లెంకలపల్లి లో ఘనంగా విద్యా దినోత్సవం


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో సర్పంచ్ పాక నగేష్ అధ్యక్షతన నిర్వహించిన విద్యా దినోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి, మన ఊరు మనబడి కార్యక్రమం కింద రూ. 32.78 లక్షలతో అభివృద్ధి చేసిన ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, మాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జగన్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, భీమనపల్లి ఎంపీటీసీ విష్ణు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం హరి, హెడ్మాస్టర్ యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


 
						



 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చంద్రారెడ్డి- మమత ల  కుమారుడు వై. కౌశిక్ రెడ్డి, జాతీయస్థాయిలో 515 ర్యాంక్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. హైదరాబాదు వనస్థలిపురం నారాయణ కళాశాలలో చదివినట్లు ర్యాంకు సాధించిన విద్యార్థి తెలిపారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు, భీమనపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు కౌశిక్ రెడ్డి ప్రతిభ పై అభినందన వర్షం కురిపిస్తున్నారు.
ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చంద్రారెడ్డి- మమత ల  కుమారుడు వై. కౌశిక్ రెడ్డి, జాతీయస్థాయిలో 515 ర్యాంక్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. హైదరాబాదు వనస్థలిపురం నారాయణ కళాశాలలో చదివినట్లు ర్యాంకు సాధించిన విద్యార్థి తెలిపారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు, భీమనపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు కౌశిక్ రెడ్డి ప్రతిభ పై అభినందన వర్షం కురిపిస్తున్నారు.
 



 
 
 నల్లగొండ జిల్లా: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని ఒకేసారి మాఫీ చేయాలని, వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, మర్రిగూడ మండల కేంద్రంలో మండల తాహశీల్దార్ వెంకటేశ్వర్లు కు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య  మాట్లాడుతూ.. 2023 ఖరీఫ్ సీజన్ మొదలవుతుందని, రుణమాఫీ చేసి వెంటనే రైతులకు రుణాలు ఇవ్వాలని అన్నారు. మర్రిగూడ మండల రైతు సంఘం అధ్యక్షులు కొట్టం యాదయ్య, కార్యదర్శి ఉప్పునూతల వెంకటయ్య, రైతు మేకల రాంరెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని ఒకేసారి మాఫీ చేయాలని, వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, మర్రిగూడ మండల కేంద్రంలో మండల తాహశీల్దార్ వెంకటేశ్వర్లు కు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య  మాట్లాడుతూ.. 2023 ఖరీఫ్ సీజన్ మొదలవుతుందని, రుణమాఫీ చేసి వెంటనే రైతులకు రుణాలు ఇవ్వాలని అన్నారు. మర్రిగూడ మండల రైతు సంఘం అధ్యక్షులు కొట్టం యాదయ్య, కార్యదర్శి ఉప్పునూతల వెంకటయ్య, రైతు మేకల రాంరెడ్డి పాల్గొన్నారు.
 
 నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్లో, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  అందులో భాగంగా గురువారం నాడు  'ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు, చేపలతో వండిన ఆహార పదార్థాలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వివిధ వండిన చేపల కర్రీ ప్యాకులు వివిధ రేట్లలో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు కళాకారులు తమ కళా ప్రదర్శనలు చేశారు. స్థానిక ప్రజలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్లో, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  అందులో భాగంగా గురువారం నాడు  'ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు, చేపలతో వండిన ఆహార పదార్థాలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వివిధ వండిన చేపల కర్రీ ప్యాకులు వివిధ రేట్లలో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు కళాకారులు తమ కళా ప్రదర్శనలు చేశారు. స్థానిక ప్రజలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
   
   
 
 కుటుంబాలని పరామర్శించాలని ఒక ప్రకటన కోరారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా రైల్వే శాఖలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, క్షతగాత్రులకు రూ. 30 లక్షలు అందజేయాలని ధనంజయ్ డిమాండ్ చేశారు.
 కుటుంబాలని పరామర్శించాలని ఒక ప్రకటన కోరారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా రైల్వే శాఖలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, క్షతగాత్రులకు రూ. 30 లక్షలు అందజేయాలని ధనంజయ్ డిమాండ్ చేశారు.
 
 
   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, ఈరోజు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి, ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదిక వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం  రైతులకు అందిస్తున్న  రైతు సంక్షేమ పథకాల గురించి అధికారులు వివరించారు, మరియు వాటిని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. తదుపరి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, డిప్యూటీ తహశీల్దార్ తారకరామన్, ఎంపీఓ ఝాన్సీ, ఏఈఓ సుజాత,  గ్రామపంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, ఈరోజు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి, ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదిక వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం  రైతులకు అందిస్తున్న  రైతు సంక్షేమ పథకాల గురించి అధికారులు వివరించారు, మరియు వాటిని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. తదుపరి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, డిప్యూటీ తహశీల్దార్ తారకరామన్, ఎంపీఓ ఝాన్సీ, ఏఈఓ సుజాత,  గ్రామపంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
   
 
 
 
 
 
Jun 21 2023, 23:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.6k