నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 14:28

AP: ఖరీఫ్ సీజన్‌కు కృష్ణా డెల్టా నీటి విడుదల.. నెల ముందుగానే

విజయవాడ: ఖరీఫ్ సీజన్‌ కృష్ణా డెల్టా నీటిని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిపారుదల శాఖ మంత్రి అంటి రాంబాబు కాలువలకు నీరు విడుదల చేశారు..

కృష్ణమ్మకు ప్రజాప్రతినిధులు, అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్‌ ప్రభుత్వంలో నీటి కొరత లేదు

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. 

కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో జూన్ నెలాఖరులో కానీ, జూలై మొదటి వారంలో కానీ నీరు వదిలేవారని..

ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు విడుదల చేశామని పేర్కొన్నారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది ఉండదని. పులిచింతలలో 34 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నాని చెప్పారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 14:27

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మాగుంట రాఘవకు బెయిల్‌..

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మాగుంట రాఘవకు ఊరట లభించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు 15 రోజుల పాటు బెయిల్‌ మంజూరు చేసింది..

తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉందని బెయిల్ కోసం రాఘవ హైకోర్టును ఆశ్రయించగా.. నేడు ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది..

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫిబ్రవరి 10న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని.. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపించింది..

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 10:24

డౌటే లేదు.. అవును వాళ్ళిద్దరూ మారి పోయారు ❓️

అవును.. సారు నిజంగానే మారిపోయారు.. ప్రసంగం పూర్తిగా మార్చేశారు.. మొన్న నిర్మల్‌ లో, నిన్న నాగర్‌కర్నూల్‌లో అదే సీన్ రిపీటయ్యింది.. బీజేపీని పూర్తిగా పక్కనెట్టేశారు.. రెండ్రోజుల వ్యవధిలోనే రెండు బహిరంగ సభలు జరగ్గా ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీ ప్రస్తావన అస్సలు తీసుకురాలేదు.. కనీసం ఒక్క విమర్శ అయినా చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సాహసించలేదు.

అయితే రెండు సభల్లోనూ కాంగ్రెస్‌నే టార్గెట్ చేయడంతో ఏదో తేడా కొడుతోందన్న విషయం తెలంగాణ ప్రజానికానికి స్పష్టంగా అర్థమైపోయింది. నిర్మల్‌ ప్రసంగంతో కాస్త డౌట్ అనిపించినా.. ఇవాళ్టి సభతో పక్కా అని తేలిపోయింది. అటు నాగర్‌కర్నూల్ కార్యక్రమం ముగిసిందో లేదో అటు బీఆర్ఎస్‌లో.. ఇటు కాంగ్రెస్‌లో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.. ఇక సోషల్ మీడియాలో అంటారా చెప్పక్కర్లేదు..!

కేసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభలో మాట్లాడినా మాటకు ముందు.. వెనుక బీజేపీని దుమ్మెత్తి పోస్తుండేవారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఎందుకో.. ఒకప్పటి బద్ధ శత్రువైన బీజేపీ.. ఇప్పుడెందుకో మిత్రపక్షంగా మారిపోయిందేమోననే అనుమానాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్నాళ్లు ఆరోపణలు, విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఈ మధ్య ఎక్కడా వినిపించట్లేదు.. కనిపించట్లేదు. దీంతో బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకప్పుడు అదిగో అరెస్ట్.. ఇదిగో అరెస్ట్ అన్న బీజేపీ.. ఇప్పుడు చలీ చప్పుడు చేయట్లేదు. అటు దర్యాప్తు సంస్థలు కూడా మిన్నకుండిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య అస్సలు బీజేపీని కేసీఆర్.. కేసీఆర్‌ను బీజేపీ నేతలు విమర్శించిన పరిస్థితుల్లేవ్.

తెలంగాణ రాజకీయాల్లో ఏదో తేడా కొడుతోందే అని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే నడుస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నిర్మల్, నాగర్ కర్నూల్‌లో బహిరంగ సభలు జరిగాయి. ఈ రెండు సభల్లోనూ కేసీఆర్ ఎక్కడా పొల్లెత్తు మాట కూడా బీజేపీని అనలేదు. ఈ రెండు సభల్లోనూ కాంగ్రెస్‌నే టార్గెట్ చేశారు కానీ కాషాయ పార్టీ ప్రస్తావన కానీ.. కమలనాథులను విమర్శించిన పరిస్థితి అస్సలేదు. దీన్ని బట్టి చూస్తే.. ఇన్నిరోజులుగా కేసీఆర్ వర్సెస్ బీజేపీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయాయన్న మాట. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఏకైక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్సేనని పదే పదే ఇలా కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

నిర్మల్ సభలో కేంద్రంపై విమర్శల్లేవంటే ఓకే.. నాగర్‌కర్నూల్‌లో అయినా మునుపటి కేసీఆర్‌ను చూస్తామని బీఆర్ఎస్ శ్రేణులు ఆశించాయి.. తెలంగాణ ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు. కానీ ఎక్కడ కేంద్రంపై ఇసుమంత విమర్శ కూడా చేయకపోవడంతో.. గత కొన్నిరోజులుగా వస్తున్న ఆరోపణలు, విమర్శలను కేసీఆర్ కన్ఫామ్ చేసేశారని టాక్ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తోంది. బహుశా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయాన్ని కేసీఆర్ నిజం చేసేశారేమోనని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం కేసీఆర్ వింత వైఖరితో ఆలోచనలో పడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే రెండ్రోజులు కేసీఆర్ తీరుపై చర్చ జరుగుతుండగా.. నాగర్ కర్నూల్ సభతో ఇది రెట్టింపయ్యింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంత అనే దానిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే ఎన్నికల కాలం సమీపిస్తోంది.. ఈ పరిస్థితుల్లో జనాల్లోకి ఇలాంటి మెసేజ్‌ వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్ ఏముందో.. ఏంటో మరి..!

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 10:21

విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278 మందికి చేరింది. అయితే వీరిలో కనీసం 40 మంది విద్యుతాఘాతంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. వీరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, రక్తస్రావం ఆనవాళ్లు కానీ కనిపించలేదన్నారు. ప్రభుత్వం, రైల్వే పోలీసులు (GRP) ఇదే విషయాన్ని తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. రైళ్లు ఢీకొన్న సమయంలో లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో విద్యుత్ షాక్ తగిలినట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు.

తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్సు రైలును ఢీకొట్టడంతో ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పి, కొన్ని పక్క ట్రాక్‌పైకి వెళ్లి పడ్డాయి. ఆ సమయంలోనే అదే మార్గంలో బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రావడం, పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఓవర్‌హెడ్ లోటెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతం చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..

కాగా, ఒడిశా రైలు దుర్ఘటనపై దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ (CBI) మంగళవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలే కారణమా అనే కోణం నుంచి సీబీఐ కూలంకషంగా దర్యాప్తు జరుపనుంది.

రైల్వే మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి, ఒడిశా ప్రభుత్వం అనుమతి, డీఓపీటీ నుంచి వచ్చిన తదుపరి ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతను సీబీఐ చేపట్టినట్టు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం, మూడు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 278కి చేరుకోగా, 1,200 మంది వరకూ గాయపడ్డారు. 100కు పైగా మృతదేహాలను ఇంకా గుర్తుపట్టాల్సి ఉంది. వీటిని వివిధ ఆసుపత్రులు, మార్చురీలలో ఉంచారు.....

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 10:18

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. ఉచిత సేవలను వినియోగించుకోవాలనుకునే మహిళలు ‘శక్తి స్మార్ట్ కార్డు‘ కోసం దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం నాడు,తెలిపింది. అలాగే, ఉచిత బస్సు సేవలను అనుమతించని బస్సుల జాబితాను కూడా ప్రకటించింది.

ప్రభుత్వ జీవో ప్రకారం.. ఉచిత బస్సు ప్రయాణ సేవలు మహిళలు, థర్డ్ జెండర్ (హిజ్రాలు)కు కూడా వర్తిస్తుంది. ఈ నెల 11 నుంచి ఉచిత సేవలు అందుబాటులోకి వస్తాయి.

మూడు నెలల్లో స్మార్ట్‌కార్డుల పంపిణీ పూర్తవుతుంది.

స్మార్ట్‌కార్డులు చేతికి అందేవరకు కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

స్మార్ట్‌కార్డుల వల్ల మహిళలు ప్రయాణం చేసే దూరాన్ని సులభంగా గుర్తించవచ్చు.

ఏసీ బస్సులు, అంతర్రాష్ట్ర లగ్జరీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి లేదు.

రాజహంస, వజ్ర, వాయువజ్ర, నాన్ ఏసీ స్లీపర్, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఫ్లై బస్, ఈవీ పవర్ ప్లస్ ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సుల్లో సగం సీట్లు మహిళలకు, సగం సీట్లు పురుషులకు కేటాయిస్తారు....

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 18:59

లాల్‌దర్వాజలో నకిలీ స్వీట్స్ తయారీ గుట్టురట్టు

హైదరాబాద్‌:జూన్ 06

హైదరాబాద్ నగరంలోని లాల్‌దర్వాజలో మంగళవారం నకిలీ స్వీట్స్ తయారీ గుట్టురట్టయింది. రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మిల్క్‌పౌడర్‌ను తీసుకొచ్చి నిందితులు నకిలీ స్వీట్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 18:57

చెరువుల మరమ్మత్తులు చేయనోళ్లు దశాబ్ది సంబరాలు ఎలా జరుపుకుంటారు?

కాటారం :జూన్ 06

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల మండలాల్లో భారీ వర్షాలతో గత ఏడాది గండ్లు పడిన చెరువులు ప్రాజెక్టుల పనులు చేయకుండానే నారం ప్రాజెక్టు వద్ద సంబరాలు ఎలా చేస్తారని దీనికి ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు సమాధానమివ్వాలని ఏఐసిసి కార్యదర్శి, మాజీ మంత్రి మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గండిపడిన శివశంకర ప్రాజెక్టు, ఓడిపిలవంచ ఊర చెరువులను రైతులతో కలిసి పరిశీలించారు.

కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మలహర్ మండలాల్లో సుమారు 16 చెరువులు ఘల్లు పడినప్పటికీ ఏ ఒక్క చెరువు గండి పనులు వేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో శివశంకర్ ప్రాజెక్టు చెరువు కు నన్ను పడి మూడు పంటలను రైతులు కోల్పోయారని రిపేరు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ పనులు చేయలేదని బాబు ప్రస్తావించారు.

చెరువుల పనులు పూర్తి చేయకుండానే నీటి ఉత్సవాలు చెరువుల సంబరాలు ఎలా నిర్వహిస్తారని అన్నారు. నారం ప్రాజెక్టులో నేటి దినోత్సవం సంబరాలకు విచ్చేస్తున్న మంత్రులు అధికారులు రైతులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మంత్రులు ఈ ప్రాంత పర్యటనకు వస్తుండటం సంతోషమని ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఎన్నో సార్లు ప్రస్తావించిన ప్పటికీ పరిష్కరించ పోవడం పట్ల శ్రీధర్ బాబు ఆక్షేపణ వ్యక్తం చేశారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మా హయాంలో పూర్తి చేయనప్పటికీ ఇప్పుడు పూర్తి చేయాలని అసెంబ్లీలో కోరడం సీఎం ఇచ్చిన హామీని తాను నెరవేర్చకపోవడం ఏమిటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. వర్షాకాలం ప్రారంభం ముందు 15 రోజులలో యుద్ధ ప్రాతిపదిక పైన గండ్లు పడిన చెరువులు అన్నింటిని శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతగాని సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు కోట రాజబాబు, ప్రభాకర్ రెడ్డి, చీర్ల తిరుమల తిరుపతి రెడ్డి, సర్పంచులు రమేష్ రెడ్డి, రాజయ్య, చీమల వెంకటస్వామి, గడ్డం కొమురయ్య వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు............

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 18:52

సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పర్యటన

ఏలూరు జిల్లా:జూన్06

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.

పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దగ్గరకు చేరుకున్న సీఎంకు డయాఫ్రం వాల్ పరిస్థితిని అధికారులు వివరించారు.

మరో తుపాను దూసుకొస్తోంది, ఈ సారి ముంబైని వణికించనున్న సైక్లోన్ బైపార్జోయ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధర మేర నిధులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు లేఖలో స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్లు అడ్‌హక్‌గా ఇచ్చి ప్రాజెక్ట్‌ పూర్తికి సహాకారం అందించాలని కోరారు. సీఎం జగన్‌ విజ్ఙప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చారు..,......

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 18:50

నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

నాగ‌ర్‌క‌ర్నూల్:జూన్ 06

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా లో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు.

తెలంగాణ త‌ల్లికి పూల‌మాల వేసి దండం పెట్టారు. పార్టీ ఆఫీసు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, జైపాల్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

రూ.52 కోట్లతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌, రూ.35 కోట్లతో చేపట్టిన పోలీసు భవన సముదాయాల‌ను కేసీఆర్ మ‌రికాసేప‌ట్లో ప్రారంభించ‌నున్నారు.

అనంత‌రం వెల‌మ ఫంక్ష‌న్ హాల్ స‌మీపంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 17:20

తెలంగాణ బిజెపి నేతలకు కీలక పదవులు : బీజేపీ అదిరిపోయే స్కెచ్..

కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణ బీజేపీ సైలెంట్ అయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వరమైతే పెద్దగా ఎక్కడా కూడా వినిపించిందే లేదు. ఇక కొందరు నేతలు మాట్లాడుతున్నా కూడా తెలంగాణలో బీజేపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని.. మూడో స్థానానికి పడిపోయిందని.. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇటీవలి కాలంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ప్రముఖ నేతలు చేరబోతున్నట్టు కూడా వార్తలొచ్చాయి.

ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. నేతలెవరకూ వేరొక పార్టీలోకి వెళ్లకుండా అదిరిపోయే స్కెచ్ వేసింది. మరి ఆ స్కెచ్ ఏంటి? ఇప్పటి వరకూ బీజేపీలో తమకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని పలువురు నేతలు కలత చెందుతూ వచ్చారు. బీజేపీ అధిష్టానం బండి సంజయ్ మినహా తమను దగ్గరికి రానివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే టాక్ కూడా నడిచింది. దీంతో రాష్ట్రంపై బీజేపీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కీలక నేతలందరికీ బీజేీపీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఢిల్లీకి రావాలంటూ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పార్టీ పిలుపు మేరకు నేడో రేపో హస్తినకు కమలనాథులు వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ పోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఈ నెలలో తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా రానున్నారు. 15న ఖమ్మంలో అమిత్ షా, 25న నాగర్ కర్నూల్ లో జేపీ నడ్డాల బహిరంగ సభలు జరగనున్నాయి.

ఇక ప్రధాని మోదీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో ఈ నెల 30న జరిగే సభలో పాల్గొంటారని సమాచారం. త్వరలో బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. డీకే అరుణ, ఈటల, రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి లాంటి నేతలకు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, అలాగే నేతలు పార్టీ మారకుండా చూసుకోవడమే లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తోంది. మొత్తానికి నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే మాత్రం వారు పార్టీ మారే అవకాశమే ఉండకపోవచ్చని తెలుస్తోంది...