17వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె, మద్దతు తెలిపిన ప్రియదర్శిని
![]()
నకిరేకల్: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని నిరసన దీక్షలో పాల్గొని గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ప్రజలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలపాలన్నారు.గ్రామపంచాయతీ కార్మికులు ప్రజలు ఆరోగ్యంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం వారి శ్రమను గౌరవించకుండా కనీస వేతనం ఇవ్వకుండా, వారి శ్రమను దోచుకుంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చలకు ఆహ్వానించి, వెంటనే వాటి పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తడకా విజయ్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి పబ్బతి శ్రీశేలం, మండల అధ్యక్షులు పల్స సైదులు , ఉపాధక్షులు రాంరెడ్డి, కార్యదర్శి కందికంటి ప్రకాష్, కోశాధికారి నకిరేకంటి మట్టపల్లి, గద్దల విమలమ్మా, శ్రీనివాస్, యాదయ్య, వెంకటమ్మ, అలివేలు, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు

గ్రామపంచాయతీ కార్మికులు ప్రజలు ఆరోగ్యంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం వారి శ్రమను గౌరవించకుండా కనీస వేతనం ఇవ్వకుండా, వారి శ్రమను దోచుకుంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చలకు ఆహ్వానించి, వెంటనే వాటి పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తడకా విజయ్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి పబ్బతి శ్రీశేలం, మండల అధ్యక్షులు పల్స సైదులు , ఉపాధక్షులు రాంరెడ్డి, కార్యదర్శి కందికంటి ప్రకాష్, కోశాధికారి నకిరేకంటి మట్టపల్లి, గద్దల విమలమ్మా, శ్రీనివాస్, యాదయ్య, వెంకటమ్మ, అలివేలు, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు

పట్టణంలో వివిధ వార్డులలో శిథిలావస్థకు చేరిన గృహాలలో నివాసం ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తలు వహించాలని అన్నారు.
హైదరాబాద్: ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం నల్లగొండ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్టీ, ఎస్టీ గురుకులాల సెక్రెటరీ నవీన్ నికోలస్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి మెమొంటోను అందజేశారు.
ఈ సందర్భంగా నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. గురుకులాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించి, నిరంతరం శ్రమించి తోడ్పాటునందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిపిఎల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మచ్చ నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు ఇతర రాష్ట్ర నాయకులు, పిపిఎల్ నల్లగొండ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట: మండల బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రామన్నపేట సూర్య ప్రభంజనం ఎడిటర్ గృహంలో, బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని,నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో సూర్య ప్రభంజనం ఎడిటర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఏటెల్లి శ్రీనివాస్ ను పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధ్యక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, కోశాధికారి గట్టు రమేష్, నాయకులు బెల్లి మల్లయ్య యాదవ్,
నకిరేకంటి స్వామి, బొడ్డు నవీన్, మేడి తేజ, మేడి చందు, నకిరేకంటి హరీష్, మేడి నిఖిల్, గొర్ల నర్సింగరావు , మేడి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు
నల్లగొండ: మున్సిపాలిటీలోని 18వ వార్డులో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వార్డులోని ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండడానికి, శుక్రవారం మురికి నీరు నిల్వ ఉన్న పలు చోట్ల మరియు ఓపెన్ నాలా లలో దోమల నివారణ కొరకు దోమల మందును, కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాసులు పిచికారి చేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
నల్లగొండ జిల్లా: తాటి చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... సుర్వి లింగస్వామి గౌడ్ (47) అనే గీత కార్మికుడు తన దిన చర్యలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో, ఈదురుగాలులు రావడంతో చెట్టు పై నుంచి జారిపడి గురువారం సాయంత్రం మృతి చెందాడు.
ఈ సందర్భంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. కులవృత్తిని నమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్న కార్మికుడు ఆకస్మాత్తుగా మృతి చెందడంతో వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు.
ప్రభుత్వం వెంటనే, బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్సిగ్రేషియా ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.
నల్లగొండ జిల్లా, నకిరేకల్: భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు, నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు.
ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డ్రైనేజీ కాలువలు, చెరువులు, వాగులు, వంకల వద్దకు ప్రజలు వెళ్లకూడదని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకూడదని చెప్పారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వీలైనంత సహకారాలు అందించాలని అన్నారు. బిఎస్పి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన కాటగోని ముత్యాలు అనారోగ్య కారణంగా, లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేశ్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కలువగా, ముందస్తు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 1,00,000 రూపాయల ఎల్ఓసి ని ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ మరియు గ్రామస్తుడు కాటగోని ముత్యాలు, ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటగోని రాజు, రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
Jul 22 2023, 14:45
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.3k