రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ సభ్యులకు మద్దతు తెలిపిన ఆలం నరసానాయుడు..

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ సభ్యులకు మద్దతు తెలిపిన ఆలం నరసానాయుడు శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ సభ్యులకి చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలియజేసిన *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఈ కార్యక్రమంలో *జిల్లా నాయకులు ఆలo వెంకట నరసా నాయుడు గారు, జనసేన నాయకులు రామకృష్ణ* పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ టిడిపి హయాంలో రెండుసార్లు వేతన సవరణ చేయడమైనది అంగన్వాడి కార్యకర్తలకి 4200 రూపాయల నుండి 7000 రూపాయల వరకు మొదటగా మరియు 7000 రూపాయల నుండి 10500 రూపాయల వరకు రెండోసారి పెంచడమైనది అంగన్వాడి హెల్పర్ కి 2200 నుండి 4500 వరకు మొదటగా పెంచడమైనది 4500 నుండి 6000 రూపాయల వరకు రెండోసారి పెంచడం జరిగింది, సమ్మే డిమాండ్లను అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి గ్రాట్యూటీ అమలు చేయాలని ఇతర సమస్యల పరిష్కారం చేయాలని గర్భవతులు బాలింతలు సున్న నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడి వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు అనేక సేవలందిస్తున్న తరుణంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించక పోవడం చాలా బాధాకరమైన విషయమని అలాగే నిరంతరం నిత్యవసర సరుకులు ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఆర్టీసీ రైల్వే ధరలు పెరుగుతూ ఉన్నాయేగాని వారికి వేతనాలు మాత్రం పెరగలేదని అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం చాలా కష్టంగా ఉందని అంతేకాకుండా అంగన్వాడి సెంటర్లు నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నీ నెరవేర్చకపోవడం దురదృష్టకరమని 2022లో నే సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాటివిటీ అమలు చేయాలని తీర్పునిచ్చిందని కానీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయడం లేదని రిటైర్డ్ అయిన సందర్భంలో నామినేల్ మొత్తం ఇవ్వటం వలన ఒంటరి మహిళలకు కుటుంబాలను లేని వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే మొదలగు తదితరల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని అలా అమలు చేయని పక్ష్యాన తెలుగు దేశం పార్టీ వారికి తోడుగా ఉండి వారికోసం పోరాడుతుందని తెలియజేశారు. ఈకార్యక్రమం లో మాజీ మండలధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు యూనిట్ ఇన్చార్జులు గ్రామ కమిటీలు, బూత్ ఇంచార్జ్ లు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఉన్న పెద్ద సమస్యను.. నేడు పరిష్కారం చేసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే..

ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాల ప్రజలకు తీరిన సమస్య... ఇన్నాళ్లూ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మూడు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలిగాయి.

దుర్గం గ్రామాన్ని నార్పల పోలీస్ స్టేషన్, పసులూరు, పి కొత్తపల్లి గ్రామాలను బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మూడు గ్రామాలు దూరంగా ఉన్న ఇటుకలపల్లి పరిధిలో ఉండటం వల్ల ఎన్నో ఏళ్లుగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకున్నారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పద్మావతికి ధన్యవాదాలు తెలియజేశారు.

బుక్కరాయసముద్రం పోలీసులను అభినందించిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ K. K. N. అంబురంజన్..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని

దేవరకొండ పైన నిన్నటిదినం కందుకూరు గ్రామానికి చెందిన

రమేష్ బాబు ప్రాణాలు కాపాడినందుకు వారిరువురికి అనంతపురం జిల్లా

ఎస్పీ శ్రీ K. K. N. అంబురంజన్. IPS గారి చేతుల మీదగా మొమెంటో

మరియు 2.000/- క్యాష్ రివార్డ్ PC H. శ్రీనివాసులు &HG. D. వీర నారప్ప లకు ఇవ్వడం జరిగినది

గుండె పోటుతో మరణించిన వైసీపీ నాయకుడు సాకే రవి కుటుంబ సబ్యులకి ప్రభుత్వంచే మంజూరయిన తక్షణ సహాయం కింద10,000 రూ.లు అందజేసిన వైసీపీ శ్రేణులు..


ఎల్ బీ కాలనీలోని నిన్న గుండె పోటుతో మరణించిన వైఎస్సార్ పార్టీ నాయకుడు సాకే రవి కుటుంబ సబ్యులకి ప్రభుత్వం చే మంజూరు అయిన భీమా పథకంలో తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు అందజేయడము జరిగినది.

ఈ కార్యక్రమములో బుల్లె రాజా , శేషానంద రెడ్డి , వడ్డె లక్ష్మీనారాయణ , సాకే అంజి , సంక్షేమ అధికారి రవి , వాలంటీర్ చంటి పాల్గొన్నారు.

గుండె పోటుతో మరణించినవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రవి పార్తివి దేహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి

ఎల్ బి కాలనీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళిత నాయకుడు జయరాం గారి సోదరుడు రవి నిన్న గుండె పోటు వల్ల మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని పార్టీ ఇంచార్జ్ ఆలూరు రమణ రెడ్డి గారు పరమర్శించారు. ఆయన వెంట బుల్లె రాజా, శేషానంద రెడ్డి, బండి పుల్లయ్య, వడ్డే లక్ష్మీనారాయణ, చక్రి, టిప్పు, మిగిలినవారు పాల్గొన్నారు.

అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలి.. 3వరోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మాజీజడ్పీటీసీ కె.రామలింగారెడి..

అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలి.. మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి.. 3వరోజు కొనసాగుతున్న అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మె.... మద్దతు తెలిపిన తెదేపా మరియు సిఐటియు నాయకులు.. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలో రాష్ట్రంలో ఉన్న లక్షమంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల వేతనాలు, గ్రాట్యూటీ తదితర సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర శిశు సంక్షేమ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు ప్రారంభించిన నిరవధిక సమ్మె గురువారానికి మూడవ రోజుకు చేరింది.

ఇందులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు తెదేపా మరియు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా *జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి గారు* మాట్లాడుతూ అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యూటీ తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఐసిడిఎస్‌కు నిధులు పెంచాలని, ప్రీ స్కూలును బలోపేతం, నూతన విద్యా విధానం రద్దు, సంక్షేమ పథకాలు అమలు,వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ అశోక్ కుమార్, లక్ష్మి నారాయణ, కేశన్న,తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి,, చదళ్ళ నారాయణస్వామి, బాబయ్య, దాసి,నరసింహుడు, టోపీ బాషా సిఐటియు మండల కార్యదర్శి సి.నాగేంద్ర, రైతు సంఘం మండల నాయకులు సంజీవరెడ్డి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ నాయకురాలు కాత్యాయని తులసి,రత్న,విమల, సుభాషిణి, విజయ కుమారి, గూడూరు సరళ,గీత, లలిత తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండ పైకిఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన కందుకూరు గ్రామవాసిని కాపాడి కొండ పై నుంచి కిందికి తీసుకు వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసులు..

ఆత్మహత్య విపలయత్నం.. పోలీసులకు పట్టుబడిన వ్యక్తి.. ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన ఆకులేటి రమేష్ బాబు, వయస్సు 35,s/o లేట్ లక్షినారాయణ, కందుకూరు గ్రామము, ఇటుకులపల్లి. గురువారం మధ్యాహ్నం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని దేవరకొండ పైకి ఎక్కి, కిందికి దూకాడు... గమనించిన వాచ్మెన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బ్లూ కోడ్ పోలీసులు శ్రీనివాసులు, వీర నారప్ప వెంటనే స్పందించి ముళ్లపదల్లో రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కున్న బాధితున్ని కాపాడి కొండపై నుంచి కిందికి తీసుకొస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసులు.. తలకు మరియు కాళ్లకు రక్తస్రావం కావడంతో 108 కి ఫోన్ చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని బాధితులు పేర్కొన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దిశా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డి.ఎస్.పి వరప్రసాద్( 60 )గుండెపోటుతో మృతి..
శ్రీ సత్యసాయి జిల్లా... పుట్టపర్తిలో జిల్లా దిశా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డి.ఎస్.పి వరప్రసాద్( 60 )గుండెపోటుతో మృతి . పుట్టపర్తి మూడవ క్రాస్ లోని సాయి ప్లాజా అపార్ట్ మెంట్ లో మృతి చెందిన డిఎస్పీ. 1991 బ్యాచ్ కి చెందిన అధికారి.
జగనన్నకు చెబుదాం " అనే ప్రోగ్రాంలో ప్రజా సమస్యలపై ఆర్డీవో గారికి వినతి పత్రం అందజేసిన సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు తరిమేల రామాంజనేయులు..

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ద్వారా శింగణమాల మండలంలోని తాసిల్దార్ కార్యాలయం వద్దజరుగుతున్న "జగనన్నకు చెబుదాం " అనే ప్రోగ్రాంలో ప్రజా సమస్యలపై ఆర్డీవో గారికి వినతి పత్రం! సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు తరిమేల రామాంజనేయులు.. మాట్లాడుతూ! ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం వర్షాలు లేక పెట్టిన పంట ఎండిపోయి రైతుల అప్పుల ఊబిలో కూరాకు పోతున్నారు. ప్రభుత్వమే జిల్లాలో 31 మండలాలు ఉంటే 28 మండలాల్లో కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేయి పట్టకపోవడం దారుణం, వెంటనే పంట ఏసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అలాగే వర్షాలు లేక పంట సాగు చేయని వారికి కూడా ప్రభుత్వ ఆదుకోవాలి, అలాగే బ్యాంకులో ఉన్నా క్రాప్ రుణాలను రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలి. వలసలు నివారించి వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు పెంచి రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీలో కంపచెట్లతో వనములాగ తయారైనది. ఇల్లు లేని నిరుపేదలకు జగనన్న ఇండ్లు అందని ద్రాక్ష లాగా తయారైనది. వెంటనే ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు కట్టించాలి. మండల వ్యాప్తంగా రీ సర్వే పేరుతో ప్రభుత్వం రైతులకున్న భూమి సక్రమంగా కొలవకుండా తక్కువ కొలిచి రికార్డు కన్నా తక్కువ భూమిని చూపిస్తూ రైతుల మధ్య వైరుధ్యం పెంచుతున్నది. కావున మరోసారి రి సర్వే చేసి వారి పట్టా పాస్ పుస్తకం లో ఎంత ఉంటే అంత భూమిని చూపించాలి అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ద్వారాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. పాల్గొన్నవారు:-కొరివిపల్లి, సలకంచెరువు,చిన్నమాట్లగొంది,ఇరువేందల, ఉల్లికళ్ళు,తరిమేల, గ్రామ ప్రజలు, లక్ష్మిరంగయ్య,శివశంకర,నాగరాజు,రామదాసు,శ్రీరాములు, రమణ,నరేష్,ప్రసాద్ తదితరులు

తన చెల్లెలు కీ.శే. సాకే మాధవి దేవి 8వ వర్ధంతి రోజున విద్యార్థులకు అవసరమైన పెన్నులు పెన్షన్లు స్కూల్ నందు మొక్కలు నాటిన సర్పంచ్ సాకే రామాంజనేయులు

శిద్ధరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం మండల పరిషత్ ఉన్నత పాఠశాల నందు తన చెల్లెలు కీ,, శే సాకే మాధవి దేవి 8వ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ సాకే రామాంజనేయులు తన చెల్లెలు జ్ఞాపకార్థం పాఠశాలలోని పిల్లలు ఉపాధ్యాయులతో సమావేశమై ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నా శక్తి మేర మన స్కూల్ కి పిల్లలకి అవసరమైన సహాయం చేసే కార్యక్రమాన్ని చేస్తానని తెలిపారు ఈసారి పిల్లలకి అవసరమైన పెన్నులను పెన్సిల్లను మరియు స్కూలు ఆవరణములో ఆహ్లాదకరమైన పచ్చదనం పెంపొందించుట కొరకు మొక్కలను కుండీలను అందజేయడం జరిగినది అదేవిధంగా స్కూల్లోని ప్రతి విద్యార్థికి ఇంటి దగ్గర నాటేందుకు ఒక మొక్కను అందజేయడం జరిగినది కాలనీలోని ఆర్డిటి స్కూల్ ఆవరణ నందు మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగార్జున రెడ్డి రమేష్ రెడ్డి శివారెడ్డి గ్రామస్తులు సాకే కిరణ్ కుమార్ కురవ నారాయణస్వామి సాకే రామాంజనేయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు