సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాలకు భరోసా లభించిందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా పొందిన లబ్దిని ఆయా కుటుంబాలకు లబ్ధి పత్రాల ద్వారా వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పేదలకు ఆర్థికంగా లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.4.94 లక్షలు లబ్ది చేకూరిందని లబ్ధిదారు జెన్నే సుజాత హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భద్రత కల్పించడమేగాక, పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలు, వారి ఆర్థిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావటంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 19 కుటుంబాలకు రూ.27.06 లక్షలు మంజూరు చేయించారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో హై స్కూల్ కొట్టాలకు చెందిన జగదీష్ గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాను చనిపోతూ గుండె, కిడ్నీ ఊపిరితిత్తులను దానం చేశాడు. మృతిని భార్య కె. రోజా కు రూ.5 లక్షలు చెక్కును అందజేశారు. గతంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాన్ని ఆమెకు కల్పించారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ పంచాయతీ-2 పరిధికి చెందిన టి. ప్రభాకర్ అనే వాలంటీర్ గత కొన్ని నెలల క్రితం గుండె పోటుతో మరణించడంతో మృతిని తల్లి టి. నాగేశ్వరమ్మ కు రూ.5 లక్షలు చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
పేదింటి ఆడపడుచు వివాహకార్యక్రమంకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి..
*స్వాగ్రామం లోని పేదింటి ఆడపడుచు వివాహకార్యక్రమంకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని సాకే చిన్నాఓబులేసు కుమార్తె వివాహకార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు*. ఈ కార్యక్రమంలో తలారి నాగేంద్ర, ఆది నారాయణ, చెన్నమయ్య, కాటమయ్య, కుళ్లాయప్ప, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మురికి నీటిలో కూర్చుని జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన..
అనంతపురం జిల్లా మురికి నీటిలో కూర్చుని జెసి ప్రభాకర్ రెడ్డి నిరసన.. తాడిపత్రి పట్టణంలో టిడిపి కౌన్సిలర్లతో కలిసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మునిసిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మురికి నీటిలో కూర్చుని సోమవారం వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.. తాడిపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని వెంటనే డ్రైనేజీ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.....
దళిత ఇల్లూరు నల్లప్ప ను కులం పేరుతో దూషించిన ఇటుకులపల్లి సిఐ నరేంద్రరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ను నమోదు చేయాలి... దళిత, గిరిజన ప్రజా స

దళిత ఇల్లూరు నల్లప్ప ను కులం పేరుతో దూషించిన ఇటుకులపల్లి సిఐ నరేంద్రరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ను నమోదు చేయాలి... దళిత, గిరిజన ప్రజా సంఘాలు

దళితగిరిజన ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో పేదల గుడిసెలు తొలగించిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది పేదలతో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు నెరమెట్ల ఎల్లన్న ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు సాకేహరి ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు, వెంకటాపురం చంద్ర, జై భీమ్ సేన నాయకులు తరిమెల రామాంజనేయులు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప జిల్లా అధ్యక్షులు జి వెంకటేష్ జిల్లా నాయకులు జీవరత్నం పామిడి ఓబులేసు, చిరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో గుడిసెలు తొలగించిన పేదలందరికీ న్యాయం జరిగేంత వరకు ఐక్యంగా పోరాడుదామని దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కల్లూరు గ్రామంలో గుడిసెలు తొలగించిన పేదలకు న్యాయం చేయాలని కోరారు.

ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు నెరమెట్ల ఎల్లన్న మాట్లాడుతూ కల్లూరు గ్రామంలో దాదాపుగా ఉన్న ఇళ్ల స్థలాలన్నీ లక్ష్మీ నరసింహస్వామి దేవుని మాన్యం భూములే అన్నారు. అగ్రవర్ణాల వారు ఈ దేవుని మాణ్యం లోనే నిర్మించుకోవడం, ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. వాళ్లెవరినీ పట్టించుకోకుండా సెంటు స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడం అత్యంత దుర్మార్గం అన్నారు. పేదల పక్షాన ప్రశ్నించడానికి వెళ్లిన సిపిఎం నాయకులపై సిఐ నరేంద్రరెడ్డి చేయిచేసుకోవడం హేయమైన చర్య అన్నారు. 

ఎస్సీ ఎస్టీ జె ఏ సి నాయకులు సాకే హరి మాట్లాడుతూ

పేదల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా కమ్యూనిస్టు పార్టీలు, నాయకులు పని చేస్తారనే విషయాన్ని వారు తెలుసుకోవాలని సూచించారు. పోలీసులే పేదల గుడిసెలు తొలగించడం దుర్మార్గంగా ఉందన్నారు. 

గుడిసెల తొలగింపు అప్రజాస్వామిక చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు చిన్న ఆంజనేయులు మాట్లాడుతూ కల్లూరులో గుడిసెలు వేసుకున్న వారంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పేదలే అన్నారు. వారికి నిలువ నీడ లేకుండా చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. 

జై భీమ్ సేన నాయకులు తరిమెల రామాంజనేయులు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఆదేశిస్తే పోలీసులు ఇష్టారాజ్యంగా పేదలపై అధికారం దుర్వినియోగం పాల్పడటం సరికాదన్నారు.

కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప మాట్లాడుతూ 

హైకోర్టు ఉత్తర్వులను భేఖాతరు చేస్తూ పేదలను నడిరోడ్డుపై పడేశారని మండిపడ్డారు. అధికారులు వైసిపి కార్యకర్తల్లాగా వ్యవహరిస్తే ఎలాని ప్రశ్నించారు. సిఐ నరేంద్ర రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దళితుడైన నల్లప్ప ను కులం పేరుతో దూషించిన సిఐ నరేంద్ర రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కల్లూరు గ్రామంలో పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించరాదని హైకోర్టు తీర్పు ఉన్నా వాటిని భేఖారు చేస్తూ పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు గుడిసెలు తొలగించారని తెలిపారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు దేవాదాయ శాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరించి పేదలకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ఆలయ భూములను వైసిపి నాయకులు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్కడ అన్యాక్రాంతం అయిన భూములన్నీ ఖాళీ చేయించే దమ్ము అధికారులకు ఉందాని ప్రశ్నించారు. సిఐ నరేంద్రరెడ్డి సిపిఎం నాయకుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించి, కులం పేర్లతో దూషించి దాడి చేశాడన్నారు. ఆ అధికారిని సస్పెండ్‌ చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. కల్లూరులో బాధిత పేదలందరికీ గుడిసెలు తొలగించిన స్థలంలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. 

ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

SVM హైస్కూల్లో జరిగిన "ఉచిత మెగా వైద్య శిబిరం" లో 1124 మందికి వైద్య సేవలు..

SVM హైస్కూల్లో జరిగిన "ఉచిత మెగా వైద్య శిబిరం" లో 1124 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. పాల్గొన్న వారందరికీ ఉచితంగా మందులు, భోజన సౌకర్యాలు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆరోగ్యం అందించటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు.. సదా సేవలో మీ... సంజీవరెడ్డి మొ రు సు SVM హైస్కూల్ నార్పల

మానవత్వం పరిమలించిన వేళ.పేదవాడికి అందుబాటులోకి ఖరీదైన వైద్యం అందించిన మీకు(సంజీవరెడ్డి,రమాదేవి దంపతులకు)వైద్యులకు,పాఠశాల సిబ్బందికి, అభినందనలు..

వివాహ కార్యక్రమంకు హాజరుఅయి నూతన వధూవరులను అశ్విరాధించిన.. టీడీపీ శ్రేణులు..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలోనీ టీడీపీ నాయకుడు చెరుకూరి నారాయణస్వామి గారి కుమారుడు యాగంటిశ్వరుడు వివాహ కార్యక్రమంకు హాజరుఅయి నూతన వధూవరులను అశ్విరాధించిన శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు బి. కే. పార్థసారథి గారు,శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు * ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్, లక్ష్మి నారాయణ, కేశన్న,S. నారాయణస్వామి,మాజీ ఎంపీటీసీ చెరుకూరి నారాయణ స్వామి, చిత్తంబారి మరియు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు
అనంతపురం జిల్లా పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్..
అనంతపురం జిల్లా పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించి చాలు అనుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీరు గుడిబండల మారింది అని స్థానిక రాప్తాడు మండలంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన కార్యక్రమం తెలియజేసిన ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక్క అనంతపురం జేఎన్టీయూ పరిధిలోనే 40 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి వాటిని తృతీయ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయకుండా స్పాట్ అడ్మిషన్స్ డేటా వివరాలు సేకరించి ఖాళీ సీట్లతో కళాశాల ద్వారా వ్యాపారం చేయించాలని చూస్తోంది. విద్యార్థుల పట్ల వైసిపి ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం ప్రదర్శిస్తోంది. అని అన్నారు. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో కౌన్సిలింగ్ చేపట్టి సకాలంలో ప్రవేశాలు కల్పించిన రాష్ట్రం ఉన్నత విద్యా మండలి ఐదు నెలలు అయినా కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయడం లేదు.మూడు దపాలు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ ప్రక్రియను రెండుసార్లు నిర్వహించి చేతులెత్తేసింది. త్వరి తగతిన తృతీయ కౌన్సిలింగ్ నిర్వహించి. విద్యార్థులకు అన్యాయం చేయాలి. ఆ దిశగా జేఎన్టీయూ కళాశాల ఆవరణంలో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తామని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో సాయి, మల్లికార్జున, శివ, తదితరులు పాల్గొన్నారు.
సైకో జగన్ పాలన వద్దనడానికి ప్రజల్లో వంద కారణాలు ఉన్నాయి .... ఆలం నరసానాయుడు..
నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామం లో భావితరాల భవిష్యత్తు మన ప్రాంతం మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ సైనికులై కృషిచేసి సీఎంగా చంద్రబాబునాయుడు గారిని చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అంటూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ప్రజా వేదిక,రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలు ప్రజలకు పంచుతూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన ఊరు మన ప్రాంతం అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ,ప్రజావేదిక లో స్థానిక వాసులు పలు సమస్యలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చేశారన్నారు కానీ ఈ పిచ్చి సైకో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందని ఒకసారి ఆలోచించాలని వ్యవస్థలు నాశనం చేసాడు యువతకు ఉద్యోగాలు లేకుండా అక్రమాలు దౌర్జన్యాలు బెదిరింపులతో పాలన సాగుతుందన్నారు. అందుకే ఈసారి ప్రజలు మేలుకోకపోతే ఈ రాష్ట్రం అధోవతి పాలఅవుతుందని 2024 చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు బూత్ కమిటి ఇంచార్జ్ లు,గ్రామ కమిటి అధ్యక్షులు,మండల సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ శింగనమల నియోజకవర్గంలో పేద ప్రజల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం
తెలుగుదేశం పార్టీ శింగనమల నియోజకవర్గం పేద ప్రజల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో నివాసముంటున్న నిరుపేద దళితులు, గిరిజనులు నాలుగున్నరేళ్లుగా గుడిసెలుసుకుని జీవనం సాగిస్తుంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని *తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, అలం నరసా నాయుడు గారు ,* తెలిపారు. బాధితులతో మాట్లాడి వారీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ నిలువ నీడ లేని వాళ్ళం, రోజు కూలి పనులకు వెళ్లి, జీవనం సాగించుకుంటున్నాం, మాకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వక పోవడంతొ గ్రామ శివారులో 132 కుటుంబాల వాళ్ళం గుడిసెలుసుకొని జీవనం సాగిస్తున్నాం అని తెలిపారు. ఇది దేవుడి మాన్యం అంటూ అధికారులు నాలుగు జేసీలతో వచ్చి తమ ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మాకు మద్దతుగా వచ్చిన సిపిఎం నాయకుల పట్ల CI నరేంద్ర రెడ్డి దూరుసుగా ప్రవర్తించారని అన్నారు. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులు, ఉన్నారని వేడుకున్న వినకుండా ఇల్లు కూల్చేశారని వాపోయారు. ఈ కార్యక్రమంలో *కన్వీనర్ పాండు, గేట్ కృష్ణారెడ్డి, ఇల్లూరు రామాంజినేయులు, మాజీ కన్వీనర్ గోరకాటి వెంకటేసు, కల్లూరు సుధాకర్ రెడ్డి, tntuc బాబయ్య, వడ్డే వన్నూరు, తెలుగు యువత జగదీష్, i tdp అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, sc సెల్ నాయకులు నరేష్, రామాంజి, ఎగువపల్లి అశోక్, రామచంద్ర, క్లస్టర్ అంజి, i tdp శ్రీధర్,సర్పంచు నరపరెడ్డి, నెట్టికంటి, నాగేష్,* తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.