చెన్నంపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో "బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ" "రచ్చబండ" కార్యక్రమం
మరియు ఇంటి ఇంటిదగ్గర కు వెళ్లి 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా తరువాత ప్రారంభించబోయే సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారికి ఏడాది 15000 రూపాయలు,ఆడబిడ్డని ధి క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు, దీపం పేరుతొ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ లు ,మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20000 ఆర్థిక సాయం తదితర పథకాలతో ప్రతి ఇంటికి ఏడాదికి 1,22,000 రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్, తెలుగురైతు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున రెడ్డి,సర్పంచ్ మల్లికార్జున, లక్ష్మి నారాయణ,కేశన్న, గోవిందరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బోలె అక్కులప్ప,బాబాయ్య, హరి, నరేంద్ర యాదవ్, బాబా వలి,కుళ్లాయి రెడ్డి,అంజి, రామాంజి, పోలప్ప, ఉజ్జినప్ప,బాల,సుబ్రహ్మణ్యం,యల్లప్ప, గౌస్ మరియు తదితర బుక్కరాయసముద్రం మండల టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Nov 08 2023, 11:04