బుక్కరాయసముద్రంలో ఉపాధి హామీ పథకం కింద అనంతసాగర్ కాలనీ చెరువు కట్ట పైన ముళ్ళ పొదలు తొలగింపు కార్యక్రమం

బుక్కరాయసమద్రం మండలంలోని బికేస్ GP లో ఉపాధి హామీ పథకం కింద ఇరిగేషన్ ట్యాంక్ అనంతసాగర్ చెరువు కట్ట పైన చేపట్టిన కంప తొలగింపు పనిని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ యన్. వేణుగోపాల్ రెడ్డి సార్ గారు, అనంతపురం క్లస్టర్ సహాయ పథక సంచాలకులు శ్రీమతి బి అనురాధ మేడమ్ గారు, మండల గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి సునీత గారు క్షేత్రస్థాయినందు పర్యవేక్షించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బుల్లె నారాయణస్వామి అన్నగారు, ఏపీవో యం. పోలేరయ్య గారు,  జేఈ ఓం ప్రసాద్, సాంకేతిక సహాయకులు కుల్లాయిస్వామి, క్షేత్ర సహాయకుడు రవి ప్రసాద్ పాల్గొనడం జరిగింది

జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికా కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూ.ల చెక్కును పంపిణీ..

జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికా కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూపాయల చెక్కును బెటాలియన్ కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా కుటుంబానికి అందించటం జరిగింది ఇంకా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేటట్లు మరియు కారుణ్య నియామకం కింద జాబ్ వారి భార్య తొందరగా వచ్చేటట్లు చూస్తాము అని చెప్పటం జరుగుతుంది.ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, AO నాగభూషణమ్మ , బెటాలియన్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.

తిరుమల శ్రీవారిని రాష్ట్ర విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డి తో పాటు స్వామివారిని దర్శించుకున్న స్టోర్ డీలర్ల ఉపాధ్యక్షులు సాకే లక్ష్మీనారాయణ

తిరుమల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి తో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకదర్శనం ద్వారా దర్శించుకున్న బుక్కరాయసముద్రం మండల వైస్ ఎంపీపీ-2 భర్త మరియు మండల స్టోర్ డీలర్ల సంఘం ఉపాధ్యక్షులు రేకులకుంట సాకే లక్ష్మీనారాయణ.

ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా సంఘీభావం తెలిపిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు మరియు రిమాండుకి పంపడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాల్వ శ్రీనివాసులు గారు రాయదుర్గం లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు దీక్షకు మద్ధతుగా సంఘీభావం తెలిపిన ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు,ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,జిల్లా సర్పంచ్ సంఘం మాజీ ఉపధ్యక్షులు ఆలం వెంకటరమణ గారు,రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ గారు,బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు,జిల్లా నాయకులు రామలింగారెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి గారు,తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు,రాష్ట్ర గాండ్ల సాధికారిక కన్వీనర్ విశాలాక్షి గారు,రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు తదితరులు పాల్గొన్నారు

తన స్వగ్రామం లో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీపార్టీకుటుంబ సభ్యులకు ₹20000/- రూ.లు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసి

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త మంగళ నరసింహులు భార్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారిని  పరామర్శించి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి మరియుబండారు బొజ్జ కొండన్న కోడెలు అమృత గారు అనారోగ్యం తో ప్రభుత్వ వైద్యశాల నందు చికత్స పొందుతున్న విషయం తెలుసుకొని పరామర్శించి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు

ఈ కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకులు అనిల్ చౌదరి గారు,చెన్నమయ్య,ఆదినారాయణ, డీలర్ కొండ తదితరులు పాల్గొన్నారు

ఇ క్రాప్, ఇ కె వై సి కి గడువు సెప్టెంబర్ 30.... జిల్లా వ్యవసాయాధికారిని శ్రీమతి ఉమా మహేశ్వరమ్మ...

రైతులు తాము వేసిన పంటలను ఈ నెలాఖరు లోగ పంట నమోదు చేయుంచుకోవాలని అదే విదంగా రైతుల వేలిముద్రలను వేయుంచి ఇ కె వై సి పూర్తి చేయాలనీ రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లను ఆదేశించారు. మండలము లోని ఓబుళపురం గ్రామములో కమీషనర్ వారు పంపిన ర్యాండం సర్వే నెంబర్ లో వేసిన కంది పంటను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు.గ్రాములో ఉన్న ప్రతి పంట వేసిన రైతు పంట నమోదు చేసుకుంటేనే పంట మద్దతు ధరకు అమ్ముకోవడానికి నష్టపోయిన పంటకు నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మొదలగునవి వర్తించాలంటే కచ్చితంగా పంట నమోదు చేయాలనీ రైతు భరోసా కేంద్ర ఇంచార్జ్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సహాయ వ్యవసాయ సంచాలకులు రవి, వ్యవసాయధికారి శ్యాం సుందర్ రెడ్డి, గ్రామ రైతులు సర్వశ్రీ మహానంద రెడ్డి, అమర్నాథ్, వెంకటరామి రెడ్డి, ఉద్యాన సహాయకుడు శ్రీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

రైతన్నల నేస్తం ఆర్బీకేలు....* *రైతుకు భరోసా భూ హక్కు పత్రాలు.. : ఆలూరు సాంబ శివారెడ్డి*

రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఆర్బీకేల ద్వారా భరోసాను, భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ భూ హక్కు పత్రాలను అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం గాంధీ నగర్ లోని గ్రామ సచివాలయం - 4 పరిధిలో నూతన రైతు భరోసా కేంద్రాన్ని సాంబశివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రారంభించారు. మండల పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి రోడ్డు సమీపంలో సొసైటీ (పి.ఏ.సి.యస్) ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ మార్కెట్ గోడౌన్ కు భూమిపూజ చేశారు. ఫేస్-2 లో భాగంగా రూ.70 లక్షల ఖర్చుతో నిర్మాణం జరగనుంది. అనంతరం యల్లనూరు మండలం 85.నిట్టూరు గ్రామంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కురక్ష పథకం పత్రాలను పంపిణీ చేశారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా కేంద్రాల వల్ల ఎంతో మేలు జరుగుతోందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయం సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో భూ రీ సర్వే చేపట్టడం లేదన్నారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా, అక్రమాలకు తావు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా ఉచితంగా భూ హక్కు పత్రాలు అందిస్తున్నామన్నారు. 85.నిట్టూరు గ్రామంలో దాదాపు 359 మంది రైతులకు జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం కింద పత్రాలు అందజేశారు.
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య సలహాదారుడు ఆలూరు సాంబశివరెడ్డి