదమంచి శ్రీధర్. తదితరులు బీసీ సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు యం.యస్ రాజు గారు..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి

నియోజకవర్గ ఇన్చార్జ్ నారా లోకేష్ గారు భోగి ఎస్టేట్స్  క్రీడా ప్రాంగణం నిర్వహిస్తున్న

 మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా

విచ్చేసిన టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు యం.యస్ రాజు గారు.....

పరిటాల శ్రీరాముల గారికి గజమాల వేసి ఘనంగా సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన : దండుశ్రీనివాసులు..

పరిటాల శ్రీరాముల గారికి గజమాల వేసి ఘనంగా సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన : దండుశ్రీనివాసులు

శింగనమల : ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలో పరిటాల శ్రీరామ్ చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలియజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు

ఈ కార్యక్రమంలో దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ,టియన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యనిర్వహకార్యదర్శి బండి పరుశురాం,

శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, పార్లమెంట్ తెలుగు రైతు అధికార ప్రతినిధి తలారితిప్పన్న, అకులేడు పవన్ సతీష్ రాయల్, రంగస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు

రెండు లారీలు ఢీ.. పలువురికి గాయాలు ఒకరి పరిస్థితి...

అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమి దొడ్డి వద్ద

రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి

గాయాలు ఒకరి పరిస్థితి ఆందోళనకరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

గుర్తు తెలియని వాహనం ఢీ.. ఒకరు దుర్మరణం...

వెంకటాంపల్లి గ్రామ నివాసులైన ఇద్దరు వ్యక్తులు బైక్ పై అనంతపురము వెళ్తుండగా SRIT College,

రోటరీపురం వద్ద గుర్తు తెలియని వాహనం డీ కొట్టింది. వీరిలో తలారి నాగముని అను వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.

వీరికి భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మరో వ్యక్తి గాయపడగా..

అతన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించడం జరిగింది.

దండు శ్రీనివాసులు సేవల అమోఘం : బలిజ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు సంజీవరాయుడు

సమాజ సేవలో దండు శ్రీనివాసులు సేవల అమోఘం : బలిజ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు సంజీవరాయుడు. శింగనమల ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశానికి హాజరై ప్రసంగిస్తున్న *బలిజ సంఘం రాష్ట్ర నాయకులు దండు శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ....

మన కమ్యూనిటీ పరంగా నిర్వహించు ప్రతి కార్యక్రమానికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని సంఘం యొక్క విలువలు కాపాడుతానుఅన్నారు

అలాగే ప్రజా సేవా కార్యక్రమాల్లో నేను చేసిన కార్యక్రమాలను గుర్తించి అనంతపురం జిల్లా బలిజ సంఘం అధ్యక్షులు సంజీవరాయుడు గారు నన్ను సత్కరించడం నాపైన మరింత బాధ్యతాయుతంగా నడుచుకోవాలని వీరందరి ఆశీస్సులతో ముఖ్యంగా నన్ను ఆదరించే ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు

ఈ కార్యక్రమంలో *వెన్నెల క్రిష్ణ, దాసరి గంగాధర్, సతీష్ రాయల్,దృవ, దండు ప్రకాష్, దాసరి వెంకటరమణ,సోము,* తదితరులు పాల్గొన్నారు

ఆనాడు రాష్ట్ర వైసిపి నుండి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచి ఈనాడు అదే పార్టీలో కంటతడి పెడుతూ వాటికి గుడ్ బై చెప్తూ ఏడ్చేసిన కాపు రామచంద్రారెడ్డి..

వైసీపీకి రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే రాజీనామా .. సీఎం జగన్ నన్ను నమ్మించి గొంతుకోశారు. నాకు టికెట్ లేదని బయటకు పంపించారు. జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా. నేను రాయదుర్గం, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తాం..

అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం జగన్ కూ గుడ్ బై అంటూ.. సీఎంఓ ఆఫీస్ ముందు ఏడ్చేసిన ఎమ్మెల్యే. సిఎం జగన్ కూ గుడ్ బై అంటు సెల్యూట్ చేసిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్ర రెడ్డి కాంగ్రెస్ గుడ్ బై చెప్పి జగనన్న అభిమానంతో వైసిపి పార్టీలోకి చేరాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికల ప్రకటించింది ఆ మధ్యంతర ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం నుంచి కాపు రామచంద్ర రెడ్డి రాయదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేయగా అధిక మెజార్టీతో వైసిపి ఎమ్మెల్యేగా గెలిచాడు

అలాంటి మొదటి గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు కంటతడి పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు..

సర్పంచ్ చేతుల మీదుగా బుక్కరయసముద్రం మండల కేంద్రంలోని డయాలసిస్ 10,000 రూ.లు పెన్షన్ పంపిణీ..

అనంతపురం జిల్లా బుక్కరయసముద్రం మండల కేంద్రంలోని సచివాలయం 4 పరిధిలోని... ఇంద్ర గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న.. బండారు రామక్క అనారోగ్యంతో 2 కిడ్నీలు చెడిపోవడం వల్ల ఆమెకు వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా డయాలసిస్ 10,000 రూపాయలు పెన్షన్ను గౌరవనీయులైన సర్పంచ్ అమ్మవారిపేట . పార్వతి గారు చేతులు మీదుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ రమణా చౌదరి , వార్డ్ నెంబర్ కుల్లాయప్ప , వాలంటీర్లు పాల్గొన్నారు.