అన్నమయ్య జిల్లా : నందలూరు మండలం ఆడపూరు గురుకుల పాఠశాల లో దారుణం.
అన్నమయ్య జిల్లా : నందలూరు మండలం ఆడపూరు గురుకుల పాఠశాల లో దారుణం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రెడ్డమ్మ అనే విద్యార్థిని మేడ పైనుంచి పడి తీవ్ర గాయాలు. 108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమం. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కి తరలింపు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆర్డీవో రామకృష్ణారెడ్డి విద్యార్థిని ఆరోగ్యంపై ఆరా. విద్యార్థిని కింద పడటానికి గల కారణాలను గోప్యాంగా ఉంచిన పాఠశాల సిబ్బంది. అమ్మాయి సొంత ఊరు వెంపల్లె మండలం రాజుపాలెం. గతంలో కూడా ఈ హాస్టల్లో పలు సంఘటనలు. మీడియా కు వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తున్న ఇంచార్జ్ వార్డెన్ నాగమణి.
గౌరవనీయులైన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ నమస్కరించి రాయు మనవి విన్నపం సార్ అంబేద్కర్ పాఠశాల అడ్డపూర్ గురుకుల పాఠశాలలో మెడ పైనుంచి పడి గాయాలు పాలైన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఆ పాప మరల సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఆ పాప యొక్క స్థితిగతులు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి ఆ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయగలరని అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ మిమ్మల్ని వేడుకుంటుంది
రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చంనాయుడు గారిని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెస్ రాజు గారితో పాటు శింగనమల నియోజకవర్గ నాయకులు..
*రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చంనాయుడు గారిని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెస్ రాజు గారితో పాటు శింగనమల నియోజకవర్గ నాయకులు కలవడం జరిగింది*
చెన్నంపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో "బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ" "రచ్చబండ" కార్యక్రమం మరియు ఇంటి ఇంటిదగ్గర కు వెళ్లి 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా తరువాత ప్రారంభించబోయే సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారికి ఏడాది 15000 రూపాయలు,ఆడబిడ్డని ధి క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు, దీపం పేరుతొ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ లు ,మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20000 ఆర్థిక సాయం తదితర పథకాలతో ప్రతి ఇంటికి ఏడాదికి 1,22,000 రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్, తెలుగురైతు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున రెడ్డి,సర్పంచ్ మల్లికార్జున, లక్ష్మి నారాయణ,కేశన్న, గోవిందరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బోలె అక్కులప్ప,బాబాయ్య, హరి, నరేంద్ర యాదవ్, బాబా వలి,కుళ్లాయి రెడ్డి,అంజి, రామాంజి, పోలప్ప, ఉజ్జినప్ప,బాల,సుబ్రహ్మణ్యం,యల్లప్ప, గౌస్ మరియు తదితర బుక్కరాయసముద్రం మండల టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

టిడిపి కార్యకర్త కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న.. ఆలం నరసానాయుడు..
టిడిపి కార్యకర్త కుటుంబానికి అండగా..ఆలం నరసానాయుడు.. శిoగనమల నియోజవర్గం నార్పల మండలం కేశేపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త M భాస్కర్ యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బతినడంతో ఈ విషయం రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు దృష్టికి తీసుకెళ్లగా అయన స్పందించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు పాల్గొన్నారు *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం చాలా సంతోషకరమని,భవిష్యత్ లో కూడా కష్టాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తమవంతుగా ఆపదలో అండగా ఉంటాము అని తెలియజేసారు.అలాగే మూడురోజుల క్రితం బి పప్పురు గ్రామంలో టిడిపి కార్య కర్త హరిజన చీమల కుల్లాయప్ప రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన విషయం ఆగ్రామ టీడీపీ నాయకులు తెలపడం తో అక్కడ కూడా 10.000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఏ కష్టము వచ్చినా అండగా మేము ఉంటామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లో ఎర్రినాగప్ప, రాఘవ నాయుడు, పీరా, కేశవరెడ్డి, నాగేంద్ర, రామాంజి రెడ్డి, పుల్లయ్య,శ్రీరాములు,నాగరాజు, కురగానపల్లి గోపాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిరంజీవి రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, జయ చంద్రారెడ్డి శేష, టైలర్ రామంజి, రవి, ధన, రాఘవేంద్ర, సురేష్, భాస్కర్, సి నాగేంద్ర, బోజ్జీలు, నారాయణస్వామి,తదితరులు పాల్గొన్నారు
సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాలకు భరోసా లభించిందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా పొందిన లబ్దిని ఆయా కుటుంబాలకు లబ్ధి పత్రాల ద్వారా వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పేదలకు ఆర్థికంగా లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.4.94 లక్షలు లబ్ది చేకూరిందని లబ్ధిదారు జెన్నే సుజాత హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భద్రత కల్పించడమేగాక, పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలు, వారి ఆర్థిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావటంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 19 కుటుంబాలకు రూ.27.06 లక్షలు మంజూరు చేయించారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో హై స్కూల్ కొట్టాలకు చెందిన జగదీష్ గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాను చనిపోతూ గుండె, కిడ్నీ ఊపిరితిత్తులను దానం చేశాడు. మృతిని భార్య కె. రోజా కు రూ.5 లక్షలు చెక్కును అందజేశారు. గతంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాన్ని ఆమెకు కల్పించారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ పంచాయతీ-2 పరిధికి చెందిన టి. ప్రభాకర్ అనే వాలంటీర్ గత కొన్ని నెలల క్రితం గుండె పోటుతో మరణించడంతో మృతిని తల్లి టి. నాగేశ్వరమ్మ కు రూ.5 లక్షలు చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
పేదింటి ఆడపడుచు వివాహకార్యక్రమంకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి..
*స్వాగ్రామం లోని పేదింటి ఆడపడుచు వివాహకార్యక్రమంకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని సాకే చిన్నాఓబులేసు కుమార్తె వివాహకార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు*. ఈ కార్యక్రమంలో తలారి నాగేంద్ర, ఆది నారాయణ, చెన్నమయ్య, కాటమయ్య, కుళ్లాయప్ప, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మురికి నీటిలో కూర్చుని జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన..
అనంతపురం జిల్లా మురికి నీటిలో కూర్చుని జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన.. తాడిపత్రి పట్టణంలో టిడిపి కౌన్సిలర్లతో కలిసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మునిసిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మురికి నీటిలో కూర్చుని సోమవారం వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.. తాడిపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని వెంటనే డ్రైనేజీ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.....
దళిత ఇల్లూరు నల్లప్ప ను కులం పేరుతో దూషించిన ఇటుకులపల్లి సిఐ నరేంద్రరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ను నమోదు చేయాలి... దళిత, గిరిజన ప్రజా స

దళిత ఇల్లూరు నల్లప్ప ను కులం పేరుతో దూషించిన ఇటుకులపల్లి సిఐ నరేంద్రరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ను నమోదు చేయాలి... దళిత, గిరిజన ప్రజా సంఘాలు

దళితగిరిజన ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో పేదల గుడిసెలు తొలగించిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది పేదలతో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు నెరమెట్ల ఎల్లన్న ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు సాకేహరి ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు, వెంకటాపురం చంద్ర, జై భీమ్ సేన నాయకులు తరిమెల రామాంజనేయులు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప జిల్లా అధ్యక్షులు జి వెంకటేష్ జిల్లా నాయకులు జీవరత్నం పామిడి ఓబులేసు, చిరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో గుడిసెలు తొలగించిన పేదలందరికీ న్యాయం జరిగేంత వరకు ఐక్యంగా పోరాడుదామని దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కల్లూరు గ్రామంలో గుడిసెలు తొలగించిన పేదలకు న్యాయం చేయాలని కోరారు.

ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు నెరమెట్ల ఎల్లన్న మాట్లాడుతూ కల్లూరు గ్రామంలో దాదాపుగా ఉన్న ఇళ్ల స్థలాలన్నీ లక్ష్మీ నరసింహస్వామి దేవుని మాన్యం భూములే అన్నారు. అగ్రవర్ణాల వారు ఈ దేవుని మాణ్యం లోనే నిర్మించుకోవడం, ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. వాళ్లెవరినీ పట్టించుకోకుండా సెంటు స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడం అత్యంత దుర్మార్గం అన్నారు. పేదల పక్షాన ప్రశ్నించడానికి వెళ్లిన సిపిఎం నాయకులపై సిఐ నరేంద్రరెడ్డి చేయిచేసుకోవడం హేయమైన చర్య అన్నారు. 

ఎస్సీ ఎస్టీ జె ఏ సి నాయకులు సాకే హరి మాట్లాడుతూ

పేదల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా కమ్యూనిస్టు పార్టీలు, నాయకులు పని చేస్తారనే విషయాన్ని వారు తెలుసుకోవాలని సూచించారు. పోలీసులే పేదల గుడిసెలు తొలగించడం దుర్మార్గంగా ఉందన్నారు. 

గుడిసెల తొలగింపు అప్రజాస్వామిక చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు చిన్న ఆంజనేయులు మాట్లాడుతూ కల్లూరులో గుడిసెలు వేసుకున్న వారంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పేదలే అన్నారు. వారికి నిలువ నీడ లేకుండా చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. 

జై భీమ్ సేన నాయకులు తరిమెల రామాంజనేయులు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఆదేశిస్తే పోలీసులు ఇష్టారాజ్యంగా పేదలపై అధికారం దుర్వినియోగం పాల్పడటం సరికాదన్నారు.

కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప మాట్లాడుతూ 

హైకోర్టు ఉత్తర్వులను భేఖాతరు చేస్తూ పేదలను నడిరోడ్డుపై పడేశారని మండిపడ్డారు. అధికారులు వైసిపి కార్యకర్తల్లాగా వ్యవహరిస్తే ఎలాని ప్రశ్నించారు. సిఐ నరేంద్ర రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దళితుడైన నల్లప్ప ను కులం పేరుతో దూషించిన సిఐ నరేంద్ర రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కల్లూరు గ్రామంలో పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించరాదని హైకోర్టు తీర్పు ఉన్నా వాటిని భేఖారు చేస్తూ పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు గుడిసెలు తొలగించారని తెలిపారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు దేవాదాయ శాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరించి పేదలకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ఆలయ భూములను వైసిపి నాయకులు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్కడ అన్యాక్రాంతం అయిన భూములన్నీ ఖాళీ చేయించే దమ్ము అధికారులకు ఉందాని ప్రశ్నించారు. సిఐ నరేంద్రరెడ్డి సిపిఎం నాయకుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించి, కులం పేర్లతో దూషించి దాడి చేశాడన్నారు. ఆ అధికారిని సస్పెండ్‌ చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. కల్లూరులో బాధిత పేదలందరికీ గుడిసెలు తొలగించిన స్థలంలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. 

ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

SVM హైస్కూల్లో జరిగిన "ఉచిత మెగా వైద్య శిబిరం" లో 1124 మందికి వైద్య సేవలు..

SVM హైస్కూల్లో జరిగిన "ఉచిత మెగా వైద్య శిబిరం" లో 1124 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. పాల్గొన్న వారందరికీ ఉచితంగా మందులు, భోజన సౌకర్యాలు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆరోగ్యం అందించటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు.. సదా సేవలో మీ... సంజీవరెడ్డి మొ రు సు SVM హైస్కూల్ నార్పల

మానవత్వం పరిమలించిన వేళ.పేదవాడికి అందుబాటులోకి ఖరీదైన వైద్యం అందించిన మీకు(సంజీవరెడ్డి,రమాదేవి దంపతులకు)వైద్యులకు,పాఠశాల సిబ్బందికి, అభినందనలు..