నిజంనిప్పులాంటిది

Jun 12 2023, 16:09

Biparjoy : తుఫాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు.. PM అత్యవసర సమావేశం..

అరేబియా సముద్రంలో బైపోర్‌జోయ్ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో ముంబై సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది..

ఈదురుగాలులతో పాటు సముద్రంలో అలలు ఎగిసిపడ్డాయి. తుఫాను కారణంగా అనేక విమానాలు కూడా దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే మహారాష్ట్రను అలర్ట్ చేసింది. తుఫాను ఇప్పుడు దేవభూమి ద్వారక నుండి 380 కి.మీ దూరంలో ఉంది. జూన్ 15 నాటికి గుజరాత్‌లోని జఖౌ ఓడరేవును దాటే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు..

తుఫాను కారణంగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. మహారాష్ట్ర, గుజరాత్ తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ సమయంలో ముంబైలో తుఫాను వచ్చి చాలా చెట్లు నేలకూలాయి. తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిందని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాతావరణ పర్యవేక్షణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం బైపోర్‌జోయ్ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది..

నిజంనిప్పులాంటిది

Jun 12 2023, 16:08

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు..

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కారు ప్రమాదానికి గురైంది..

ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది..

ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారు.

బైక్‌ పైన వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎస్కార్ట్ వెహికిల్ ఎక్కి వెళ్లిపోయారు.

అయితే హైదరాబాద్ నుంచి హుజూరాబాద్‌కు నేడు(సోమవారం) నిర్వహించబోయే 2కే రన్ కోసం వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కారు పాక్షికంగా ధ్వంసమైంది..

నిజంనిప్పులాంటిది

Jun 12 2023, 16:07

పండుగలా విద్యాకానుక.. మేనమామగా సంతోషిస్తున్నా: సీఎం జగన్‌..

పల్నాడు:వీళ్లు చిన్నారులు వీళ్లకు ఓటు హక్కు లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గతం. కానీ, ఇవాళ వాళ్ల జగన్‌ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోంది..

ఒక ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ప్రజాప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడడం.. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నా: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన. ''పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్థికి మూడు జతల యూనిఫామ్‌, స్కూల్‌ బ్యాగ్‌, షూస్‌, సాక్సులు అందిస్తున్నాం.

నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స​, బైలింగువల్‌ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్‌ డిజైన్‌లోనూ మార్పులు చేశాం అని తెలిపారాయన. 

ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాం అని సీఎం జగన్‌ చెప్పారు..

నిజంనిప్పులాంటిది

Jun 12 2023, 08:01

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :జూన్ 12

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 92,238 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 40,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు...

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 12 2023, 08:00

ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి..

ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి చెందారు.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీని ఢీ కొట్టింది ఓ కారు.ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల వయసు చిన్నారి కూడా ఉన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..

నిజంనిప్పులాంటిది

Jun 12 2023, 07:58

Cm Jagan: ఏపీలో నేడే జగనన్న విద్యాకానుక.. ప్రారంభించనున్న సీఎం జగన్..

ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్ధులకు అవసరమైన వస్తువులతో కూడిన విద్యా కానుక కిట్లను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు..

2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు.

పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు..

విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లోష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు.

దీంతో పాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్ ప్రారంభమైన తొలిరోజే అందిస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 12 2023, 07:41

నేటి నుంచి మోగనున్న బడిగంట

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ ప్రకటన చేసింది.ఈనెల12 న,సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది.

దీంతో ఈ రోజు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది...

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 12 2023, 07:40

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 933 కేంద్రాల్లో 2,70,583 మంది మొదటి ఏడాది విద్యార్థులు, 1,41,742 మంది రెండో ఏడాది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే విద్యార్థులు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా అధికారిని కలవాలని సూచించారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 21:33

రేపు జోగులాంబ గద్వాల్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

సీఎం కేసీఆర్ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా లో పర్యటించనున్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణాలు చేపట్టగా ఇటీవల ఆ నిర్మాణాలు పూర్తయ్యాయి.

అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కూడా చాలా రోజుల క్రితమే నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సోమవారం వాటిని ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ శ్రేణులు పూర్తిచేశాయి. 2018 తర్వాత మళ్లీ ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 2018 జూన్‌ నెలలోనే గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించగా,

దాదాపు ఐదేళ్ల తర్వాత గద్వాల జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో హామీలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశలు పెట్టుకున్నారు. గద్వాలకు మెడికల్‌ కాలేజీ, చేనేత పార్కు, పలు సాగునీటి పథకాలకు సంబంధించి నిధుల విడుదలపై ప్రత్యేకంగా హామీలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 20:34

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పై కేసు నమోదు

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ తో పాటు మరో ఇద్దరు పై భూ ఆక్రమణకు సంబంధించిన కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు బంజరాహిల్స్ పోలీసులు పట్నం నరేందర్ తో పాటు మరో ఇద్దరి పై కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం..... బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ కు చెందిన సామ ఇంద్రపాల్ రెడ్డికి సంబంధించిన భూమిని పట్నం నరేందర్ రెడ్డి, వై. శ్రీరామ్ రెడ్డి, రాకేష్ రెడ్డిలు మోసం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

దాంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. దాంతో వివిధ సెక్షన్ ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.

అంతే కాకుండా ఈ కేసు పై పూర్తి విచారణ జరపాలని బంజారాహిల్స్ ఎస్సై నవీన్ రెడ్డికి ని కోర్టు ఆదేశించింది...