msrinivas

Jul 11 2023, 15:44

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *పాల్వంచ మండల మేరు కుల సంఘ విస్తృత స్థాయి సమావేశం*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ

పాల్వంచ మండల మేరు కుల సంఘ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు పాల్వంచ

అయ్యప్పనగర్ లోని మాడిశెట్టి రాజమనోహర్ నివాసంలో జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర మేరు సంఘ నాయకులు తాళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన

సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ఇటీవలి భద్రాచలం లోని అభయ ఆంజనేయ దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన తాళ్ల రవికుమార్ ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్సు లోని

పిల్లల యూనిఫామ్స్ కుట్టుపని మేరుకులస్తులకు మాత్రమే ఇవ్వాలని మరియు బి.సీ

లోన్స్ లో మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని అలాగే కుట్టుపని పై జీవించే ప్రతీ ఒక్క మేరు కుటుంబాలకు ఉచితంగా కుట్టు మిషన్ లను పంపిణి

చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమం లో పాల్వంచ మేరు ఉపాధ్యక్షులు సింగు రాంబాబు, కార్యదర్శి

మాడిశెట్టి రాజమనోహర్, కోశాధికారి శనగవరపు రాజేశ్యం, రేఖల ప్రభాకర్,

కొట్టురు మధు సతీష్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

msrinivas

Jul 07 2023, 09:30

*భద్రాద్రి కొత్తగూడెం* *జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ కల్పించాలి..*

డి ఈ వో కు మెమోరాండం ఇచ్చిన టి యూ డబ్ల్యూబి జె (టి జె ఎఫ్ )

జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు గత సంవత్సరం జారిచేసినట్లు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితిని కల్పించాలంటూ జిల్లా విద్యాశాఖధికారి సోమశేఖర శర్మ ని టి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వంకంగా కలిసి వినతిపత్రం ను అందచేయటం జరిగింది. డి ఈ వో సానుకూలంగా స్పందిస్తూ రెండు రోజుల్లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేటు పాఠశాలకు సర్కులర్ జారీ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం శ్రమిస్తున్న టీజేఎఫ్ కల్లోజి శ్రీనివాస్ ను జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు.డి ఈ వో ని కలిసిన వారిలో టి జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మహమ్మద్, టెంజు అధ్యక్షులు వట్టికొండ రవి,టెంజు ప్రధాన కార్యదర్శి సి హెచ్ వి నరసింహారావు, సహాయ కార్యదర్శి అచ్చి ప్రభాకర్ రెడ్డి,ప్రచార కార్యదర్శి కృష్ణం రాజు,స్మాల్ పేపర్స్ ప్రధాన కార్యదర్శి ఆఫ్జల్ పఠాన్, క్రాంతి, రాజకుమార్, సురేష్, చిరంజీవి,రహీం తదితరులు ఉన్నారు.

msrinivas

Jul 06 2023, 14:11

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో హెల్త్ క్యాంప్*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ 

 జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా పాల్వంచ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో మొబైల్ హెల్త్ క్లీనిక్ ద్వారా వివిధ రకాల డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, ఫార్మసిస్టులతో వారి గ్రామంలో వారి వద్దకే వెళ్లి హెల్త్ క్యాంపులు నిర్వహించి వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇందులో భాగంగా ఈరోజు పాల్వంచ పట్టణంలోని నెహ్రునగర్, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, తెలంగాణ నగర్ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నెహ్రు నగర్ లోని రాతి చెరువు కట్ట ప్రక్కన హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు సుమారు 300 మంది వరకు వచ్చి వివిధ రకాల వైద్య సేవలు పొందడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

msrinivas

Jul 01 2023, 10:09

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *త్వరలోజిల్లాలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ 

త్వరలోజిల్లాలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

రాష్ట్ర ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ

పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పాల్వంచకు విచ్చేసిన రాష్ట్ర ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిసిన టియుడబ్ల్యూజే, టీజేఎఫ్ నాయకులు. భద్రాద్రి జిల్లా లోని జర్నలిస్టుల ఇళ్ల సంబంధించిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించన హరీష్ రావు త్వరలో జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వినత పత్రం అందించిన వారిలో టియూడబ్ల్యూజె టీజేఎఫ్ అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్, ఐజేయూ సభ్యులు చండ్ర నరసింహారావు,టిన్యూస్ ఉమ్మడి జిల్లాల బ్యూరో వెన్నబోయిన సాంబశివరావు, తెంజు జిల్లా అధ్యక్షుడు వట్టి కొండ రవి,తెంజు జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ వి నసింహారావు, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు చెంగ పోగు సైదులు, తెంజు ప్రచార కార్యదర్శి కృష్ణంరాజు, జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి, కనుమ రమేష్,కేరటం శ్యామ్,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

msrinivas

May 21 2023, 13:30

*భద్రాద్రి కొత్తగూడెం* *జర్నలిస్టుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ ను కలసిన టి.యూ.డబ్ల్యు.జె(టి.జె.ఎఫ్) హెచ్-143 యూనియన్ నాయకులు*

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న

టి.యూ.డబ్ల్యు.జె(టి.జె.ఎఫ్)హెచ్-143యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, మహ్మద్ షఫీ.

టెంజు జిల్లా అధ్యక్షుడు వట్టికొండ రవి, అక్రిడేషన్ కమిటీ సభ్యులు, జిల్లా పౌర సంబంధాల అధికారి శీలం శ్రీనివాసరావు సమక్షంలో

జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కు రెండో విడత అక్రిడేషన్ కార్డులు మంజూరు, మార్పులు చేర్పులు ఇళ్ల స్థలాల పంపిణీ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జర్నలిస్టుల సమస్యలను అదనపు కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు, డీపీఆర్వో శీలం శ్రీనివాసరావు సమక్షంలో వివరించారు.

 ఎంతోకాలంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రెండో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సత్వరమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, అక్రిడేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబం ధించి చర్యలు తీసుకోవాలని , జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరారు.

అదనపు కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.

సోమవారం రోజున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని, అంతే కాకుండా సోమవారం రోజున యూనియన్ నాయకులు అక్రిడేషన్ సభ్యులు కూడా జిల్లా కలెక్టర్ ను కలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సాక్షి జిల్లా బ్యూరో కృష్ణ గోవింద్, ఐ.జె.యూ&అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు చండ్ర నరసింహా రావు,అక్రిడిడేషన్ కమిటీ సభ్యులు తోటమల్ల బాల యోగి, కాటా సత్యం, యూని యన్ నాయకులు రవికుమార్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

msrinivas

May 20 2023, 18:51

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వనమా*

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమావెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేసారు.

 వార్డులలో తిరిగి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను అడిగి

తెలుసుకొని సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని డాక్టర్ లకు, వైద్య సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ హాస్పటల్ ఆవరణలో షెడ్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు, లిఫ్ట్ మరియు ఎక్విప్ మెంట్ కోసం 20 లక్షలు శాంక్షన్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ బీఅర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రాజు గౌడ్,పెద్దమ్మగుడి చైర్మన్ మహిపతి రామలింగం, ఎస్ వీ అర్ కే ఆచార్యులు,హాస్పటల్ డాక్టర్స్ ముక్కంటేశ్వరరావు, సోమరాజు దొర, సిబ్బంది,తదితరులు

పాల్గొన్నారు.

msrinivas

Feb 28 2023, 21:03

పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకం:ఎస్పీ డా. వినీత్.జి ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకం : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు డీ-మొబిలైజేషన్ పెరేడ్ నందు ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు ఈ రోజు జిల్లా సాయుధ దళ విభాగంలో జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల విధులు నిర్వర్తించే ఏఆర్ అధికారులు,సిబ్బందికి గత 15 రోజులుగా మొబిలైజేషన్లో భాగంగా వారి విధులలో మరలా తిరిగి శిక్షణను పొందడం జరిగింది.ముగింపు కార్యక్రమం అయిన డీ-మొబిలైజేషన్ కు ఈ రోజు జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం ఈ డీ-మొబిలైజేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ముందుగా ఎస్పీ డా. వినీత్. జి జిల్లా సాయుధ బలగాల విభాగం తరపున పరేడ్ కమాండర్ ఆర్ఐ దామోదర్ నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం 04 ప్లాటున్స్ ద్వారా జరిగిన మొబిలైజేషన్ పరేడ్ ను ఎస్పీ వీక్షించారు.తరువాత జిల్లా డాగ్ స్క్వాడ్ నందు పని చేస్తున్న జాగిలాల ప్రతిభను ప్రదర్శించారు.స్క్వాడ్ డ్రిల్,లాఠీ డ్రిల్,మాబ్ ఆపరేషన్ తదితర అంశాలపై ఏఆర్ సిబ్బంది తమ విధుల తీరును వ్యక్తపరుస్తూ గత పదిహేను రోజులుగా వారు తీసుకున్న శిక్షణను ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఎస్పీ డా. వినీత్. జి మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం యొక్క పాత్ర చాలా కీలకమని అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరోక్షంగా,ప్రత్యక్షంగా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు.జిల్లాలో వివిధ రకాల విధులను నిర్వర్తిస్తూ,సంవత్సరంలో ఒకసారి అందరూ కలిసి అట్టి విదులలో తమ అనుభవాలను పంచుకుంటూ క్రమశిక్షణతో ముందుకెళ్లడానికి ఈ మొబలైజేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.నిరంతరం ప్రజాసేవలో ప్రత్యక్షంగా,పరోక్షంగా పోలీస్ శాఖలో విధులను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం జిల్లా సాయుధ విభాగంలోని పోలీస్ అధికారులు,సిబ్బందితో సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వీలైనంత త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసారు.

msrinivas

Feb 28 2023, 12:18

*డాక్టర్ ప్రీతి మృతికి వివిధ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన*

భద్రాద్రి కొత్తగూడెం

వివిధ జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన డాక్టర్ ప్రీతి కి ఘన నివాళి

దోషులను కఠినంగా శిక్షించాలి.

ర్యాగింగ్ కారణంగా డాక్టర్ ధారావత్ ప్రీతి మృతి తీరనిలోటని ప్రీతి మరణానికి కారకుడైన వారిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటన మరల పునర్వతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద డాక్టర్ ప్రీతికి ఘన నివాళి అర్పించారు. వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

 టి.టి.డబ్ల్యు.జె.ఏ, టి.యూ. డబ్ల్యు.జె,(టి.జె.ఎఫ్), టి.యూ. డబ్ల్యు.జె(ఐ.జె.యూ) ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో బానోత్ వీరు, కల్లోజి శ్రీనివాస్, ఉదయ్ కుమార్,పోలిశెట్టిరమేష్,   వట్టికొండ రవి,షఫీ,ఈశ్వర్, రమేష్,శంకర్,రాందాస్, అశోక్, చిరంజీవి, లక్ష్మణ్,హరి, కోటి,రాము,రామకృష్ణ, సర్వేశ్,ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు గుండెపూడిసతీష్,బాబురెడ్డి నాగేశ్వరరావు, కరుణాకర్ ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు.