దళిత ఇల్లూరు నల్లప్ప ను కులం పేరుతో దూషించిన ఇటుకులపల్లి సిఐ నరేంద్రరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ను నమోదు చేయాలి... దళిత, గిరిజన ప్రజా స
దళిత ఇల్లూరు నల్లప్ప ను కులం పేరుతో దూషించిన ఇటుకులపల్లి సిఐ నరేంద్రరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ను నమోదు చేయాలి... దళిత, గిరిజన ప్రజా సంఘాలు
దళిత
గిరిజన ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో పేదల గుడిసెలు తొలగించిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది పేదలతో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు నెరమెట్ల ఎల్లన్న ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు సాకేహరి ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు, వెంకటాపురం చంద్ర, జై భీమ్ సేన నాయకులు తరిమెల రామాంజనేయులు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప జిల్లా అధ్యక్షులు జి వెంకటేష్ జిల్లా నాయకులు జీవరత్నం పామిడి ఓబులేసు, చిరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో గుడిసెలు తొలగించిన పేదలందరికీ న్యాయం జరిగేంత వరకు ఐక్యంగా పోరాడుదామని దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కల్లూరు గ్రామంలో గుడిసెలు తొలగించిన పేదలకు న్యాయం చేయాలని కోరారు.
ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు నెరమెట్ల ఎల్లన్న మాట్లాడుతూ కల్లూరు గ్రామంలో దాదాపుగా ఉన్న ఇళ్ల స్థలాలన్నీ లక్ష్మీ నరసింహస్వామి దేవుని మాన్యం భూములే అన్నారు. అగ్రవర్ణాల వారు ఈ దేవుని మాణ్యం లోనే నిర్మించుకోవడం, ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. వాళ్లెవరినీ పట్టించుకోకుండా సెంటు స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడం అత్యంత దుర్మార్గం అన్నారు. పేదల పక్షాన ప్రశ్నించడానికి వెళ్లిన సిపిఎం నాయకులపై సిఐ నరేంద్రరెడ్డి చేయిచేసుకోవడం హేయమైన చర్య అన్నారు.
ఎస్సీ ఎస్టీ జె ఏ సి నాయకులు సాకే హరి మాట్లాడుతూ
పేదల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా కమ్యూనిస్టు పార్టీలు, నాయకులు పని చేస్తారనే విషయాన్ని వారు తెలుసుకోవాలని సూచించారు. పోలీసులే పేదల గుడిసెలు తొలగించడం దుర్మార్గంగా ఉందన్నారు.
గుడిసెల తొలగింపు అప్రజాస్వామిక చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు చిన్న ఆంజనేయులు మాట్లాడుతూ కల్లూరులో గుడిసెలు వేసుకున్న వారంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పేదలే అన్నారు. వారికి నిలువ నీడ లేకుండా చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.
జై భీమ్ సేన నాయకులు తరిమెల రామాంజనేయులు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఆదేశిస్తే పోలీసులు ఇష్టారాజ్యంగా పేదలపై అధికారం దుర్వినియోగం పాల్పడటం సరికాదన్నారు.
కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప మాట్లాడుతూ
హైకోర్టు ఉత్తర్వులను భేఖాతరు చేస్తూ పేదలను నడిరోడ్డుపై పడేశారని మండిపడ్డారు. అధికారులు వైసిపి కార్యకర్తల్లాగా వ్యవహరిస్తే ఎలాని ప్రశ్నించారు. సిఐ నరేంద్ర రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దళితుడైన నల్లప్ప ను కులం పేరుతో దూషించిన సిఐ నరేంద్ర రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కల్లూరు గ్రామంలో పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించరాదని హైకోర్టు తీర్పు ఉన్నా వాటిని భేఖారు చేస్తూ పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు గుడిసెలు తొలగించారని తెలిపారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు దేవాదాయ శాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరించి పేదలకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ఆలయ భూములను వైసిపి నాయకులు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్కడ అన్యాక్రాంతం అయిన భూములన్నీ ఖాళీ చేయించే దమ్ము అధికారులకు ఉందాని ప్రశ్నించారు. సిఐ నరేంద్రరెడ్డి సిపిఎం నాయకుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించి, కులం పేర్లతో దూషించి దాడి చేశాడన్నారు. ఆ అధికారిని సస్పెండ్ చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. కల్లూరులో బాధిత పేదలందరికీ గుడిసెలు తొలగించిన స్థలంలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.
ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Nov 06 2023, 15:23