పెద్ద ఎత్తున తరలివచ్చి మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి.. నీలం భాస్కర్ జడ్పిటిసి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీ పురం నందు ఎస్ఆర్ఐటి కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జనహృదయనేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఉదయం 8.00 గం.లకు నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు నాయకులు డీలర్లు కార్యకర్తలు వాలంటీర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి ఒక్కరూ హాజరై రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన నీలం భాస్కర్ బుక్కరాయసముద్రం మండల జడ్పిటిసి.. "జగనన్న మిద అబిమానం - నేను సైతం రక్తదానం"

నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న తరిమెల రామాంజనేయులు..

పేద కుటుంబాన్ని ఆదుకున్న తరిమెల రామాంజనేయులు.. శింగనమల మండల పరిధిలోని సలకం చెరువు గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న వృద్ధుల కుటుంబానికి 50 కేజీల బియ్యం ప్యాకెట్ నిత్యవసర సరుకులను సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు బుధవారం వృద్ధుల కుటుంబానికి అందించారు,

జిల్లాలో అత్యంతకరువుతో వర్షాలు లేక వెనుకబడిన మండలాలలో వర్షాలుసింగనమల మండలం ముందు వరుసలో ఉంది, కరువుతో వ్యవసాయ కూలీలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు.

ఈ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు మండలంలోని సనకoచెరువు గ్రామంలో లక్ష్మి దేవి భర్త రామదాసు వృద్ధులకు పిల్లలు లేరు.

కనీసం రేషన్ కార్డు కూడా సంబంధిత అధికారులు ఇవ్వకపోవడంతో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న సందర్భంలో వారు పడే అవస్థలనుగుర్తించి సొంత నిధులతో 50 కేజీలు బియ్యము నిత్యవసర సరుకులు తీసుకెళ్లి ఆ వృద్ధులకు ఇచ్చి సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు మానవత్వం చాటుకున్నారు,

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్, ఇరు వెందుల శ్రీరాములు, రాజారాం,ఆదినారాయణ, సంజీవప్ప, శివప్రసాద్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు

తిరుమలలో మళ్లీ చిరుత భయం..

తిరుమలలో మళ్లీ చిరుత భయం..

అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం..

నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం.. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో సంచరించిన చిరుత..

చిరుత సంచారంపై అప్రమత్తమైన టీటీడీ..

నడకదారి భక్తులను గుంపులుగా అనుమతిస్తున్న భద్రతా సిబ్బంది....

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహా విష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన జడ్పిటిసి నీలం భాస్కర్..

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహా విష్కరణను

విజయవంతం చేయండి : నీలం భాస్కర్ జడ్పిటిసి. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో

ఈనెల 21వ తేదీన ఉదయం 10:00 గంటలకు ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యత మరియ ప్రజల సాధికారత కోసం, అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి అంబేద్కర్ గారి అభిమానులు, దళిత బాంధవులు, నాయకులు కార్యకర్తలు, పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఈ కార్యక్రమంలో నాగభూషణ, గంగరాజు, ఎస్టి సెల్ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ వర్కర్లకు మంచి జరిగింది అంటే అది కేవలం జగనన్న ప్రభుత్వంలో మాత్రమే.. జడ్పిటిసి నీలం భాస్కర్

అంగన్వాడీ వర్కర్లకు మేలు చేస్తున్నది జగనన్న ప్రభుత్వం మాత్రమే. జడ్పిటిసి నీలం భాస్కర్ . చంద్రబాబు 14 సంవత్సరాల పరిపాలన కాలంలో అంగన్వాడీల కోసం ఈ మంచి పని చేశాము అని ధైర్యంగా చెప్పగలిగే దమ్ము ఈ తెలుగుదేశం

నాయకులకు లేదు. అంగన్వాడీ వర్కర్లకు మంచి జరిగింది అంటే అది కేవలం జగనన్న ప్రభుత్వంలో మాత్రమే. గతంలో అంగన్వాడీ వర్కర్లు చాలీచాలని జీతాలతో ఎంతో దయనీయమైన పరిస్థితుల మధ్య

అంగన్వాడీ సెంటర్లను నడిపే వాళ్ళు కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక అంగన్వాడి సెంటర్ల రూపురేఖలు మారిపోయాయి అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచుతూ నాడు నేడు ప్రోగ్రాం కింద అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తూ మన పిల్లలకు సరైన పౌష్టికాహారాల అందిస్తూ దేశంలోనే గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు అంగన్వాడి సెంటర్లు నడుస్తున్నాయి.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించి మహిళా పోలీసులతో జుట్టు పట్టి లాగి, చాలా కర్కశంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు తెలుగు దేశ ప్రభుత్వం అధికారంలో ఉండి అంగన్వాడీ వర్కర్ల కోసం మా హయాంలో ఈ మంచి పని చేసాము అని ధైర్యంగా చెప్పుకో లేని స్థితిలో ఈ తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ప్రతి సందర్భాన్ని రాజకీయంతో ముడిపెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందాలనుకున్న ఇలాంటి ప్రతిపక్ష నాయకులు ఉండటం మన యొక్క దౌర్భాగ్యం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో అంగన్‌వాడీ వర్కర్ల జీతం నెలకు రూ. 7 వేలు, హెల్పర్లకు రూ. 4,500 మాత్రమే పొందేవారు. కానీ జగనన్న ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నంబర్‌ 18 జారీ చేసింది. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు నెలకు రూ 7 వేలు నుంచి రూ. 11,500కు అలాగే హెల్పర్లకు జీతాలు నెలకు రూ. 4,500 నుంచి రూ. 7 వేలకు పెంచుతూ 2019 జూన్‌ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

గత ప్రభుత్వంలో అంగన్‌వాడీలకు పదోన్నతులు లేవు అసలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జగనన్న ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్‌–2 సూపర్‌ వైజర్‌ పోస్టులను భర్తీ చేసింది. ఈ సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, పదవి విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం పాటు బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తున్నాది జగనన్న మాత్రమే.

3 రోజులు జరుగు ఆంధ్రప్రదేశ్ 14th బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ 2023 ను ఘనంగా ప్రారంభించిన గంగాధర్ రావు IPS కమాండెంట్..

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు గ్రామం నందు 3 రోజులు జరుగు ఆంధ్రప్రదేశ్ 14th బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ 2023 ను ఘనంగా ప్రారంభించిన గంగాధర్ రావు IPS కమాండెంట్.. ముందుగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించి స్పోర్ట్ మీట్ జెండాను ఆవిష్కరించిన గంగాధర్ రావు IPS కమాండెంట్.. అనంతరం శాంతి పావురం ఎగురవేశారు. తరువాత బెటాలియన్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై ఎంతో ఆసక్తికరమైన మరియు అందరినీ ఆకట్టుకునేలా వారికి అన్ని విధాలుగా భరోసా కల్పిస్తూ వారు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా మొదటిగా క్రికెట్ గేమ్ ను తన స్వహస్తాలతో ఇరువురు టీములను పరిచయం చేసుకొని టాస్ ఎగిరేసి ఆటను ప్రారంభించారు

బుక్కరాయసముద్రం హాస్పిటల్ నందు PLHIV ఫెసిలిటేషన్, పౌస్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి అతిథిగా విచ్చేసిన ఎం.పీ.పీ సునీత..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు DAPCU వారి ఆదేశాలమేరకు , చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారు బుక్కరాయసముద్రం హాస్పిటల్ నందు PLHIV ఫెసిలిటేషన్ మరియు పౌస్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సమావేశానికి అతిథిగా విచ్చేసిన ఎం.పీ.పీ సునీత గారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారు మందులతో పాటు మంచి పౌష్ఠికాహారం తీసుకోవాలని అలాగే పౌష్ఠిాహార దతలకి కృతజ్ఞతలు తెలియజేశారు. వైద్యాధికారిని స్వాతిలక్ష్మీ మరియు తెహరున్నిసా మాట్లాడుతూ హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారిని చిన్న చూపు, వివక్షతకు గురి చేయకూడదని వారిని ప్రేమతో ఆదరించాలని తెలిపారు..

ఈ కార్యక్రమంలో డీ.పి.ఎం వెంకట రత్నం గారు డి.ఎస్ రమణ గారు మాట్లాడుతూ విధిగా మందులు మింగడం తో పాటు తగిన పౌష్ఠికాహారం తీసుకోవడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవచ్చని తెలిపారు.అలాగే వైరల్ లోడ్ CD4 కౌంట్ గురించి తెలియజేశారు.

డీ అర్ పి రమేష్ యాదవ్ మాట్లాడుతూ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారు దాతల సహకారంతో పౌష్ఠికాహారం సేకరించి 30 మంది హెచ్. ఐ.వి.తో జీవిస్తున్న వారికి పంపిణీ చేశారు.కార్యక్రమం లో ఎం.పీ.పీ సునీత గారు, మెడికల్ ఆఫీసర్ స్వాతి లక్ష్మి, రెండవ మెడికల్ ఆఫీసర్ తెహరున్నిషా, డీ.పీ.ఎం వెంకటరత్నం, డి.స్ రమణ, సి.హెచ్.ఓ మోహనరావు,

విహాన్ పీడీ రామాంజనేయులు, డీ.అర్.పి రమేష్ యాదవ్, పీ.హెచ్.ఎన్ చెన్నమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ ఈశ్వరమ్మ, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ,జోనల్ సూపర్వైజర్ పెద్దన్న, ఎం&ఈ హస్సన్ ,లింక్ వర్కర్స్ నాగరాజ్,నాగేంద్ర,v.భారతి,స్వప్న,శ్రీరాములు,విజయ్, మారుతి ప్రసాద్, లక్ష్మీ నారాయణమ్మ, విహాన్ ఈశ్వరయ్య, మరియు YRG కేర్ CCF భారతి తదితరులు పాల్గొన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ నుంచి లిఫ్ట్ ద్వారా త్రాగు,సాగు నీరు అవసరాలకు మడుగుపల్లి కుంటలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు.

మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ కాలువను, అలాగే పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలోని బైయన్న కుంటను అధికారులతో కలసి పరిశీలించారు.

హెచ్.ఎల్ .సి కెనాల్ నుంచి కుంటలకు నీటిని సరఫరా చేసే ప్రతిపాదిత అంశాలపై వారితో చర్చించారు. దాదాపు రూ.5.45 కోట్లు అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పలు అభ్యంతరాలపై అధికారులతో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చర్చించారు.

త్వరితగతిన సమగ్ర నివేదిక అందించాలని వారిని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతన్నలకు సాగు, త్రాగు నీటి కొరత లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. హెచ్.ఎల్.సి కెనాల్ నుంచి కుంటలకు నీటిని అందించడం ద్వారా నీటి కొరత లేకుండా రైతులు, ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు.

ఈ కుంటలకు నీటిని అందించటం ద్వారా చుట్టుపక్కల గ్రామాలు జంగంరెడ్డి పేట, ఎల్లుట్ల, మడుగుపల్లి, మూగె తిమ్మంపల్లి గ్రామాల రైతులకు త్రాగు నీటి కొరత తీరనుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అనంత లో వైభవంగా అయ్యప్ప స్వామి ఇరుముడి..

వైభవంగా అయ్యప్ప ఇరుముడి.. శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి

కఠోర దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేసుకున్నారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలో

ఉన్న చెరువుకట్టపై ఉన్న అయ్యప్ప దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి, గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకున్నారు.

అనంతరం స్వాములతో కలసి శబరి యాత్ర బయలుదేరారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో అయ్యప్పను పూజించిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వులు మేరకు నిమ్మల భాస్కర్ కు జిల్లా స్థాయిలో ఆ క్యాడర్ దక్కించుకున్నారు

సింగనమల నియోజకవర్గం లోని వైయస్సార్సీపీ నాయకులకు పలువురికి వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో చోటు లభించింది.

వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో భాగంగానే బుక్కరాయసముద్రం మండలం పసులూరు కొత్తపల్లి గ్రామానికి చెందిన నిమ్మల భాస్కర్ కు జిల్లాస్థాయిలో చేనేత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా నిమ్మల భాస్కర్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డి గారికి నియోజవర్గ స్థాయి నాయకులు గువ్వల శ్రీకాంత్ రెడ్డి గారికి

సొసైటీ అధ్యక్షులు గువ్వల వెంకట రెడ్డి గారికి గువ్వల రాజశేఖర్ రెడ్డి గారికి ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.