బుక్కరాయసముద్రం హాస్పిటల్ నందు PLHIV ఫెసిలిటేషన్, పౌస్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి అతిథిగా విచ్చేసిన ఎం.పీ.పీ సునీత..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు DAPCU వారి ఆదేశాలమేరకు , చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారు బుక్కరాయసముద్రం హాస్పిటల్ నందు PLHIV ఫెసిలిటేషన్ మరియు పౌస్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సమావేశానికి అతిథిగా విచ్చేసిన ఎం.పీ.పీ సునీత గారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారు మందులతో పాటు మంచి పౌష్ఠికాహారం తీసుకోవాలని అలాగే పౌష్ఠిాహార దతలకి కృతజ్ఞతలు తెలియజేశారు. వైద్యాధికారిని స్వాతిలక్ష్మీ మరియు తెహరున్నిసా మాట్లాడుతూ హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారిని చిన్న చూపు, వివక్షతకు గురి చేయకూడదని వారిని ప్రేమతో ఆదరించాలని తెలిపారు..

ఈ కార్యక్రమంలో డీ.పి.ఎం వెంకట రత్నం గారు డి.ఎస్ రమణ గారు మాట్లాడుతూ విధిగా మందులు మింగడం తో పాటు తగిన పౌష్ఠికాహారం తీసుకోవడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవచ్చని తెలిపారు.అలాగే వైరల్ లోడ్ CD4 కౌంట్ గురించి తెలియజేశారు.

డీ అర్ పి రమేష్ యాదవ్ మాట్లాడుతూ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారు దాతల సహకారంతో పౌష్ఠికాహారం సేకరించి 30 మంది హెచ్. ఐ.వి.తో జీవిస్తున్న వారికి పంపిణీ చేశారు.కార్యక్రమం లో ఎం.పీ.పీ సునీత గారు, మెడికల్ ఆఫీసర్ స్వాతి లక్ష్మి, రెండవ మెడికల్ ఆఫీసర్ తెహరున్నిషా, డీ.పీ.ఎం వెంకటరత్నం, డి.స్ రమణ, సి.హెచ్.ఓ మోహనరావు,

విహాన్ పీడీ రామాంజనేయులు, డీ.అర్.పి రమేష్ యాదవ్, పీ.హెచ్.ఎన్ చెన్నమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ ఈశ్వరమ్మ, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ,జోనల్ సూపర్వైజర్ పెద్దన్న, ఎం&ఈ హస్సన్ ,లింక్ వర్కర్స్ నాగరాజ్,నాగేంద్ర,v.భారతి,స్వప్న,శ్రీరాములు,విజయ్, మారుతి ప్రసాద్, లక్ష్మీ నారాయణమ్మ, విహాన్ ఈశ్వరయ్య, మరియు YRG కేర్ CCF భారతి తదితరులు పాల్గొన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ నుంచి లిఫ్ట్ ద్వారా త్రాగు,సాగు నీరు అవసరాలకు మడుగుపల్లి కుంటలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు.

మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ కాలువను, అలాగే పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలోని బైయన్న కుంటను అధికారులతో కలసి పరిశీలించారు.

హెచ్.ఎల్ .సి కెనాల్ నుంచి కుంటలకు నీటిని సరఫరా చేసే ప్రతిపాదిత అంశాలపై వారితో చర్చించారు. దాదాపు రూ.5.45 కోట్లు అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పలు అభ్యంతరాలపై అధికారులతో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చర్చించారు.

త్వరితగతిన సమగ్ర నివేదిక అందించాలని వారిని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతన్నలకు సాగు, త్రాగు నీటి కొరత లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. హెచ్.ఎల్.సి కెనాల్ నుంచి కుంటలకు నీటిని అందించడం ద్వారా నీటి కొరత లేకుండా రైతులు, ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు.

ఈ కుంటలకు నీటిని అందించటం ద్వారా చుట్టుపక్కల గ్రామాలు జంగంరెడ్డి పేట, ఎల్లుట్ల, మడుగుపల్లి, మూగె తిమ్మంపల్లి గ్రామాల రైతులకు త్రాగు నీటి కొరత తీరనుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అనంత లో వైభవంగా అయ్యప్ప స్వామి ఇరుముడి..

వైభవంగా అయ్యప్ప ఇరుముడి.. శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి

కఠోర దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేసుకున్నారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలో

ఉన్న చెరువుకట్టపై ఉన్న అయ్యప్ప దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి, గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకున్నారు.

అనంతరం స్వాములతో కలసి శబరి యాత్ర బయలుదేరారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో అయ్యప్పను పూజించిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వులు మేరకు నిమ్మల భాస్కర్ కు జిల్లా స్థాయిలో ఆ క్యాడర్ దక్కించుకున్నారు

సింగనమల నియోజకవర్గం లోని వైయస్సార్సీపీ నాయకులకు పలువురికి వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో చోటు లభించింది.

వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో భాగంగానే బుక్కరాయసముద్రం మండలం పసులూరు కొత్తపల్లి గ్రామానికి చెందిన నిమ్మల భాస్కర్ కు జిల్లాస్థాయిలో చేనేత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా నిమ్మల భాస్కర్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డి గారికి నియోజవర్గ స్థాయి నాయకులు గువ్వల శ్రీకాంత్ రెడ్డి గారికి

సొసైటీ అధ్యక్షులు గువ్వల వెంకట రెడ్డి గారికి గువ్వల రాజశేఖర్ రెడ్డి గారికి ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ సభ్యులకు మద్దతు తెలిపిన ఆలం నరసానాయుడు..

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ సభ్యులకు మద్దతు తెలిపిన ఆలం నరసానాయుడు శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ సభ్యులకి చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలియజేసిన *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఈ కార్యక్రమంలో *జిల్లా నాయకులు ఆలo వెంకట నరసా నాయుడు గారు, జనసేన నాయకులు రామకృష్ణ* పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ టిడిపి హయాంలో రెండుసార్లు వేతన సవరణ చేయడమైనది అంగన్వాడి కార్యకర్తలకి 4200 రూపాయల నుండి 7000 రూపాయల వరకు మొదటగా మరియు 7000 రూపాయల నుండి 10500 రూపాయల వరకు రెండోసారి పెంచడమైనది అంగన్వాడి హెల్పర్ కి 2200 నుండి 4500 వరకు మొదటగా పెంచడమైనది 4500 నుండి 6000 రూపాయల వరకు రెండోసారి పెంచడం జరిగింది, సమ్మే డిమాండ్లను అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి గ్రాట్యూటీ అమలు చేయాలని ఇతర సమస్యల పరిష్కారం చేయాలని గర్భవతులు బాలింతలు సున్న నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడి వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు అనేక సేవలందిస్తున్న తరుణంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించక పోవడం చాలా బాధాకరమైన విషయమని అలాగే నిరంతరం నిత్యవసర సరుకులు ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఆర్టీసీ రైల్వే ధరలు పెరుగుతూ ఉన్నాయేగాని వారికి వేతనాలు మాత్రం పెరగలేదని అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం చాలా కష్టంగా ఉందని అంతేకాకుండా అంగన్వాడి సెంటర్లు నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నీ నెరవేర్చకపోవడం దురదృష్టకరమని 2022లో నే సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాటివిటీ అమలు చేయాలని తీర్పునిచ్చిందని కానీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయడం లేదని రిటైర్డ్ అయిన సందర్భంలో నామినేల్ మొత్తం ఇవ్వటం వలన ఒంటరి మహిళలకు కుటుంబాలను లేని వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే మొదలగు తదితరల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని అలా అమలు చేయని పక్ష్యాన తెలుగు దేశం పార్టీ వారికి తోడుగా ఉండి వారికోసం పోరాడుతుందని తెలియజేశారు. ఈకార్యక్రమం లో మాజీ మండలధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు యూనిట్ ఇన్చార్జులు గ్రామ కమిటీలు, బూత్ ఇంచార్జ్ లు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఉన్న పెద్ద సమస్యను.. నేడు పరిష్కారం చేసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే..

ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాల ప్రజలకు తీరిన సమస్య... ఇన్నాళ్లూ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మూడు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలిగాయి.

దుర్గం గ్రామాన్ని నార్పల పోలీస్ స్టేషన్, పసులూరు, పి కొత్తపల్లి గ్రామాలను బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మూడు గ్రామాలు దూరంగా ఉన్న ఇటుకలపల్లి పరిధిలో ఉండటం వల్ల ఎన్నో ఏళ్లుగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకున్నారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పద్మావతికి ధన్యవాదాలు తెలియజేశారు.

బుక్కరాయసముద్రం పోలీసులను అభినందించిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ K. K. N. అంబురంజన్..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని

దేవరకొండ పైన నిన్నటిదినం కందుకూరు గ్రామానికి చెందిన

రమేష్ బాబు ప్రాణాలు కాపాడినందుకు వారిరువురికి అనంతపురం జిల్లా

ఎస్పీ శ్రీ K. K. N. అంబురంజన్. IPS గారి చేతుల మీదగా మొమెంటో

మరియు 2.000/- క్యాష్ రివార్డ్ PC H. శ్రీనివాసులు &HG. D. వీర నారప్ప లకు ఇవ్వడం జరిగినది

గుండె పోటుతో మరణించిన వైసీపీ నాయకుడు సాకే రవి కుటుంబ సబ్యులకి ప్రభుత్వంచే మంజూరయిన తక్షణ సహాయం కింద10,000 రూ.లు అందజేసిన వైసీపీ శ్రేణులు..


ఎల్ బీ కాలనీలోని నిన్న గుండె పోటుతో మరణించిన వైఎస్సార్ పార్టీ నాయకుడు సాకే రవి కుటుంబ సబ్యులకి ప్రభుత్వం చే మంజూరు అయిన భీమా పథకంలో తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు అందజేయడము జరిగినది.

ఈ కార్యక్రమములో బుల్లె రాజా , శేషానంద రెడ్డి , వడ్డె లక్ష్మీనారాయణ , సాకే అంజి , సంక్షేమ అధికారి రవి , వాలంటీర్ చంటి పాల్గొన్నారు.

గుండె పోటుతో మరణించినవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రవి పార్తివి దేహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి

ఎల్ బి కాలనీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళిత నాయకుడు జయరాం గారి సోదరుడు రవి నిన్న గుండె పోటు వల్ల మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని పార్టీ ఇంచార్జ్ ఆలూరు రమణ రెడ్డి గారు పరమర్శించారు. ఆయన వెంట బుల్లె రాజా, శేషానంద రెడ్డి, బండి పుల్లయ్య, వడ్డే లక్ష్మీనారాయణ, చక్రి, టిప్పు, మిగిలినవారు పాల్గొన్నారు.

అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలి.. 3వరోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మాజీజడ్పీటీసీ కె.రామలింగారెడి..

అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలి.. మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి.. 3వరోజు కొనసాగుతున్న అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మె.... మద్దతు తెలిపిన తెదేపా మరియు సిఐటియు నాయకులు.. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలో రాష్ట్రంలో ఉన్న లక్షమంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల వేతనాలు, గ్రాట్యూటీ తదితర సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర శిశు సంక్షేమ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు ప్రారంభించిన నిరవధిక సమ్మె గురువారానికి మూడవ రోజుకు చేరింది.

ఇందులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు తెదేపా మరియు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా *జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి గారు* మాట్లాడుతూ అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యూటీ తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఐసిడిఎస్‌కు నిధులు పెంచాలని, ప్రీ స్కూలును బలోపేతం, నూతన విద్యా విధానం రద్దు, సంక్షేమ పథకాలు అమలు,వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ అశోక్ కుమార్, లక్ష్మి నారాయణ, కేశన్న,తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి,, చదళ్ళ నారాయణస్వామి, బాబయ్య, దాసి,నరసింహుడు, టోపీ బాషా సిఐటియు మండల కార్యదర్శి సి.నాగేంద్ర, రైతు సంఘం మండల నాయకులు సంజీవరెడ్డి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ నాయకురాలు కాత్యాయని తులసి,రత్న,విమల, సుభాషిణి, విజయ కుమారి, గూడూరు సరళ,గీత, లలిత తదితరులు పాల్గొన్నారు.