Mane Praveen

Sep 27 2023, 10:08

NLG: నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి, టీ ఏస్ పి ఏస్ సి బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుద్యోగుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నిరుద్యోగులు బలైతూనే ఉన్నారని, గ్రూప్-1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు నిర్వహించారు. ఎలాంటి పారదర్శకత లేకుండా, అక్రమాల పుట్టగా ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా మళ్ళీ పరీక్షల నిర్వహించాలనుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు. నిరుద్యోగుల పక్షాన తీవ్ర మొండి వైఖరి వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యావత్ నిరుద్యోగ లోకమంతా రానున్న ఎలక్షన్లలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి దగ్గర పడ్డాయని, ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని, టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ ను మరియు అలాగే సభ్యులను తొలగించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, నూతన బోర్డును నియమించి జరగబోయే పరీక్షలను పారదర్శకతతో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. సిహెచ్ మౌనిక, సిహెచ్ కిరణ్మయి మాట్లాడుతూ.. కుటుంబాలను వదిలేసి వచ్చి సంవత్సరాలుగా లైబ్రరీలలో చదువుకుంటూ హాస్టల్ ఫీజులు కట్టి, ఒక పూట తిండి తిని తినక, మా కుటుంబాలు రోడ్లమీద పడే పరిస్థితి వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనట్లేదని, మా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రేణుక, మౌనిక, కోట క్రాంతి, వినోద్ చారీ, క్రాంతి కుమార్, కిరణ్, సైదులు, విక్రమ్, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. SB NEWS

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA

Mane Praveen

Sep 26 2023, 21:52

'అంగన్వాడి ఉద్యోగులను పెర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం ఆగదు': నాంపల్లి చంద్రమౌళి
NLG: మర్రిగూడ మండలంలో అంగన్వాడీ ఉద్యోగులు 16వ రోజు సమ్మెలో భాగంగా మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు పది లక్షలు, హెల్పర్ కు 5 లక్షల చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని, 2017 నుండి టీఏ డీఏ ఇంక్రిమెంట్ ఇన్చార్జి అలవెన్సులు బకాయిలు మొత్తం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులను పెర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం ఆగదని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శోభ, కే రజిత,జయశ్రీ, శారద, లక్ష్మి, సులోచన, అరుణ, అనంతలక్ష్మి, పద్మ, నిర్మల, సుగుణ యాదమ్మ,విమలాదేవి, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

Mane Praveen

Sep 26 2023, 20:16

రేషన్ కార్డుల నుండి పేర్లు తొలగిన వారి యొక్క పేర్లు నమోదు చేయడానికి అదనపు మీసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి: నూనె వెంకట్ స్వామి
నల్లగొండ జిల్లా, చిట్యాల: ఇటీవల రేషన్ కార్డులలో పేర్లు నమోదు కానీ వారి యొక్క పేర్లను అన్నిటిని నమోదు చేయడం, వారి యొక్క ఫింగర్ ప్రింట్లను అప్డేట్ చేయడం, వారి యొక్క ఐరిష్ కెమెరాల ద్వారా కంటిపాప లను నమోదు చేయడం ఇటువంటి కార్యాక్రమాలకు సంబంధించి చిట్యాల లో ఒకే మీసేవ కేంద్రం ఉండడం వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని,  ప్రజా పోరాట సమితి నాయకులు మంగళవారం ఎంపిడిఓ కార్యాలయం ముందు బాధితులు అందరితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ.. కలెక్టరేట్ లో ఉన్న మీసేవకు సంబంధించిన జిల్లా మేనేజర్ తో మాట్లాడి వెనువెంటనే చిట్యాల లో అదనపు మీసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, చేయకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్పిఎస్ నాయకులు చిట్టిమల్ల శ్రవణ్ కుమార్ యోధ, ఉయ్యాల లింగస్వామి గౌడ్, రొయ్య అంజయ్య, ఎన్నమల్ల ప్రదీప్, దొడ్డి యాదయ్య, ఎర్రమాద శ్రీనివాస్, రెడపాక లక్ష్మి, పానుగుల్ల పవిత్ర, సీమ, సునీత, బూడిద సంజీవ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 26 2023, 19:27

లెంకలపల్లి: వినాయకుడి పూజలో పాల్గొన్న దాసరి వెంకన్న దంపతులు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా..  గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి గణేష్ పూజలలో భాగంగా, మంగళ వారం, గ్రామానికి చెందిన దాసరి వెంకన్న దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాసరి గణేష్, శివ లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 26 2023, 12:30

NLG: క్షేత్ర పర్యటన నిమిత్తం సీసీఎంబి హైదరాబాద్ వెళ్లిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్గొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ  కళాశాల మైక్రో బయాలజీ మరియు బయోటెక్నాలజీ గ్రూప్స్ విద్యార్థులు, ఈ రోజు క్షేత్ర పర్యటన నిమిత్తం సెంటర్ ఫర్ సెల్లులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి) హైదరాబాడ్ కు "ఓపెన్ డే - వన్ నేషన్ వన్ ల్యాబ్" సందర్భంగా, శాస్త్రీయ పరిశోధనలు ప్రత్యక్షంగా చూసి సైంటిఫిక్ రీసెర్చ్ ను తెలుసుకోవడానికి, సీసీఎంబి హైదరాబాద్ కి వెళ్లారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్ తెలిపారు. మైక్రో బయాలజీ మరియు బయోటెక్నాలజీ విభాగాధిపతి నాగరాజు మాట్లాడుతూ.. నేషనల్ సైంటిఫిక్ ల్యాబ్స్ సందర్శించడం ద్వారా ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలు ఏ రంగాలలో ఏ విధంగా పరిశోధన చేస్తున్నారు, పరిశోధన ల్యాబ్ లలో ఉండేటువంటి అత్యాధునిక పరికరాలు ప్రత్యక్షంగా విద్యార్థులు చూడటం ద్వారా, ఆ పరికరాలు పనిచేసే విధానం ప్రస్తుతం దేశీయ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన విధానాన్ని అర్థం చేసుకుంటారని, విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి శాస్త్రవేత్తల ద్వారా అర్థం చేసుకుంటారని, భవిష్యత్తులో విద్యార్థులు పరిశోధనా రంగంలో రాణించటానికి ఈ సైంటిఫిక్ విజిట్ విద్యార్థులలో శాస్త్రీయ పరిశోధన స్ఫూర్తిని నింపుతుందని , ప్రస్తుత విద్యార్థులే భవిష్యత్ భారత దేశంలో పరిశోధకులుగా తయారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోస్న, జంతు శాస్త్ర అధ్యాపకురాలు, డాక్టర్ దుర్గాప్రసాద్, గ్రంథ పాలకులు, మల్లేష్ ఫిజికల్ డైరెక్టర్ , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 26 2023, 08:28

TS: వినాయకుడి పూజలో పాల్గొన్న ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి
నల్లగొండ: పట్టణంలోని అక్కచెల్మా 26వ వార్డు వినాయకుని దగ్గర పూజా కార్యక్రమం లో సోమవారం, ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ కంజర వాయిద్యకారుడు నాగుల శ్రీనివాస్, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

Mane Praveen

Sep 25 2023, 20:15

NLG: టీఎస్పీఎస్సీ ని రద్దు చేయాలని బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి (వీడియో)
టీఎస్పిఎస్సి ని రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నల్లగొండలో బీఎస్పీ నాయకులు కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. కార్యక్రమంలో పలువురు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 25 2023, 17:25

IBP: పలువురికి నియామకపు పత్రాలు అందజేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని,  ఇబ్రహీంపట్నం మండల ఓబీసీ సెల్ చైర్మన్ గా పసుల వినోద్ కుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓబీసీ సెల్ చైర్మన్ గా పండాల శ్రీనివాస్ గౌడ్ నియమితులు అయ్యారు, వారికీ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్  మల్ రెడ్డి రంగారెడ్డి సోమవారం నియామకపు పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఓబీసీ సెల్ చైర్మన్ సుబ్బురు పాండు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎదుళ్ల పాండు రంగారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌని బాలరాజ్ గౌడ్, ఆకుల ఆనంద్ కుమార్, కౌన్సిలర్ ఆకుల మమత, సీనియర్ నాయకుడు మంకాల శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంకాల కరుణాకర్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్, సంతోష్, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS RR DIST

SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 25 2023, 17:01

నల్లగొండ కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ ఆఫీస్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 20 తేదీ నుండి నిరవధిక సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవరిస్తుందని ఆరోపించారు. 2001 సంవత్సరం లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఆనాటి ప్రభుత్వం నేటి వరకు విజయవంతంగా కొనసాగుతుంది. కానీ మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు మాత్రం తొలిగిపోలేదు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స్వయంగా 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించి జీవో విడుదల చేసినా, నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గత ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అప్పులు చేసి వంట చేస్తే, o కార్మికులకు బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేకుండా ప్రకటన చేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంట కార్మికులకు ఇచ్చే వేతనంతో పాటు కమిషన్ పెంచాలని ఆయన కోరారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అకారణంగా వంట కార్మికులను తొలగించరాదని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు అకారణంగా మరణిస్తే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే వంట సామాను, సంబంధించిన సామాగ్రిని సరఫరా చేయాలి. కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వంట కార్మికుల గౌరవ వేతనం 3000 తక్షణమే నిధులను విడుదల చేయాలని కోరారు. ధర్నా అనంతరం అడిషనల్ కలక్టర్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జే జంగమ్మ, కార్యదర్శి బంటు రాజేశ్వరి, జిల్లా కౌన్సిల్ సభ్యులు జే వెంకట రాములు, ఏ మల్లయ్య, సైదులు, లక్ష్మయ్య, శేఖర చారి, సైదమ్మ, వెంకటమ్మ, సాలమ్మ, అలివేలు, విజయ, మల్లమ్మ, నారమ్మ, ఫాతిమా, లక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Sep 25 2023, 15:55

NLG: మెడికల్ కాలేజీ కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించండి: జిల్లా కలెక్టర్ కు మెమొరాండం
నల్లగొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇప్పించాలని, కొత్త టెండర్ వెంటనే పూర్తి చేయాలని, మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం AITUC ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టర్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల దాటిపోయినా నేటికీ వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని అన్నారు. జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి, మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు. ప్రిన్సిపాల్, కాంట్రాక్టర్ ఇద్దరి మధ్య లో కార్మికులు నలిగిపోతున్నారని అన్నారు. టెండర్ నోటిఫికేషన్ వేసి 10 నెలలు దాటి పోతున్నా, నేటి వరకు పూర్తి చేయకుండా కాలేజీ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం హాస్పిటల్ కార్మికుల వేతనాలు పెరిగినా,నల్లగొండ మెడికల్ కాలేజీలో పనిచేసే కార్మికులకు మాత్రం నేటికీ పాత జీతాలే ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో AITUC మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. డి జకీర్, అండాలు, చెంద్రమ్మ, స్వర్ణ, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, జమీర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

STREETBUZZ NEWS APP