సలకంచెరువులో సచివాలయ కార్యదర్శి కి వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఐ మండల కార్యదర్శి తరిమెల రామాంజనేయులు...
రైతులనుకూలీలనుప్రభుత్వంఆదుకోవాలి,, సిపిఐ మండల కార్యదర్శి తరిమల రామాంజనేయులు విశాలాంధ్ర-శింగనమల మండల వ్యాప్తంగా గతంలో 50 సంవత్సరాల లో లేని కరువు ఈ సంవత్సరం వచ్చిందని, రైతులను కూలీలను ప్రభుత్వంఆదుకోవాలని, సిపిఐ మండల కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం చల్లకంచెరువు సచివాలయ కార్యదర్శి కి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులువేసిన ప్రతి పంట ఎండిపోయి లక్షలాది రూపాయలు పంట నష్టం సంభవించిందని, మండలంలో పూర్తిగా కరువు అలముకొని అలమటిస్తున్నారని, ఈ సమయంలో రైతులను, కూలీలనుఆదుకోవాలని డిమాండ్ చేశారు, వేసవిని తలపిస్తున్నట్లు కరెంటు కోతలు అధికమవడం వల్ల మరోపక్క వర్షాలు లేనందున బోరుబావుల్లో నీరు అడగండి పోతుందని బోర్ల కింద వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయన్నారు, ఇప్పటికే వరుస కరువులవల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగాచితికిపోయారని, అప్పుల మీద అప్పులు పెరిగిపోయి కుటుంబ పోషణ భారమై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రభుత్వం రైతులు తీసుకున్న అన్ని పంట రుణాలు వెంటనే రద్దుచేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు, వ్యవసాయ పంటలకుఎకరాకు 50 వేల రూపాయలు,హార్టికల్చర్ పంటలకి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలు పెంచి పని అడిగిన ప్రతి కూలికి వెంటనే పని కల్పించి అటు రైతులను ఇటు వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో స్వర నాగప్ప, దైవత్వం, నరేష్, బాలిరెడ్డి, దొడ్డెన్న, చంద్రనారాయణ, లక్ష్మీదేవి, కుల్లయప్ప, ముత్యాలు, రామాంజనేయులు, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు
Nov 12 2023, 15:41