గుర్తు తెలియని వాహనం ఢీ.. ఒకరు దుర్మరణం...

వెంకటాంపల్లి గ్రామ నివాసులైన ఇద్దరు వ్యక్తులు బైక్ పై అనంతపురము వెళ్తుండగా SRIT College,

రోటరీపురం వద్ద గుర్తు తెలియని వాహనం డీ కొట్టింది. వీరిలో తలారి నాగముని అను వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.

వీరికి భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మరో వ్యక్తి గాయపడగా..

అతన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించడం జరిగింది.

దండు శ్రీనివాసులు సేవల అమోఘం : బలిజ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు సంజీవరాయుడు

సమాజ సేవలో దండు శ్రీనివాసులు సేవల అమోఘం : బలిజ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు సంజీవరాయుడు. శింగనమల ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశానికి హాజరై ప్రసంగిస్తున్న *బలిజ సంఘం రాష్ట్ర నాయకులు దండు శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ....

మన కమ్యూనిటీ పరంగా నిర్వహించు ప్రతి కార్యక్రమానికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని సంఘం యొక్క విలువలు కాపాడుతానుఅన్నారు

అలాగే ప్రజా సేవా కార్యక్రమాల్లో నేను చేసిన కార్యక్రమాలను గుర్తించి అనంతపురం జిల్లా బలిజ సంఘం అధ్యక్షులు సంజీవరాయుడు గారు నన్ను సత్కరించడం నాపైన మరింత బాధ్యతాయుతంగా నడుచుకోవాలని వీరందరి ఆశీస్సులతో ముఖ్యంగా నన్ను ఆదరించే ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు

ఈ కార్యక్రమంలో *వెన్నెల క్రిష్ణ, దాసరి గంగాధర్, సతీష్ రాయల్,దృవ, దండు ప్రకాష్, దాసరి వెంకటరమణ,సోము,* తదితరులు పాల్గొన్నారు

ఆనాడు రాష్ట్ర వైసిపి నుండి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచి ఈనాడు అదే పార్టీలో కంటతడి పెడుతూ వాటికి గుడ్ బై చెప్తూ ఏడ్చేసిన కాపు రామచంద్రారెడ్డి..

వైసీపీకి రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే రాజీనామా .. సీఎం జగన్ నన్ను నమ్మించి గొంతుకోశారు. నాకు టికెట్ లేదని బయటకు పంపించారు. జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా. నేను రాయదుర్గం, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తాం..

అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం జగన్ కూ గుడ్ బై అంటూ.. సీఎంఓ ఆఫీస్ ముందు ఏడ్చేసిన ఎమ్మెల్యే. సిఎం జగన్ కూ గుడ్ బై అంటు సెల్యూట్ చేసిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్ర రెడ్డి కాంగ్రెస్ గుడ్ బై చెప్పి జగనన్న అభిమానంతో వైసిపి పార్టీలోకి చేరాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికల ప్రకటించింది ఆ మధ్యంతర ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం నుంచి కాపు రామచంద్ర రెడ్డి రాయదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేయగా అధిక మెజార్టీతో వైసిపి ఎమ్మెల్యేగా గెలిచాడు

అలాంటి మొదటి గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు కంటతడి పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు..

సర్పంచ్ చేతుల మీదుగా బుక్కరయసముద్రం మండల కేంద్రంలోని డయాలసిస్ 10,000 రూ.లు పెన్షన్ పంపిణీ..

అనంతపురం జిల్లా బుక్కరయసముద్రం మండల కేంద్రంలోని సచివాలయం 4 పరిధిలోని... ఇంద్ర గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న.. బండారు రామక్క అనారోగ్యంతో 2 కిడ్నీలు చెడిపోవడం వల్ల ఆమెకు వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా డయాలసిస్ 10,000 రూపాయలు పెన్షన్ను గౌరవనీయులైన సర్పంచ్ అమ్మవారిపేట . పార్వతి గారు చేతులు మీదుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ రమణా చౌదరి , వార్డ్ నెంబర్ కుల్లాయప్ప , వాలంటీర్లు పాల్గొన్నారు.

చుక్కలు చూపిస్తున్న సన్న బియ్యం..
చుక్కలు చూపిస్తున్న సన్న బియ్యం.. అమాంతం పెరిగిన ధరలు.. రూ.6వేల నుంచి రూ.7వేల వరకు.. నెల రోజుల్లో రూ. 800 నుంచి రూ.వెయ్యి పెరుగుదల ఇబ్బందిపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలు ధరలను అదుపు చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు బియ్యం ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.

రెండు, మూడు నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు అమాంతం పెరగడంతో ఇబ్బందిపడుతున్నారు. దొడ్డు బియ్యం తినలేక, సన్నబియ్యం కొనలేక ఒక పూట పస్తులుండే పరిస్థితి దాపురించింది. గతంలో క్వింటాలు సన్న బియ్యానికి రూ.4వేల నుంచి రూ.4500 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.6వేల నుంచి రూ.7 వేల వరకు సామాన్యులు కొనలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలను అదుపు చేసి, సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

జనవరి 2 బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చుకలు చూపిస్తున్నాయి. గత నెల రోజులతో పోలిస్తే ప్రస్తుతం బియ్యం ధరలు అమాంతం పెరిగి సామాన్యులు తినలేని దుస్థితి వచ్చింది. క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పెరగడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదితో పోలిస్తే పాత, కొత్త బియ్యానికి రెకలు వచ్చాయి. పెరిగిన బియ్యం ధరలతో రైతులు పండించిన ధాన్యానికి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఆహార గింజల కొరతతోపాటు యాసంగిలో వరి కోతల ముందు తుపాన్‌ ప్రభావంతో రైతుల ధాన్యం తడిసిపోయింది. దీనికి తోడు ఇతర రాష్ర్టాల్లో ధాన్యానికి డిమాండ్‌ ఉండడంతో ఎగుమతులు ఎకువయ్యాయి. దీంతో బియ్యం ధరలకు ఒకసారిగా రెకలొచ్చాయి.

ఈ సీజన్లో గ్రేడ్‌ 'ఏ' రకానికి రూ.2203, కామన్‌ గ్రేడ్‌ రకానికి రూ.2,183 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నది. ఇక ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాలు ధాన్యానికి రూ.3100 నుంచి రూ.3200 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది వడ్ల వ్యాపారులు పొలాల వద్దకే వచ్చి డబ్బులు ఇచ్చి మరి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మూడు నెలల క్రితం వరకు నార్మల్‌గా ఉన్న బియ్యం ధరలు ఒకసారిగా పెరగడంతో పేద ప్రజలకు ఎంతో ఇబ్బందిగా మారింది. ఏకంగా క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పెరగడంతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు.

విజయమసూరి కొత్త బియ్యానికి క్వింటాలు రూ.4500 నుంచి రూ.4800 వరకు, పాత బియ్యానికి రూ.5800 నుంచి రూ.6200, ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యానికి కొత్త వాటికి రూ.5200 నుంచి రూ.5500 వరకు ఉండగా పాత బియ్యానికి రూ.6,500 నుంచి రూ.6,800 వరకు పెరిగింది. జై శ్రీరామ్‌ కొత్త బియ్యానికి రూ.6000 నుంచి రూ.6200 వరకు, పాత బియ్యానికి రూ.7500 నుంచి రూ.7800 వరకు ప్రస్తుతం ధరలు ఉన్నాయి. దీంతో సన్నబియ్యం కొనాలంటే జనం జంకుతున్నారు. క్వింటాకు రూ.2వేల వరకు పెరిగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. గతంలో సన్నబియ్యం క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.4,500వరకు ధర ఉండేది. ఈ ఏడాది రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ధర పలుకుతున్నది. అంటే సుమారు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధర పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేద కుటుంబాలైతే సన్నబి య్యం తినే అవకాశం లేకుండా పోతున్నది. ప్రభుత్వం బియ్యం ధరలను అదు పు చేయకపోతే పేదలు మూడు పూటలా అన్నం తినే అవకాశం ఉండదు.
బైజుస్ తో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్..
బైజుస్ తో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బైజూస్ కార్యాలయం దగ్గర ఆందోళన అనంతపురం అర్బన్: ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా బైజుస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో బైజ్యూస్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ కుమార్ సంతోష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షు, కార్యదర్శి రమణయ్య కుల్లాయి స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నది. ట్యాబ్ లను పంపిణీ చేయడానికి 3500 కోట్ల రూపాయలు బైజూస్ సంస్థ కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. విద్యార్థులకు తరగతులు అర్థం కానప్పుడు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సబ్జెక్ట్స్ నీ అర్థం చేసుకోవడానికి బైజూస్ ట్యూషన్ పాయింట్స్ ని బైజు సంస్థ ఏర్పాటు చేసింది .ప్రతి విద్యార్థి దగ్గర నుండి 15వేల రూపాయలు కట్టించుకొని అడ్మిషన్ చేసుకున్నారు. ఎవరైనా ఒక నెల తర్వాత తరగతులు వద్దనుకుంటే వాళ్ల ఫీజులు మొత్తం వాపసు చేస్తామని బైజూస్ ప్రతినిధులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఎవరైనా తల్లిదండ్రులు ఒకేసారి 60000 రూపాయలు ఫీజులు చెల్లించ లేనప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఇఎంఐ రూపంలో ప్రతినెల 5000 నుండి 6000 రూపాయలు వరకు సౌకర్యం కల్పించింది.బైజుస్ అనేది దేశంలో దివాలా తీసిన సంస్థ .ఇప్పటికే బైజూస్ మీద మనీ లాండరింగ్ కేసులు కూడా నమోదు అయి ఉన్నాయి. 9200 కోట్ల రూపాయలు ఇతర దేశాలకి మనీలాండరింగ్ చేశారు. అటువంటి సంస్థ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా దుర్మార్గం. ట్యాబుల పేరుతో కోట్లాది రూపాయలు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. విద్యార్థుల బలహీనతను ఆసరా చేసుకొని భారీ దోపిడీ జరుగుతుందన్నారు బైజుస్ కంపెనీ 3,500 కోట్లు దోచి పెట్టారని విమర్శించారు బైజుస్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ తో ఒప్పందం కుదుర్చుకొని ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్నారు ముఖ్యమంత్రి అధికారులు బైజూస్ తో లాలూచీ పడడంతో ఈ సాధ్యమైందన్నారు విద్యార్థులకు నష్టం కలిగిస్తూ, తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న, బైజుస్ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బరేర్స్ వెంకట్ నాయక్ ఆంజనేయులు వంశీ ఏఐవైఎఫ్ నాయకులు లిఖిల్ శ్రీకాంత్ చాంద్ బాషా రాజశేఖర్ తదితరులు.
పలు గ్రామాల్లో మూడు వేలకు పెరిగిన పెన్షన్ పథకమును లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

పేదల జీవితాల్లో ఆనందం.. పండుగలా పింఛన్ల పంపిణీ.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో ఆనందం నింపడానికి సంక్షేమ పథకాలు అందుస్తున్నారని అందులో భాగంగా వైయస్ఆర్ పింఛన్ల కానుక రూ. 3,000 పెంచారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సచివాలయం ఆవరణలో, శింగనమల మండల పరిషత్ కార్యాలయంలో, నార్పల మండలం కేశేపల్లి గ్రామ సచివాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన వైయస్సార్ పింఛన్ల కానుక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పింఛన్ కార్డు మరియు రూ.3,000 అందజేశారు.

వీటితో పాటు పాత లబ్దిదారులకు రూ.3,000 పింఛన్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్‌ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ప్రస్తుతం ఉన్న రూ.2,750 జనవరి నుంచి రూ.3,000 చొప్పున ఇస్తున్నారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల నుంచి కొత్తగా మరో 841మందికి పింఛన్లు మంజూరు చేశారన్నారు. మొత్తంగా 45,261 వేల మందికి రూ. 13.558 కోట్లను విడుదల అయిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన సర్పంచ్ చీమల పెద్దన్న పార్థివ్ దేహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆలం నర్సా నాయుడు

శింగనమల నియోజకవర్గం నార్పల మండలం బి పప్పూరు గ్రామ సర్పంచ్ చీమల పెద్దన్న  బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నిన్నటి రోజున అనంతపురంలోని పావని హాస్పిటల్ లో చేరడం జరిగింది. ఆ విషయం తెలిసిన  రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు డాక్టర్స్ తో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకుని వైద్యం అందించాలని కోరారు.అలాగే కుటుంబ సభ్యులకు కూడా దైర్యం చెప్పారు. వీరితో పాటు రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షులు ఎం ఎస్ రాజు గారు, టీడీపీ జిల్లా నాయకులు అలం వెంకట నరసానాయుడు గారు కూడా పాల్గొన్నారు.  డాక్టర్స్ ఎంత ప్రయతించిన చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో సర్పంచ్ చీమల పెద్దన్న తుది శ్వాస విడిచారు.

మృతదేహాన్ని బి పప్పూరు గ్రామానికి తీసుకెళ్లడంతో రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు, జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు అక్కడికి వెళ్లి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అంత్యక్రియలు పూర్తి అయ్యేదాకా అక్కడే ఉండి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సర్పంచ్ పెద్దన్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గా ఎన్నికై తక్కువ సమయం లోనే పంచాయతీ కోసం చాలా కష్టపడ్డారని మరియు గ్రామంలోని ప్రతి ఒక్కరి దగ్గర అభిమానాన్ని చురగొన్నారని అలాంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఆకస్మికంగా మరణించిన వార్తని జీర్ణించుకోలేక పోతున్నానని తెలియజేశారు. సర్పంచ్ పెద్దన్న కుటుంబాన్ని తాను వ్యక్తిగతంగా మరియు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షుడు పిట్టు రంగారెడ్డి, మండల అధ్యక్షులు ఎర్రినాగప్ప, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్, గంగనపల్లి రాము, బండ్లపల్లి సర్పంచ్ వెంకట నారాయణమ్మ, నదిమిదొడ్డి సర్పంచ్ నాగార్జున, గూగుడు మాజీ ఎంపీటీసీ రాజన్న,క్లస్టర్ ఇంచార్జ్ కుళ్లాయప్ప,గుంజేపల్లి కుళ్ళాయప్ప, పప్పూరు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

సొంత భూమిని ఒక్కొక్కరికి 2.5 సెంట్లు ప్రకారం 165 మందికి రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను పేదలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారు..


ఉరవకొండ నియోజకవర్గం మైలారంపల్లిలో 6 .50 ఎకరాల సొంత భూమినిఒక్కొక్కరికి 2.5 సెంట్లు ప్రకారం 165 మందికి రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను పేదలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారు

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పయ్యావుల వెంకటరమణప్ప, వేలూరు నారాయణస్వామి, పయ్యావుల ఎర్రిస్వామి,

 వేలూరు కేశన్న, EX MPTC నాగన్న, వడ్డే సురేష్, హరిజన లాలేప్ప ,వడ్డే ఆదినారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు.

జంతలూరు గ్రామం గోవిందం పల్లి సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ దాసరి సునీత..

బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామం గోవిందం పల్లి సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా గౌరవ ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి సునీత గారు, మరియు గ్రామ సర్పంచ్ లక్ష్మిరెడ్డి గారు,రాష్ట్ర జగనన్న ఆరోగ్య సురక్ష నోడల్ ఆఫీసర్ కె శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ గారు వచ్చారు,

గౌరవ ఎంపీపీ గారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గత అక్టోబర్లో నిర్వహించినప్పుడు మండల వ్యాప్తంగా 6,393 మంది చూపించుకోవడం జరిగింది వారిలో 282 మందిని పెద్ద ఆసుపత్రులకు రిఫర్ ( ఆరోగ్యశ్రీ కింద) చేయడం జరిగింది. ఈ 282 కేసుల్లో 281 కేసులు 281 కేసులు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది, అలాగే కంటికి సంబంధించి 243 మంది ఆపరేషన్లకు అవసరం కాక ఇప్పటివరకు 92 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది, మిగతా వారికి కంటి అద్దాలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది,

ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రధాన కార్యక్రమముగా తీసుకొని ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని వారు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమాలు నిర్వహించే ప్రతి చోట ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అనారోగ్యంతో ఉన్న వారిని అలాగే దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వారిని కంటి ఆపరేషన్లు, మరియు అద్దాలు అవసరమైన వారిని గుర్తించి , జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వారు వచ్చి క్యాంపును విజయవంతం చేసేటట్లు గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని వారు తెలియజేశారు, అలాగే జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్ టెస్టులు, డాక్టర్లు రాసినటువంటి మందులు తప్పనిసరిగా ఇచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులో వారికి పంపిణీ చేయాలని తెలియజేశారు, అలాగే ఈరోజు స్కూల్ పిల్లలకు గ్రామ ప్రజలకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మి గారు, స్పెషలిస్ట్ డాక్టర్లు శరత్ రెడ్డి గారు జనరల్ ఫిజీషియన్, డాక్టర్ శివ జ్యోతి శ్రీ. గైనకాలజీ డాక్టర్ ( స్త్రీ సంబంధిత , గర్భవతి బాలింత ప్రత్యేక వైద్యురాలు) , ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కంటికి సంబంధించి ఆప్తమిక్ అసిస్టెంట్ ప్రసాదు, సౌమ్యకృష్ణ, సిహెచ్ మోహన్ రావు గారు, సూపర్వైజర్ స్టాప్, ఐసిడిఎస్ వారు, సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ఆశా కార్యకర్తలు , గోవిందం పల్లి సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు,

 ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఓపి 359 హాజరయ్యారు, 02 కేసెస్ రెఫర్ చేయడం జరిగింది 48 మందికి కంటి అద్దాల కోసం పరీక్షించడం జరిగింది