బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి:..

బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు

 బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకుగ్యారెంటీ కార్యక్రమంపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు , జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి

 ఆధ్వర్యంలో ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలో నందు క్లస్టర్ ఇంచార్జ్ లకు,ఐ-టీడీపీ సభ్యులు, బూత్ ఇంచార్జ్ లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ భరోసా కల్పిస్తూ చేపడుతున్న "బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ" పథకాన్ని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,మాజీసర్పంచ్ లక్ష్మినారాయణ, కేశన్న, S. నారాయణస్వామి,మల్లికార్జున రెడ్డి,అదిశేషయ్య, వెంకట రెడ్డి, నరేంద్రయాదవ్,రామకృష్ణ రెడ్డి , గంపన్న మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

నియోజకవర్గ వ్యాప్తంగా "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి

నేటి నుంచి "వై ఏపీ నీడ్స్ జగన్"

నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి తెలిపారు.

బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల ఎంపిపి కార్యాలయాల్లో "వై ఏపీ నీడ్స్ జగన్" అనే కార్యక్రమంపై ఆయా ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలను అందచేశామని తెలిపారు. ఇటు రాష్ట్ర అభివృద్ధిని మెరుగుపరుస్తూనే అటు సంక్షేమంపై దృష్టి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేమీ లేదన్నారు. 

సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేర్చిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. పూర్తి పారదర్శక పాలనతో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల ఖాతాల్లోకి చేరాయన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఉండాలంటే జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సి ఉంటుందన్నారు. రేపటి దినం అనగా 09-11-2023 తేదీన బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి, నార్పల- బండ్లపల్లి, గార్లదిన్నె- కేశవాపురం, పుట్లూరు- సి. వెంగన్నపల్లి, యల్లనూరు- 85 నిట్టూరు పరిధిలోని గ్రామాల్లో సాయంత్రం 3.00 గంటలకు "వై ఏపీ నీడ్స్ జగన్ " కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి..
చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి.. 45 నిమిషాల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులు.. ఆపరేషన్ అనంతరం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్న చంద్రబాబు..
టీడీపీ కార్యకర్త కుటుంబానికి 20వేల రూ. ఆర్థికసాయం చేసిన మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు.
టీడీపీ కార్యకర్త కుటుంబానికి 20వేల రూ.లు ఆర్థికసాయం చేసి అండగా నిలిచిన మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో అనారోగ్యం మరణించిన టీడీపీ కార్యకర్త రాగే యల్లప్ప తల్లి గారి పార్థవదేహం కు పూలమాలతో నివాళులు అర్పించి, బాధలో ఉన్న కుటుంబసభ్యులకు తమవంతుగా *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు ₹10000/- రూపాయలు మరియు జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు ₹10000/- రూపాయలు* ఆర్థికసాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు. భవిష్యత్తులో కూడా బుక్కరాయసముద్రం మండలంలో కష్టలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తమవంతుగా ఆర్థికంగా అండగా ఉంటాము అని తెలియజేసిన *మాజీజడ్పీటీసీ కటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు*. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, లక్ష్మినారాయణ గారు, కేశన్న గారు, బోలె అక్కులప్ప గారు,నరేంద్ర యాదవ్ గారు, బండి మధు గారు తదితరులు పాల్గొన్నారు.
నూతన గృహప్రవేశానికి హాజరై బహుమతి అందజేసిన బుక్కరాయసముద్రం మండల జడ్పిటిసి నీలం భాస్కర్..

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో తలారి లక్ష్మీదేవి w/o రామకృష్ణ (కాంట్రాక్టరు) వారి నూతన గృహప్రవేశానికి హాజరై బహుమతి అందజేసిన బుక్కరాయసముద్రం మండల జడ్పిటిసి నీలం భాస్కర్ . కార్యక్రమంలో చేతుల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కొర్రపాడు వైస్ సర్పంచ్ ఆర్ శ్రీనివాసరెడ్డి వార్డ్ మెంబర్ రాజారెడ్డి చికెన్ నారాయణస్వామి పి. కొత్తపల్లి భాస్కర్ రెడ్డి మరియు సాయి తదితరులు

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపక అందజేసిన జర్నలిస్టులు..

పుట్టపర్తిలో సీఎం జగన్ కు జర్నలిస్టుల సన్మానం జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పుట్టపర్తిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన జర్నలిస్టులు సీఎం జగన్ కు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించిన జర్నలిస్టులు శివారెడ్డి (సాక్షి టివి), రామచంద్రారెడ్డి (సాక్షి), అనిల్ కుమార్ రెడ్డి (అనంత భూమి ఎడిటర్), శ్రీనివాసులు (ఎన్టీవీ), నరేష్ (టీవీ 9), సాయినాథ్ రెడ్డి (వైఎస్సార్ టివి) మరియు తదితరులు

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే దంపతులు..
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి .
యువతిని చితకబాది గొంతుకు చున్నితో బిగించి హత్య చేసి.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితులు
అనంతపురం జిల్లా:గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కోమల(17) అనే యువతి మృతి చావుకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది . యువతిని చితకబాది గొంతుకు చున్నితో బిగించి హత్య తల్లి,అన్న ...? యువతిని చంపిన తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితులు ...? ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...
SRIT కళాశాల నందు "మానవతా సమస్త" గవర్నమెంట్ హాస్పిటల్ మరియు అనంతపురం HDFC బ్యాంకు అనుబంధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్..125 యూనిట్లు బ్లడ్ ప్యాకెట్స్

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురం గ్రామ సమీపంలో నందున్న SRIT కళాశాల నందు "మానవతా సమస్త" గవర్నమెంట్ హాస్పిటల్ మరియు అనంతపురం HDFC బ్యాంకు అనుబంధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఫలితంగా 125 యూనిట్లు బ్లడ్ ప్యాకెట్స్ సేకరించారు ఈ కార్యక్రమం లో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి బాలకృష్ణ గారు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు గారు డోన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ సాయి చైతన్య కిషోర్ గారు పిఎన్పి ఆఫీసర్ డాక్టర్ ఎం రంజిత్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మానవతా సంస్థ కన్వీనర్ గౌరవనీయులైన టి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ నేటి సమాజ యువతకు రక్తదానం ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ తోటి వారికి ఎలా సాయం చేయాలి అన్న విషయం గురించి విశదీకరింపజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా HDFC బ్యాంకు మేనేజర్ అరవింద్ గారు మాట్లాడుతూ కళాశాల యువతకు రక్తదానం పట్ల అవగాహన ఉండటం గమనించి హర్షం వ్యక్తం చేశారు 

ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపక బృందం నాన్ టీచింగ్ స్టాఫ్ తమవంతుగా రక్తదానం చేశారు మరియు ఎన్ఎస్ఎస్ పిఓ రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్న పుల్లయ్య గారు రక్తదానం చేశారు

అన్నమయ్య జిల్లా : నందలూరు మండలం ఆడపూరు గురుకుల పాఠశాల లో దారుణం.
అన్నమయ్య జిల్లా : నందలూరు మండలం ఆడపూరు గురుకుల పాఠశాల లో దారుణం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రెడ్డమ్మ అనే విద్యార్థిని మేడ పైనుంచి పడి తీవ్ర గాయాలు. 108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమం. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కి తరలింపు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆర్డీవో రామకృష్ణారెడ్డి విద్యార్థిని ఆరోగ్యంపై ఆరా. విద్యార్థిని కింద పడటానికి గల కారణాలను గోప్యాంగా ఉంచిన పాఠశాల సిబ్బంది. అమ్మాయి సొంత ఊరు వెంపల్లె మండలం రాజుపాలెం. గతంలో కూడా ఈ హాస్టల్లో పలు సంఘటనలు. మీడియా కు వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తున్న ఇంచార్జ్ వార్డెన్ నాగమణి.
గౌరవనీయులైన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ నమస్కరించి రాయు మనవి విన్నపం సార్ అంబేద్కర్ పాఠశాల అడ్డపూర్ గురుకుల పాఠశాలలో మెడ పైనుంచి పడి గాయాలు పాలైన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఆ పాప మరల సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఆ పాప యొక్క స్థితిగతులు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి ఆ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయగలరని అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ మిమ్మల్ని వేడుకుంటుంది